Sunday, 15 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

CMRF చెక్కును అందజేసిన జనసేన నాయకులు

అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయనిధి (CMRF) కోసం దరఖాస్తు చేసుకున్న వత్సవాయి మండలం, భీమవరం గ్రామానికి చెందిన వాసిపల్లి సుబ్బారెడ్డి గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి సిఫారసు మేరకు, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రూ. 81,000/- విలువ గల CMRF చెక్కు మంజూరైంది. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ఈ చెక్కును జనసేన పార్టీ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ తుమ్మల ప్రభాకరరావు గారు, జనసేన నాయకులు శ్రీ షౌకత్ అలీ గారు, శ్రీ ఈమని కిషోర్ కుమార్ గారు, శ్రీ గొర్రెపాటి సుదర్శన్ గారు, భీమవరం గ్రామ నాయకులు శ్రీ గుండం రంగారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయ దివాస్

ప్రెస్ నోట్ భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు విజయ్ దివస్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు. 1971 Bangladesh Liberation యుద్ధంలో భారత సాయుధ దళాలు సాధించిన చారిత్రక విజయాన్ని స్మరించుకుంటూ, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విజయ్ దివస్ భారత దేశ గర్వకారణమని, సైనికుల అపార ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడికి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, కర్తవ్యబద్ధత, క్రమశిక్షణ వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు డా. పవన్ పాండే, డా. భీమారావు, డా. పి.జి. రెడ్డి, డా. రవి కుమార్, డా. ఎం. శంకర్ డాక్టర్ సంతోష్ కుమార్, అబ్దుల్లా, సురేందర్ ,దివ్య , రాజయ్య, మజార్, కిషన్ ,ఇర్ఫాన్ ,వాయిద్, ఉజ్మా సమరీన్ యుద్ధ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణలో భారత సైనికుల పాత్ర అమోఘమని కొనియాడారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ త్యాగాలకు తగిన పౌరులుగా మెలగడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు శ్రీ ఏ. రాజు, డా. ఓం ప్రకాష్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతం ఆలపించడం, వీర జవాన్లకు రెండు నిమిషాల మౌనం పాటించడం, దేశభక్తి ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు దేశ రక్షణకు అంకితమైన భారత సైనికుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, దేశ సేవే పరమ ధ్యేయంగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ విధంగా విజయ్ దివస్ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణంలో ఘనంగా ముగిసింది.

నిర్మల్

బైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయ దివాస్

ప్రెస్ నోట్ భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు విజయ్ దివస్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు. 1971 Bangladesh Liberation యుద్ధంలో భారత సాయుధ దళాలు సాధించిన చారిత్రక విజయాన్ని స్మరించుకుంటూ, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విజయ్ దివస్ భారత దేశ గర్వకారణమని, సైనికుల అపార ధైర్యసాహసాలు, త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడికి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, కర్తవ్యబద్ధత, క్రమశిక్షణ వంటి విలువలను తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు డా. పవన్ పాండే, డా. భీమారావు, డా. పి.జి. రెడ్డి, డా. రవి కుమార్, డా. ఎం. శంకర్ డాక్టర్ సంతోష్ కుమార్, అబ్దుల్లా, సురేందర్ ,దివ్య , రాజయ్య, మజార్, కిషన్ ,ఇర్ఫాన్ ,వాయిద్, ఉజ్మా సమరీన్ యుద్ధ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, సార్వభౌమత్వం పరిరక్షణలో భారత సైనికుల పాత్ర అమోఘమని కొనియాడారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ త్యాగాలకు తగిన పౌరులుగా మెలగడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు శ్రీ ఏ. రాజు, డా. ఓం ప్రకాష్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతం ఆలపించడం, వీర జవాన్లకు రెండు నిమిషాల మౌనం పాటించడం, దేశభక్తి ప్రతిజ్ఞ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు దేశ రక్షణకు అంకితమైన భారత సైనికుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, దేశ సేవే పరమ ధ్యేయంగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ విధంగా విజయ్ దివస్ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణంలో ఘనంగా ముగిసింది.

అన్నమయ్య

బిసి హాస్టల్ పరిశీలించిన సిఐటియు జిల్లా నాయకులు!సమస్యల పరిష్కరించాలని డిమాండ్

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉన్న బీసీ హాస్టల్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, మండల నాయకులు, కర్రతోటే హరి నారాయణ, మంగళవారం సందర్శించి, అక్కడ ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఎక్కువగా దోమలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక పోతున్నామని, వాటి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.  స్పందించిన  సిఐటియు నాయకులు, సర్పంచ్  దార్ల చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి, తక్షణం 15వ ఫైనాన్సు నిధులు కింద, దోమలు నివారణ కోసం,ప్యాగీ0గ్  చేయాలని చెప్పడం జరిగినది. మిషను చెడిపోయి ఉన్నది. ఏదో విధంగా స్ప్రే చేపిస్తానని  హామీ ఇచ్చారు. వర్షం వస్తే రూములు తడుస్తున్నాయని, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ప్రత్యమ్న ఏర్పాటు చేయాలని, రూములు రిపేర్  చేయించాలని  వార్డెన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. పెద్ద పిల్లలకు నెలకు 150 రూపాయలు కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాల్సి ఉండగా మూడు సంవత్సరాలుగా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బట్టలు ఉతుక్కోవాలన్నా, స్నానం చేయాలన్నా, నూనెలు, చెప్పులు, కట్టింగులకు, ఇన్ని నెలల ఇవ్వకుంటే ఎలా ఉంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, తక్షణం ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

NCC విజయభేరి …. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడ…..16/12/2025….

(విజయవాడ….లబ్బీపేట…. డాక్టర్ మంజుల గుదిమెళ్ళ పున్నమి) SDMSMK ఎన్సీసీ యూనిట్ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల (PBSCAS), విజయవాడ వారు నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా జరిగిన **“విజయంత ట్రియోస్ ఎలాన్ – 4(A) గర్ల్స్ ఫెస్ట్”**లో చురుకుగా పాల్గొని విశేష విజయాలు సాధించింది. ఈ కార్యక్రమంలో SDMSMK నుంచి 57 మంది ఎన్సీసీ కేడెట్లు డ్రిల్, డిబేట్, ఫ్లాగ్ ఏరియా ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సోలో డాన్స్, గ్రూప్ సాంగ్, గ్రూప్ డాన్స్‌తో పాటు క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కేడెట్లు ప్రదర్శించిన క్రమశిక్షణ, జట్టు భావన మరియు అంకితభావం ఫలితంగా అనేక పోటీల్లో బహుమతులు సాధించారు. సాంస్కృతిక మరియు ఎన్సీసీ కార్యక్రమాల్లో డ్రిల్ టెస్ట్, గ్రూప్ డాన్స్, సోలో డాన్స్, ఫ్లాగ్ ఏరియాలో ప్రథమ బహుమతులు, అలాగే పోస్టర్ ప్రెజెంటేషన్, డిబేట్, సోలో సింగింగ్‌లో ద్వితీయ బహుమతులు సాధించారు. క్రీడా పోటీల్లో టగ్ ఆఫ్ వార్ మరియు రన్నింగ్ పోటీల్లో ప్రథమ బహుమతులు, త్రోబాల్‌లో ద్వితీయ బహుమతి, క్విజ్‌లో తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా SDMSMK ఎన్సీసీ యూనిట్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు డాక్టర్ వివియస్ సుబ్రహ్మణ్య కుమార్ గారు, కళాశాల యాజమాన్యం మరియు ఎన్సీసీ ఆఫీసర్ బి. కోమలి గారు విజయాలు సాధించిన ఎన్సీసీ కేడెట్లను హృదయపూర్వకంగా అభినందించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ప్రారంభోత్సవాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రాక

ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ ప్రారంభోత్సవాల సందర్భంగా 15/12/25 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ APSECM సహకారంతో ఘనంగా ఎనర్జీ సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి మున్సిపల్ స్టేడియం వరకు సాగింది ఈ ర్యాలీలో స్టూడెంట్స్ నినాదాలు చేస్తూ ఎనర్జీ సేవ్ చేయండి…భవిష్యత్తును కాపాడండి,… విద్యుత్తు ఆదా……దేశ ప్రగతి వంటి సందేశాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు… ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ పుల్లారెడ్డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ APCPDCL, శ్రీ జి లక్ష్మీశ ఐఏఎస్ కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, శ్రీమతి నాగలక్ష్మి. ఎస్. ఐఏఎస్.. మేనేజింగ్ డైరెక్టర్… ఏపీ జెన్కో అండ్ సీఈవో, APSECM శ్రీ కమలాకర బాబు వి.సి.అండ్ మేనేజింగ్ డైరెక్టర్, NREDCAP మరియు జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ ఆర్ డి అండ్ అడ్మిన్ ) APTRANCO పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం గావించారు.

కామారెడ్డి

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరీక్ష

రామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం లో విద్యార్థుల ఆరోగ్య పరీక్ష జరిగిందని తెలిపారు. వైద్యుడు డా. సురేష్‌కు నేతృత్వంలో 18 మంది పిల్లలకు సమగ్ర హెల్త్ చెకప్‌లు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యా న్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసా గుతాయని తెలిపారు.ఈ పరీక్షల్లో జ్వరం, జలుబు తద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడు తున్న 8 మంది విద్యార్థులకు అవసరమైన మందు లు అందజేశారని చెప్పారు. అనంతరం పాఠశాల కిచెన్‌ను స్వచ్ఛత, నాణ్యతలో తనిఖీ చేశారు.ఈ కార్యక్ర మంలో కస్తూరిబా ప్రిన్సిపాల్ వనిత, ఏ ఎన్ ఎంలు రజిత, జ్యోతిప్రియ, రమాదేవి, అరుణలతో పాటు వైద్య సిబ్బంది శ్రీహరి, దోమల శ్రీధర్‌లు పాల్గొన్నా రు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కండలేరు డ్యామ్ ను నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలి బిజెపి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి) కండలేరు డ్యామ్‌ను తిరుపతిలో కలపాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈరోజు మనుబోలు మండలంలో ఉప తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. డ్యామ్‌ను తిరుపతిలో కలిపితే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ రైతులు, ప్రజలు, మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, వేలాది ఎకరాల భూములు బీడుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మార్చకపోతే రాస్తారోకో, ధర్నా వంటి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను, బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఇరగరాజు వెంకయ్య పట్నం ప్రతాప్, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో డిప్యూటీ ఎంపీడీవో గా కరిముల్లా

ఉదయగిరి మండలంలోని గ్రామ వార్డు సచివాలయాలా డిప్యూటి ఎంపీడీవోగా సయ్యద్ కరిముల్లా నియామకమయ్యారు ఈయన ప్రకాశం జిల్లా కంభం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పై ఉదయగిరి గ్రామ వార్డు సచివాలయాలా డిప్యూటి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలుకి అందుబాటులో ఉండాలన్నారు

తెలంగాణ

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు అన్న : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్, కౌంటింగ్, ఫలితాల ప్రకటనలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.