కుమారదేవం లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోరిజాల పేర్రాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు,ఈ వేడుకల్లో భారీ కేకు ను కొవ్వూరు వై ఎస్ ఆర్ సి పీ సమన్వయ కర్త,మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు కట్ చేసి జగన్మోహన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది మన ప్రభుత్వంమేనని నాయకులు, కార్యకర్తలు అధైర్య పడవద్దన్నారు ఇప్పటినుండే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్ట పడి 2029లో పార్టీని గెలిపించుకుందామని అన్నారు.ఈ కార్యక్రమంలో గోరిజాల పేర్రాజు,గ్రామ వై సీ పి అధ్యక్షులు కాసాని వెంకటేష్, ఉపాధ్యక్షులు అడబాల అచ్చి బాబు, నాయకులు, కార్యకర్తలు వై ఎస్ జగన్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.










