Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

జీవీఎంసీ వెబ్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నులను సులభంగా చెల్లింపు సౌకర్యం

జీవీఎంసీ వెబ్ పోర్టల్ ద్వారా ఆస్తి పన్నులను సులభంగా చెల్లింపు సౌకర్యం – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ **విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఇంటిపన్ను, ఖాళీస్థలముల పన్ను సులభతరంగా చెల్లింపు చేయుటకు, ప్రజల సౌకర్యార్ధం జి.వి.యం.సి వెబ్ పోర్టల్ (gvmc.gov.in) నందు ఆస్తిపన్నుచెల్లింపు చేయుటకు క్రెడిట్/డెబిట్ కార్డులు/ నెట్ బ్యాంకింగ్ / యు.పి.ఐ లేదా యు.పి.ఐ. క్యూఆర్. కోడ్ (భారత్ పే, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటియం మరియు క్రెడ్ పే) మొదలగు చెల్లింపు మాధ్యమాల ద్వారా ఆస్తిపన్ను చెల్లింపుచేయు సదుపాయం కల్పించడం జరిగిందని కమీషనర్ తెలిపారు. నగరములోని గృహ యజమానులు / ఆస్తిపన్ను చెల్లింపు దారులు ఈ సౌకర్యమును ఉపయోగించుకొని ఎటువంటి భౌతిక ఇబ్బందులు లేకుండా, వారి విలువైన సమయం వృధా కాకుండా, నేరుగా, సులభముగా జీవీఎంసీ కి చెల్లించ వలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు చెల్లింపు చేయవచ్చు అన్నారు. కావున నగర పరిధిలోని గృహ యజమానులు/ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని కమిషనర్ తెలిపారు.

విశాఖపట్నం

వెలంపేట మురికివాడను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్

వెలంపేట మురికివాడను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్ *50 ఏళ్లు పైబడి నివసిస్తున్నాం ఇండ్లు నిర్మించి, మౌలిక వసతులు కల్పించండని కమిషనర్ను కోరిన నివాసితులు. *పి పి పి మోడల్ లో బహుళ అంతస్తులు నిర్మించి అందిస్తాం. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ *విశాఖపట్నం డిసెంబర్ 11పున్నమి ప్రతినిధి* వెలంపేట మురికివాడలోని ప్రజలకు శాశ్వత నివాసం తో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. గురువారం ఆయన 4వ జోన్ 35వ వార్డు వెలంపేట మురికివాడను జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు పివివి సత్యనారాయణ రాజు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెలంపేటలోని మురికివాడలో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడుతూ ఎప్పటినుండి నివాసం ఉంటున్నారని, ఏ ఏ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఏఏ పనులు చేస్తున్నారని ఆరా తీశారు. అలాగే వారి నివాసం ఉంటున్న ఇంటి లోపల కమిషనర్ పరిశీలించి, వారి ఆధార కార్డు, చిరునామా, డోర్ నెంబర్ మొదలైనవి పరిశీలించారు. మడగల వెంకయ్యమ్మ అనే వృద్ధురాలను ఎప్పటినుండి మీరు ఇక్కడ నివాసం ఉంటున్నారని కమిషనర్ ఆరా తీయగా, వెలంపేటలో దాదాపు 50 సంవత్సరాలు పైబడి ఇక్కడ జీవనం సాగిస్తున్నామని, ఈ మురికి వాటర్ లో నివసిస్తున్న వారందరూ ఇక్కడే పుట్టి పెరిగారని తెలిపారు. వెలంపేటలో ఎటువంటి మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, కాలువలు మొదలైనవి సరిగా లేవని, అలాగే మాకు ఇదే ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కమిషనర్ కు నివాసితులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ వెలంపేట మురికివాడలో దాదాపు 170 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, అందరికీ ఇల్లు నిర్మించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చవుతుందని, అందుకు పిపిపి మోడల్ లో బహుళ అంతస్తులు నిర్మించి అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, అందుకు కొంత సొమ్ము నివాసితులు సమకూర్చుకోవాల్సి ఉన్నందున వారికి బ్యాంకు లోను సదుపాయం ఏర్పాటు చేస్తామని, అందుకు నివాసితులు ముందుకు వస్తే కొంత సొమ్ము బ్యాంకు లోన్ ద్వారా నెలనెలా కట్టవలసి ఉంటుందని తెలపగా నివాసితులు అందుకు అంగీకారం తెలిపారని కమిషనర్ తెలియజేశారు. నివాసితుల యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి వారికి బ్యాంక్ లోను ఏర్పాటుకు బ్యాంకర్లతో మాట్లాడి సమాచారం సిద్ధం చేయాలని యు సి డి ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం సత్యవేణికి కమిషనర్ ఆదేశించారు. ఈ మురికివాడలో బహులంతస్తులో నివాసాల నిర్మాణం చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేయాలని, సంబంధిత ప్రణాళికలను సమర్పించాలని ప్రధాన ఇంజనీరు పీవీ సత్యనారాయణ రాజుకు, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావుకు కమిషనర్ ఆదేశించారు. నివాసితులలో కొంతమంది వృద్ధులకు ప్రభుత్వ పింఛన్లు అందలేదని కమిషనర్ కు తెలపగా ఆయా వివరాలు సేకరించి పింఛన్ల మంజూరుకు కార్యాచరణ చేపట్టాలని జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడును కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో డీసీపీ హరిదాస్, ఏసీబీ ఝాన్సీ లక్ష్మి ఏపిడి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

డిసెంబరు 17న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ. – 4వ జోనల్ కమిషనర్ ఎమ్ .మల్లయ్య నాయుడు.

డిసెంబరు 17న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ. – 4వ జోనల్ కమిషనర్ ఎమ్ .మల్లయ్య నాయుడు. *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్ లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, ఒక కళ్యాణ మండపం, ఒక మార్కెట్, జీవీఎంసీ మెయిన్ ఆఫీ కాంటీన్ నకు లీజు గజిటు నోటిఫికేషన్ నెంబర్ 07/2024 నందలి నిబంధనలు ప్రకారం అత్యవసర షార్ట్ నోటీసు 07.03.2025 ద్వారా ఇచ్చిన షరతులకు లోబడి అప్పగించిన తేదీ నుండి మూడు సంవత్సరాల పరిమితికి గుత్తకిచ్చుటకుగాను డిసెంబరు 17న తేది ఉ.గం.11.00 లకు జోన్-4 సూర్య బాగ్ కార్యాలయం నందు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగునని 4వ జోన్ జోనల్ కమిషనర్ ఎమ్.మల్లయ్య నాయుడు గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అలాగే జివిఎంసి 4వ జోన్ (సూర్యబాగ్) పరిధిలో గల డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము(గ్రౌండ్ ఫ్లోర్) , షాప్ లు 8,9,10,11(SC), 12, 13(PH) & 15(SC), (వార్డు నెం.35, నియర్ స్పింగ్ రోడ్), డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము (మొదటి అంతస్తు) షాప్ లు 2(SC), 3,4,5,6,7,8,9,10,11(SC), 12,13(PH),14(ST),15(SC) (వార్డు నెం.35, నియర్ స్పింగ్ రోడ్), జగదాంబ వాణిజ్య సముదాయము షాప్ లు 3,5(PH),11,12,14&13(ST) (వార్డు నెం.31), పాత బస్ స్టాండ్ ఫేస్-II దుకాణాములు 1,2,3(PH),4,5,6, 7(SC), 8, 9(ST), 10,11, 12(SC),13,14 (వార్డు నెం.35), పాత బస్ స్టాండ్ ఫేస్-I దుకాణాము 5(SC) (వార్డు నెం.35), పద్మనగర్ వాణిజ్య సముదాయము 3, 4(SC), 6,7,11,12(SC) & 8(SC) (వార్డు నెం.39, లక్ష్మిటాకీస్ దగ్గర), సూర్యబాగ్ వాణిజ్య సముదాయము 8(SC) (గ్రౌండ్ ఫ్లోర్), 9(ఫస్ట్ ఫోర్) (వార్డు నెం.31, నియర్ జివిఎంసి జోనల్-4 ఆఫీసు), టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వాణిజ్య సముదాయము 18,21,33,37,39(ST),46(SC),51(ST) (వార్డు నెం.31), అంగడిదిబ్బ వాణిజ్య సముదాయము 2(SC) (వార్డు నెం.29), జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని కాంటీన్ (వార్డు నెం.28), రెల్లివీధి రోడ్ సైడ్ ఫిష్ మార్కెట్లును 3 సంవత్సరముల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకు తేదీ 17-12- 2025 ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించబడునని జోనల్ కమిషనర్ తెలిపారు. సదరు వేలంపాటలో పాల్గొనదలచిన వారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 4వ జోనల్ కార్యాలయం పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలిపారు.

అమరావతి

రేపు విశాఖకు సీఎం చంద్రబాబు*

*రేపు విశాఖకు సీఎం చంద్రబాబు* *కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన* *విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశానికి హాజరు కానున్న సీఎం* అమరావతి, : విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. విశాఖలోని కాపులుప్పాడ సమీపంలోని ఐటీ హిల్స్ వద్ద అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన, కార్యకలాపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రేపు ఉదయం ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి ఐటీ జోన్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ సంస్థ కార్యకలాపాలను సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరోవైపు ఇదే సమయంలో మంత్రి లోకేష్ ఐటీ హిల్స్ లో మరో 8 సంస్థలకు కేటాయించిన స్థలాల్లో ఒకేసారి నూతన కార్యాలయాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్ప్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు త్వరలో ప్రారంభించనున్నాయి. కాగ్నిజెంట్ సహా ఈ సంస్థలు రూ.3,740 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. 41,700 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకూ 9 జిల్లాల సమగ్ర అభివృద్ధి రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 9 జిల్లాల అధికారులు, మంత్రులు ప్రజాప్రతినిధులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

అన్నమయ్య

“రాజంపేట జిల్లా కేంద్రం కోసం పోరాటం ముమ్మరం… జనసేన మద్దతుతో ఉద్యమానికి జోష్‌!”

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు కొనసాగుతున్న “రిలే నిరాహారదీక్ష”లో పాల్గొన్న నిరాహార దీక్షకులకు మద్దతుగా రాజంపేట జనసేన పార్టీ నాయకులు మరియు మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు ఈ రోజు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలో మాట్లాడిన శివరామరాజు అన్నమయ్య జిల్లా ఏర్పాటైన మొదటి రోజు నుంచే రాజంపేట ప్రజల హృదయాల్లో ఒకే మాట ‘రాజంపేటనే జిల్లా కేంద్రం కావాలి’. ఇది కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాదు, ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష,” అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం రాజంపేటకే రావాలని సమగ్ర అభివృద్ధి దృష్ట్యా అనివార్యమని స్పష్టం చేస్తూ, “ప్రజల న్యాయమైన హక్కు కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో జనసేన ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుంది,” అని ధైర్యం నింపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నీటి సంఘం అధ్యక్షుడు నారదాసు రామచంద్ర, విశ్రాంత పోలీసు అధికారి పూల లక్ష్మీ నరసయ్య, గూడూరు శ్రీనివాసరాజు, మౌలా, చింతల శివ మరియు అనేక మంది స్థానిక జనసేన నాయకులు పాల్గొని దీక్షకులకు మద్దతుగా నిలిచారు. స్థానిక నాయకుల రాకతో దీక్షా శిబిరంలో ఉత్సాహం మరింత పెరిగింది. అదేక్రమంలో, రాజంపేట – కోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలలో జరిగే నిరసన కార్యక్రమాలు, కాగితాలు, ర్యాలీలు, నిరాహారదీక్షలకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు కీలక ప్రకటన చేశారు. “జిల్లా హక్కు కోసం చేస్తున్న పోరాటానికి జనసేన అండగా ఉంటుంది. ప్రజల ఆశయాన్ని సాధించటం కోసం అన్ని విధాలా సహకరిస్తాం,” అని ఆయన పేర్కొన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే ప్రజా ఉద్యమానికి జనసేన నాయకుల మద్దతు లభించడం, దీక్షకులలో మరియు సాధన సమితిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్ సాధనకు పోరాటం మరింత వేగం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది.

అన్నమయ్య

నందలూరులో ఘనంగా మాజీ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్ జన్మదిన వేడుకలు

నందలూరు మండలం శ్రీ సౌమ్యనాథ ఫిల్లింగ్ స్టేషన్‌లో మాజీ అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలో టీడీపీ కార్యకర్తల్లో విశేష ఉత్సాహం నెలకొన్న వేళ, నాయకుడు ఉప్పుశెట్టి సుధీర్ రాయల్ ఆధ్వర్యంలో మిత్రబృందం సమక్షంలో శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయడం జరిగింది. విజయ సాగర్ నాయకత్వం టీడీపీకి బలమని, ఆయన ప్రజాప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు రైతాంగానికి ఎంతో మేలు చేశాయని ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రశంసించారు. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పోరాటం సాగుతుందని, పార్టీకి చిరస్మరణీయమైన సేవలు అందించారని వ్యాఖ్యానించారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ఇచ్చిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు గంధం శెట్టి గంగాధర్, నందలూరు గ్రామ సర్పంచ్ మోడబోతుల రాము, మండల టీడీపీ నాయకులు ఉప్పుశెట్టి రెడ్డయ్య, రాజంపేట మాజీ తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్, జయచంద్రారెడ్డి, సాయి, వంశీ, పెంచలయ్య తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుక మొత్తం సందడి, టీడీపీ కార్యకర్తల ఉత్సాహంతో నిండిపోయింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు

ఉదయగిరిలో గురువారం మండల విద్యాధికారిణి వినీత 104 వాహన వైద్య సేవలు నిర్వహించారు ఆమె 44 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ నెల 21 న పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దీర్ఘ కాలిక రోగులు అప్రమత్తoగా ఉండాలన్నారు వాహన సేవలను ఉపయోగించుకోవాలన్నారు.

E-పేపర్

రైల్వేకోడూరులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ సౌత్ ఇండియా కార్యాలయం ప్రారంభం

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ సోషల్ జస్టిస్ సౌత్ ఇండియా కార్యాలయం ప్రారంభం రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు అన్నమయ్య జిల్లా లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రైల్వే కోడూరు మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ అధ్యక్షతన మానవ హక్కుల అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ షేక్ జుబైర్ మాట్లాడుతూ పౌరులందరూ భారత రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులకు అనుగుణంగా మసులుకోవాలనీ పిలుపునిచ్చారు.అలాగే నేర రహిత భారతదేశాన్ని నిర్మిద్దామని ఆహ్వానించారు. మహిళలను గౌరవించమని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మహిళా విభాగం కే సౌందర్య , అన్నమయ్య జిల్లా మీడియా ఇంచార్జ్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి బైసాని కిరణ్ కుమార్,మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ , అన్నమయ్య జిల్లా సెక్రెటరీ శివ ,రైల్వే కోడూరు మండల జనరల్ సెక్రెటరీ అల్లావుద్దీన్ ,మరియు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

అన్నమయ్య

అంతర్జాతీయ వేదికపై రైల్వే కోడూరు యువకుడికి అరుదైన గౌరవం

-ఏపీ యూత్ ఐకాన్’ అవార్డు అందుకున్న షేక్ మహమ్మద్ షాహిద్ -మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగిన మానవ హక్కుల దినోత్సవ వేడుకలో ప్రశంసా పత్రం, కాంస్య పతకం అందజేత చిట్వేల్, డిసెంబర్ 11: పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు వాసి షేక్ మహమ్మద్ షాహిద్ సామాజిక సేవ, వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయనకు ‘ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకాన్’ అవార్డు లభించింది. -అవార్డు ప్రధానం: డిసెంబర్ 10వ తేదీన (బుధవారం) ఔరంగాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుక ప్రోగ్రాంలో షేక్ మహమ్మద్ షాహిద్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్.అన్సారీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ గారి ల చేతుల మీదుగా షేక్ మహమ్మద్ షాహిద్ ఈ అవార్డును స్వీకరించారు. అవార్డుతో పాటు ఆయనకు ప్రశంసా పత్రం మరియు కాంస్య పతకం కూడా అందజేయబడింది. -గుర్తింపు దేనికంటే? రైల్వే కోడూరు వాసి అయిన షేక్ మహమ్మద్ షాహిద్ సామాజిక రంగంలో, ముఖ్యంగా యువతను చైతన్యపరచడంలో చేసిన విశేష కృషికి ఫలితంగా ఈ అవార్డు లభించింది. ఆయన చేసిన కార్యక్రమాలు, సామాజిక బాధ్యత పట్ల ఆయనకున్న నిబద్ధతను జాతీయ స్థాయి వేదిక గుర్తించింది. మానవ హక్కుల పరిరక్షణలో యువత పాత్రను పెంచేందుకు, సమాజంలో మార్పు తెచ్చేందుకు ఆయన చేసిన కృషి ఈ గౌరవాన్ని దక్కించుకోవడంలో కీలకమైంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందుకోవడం పట్ల షేక్ మహమ్మద్ షాహిద్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల రైల్వే కోడూరు ప్రజలు, స్థానిక యువత, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

అన్నమయ్య

చిట్వేలిలో మూతపడ్డ మరుగుదొడ్లు: ప్రజల అవస్థలు!

-మండల కార్యాలయాల సముదాయం వద్ద సౌకర్యం ఉన్నా, వినియోగానికి నోచుకోని వసతి -పల్లెల నుంచి వచ్చిన మహిళలకు తీవ్ర ఇబ్బందులు; అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు చిట్వేలి డిసెంబర్ 11: పున్నమి ప్రతినిధి చిట్వేల్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద నిర్మించిన మలమూత్ర విసర్జనశాల మూతపడడంతో ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చిన మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రజా సౌకర్యం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన ఈ వసతిని అధికారులు కొద్ది రోజులకే వినియోగానికి దూరం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -నిర్మాణం – నిరుపయోగం: మండల కార్యాలయాల సముదాయానికి వచ్చిన ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు ఈ మరుగుదొడ్లను పంచాయతీ అధికారులు 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించారు. కానీ, నిర్మించిన కొద్ది రోజుల తర్వాతే దాన్ని మూసివేశారు. ప్రస్తుతం మలమూత్ర విసర్జనశాల మూతపడి ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా పల్లెల నుంచి వచ్చిన మహిళలు తమ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసివేసిన ప్రాంతాన్ని పూడిక వేసి, నిరుపయోగంగా మార్చివేయడం ఈ సమస్యకు ప్రధాన కారణం. మండల కేంద్రానికి వచ్చే ప్రజలు, మహిళలు ఈ ప్రాంతంలో తమ అవసరాలు తీర్చుకోడానికి తగిన వసతి లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. -ప్రజల డిమాండ్: ప్రభుత్వ లక్ష్యాల మేరకు ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు, వివిధ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే వారు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం వృథా కాకుండా, ప్రజల కష్టాలు తీర్చేందుకు అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.