తిరుపతి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 15, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా నూతనంగా పదవీ ప్రమాణం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రంగినేని చెంచయ్య నాయుడుని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు సోమవారం నాడు మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో బిసిల ఆరాధ్య దైవం పూలే దంపతుల చిత్రపటాన్ని అందించి, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా తెదేపా బిసి విభాగ నాయకులు మాట్లాడతూ…. రైతు సంతోషమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ సంతోషంగా తలచిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అన్నదాత కుటుంబాల్లో చిరు నవ్వులు చిందించేలా ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలిచిందని తెలుగుదేశంపార్టీ అని మధ్యవర్తుల దోపిడీ నుండి రైతులను కాపాడి, తమ ఉత్పత్తులకు సరైన ధర వచ్చేలా చూడటం, మార్కెట్ యార్డులలో (మండిస్) బహిరంగ వేలం పాటల ద్వారా ధరలను నిర్ణయించడం వంటి రైతు అనుకూల విధానాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని ధరల పోకడలు,మార్కెట్ పరిస్థితులపై రైతులకు సమాచారం అందించడం, e-NAM వంటి వేదికలతో అనుసంధానం చేయడానికి కృషి చేయాలని రైతుల పంట ఉత్పత్తుల నాణ్యతను కాపాడటానికి నిల్వ, గిడ్డంగుల సేవలను సులభతరం చేయటానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మార్కెట్ యార్డులు, గిడ్డంగులు, నిల్వ సౌకర్యాలు, నాణ్యత పరీక్షా కేంద్రాలు వంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని చెంచయ్య నాయుడుని కోరుతూ… రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చే విధంగా రెండు విడతల్లో రూ.14,000 రైతుల ఖాతా లోకి కూటమి ప్రభుత్వం వేసిందని తెలిపారు. “పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం” కింద మొదటి విడతలో భాగంగా రూ.3,174 కోట్లు,రెండో విడతలో భాగంగా రూ.3,135 కోట్లు మొత్తంగా రూ.6,310 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసి కష్టకాలంలో అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటూ నిత్యం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన 2024-25 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం… ఉద్యాన రంగంలో 193 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి చేస్తూ దేశంలో మొదటి స్థానం దక్కించుకున్న ఏపీ… 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఆక్వా రంగంలోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఆయా రంగాలకు చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్,శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, క్లస్టర్ ఇన్ఛార్జి పేట బాలాజీ రెడ్డి,బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు దొరైరాజ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,తిరుపతి పార్లమెంటు నాయకులు సంజాకుల మురళీకృష్ణ, కృష్ణమూర్తి,సయ్యద్ చాంద్ బాషా,భాస్కర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.