ఫిబ్రవరి 26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- జనసేన హనుమంతు
జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారి ఆదేశాల మేరకు తెలంగాణ విభజన విభాగం సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ గారి ఆధ్వరంలో ఫిబ్రవరి 26 నుండి మక్తల్ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు నిర్వహించబడుతుందనీ మక్తల్ నియోజక వర్గం జనసేన నాయకులు హనుమంతు గారు తెలియజేశారు. భావితరాల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధినే ధ్యేయంగా పనిచేస్తున్న జనసేన పార్టీ 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని 5 వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుంది అని అందులో భాగంగా మక్తల్ నియోజకవర్గం లో వందమంది సాధకులతో ఉద్యమి సభ్యత్వాలు నమోదు చేయబడతాయని తెలియజేశారు. సభ్యత్వ నమోదు ద్వారా 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుంది. పార్టీ కార్యకర్తకు అనుసంధానంగా ఉండటం కోసం ఉద్యమి సభ్యత్వం ఉపయోగపడుతుందని భవిష్యత్తులో పదవులు గానీ స్థానిక సంస్థల ఎన్నికలలో గానీ ఈ ఉద్యమి సభ్యత్వమే ప్రధాన పాత్ర వహిస్తుందని హనుమంతు తెలియజేశారు. కావున పార్టీ సిద్ధాంతలపట్ల ఆకర్షితులైన వ్యక్తులు పార్టీ భావజాలం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తులు పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చేవారందరు కూడా ఈ ఉద్యమి సభ్యత్వం తీసుకోవాలని తెలియజేశారు.











