Sunday, 15 March 2026

Blog

తెలంగాణ

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు అన్న : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటనలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కడప

మట్కా బీటర్ అరెస్టు.. రూ. 10,150 నగదు స్వాధీనం*

*వై.ఎస్.ఆర్ కడప జిల్లా…* ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో పోలీసుల దాడులు.. మట్కా బీటర్ అరెస్టు.. రూ. 10,150 నగదు స్వాధీనం* ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలోని దస్తగిరి పేట లో మట్కా నిర్వహిస్తున్న ఖురేషి మహమ్మద్ సాషా (59) అనే మట్కా బీటర్ ను అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు టూ టౌన్ సి.ఐ యు. సదాశివయ్య తెలిపారు. అతని నుండి రూ. 10,150 నగదు, మట్కా స్లిప్ స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ ప్రొద్దుటూరు టూ టౌన్ సి.ఐ యు. సదాశివయ్య హెచ్చరించారు. టూ టౌన్ ఎస్.ఐ రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఎ.పి. గ్రామీణ బ్యాంక్ పానగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, పానగల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాడు తిరుపతి అగర్వాల్ మెడికల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బ్రాంచ్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా బ్రాంచ్ మేనేజర్ నరేష్ మాట్లాడుతూ.. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం అవకాశాన్ని మన ఖాతాదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యాజమాన్యానికి, అగర్వాల్ కంటి వైద్య హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 110 మంది ఖాతాదారులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి, అవసరమైన చికిత్సపై సూచనలు ఇచ్చారు. పలు కంటి సమస్యలను గుర్తించి ఖాతాదారులకు తగిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఎం.సోము, మల్లికార్జున్, చిట్టిబాబు, ప్రసాద్ కలిసి శిబిరాన్ని విజయవంతం గా నిర్వహించారు.

తిరుపతి

భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని మజ్దూర్ సంఘ్ వినతిపత్రం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో గల కార్మిక సంఘ కార్యాలయంలో సోమవారం నాడు ఏపీ కన్స్ట్రక్షన్స్ మజ్దూర్ సంఘ్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎస్.సుకుమార్, ప్రధాన కార్యదర్శి సి. ముని కుమార్ లు కార్మిక తనిఖీ అధికారి శ్రీమన్నారాయణకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇచ్చిన హామీల మేరకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చెంగల్ పట్టు ముని కుమార్ మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డును పునరుద్ధరించి భవన నిర్మాణ రంగానికి చెందిన అన్ని విభాగాల కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లుల సొమ్మును వెంటనే విడుదల చేయాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక డైరెక్టర్ పదవిని కార్మికులకు ఇవ్వాలని గత వైసిపి హయాంలో ఇసుక క్వారీలు ఆపేసి కార్మికులకు పనుల్లేకుండా చేశారన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తూ గత వైసిపి ప్రభుత్వం 1214 మెమో జారీ చేసిందని, ఫలితంగా లక్షలాది మంది నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికులు ఓట్లు వేసి గెలిపించారని, 16 నెలలవుతున్నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు పునరుద్ధరించి పెండింగ్‌ క్లైములు పరిష్కరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఆచారి, కాలువ ప్రసాద్, రమేష్ ఆచారి, లక్ష్మణ్ రెడ్డి, మురళి, మణి నాయుడు, దొరబాబు, ప్రభు, సీత ముని, వాసు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ ని ఘనంగా సన్మానించిన తెదేపా బిసి విభాగ నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నూతనంగా పదవీ ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రంగినేని చెంచయ్య నాయుడుని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు సోమవారం నాడు మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో బిసిల ఆరాధ్య దైవం పూలే దంపతుల చిత్రపటాన్ని అందించి, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా తెదేపా బిసి విభాగ నాయకులు మాట్లాడతూ…. రైతు సంతోషమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ సంతోషంగా తలచిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అన్నదాత కుటుంబాల్లో చిరు నవ్వులు చిందించేలా ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలిచిందని తెలుగుదేశంపార్టీ అని మధ్యవర్తుల దోపిడీ నుండి రైతులను కాపాడి, తమ ఉత్పత్తులకు సరైన ధర వచ్చేలా చూడటం, మార్కెట్ యార్డులలో (మండిస్) బహిరంగ వేలం పాటల ద్వారా ధరలను నిర్ణయించడం వంటి రైతు అనుకూల విధానాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని ధరల పోకడలు,మార్కెట్ పరిస్థితులపై రైతులకు సమాచారం అందించడం, e-NAM వంటి వేదికలతో అనుసంధానం చేయడానికి కృషి చేయాలని రైతుల పంట ఉత్పత్తుల నాణ్యతను కాపాడటానికి నిల్వ, గిడ్డంగుల సేవలను సులభతరం చేయటానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మార్కెట్ యార్డులు, గిడ్డంగులు, నిల్వ సౌకర్యాలు, నాణ్యత పరీక్షా కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని చెంచయ్య నాయుడుని కోరుతూ… రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చే విధంగా రెండు విడతల్లో రూ.14,000 రైతుల ఖాతా లోకి కూటమి ప్రభుత్వం వేసిందని తెలిపారు. “పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం” కింద మొదటి విడతలో భాగంగా రూ.3,174 కోట్లు,రెండో విడతలో భాగంగా రూ.3,135 కోట్లు మొత్తంగా రూ.6,310 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసి కష్టకాలంలో అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటూ నిత్యం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 2024-25 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం… ఉద్యాన రంగంలో 193 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి చేస్తూ దేశంలో మొదటి స్థానం దక్కించుకున్న ఏపీ… 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఆక్వా రంగంలోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఆయా రంగాలకు చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్,శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, క్లస్టర్ ఇన్‌ఛార్జి పేట బాలాజీ రెడ్డి,బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు దొరైరాజ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,తిరుపతి పార్లమెంటు నాయకులు సంజాకుల మురళీకృష్ణ, కృష్ణమూర్తి,సయ్యద్ చాంద్ బాషా,భాస్కర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అఖండ–2 ఘన విజయం పట్ల బొజ్జల బృందమ్మ హర్షం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభసబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సోమవారం నాడు నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ–2ను కార్యకర్తలతో కలిసి వీక్షించారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం బొజ్జల బృందమ్మమాట్లాడుతూ….బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా నటించడం అభినందనీయమని నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఆయన ప్రతీ చిత్రంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రతి సినిమాలో సమాజానికి ఒక సందేశాన్ని అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారని అఖండ–2 చిత్రంలో బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారని, సినిమా ఘన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని బొజ్జల బృందమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, మీనల్ రవి, రేణుక, ఖాదర్, లక్ష్మి, చందు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతోనే ఈ అరుదైన గౌరవం దక్కింది.. ప్రభుత్వ పాఠశాల విద్యార్దులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, హైదరాబాద్ పర్యటన అనంతరం శ్రీకాళహస్తికి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ ఆనందాన్ని పత్రికా సమావేశంలో పంచుకున్నారు. సమావేశంలో విద్యార్దులుమాట్లాడుతూ… తమ ప్రియతమ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చొరవతోనే తాము హైదరాబాద్‌లో జరిగిన ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఇండియా టూర్ పర్యటనను ప్రత్యక్షంగా చూసే గొప్ప అవకాశం పొందామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాల పిల్లలకూ దక్కని ఈ అరుదైన గౌరవం, కేవలం ఎమ్మెల్యే చొరవ వల్లే తమకు దక్కిందన్నారు. శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్‌కు మా కోసం మంచి రైలు వసతి, అక్కడ స్టార్ హోటల్‌లో ఉంచి, ఏ లోటూ లేకుండా చూసుకున్నారని భోజనం ఏర్పాట్లలలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి రెండు మూడు గంటలకొకసారి మాకు మంచి భోజనం ఏర్పాట్లు, తాము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, బాగా తింటున్నామని తెలుసుకోవడానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా పీటీ మాస్టర్‌ని, ఇతర సిబ్బందిని మా వెంట పంపించి ప్రత్యేక పర్యవేక్షణ చేశారన్నారు. మెస్సీ టూర్‌తో పాటు, చారిత్రక చార్మినార్ వంటి ఎన్నో అందమైన ప్రదేశాలను కూడా చూసే అవకాశం తమకి కల్పించారని తమ ఈ చిన్న జీవితంలో ఇంతటి అపూర్వమైన గౌరవాన్ని, మధురమైన జ్ఞాపకాలను అందించినందుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి, వారి సతీమణికి తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాంఅని జీవితాంతం… ఎమ్మెల్యే కల్పించిన ఈ అద్భుత అవకాశాన్ని, ఆయన గొప్ప చొరవను ఎప్పటికీ మర్చిపోమన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఏ ప్రభుత్వ పాఠశాల పిల్లలకూ దక్కని ఈ అపూర్వ గౌరవాన్ని తమ పిల్లలకు కల్పించిన వారి తల్లిదండ్రులు ఎఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యువత భవిష్యత్తుకై నిబద్ధతతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువశక్తికి దిక్సూచిగా నిలుస్తున్న మంత్రి నారా లోకేష్ కి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, విద్యారంగంతో పాటు, క్రీడారంగాన్ని కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించడం యువతకు నిరంతర స్ఫూర్తిని ఇస్తుందని కొనియాడారు. ఇలాంటి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడి విజన్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాస్తు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఒక విద్యావంతుడు, అభివృద్ధి పట్ల నిబద్ధత గల శాసనసభ్యులు ఉండటం తమ అదృష్టమని, క్రీడలు, విద్యారంగంలో, అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని తాము ఎంతో గర్వపడుతున్నామని విద్యార్దులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజకవర్గం లోని బీఎస్పీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఉదయగిరి నియోజకవర్గం లోని , కొండాపురం మండలం , తూర్పు బ్రాహ్మణ పల్లె లో బీఎస్పీ కార్యక్రమం వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలోగడప గడప గడప కు వెళ్లి, పార్టీ గురించి, పార్టీ బలోపేతం వివరించారు ఈ కార్యక్రమంలో కె ,పుష్పాంజలి ఉదయగిరి నియోజకవర్గం కన్వీనర్ ప్రకాష్ రావు మరియు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు.

అన్నమయ్య

జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ వినతికి స్పందించిన ఆర్టీసీ – నందలూరుకు మళ్లీ ఆర్‌ఎస్ రూట్ బస్సు సౌకర్యం

నందలూరు మండలంలో గతంలో నడిచిన (ఆర్‌,ఎస్‌) రూట్ బస్సు సేవలు నిలిపివేయడంతో స్థానిక ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నందలూరు ప్రాంత ప్రజల సమస్యలను గుర్తించిన స్థానిక బీజేపీ పార్టీ నాయకులు రాచూరి మురళి,వీరబల్లి జయ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్, హ్యూమన్ రైట్స్ ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ డేవిడ్ కళ్యాణి రాజు,జనం న్యూస్ విలేఖరి కిరణ్ కలిసి ఈ బస్సు సేవలను తిరిగి పునరుద్ధరించాలని బీజేపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ ని కోరారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సాయి లోకేష్ వెంటనే ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రాన్ని స్వీకరించిన రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి లత సమస్యపై స్పందిస్తూ, టంగుటూరు–రాజంపేట రూట్ బస్సును నందలూరు ఆర్‌ఎస్ రోడ్డు మీదుగా నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశారు. దీంతో ప్రజలకు, ఉద్యోగస్తులకు, ముఖ్యంగా రాజంపేటలో విద్యనభ్యసిస్తున్న కాలేజీ మరియు స్కూల్ విద్యార్థులకు ఈ బస్సు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఉదయం 8 గంటల సమయంలో నందలూరు ఆర్‌,ఎస్ రోడ్డు ఆర్,అండ్,బి బంగ్లా వద్ద ఈ బస్సు రాజంపేటకు ప్రయాణించే వారికి అందుబాటులో ఉంటుందని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈరోజు ఉదయం 8 గంటలకు అరవపల్లి ఆర్,అండ్,బి బంగ్లా వద్ద చేరుకున్న బస్సు, బస్సు డైవరు మరియు కండక్టర్ ను ప్రజా ప్రతినిధులు మిఠాయి పంచి శాలువాతో సత్కరించారు. నందలూరు ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ కి స్థానిక నాయకులు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయంతో నందలూరు మండల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్ టి ఆర్ జిల్లా

ఏపీ బాల హక్కుల కమిషన్ నియామకాలకు ఇంటర్వ్యూలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీ ఎస్‌సీపీసీఆర్‌) ఛైర్‌పర్సన్‌ మరియు సభ్యుల నియామకా లకు సంబంధించిన ఇంటర్వ్యూలు అమరావతిలో గురువారంప్రారంభమయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ ఈ నెల 15, 16, 19, 20, 21 తేదీల్లో కొనసాగనుంది. ఈ ఎంపిక ప్రక్రియను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పారదర్శ కతతో పాటు అర్హతలే ప్రాతిపదికగా ఛైర్‌పర్సన్‌, సభ్యుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇంటర్వ్యూల నిర్వహణ కోసం ఏర్పాటైన కమిటీలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వి.ఎస్‌.బి.జి. పార్థసారథి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి, అనుభవం కలిగిన అర్హులైన వ్యక్తిని కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియచేపట్టినట్లు అధికారులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.