Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.

కామారెడ్డి

పంచాయతీ వీరులకు పెద్దన్న శుభాకాంక్షలు!!

కామారెడ్డి, 12 డిసెంబర్ పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచిన అందరికీ హార్దిక అభినందనలు! ప్రజల నమ్మకంతో ఓట్లు పోసి గెలిపించిన మీరు, రాబోయే రోజుల్లో గ్రామాల సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి రంగంలో ముందడుగు వేయాలి!గ్రామాల్ని ఆదర్శ పల్లెలుగా, మండలాన్ని టాప్ మోడల్‌గా, దేశవ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలుగా మలిచి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అధికారులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ సలహాదారుల సహకారంతో గ్రామ బాధ్యతలు నిర్వహించి, ప్రజలకు నిజమైన సేవ చేయాలి. మీ బాధ్యత తీర్చిపెట్టి, గ్రామాల్ని స్వర్ణోత్సవాలకు చేర్చండి!

కామారెడ్డి

పోసానిపేటలో టీఆర్ఎస్ గెలుపు

సుద్దాల లింగం సర్పంచ్‌గా భారీ గెలుపు.. జాజాల సురేందర్ సన్మానం సందడి! కామారెడ్డి 12 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో 11.12.2025న సర్పంచ్ ఎన్నికలు జరిగి, టీఆర్ఎస్ అభ్యర్థి సుద్దాల లింగం భారీ మెజారిటీతో గెలిచారు. గ్రామ ప్రజలు జోష్‌లో మునిగి ఉన్నారు. విజయోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సర్పంచ్ లింగం , వార్డు మెంబర్లను సన్మానం చేశారు. స్థానికుల సంతోషం: “లింగం గెలిచారు, ఇక గ్రామం గెలిచింది” అంటూ అందరూ చెప్పుకుంటు న్నారు. రోడ్లు, నీరు, విద్యుత్ సమస్యలకు త్వరిత చర్యలు, రైతులకు సహకారం..ఇవన్నీ ప్రాధాన్యత అని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ ఎన్ దశరథ్ రెడ్డి, కాలభైరవ స్వామి, మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా, కిరణ్ కుమార్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు టంకరి రవి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా జీజీహెచ్‌లో న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమం

నెల్లూరు జిల్లా — పున్నమి ప్రతినిధి హైకోర్టు ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కే.వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ ద్వారా ప్రతి పౌరుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందగలడని తెలిపారు. అలాగే వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయసహాయం అందించేందుకు 1987 న్యాయ సేవాధికార సంస్థల చట్టం అమలులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ హెచ్‌ఓడీ కళారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్‌కే మస్తాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఈశ్వరీదేవి ఊరేగింపు: శాంతిభద్రతలపై పోలీసుల సమీక్ష

-కేఎస్ అగ్రహారం ఉత్సవాల దృష్ట్యా చిట్వేలి పీఎస్‌లో శాంతి కమిటీ సమావేశం -శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని కోరిన కోడూరు రూరల్ సీఐ చిట్వేలి, డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం, కేఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న ఈశ్వరీదేవి ఊరేగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ సందర్భంగా శుక్రవారం నాడు చిట్వేలి పోలీస్ స్టేషన్‌లో కోడూరు రూరల్ సీఐ ముఖ్య నేతలు, అధికారులతో కలిసి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈశ్వరీదేవి ఊరేగింపును అత్యంత శాంతియుత వాతావరణంలో, ఇతర మతాల మనోభావాలకు భంగం కలిగించకుండా నిర్వహించాలని సీఐ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు.ఊరేగింపు నిర్ణీత మార్గాల్లో మాత్రమే జరిగేలా చూడాలని, ప్రజలు ఎవరూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ పాటించాలని సూచించారు.సమావేశానికి హాజరైన గ్రామ పెద్దలు, మత పెద్దలు, రాజకీయ నాయకులు మరియు ఊరేగింపు కమిటీ సభ్యులు పూర్తి సహకారం అందిస్తామని, పోలీస్ శాఖ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు.శాంతి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉత్సవాల నిర్వహణలో కచ్చితంగా అమలు చేయాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సీఐ తెలిపారు.

తెలంగాణ

నా గ్రామం నా బాధ్యత అంటూ పోతుగల్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గార్లు

పోతుల గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల క్షేమమే తన లక్ష్యం అంటు ప్రజల ముందుకు వస్తున్న విద్యావంతులు సర్పంచ్ బరిలో. పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గార్లు పోటీ చేస్తున్నారు వీరిని తమ గుర్తు అయిన స్త్రీలు వాడే హ్యాండ్ బ్యాగు ( లేడీ పర్స్) గుర్తుకు ఓటు వేసి తమని సర్పంచిగా గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ కోరుతున్నారు గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను అయినా గ్రామం నుండి పోచమ్మ దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం మరియు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారిన కోతుల బెడద నుంచి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్ల నిర్మాణం మరియు అర్హులైన వారికి పెన్షన్లు మరియు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తానని యువతకు పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని నిర్మిస్తానని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తానని యువకులకు శరీర దారుఢ్యం కొరకు ఓపెన్ జిమ్మును గ్రామంలో ఏర్పాటు చేస్తానని మరియు పోతుగల్ గ్రామం నుండి హైదరాబాదుకు వెళ్లే నైట్ హోల్డ్ బస్సులు మళ్లీ ప్రారంభిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ తన ఎజెండాను ముందుగానే చెప్పుతూ ప్రజలను కోరుతూ తనను గెలిస్తే పరిపాలనలో దర్శకత అభివృద్ధిలో వేగం చూపిస్తూ ముస్తాబాద్ మండలంలోని ముందు వరుసలో పోతుగల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామంలో ఉన్న దేవాలయాలను ముఖ్యంగా శ్రీ రాముల వారి దేవాలయాన్ని గ్రామస్తులు సహాయంతో ప్రభుత్వ వారి అండదండతో అభివృద్ధికి చేస్తూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాదని చేయబోయే పనులను తమ ఎజెండాతో ముందుగానే వివరిస్తూ ప్రజలకు ఓటు వేయాలని కోరుతున్నారు తమ గుర్తు అయిన లేడీ పర్స్ గుర్తుపైన ఓటు వేసి మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

తెలంగాణ

నా గ్రామం నా బాధ్యత అంటూ పోతుగల్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గార్లు

పోతుల గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల క్షేమమే తన లక్ష్యం అంటు ప్రజల ముందుకు వస్తున్న విద్యావంతులు సర్పంచ్ బరిలో. పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గార్లు పోటీ చేస్తున్నారు వీరిని తమ గుర్తు అయిన స్త్రీలు వాడే హ్యాండ్ బ్యాగు ( లేడీ పర్స్) గుర్తుకు ఓటు వేసి తమని సర్పంచిగా గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ కోరుతున్నారు గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను అయినా గ్రామం నుండి పోచమ్మ దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం మరియు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారిన కోతుల బెడద నుంచి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్ల నిర్మాణం మరియు అర్హులైన వారికి పెన్షన్లు మరియు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తానని యువతకు పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని నిర్మిస్తానని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తానని యువకులకు శరీర దారుఢ్యం కొరకు ఓపెన్ జిమ్మును గ్రామంలో ఏర్పాటు చేస్తానని మరియు పోతుగల్ గ్రామం నుండి హైదరాబాదుకు వెళ్లే నైట్ హోల్డ్ బస్సులు మళ్లీ ప్రారంభిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ తన ఎజెండాను ముందుగానే చెప్పుతూ ప్రజలను కోరుతూ తనను గెలిస్తే పరిపాలనలో దర్శకత అభివృద్ధిలో వేగం చూపిస్తూ ముస్తాబాద్ మండలంలోని ముందు వరుసలో పోతుగల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామంలో ఉన్న దేవాలయాలను ముఖ్యంగా శ్రీ రాముల వారి దేవాలయాన్ని గ్రామస్తులు సహాయంతో ప్రభుత్వ వారి అండదండతో అభివృద్ధికి చేస్తూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాదని చేయబోయే పనులను తమ ఎజెండాతో ముందుగానే వివరిస్తూ ప్రజలకు ఓటు వేయాలని కోరుతున్నారు తమ గుర్తు అయిన లేడీ పర్స్ గుర్తుపైన ఓటు వేసి మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

E-పేపర్

నారాయణఖేడ్ లోని బోధి పాఠశాలలో సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం

ఈరోజు అనగా శుక్రవారం బోధి పాఠశాలలోని నారాయణఖేడ్ డివిజన్ పోలీసు సిబ్బంది వారిచేత పాఠశాల విద్యార్థినులకు నేటి సమాజంలోని ఆడపిల్లలు మరియు మహిళల భద్రత, సైబర్ నేరాలు మరియు అపరిచిత వ్యక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు తెలిపారు. దీనిలో భాగంగా సైబర్ హెల్ప్ లైన్ 1930 మహిళల ఫిర్యాదులో భాగంగా 1098 మరియు 100 నంబర్లకు కాల్ చేసి తక్షణ సహాయం పొందగలరని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సంకిర్తన్ రెడ్డి,రాహుల్, దయాకర్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం, సిబ్బంది విజయ్ కుమార్,ఈశ్వర్ గౌడ్, సిద్ధిరాం ,నిర్మల , లక్ష్మణ్ సాగర్,విిద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.