Friday, 13 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నం* నందు. (*డిన్నర్ విత్ ఆఫీసర్స్ అండ్ క్యాడర్*)

*విశాఖ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం గోపాలపట్నం* నందు. (*డిన్నర్ విత్ ఆఫీసర్స్ అండ్ క్యాడర్*) విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:- ప్రభుత్వ విప్ *శ్రీ.గణబాబు* గారి ఆధ్వర్యంలో *90,91 వార్డ్ సచివాలయం సిబ్బంది మరియు క్యాడర్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించాడం జరిగినది*. ఈ సమావేశంలో *గణబాబు* గారు మాట్లాడుతూ *సచివాలయం సిబ్బంది పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయాలని అర్హులందరికీ సంక్షేమ పథకాలు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల జీవోలపై పూర్తి అవగాహనతో ఉండాలని , వార్డ్ స్థాయిలో శానిటేషన్ , వాటర్ సప్లై , సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు*. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనేత *మౌర్యసింహా* గారు జోనల్ కమిసనర్స్ *రాము* గారు *శంకరరావు* గారు 90 వార్డ్ కార్పొరేటర్ *బొమ్మిడి రమణ* గారు , వాటర్ సప్లై DE *వీరయ్య* గారు కూటమి నేతలు *నారిపిన్ని సత్తిరాజు , శరగడం అరుణ్ కుమార్ , బంగారు తులసిరామ్ , బొడ్డేటి విజయ్ , దాడి రమేష్ నాయుడు , జ్యోతి బాబీ , నరవ అనూష , పట్నాల అరుణ్ కుమార్ కొల్లి అప్పారావు , ఉప్పెటి శివ , కుమార్ , నాగు ,నరేంద్ర , రెవెన్యూ , జీవీఎంసీ సిబ్బంది , సచివాలయం సిబ్బంది , బూత్ స్థాయి నాయకులు , మహిళ నాయకులు , కార్యకర్తలు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

విశాఖపట్నం

గణిత శాస్త్రంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహణ*

*గణిత శాస్త్రంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహణ* విశాఖపట్నం, డిసెంబర్ 23,పున్నమి ప్రతినిధి:- *భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి (జాతీయ గణిత దినోత్సవం 2025)ను పురస్కరించుకుని, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర మరియు అనువర్తిత గణిత శాస్త్ర విభాగాల సంయుక్తంగా “గణిత శాస్త్రంలో ప్రస్తుత ధోరణులు” (Current Trends in Mathematics) అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ అసాధారణ జీవితం మరియు ఆయన చేసిన పరిశోధనల స్ఫూర్తితో ఈ సదస్సును నిర్వహించారు* . *ముగింపు కార్యక్రమానికి ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ హాజరయ్యారు. సదస్సులో భాగంగా గౌరవ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ “గ్రీన్స్ ఫంక్షన్ మెథడ్స్ టు సాల్వ్ లాప్లీస్ ఈక్వేషన్” అనే అంశంపై ప్రసంగించారు. భారతీయ గణిత శాస్త్రవేత్తల కృషిని నేటితరం తెలుసుకోవాలని, వారి వారసత్వాన్ని కొనసాగించే దిశగా విలువైన పరిశోధనలు జరపాలని సూచించారు* . *కోల్కతాలోని RKMVERI యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ అధికారి “ఎర్లీ రామ్సే టైప్ థియరమ్స్” అనే అంశంపై విద్యార్థులకు, పరిశోధకులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు కాలానుగుణగా జరుగుతున్న శాస్త్రవిజ్ఞాన ప్రగతిని తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు.* పరిశోదన రంగంలో అడుగిడాలని యువతకు సూచించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రధానంచేసి అభినందించారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులకు ఆధునిక గణిత శాస్త్రంలో వస్తున్న మార్పులపై లోతైన అవగాహన కలిగించడానికి ఉపయుక్తంగా నిలచిందని విభాగాధిపతి ఆచార్య అనురాధ కామేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో డీన్ ఆచార్య రాజేంద్రప్రసాద్, ఆధార్య పి.డి. ఎన్ శ్రీనివాసు, విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సును సోమవారం ఉదయం ఐఐటీ గౌహతి కి చెందిన ప్రొఫెసర్ కె.వి. కృష్ణ ప్రారంభించి “వర్డ్-రిప్రజెంటబుల్ గ్రాప్స్” (Word-Representable Graphs) అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం డాక్టర్ ఎన్. రామకృష్ణ “అసింష్టోటిక్ రెగ్యులారిటీ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ సర్టైన్ మోనోమియల్ ఐడియల్స్” అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశాడు. మధ్యాహ్నం సెషన్లో ఐఐపీఈ, విశాఖపట్నం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. రామునాయుడు “వేర్ AI మీట్స్ కంప్రెస్డ్ సెన్సింగ్: ఎ టూ వే రివల్యూషన్” అనే అంశంపై ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ‘ఇంటెలిజెన్స్ రంగంలో గణితం పాత్రను ఆయన వివరించారు. అనంతరం రెండు విభాగా విద్యార్ధులకు క్విజ్ పోటీలను నిర్వహించారు.

అమరావతి

నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు

నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు అమరావతి డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:- ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీసులు నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో నటుడు శివాజీకి నోటీసులు పంపిన మహిళా కమిషన్

విశాఖపట్నం

నాణ్యమైన వైద్యం, వైద్య విద్యే మా పార్టీ విధానం – మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి – అదే మా పార్టీ విధానం

విశాఖపట్నం డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:- – నాణ్యమైన వైద్యం, వైద్య విద్యే మా పార్టీ విధానం – మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి – అదే మా పార్టీ విధానం – ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే ఉపేక్షించేదిలేదు – మేం అధికారంలోకి వస్తే ఇలాంటి వారిపై చర్యలు – మా పార్టీ అధ్యక్షుడూ ఇదే స్పష్టం చేశారు : శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టీకరణ విశాఖపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాధ్, ఇతర వైయస్సార్సీపీ నేతలు. – డిప్యూటీ సీఎం పీకుడు భాష తీవ్ర అభ్యంతరకరం – పవన్ కళ్యాణ్ కాగితంపులి మాటలు కట్టిపెట్టండి – గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు – సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా – అయినా చర్యలు మాత్రం శూన్యం : సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ – కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి – యూరియా కొరతపై కుంటిసాకులు – యుక్రెయిన్ యుద్దం కారణమైతే దేశమంతా కొరతుండాలి – ఎన్డీయే రాష్ట్రాల్లో లేని కొరత ఏపీకే ఎందుకు? – ఏపీలో రైతుల తరపున అడిగే నాధుడేలేడు : తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ – రియల్ ఎస్టేటే కంపెనీలకు కారుచౌకగా భూదోపిడీ – ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యా వార్తలే – సంక్షేమ హాస్టళ్లలోనూ కొరవడిన తాగునీరు, పౌష్టికాహారం – నాడు- నేడు పథకానికి మంగళం – ముస్తాబు పేరుతో అద్దం, దువ్వెనలు – భారీగా అప్పులు- అధ్వాన్నంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి – 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు – భారీగా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు – నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించని ఆరోగ్యశ్రీ బిల్లులు – ఇది ముమ్మూటికీ అసమర్థ ప్రభుత్వమే : కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్ పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని… అందులో భాగంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలన్నదే మా పార్టీ విధానమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణపేరుతో స్కాములకు మేం విరుద్దమన్న ఆయన.. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ సైతం ఇదే స్పష్టం చేశారని తెలిపారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ఇదే మా పార్టీ విధానమని… మేం అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేయడంతో పాటు స్కాములకు పాల్పడ్డ వారిపై చర్యలు ఖాయమని స్పష్టీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీకుడు భాష పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన… కాగితంపులి మాటలు కట్టిపెట్టాలని సూచించారు. గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నా, సీపోర్టుల ద్వారా లక్షల టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో పేదల ఉపాధి గండం కలిగేలా… ఉపాధి హామీ చట్టం ఆబ్జెక్ట్ మార్పు చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి రాజ్యమేలుతుందని… యూరియా కొరతపై కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డ బొత్స సత్యనారాయణ, యుక్రెయిన్ యుద్దం కారణమైతే ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో లేని కొరత ఏపీకే ఎందుకని నిలదీశారు. కేవలం ఏపీలో రైతుల తరపున అడిగే నాధుడు లేకపోవడమేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిరోజూ పత్రికల్లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలతో పాటు సంక్షేమ హాస్టళ్లలోనూ కొరవడిన తాగునీరు, పౌష్టికాహార వార్తలే దర్శనిమిస్తున్నాయని.. ప్రభుత్వ అసమర్ధ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా.. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు, నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించలేని అసమర్థ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ● క్షేత్రస్దాయికి వెళ్లి నిజాలు తెలుసుకొండి… నాలుగైదు రోజులగా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, వారి భాష, ఆలోచనా విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారం రోజుల క్రితం గవర్నర్ గారిని మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ తో పాటు మా పార్టీ నాయకులందరం వెళ్లి కలిసాం. ప్రజారోగ్యానికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో పెట్టిన మెడికల్ కాలేజీలను స్వార్ధంతో పీపీపీ విధానంలో ప్రైవేటైజేషన్ చేస్తున్నారని… దీన్ని వ్యతిరేకిస్తూ కోటికి పైగా సంతకాలతో కూడిన ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ గారికి సమర్పించాం. అనంతరం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడిన మాటలు, వారి భాషపై ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నాను. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలుంటే కోటి మంది ఎలా సంతకాలు పెట్టారని ప్రశ్నిస్తున్నారు? అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో మంత్రిగారికి తెలుసా? ప్రజలు ప్రభుత్వ హయాంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి, సంతకాలు చేశారు. మీరు మీకు నచ్చిన గ్రామానికి వెళ్లి… మేం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటున్నాం.. ఎవరికైనా అభ్యంతరం ఉందా? అని అడిగితే ప్రజలే వాస్తవాలు చెబుతారు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటే.. మీకే వాస్తవాలు తెలుస్తాయి. కావాలంటే మీరే ప్రజాభిప్రాయం తెలుసుకొండి, అంతే తప్ప చిన్న మాటలు మాట్లాడి మీ స్థాయి తగ్గించుకోవద్దు. ● మా పార్టీ విధానం సుష్పష్టం- అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటీకరణ రద్దు ఖాయం.. ప్రైవేటీకరణ మీ విధానం అని ధైర్యంగా చెప్పండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినదేమిటంటే… ఎవరైనా ఆశపడో, అవినీతి కోసమో.. ఈ కార్యక్రమం చేస్తే మేం ప్రజల అండదండలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేస్తాం, అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. మరలో మేం మరోసారి చాలా స్పష్టంగా చెబుతున్నాను. మా పార్టీ విధానం చెబితే అది బెదిరింపు ఎలా అవుతుంది? ఉపముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు? ప్రజారోగ్యాన్ని మీ స్వలాభం కోసం మార్చుకోవాలని చూస్తే… వారిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠిన చర్యలు తప్పవన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాం. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మంత్రులందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ● పేదల ఉపాధికి గండం… మీ ఎన్నికల ప్రణాళిక అమలుతో సహా రాష్ట్రంలో చాలా సమస్యలుంటే వాటిపై మాత్రం మీరు నోరు మెదపడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఆ ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు కానీ… ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం ఆబ్జెక్ట్ మార్చడం వల్ల.. ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురిస్తోంది. మరలా రాష్ట్రంలో వలసలు వచ్చే తరుణం ఆసన్నమవుతోంది. గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోయి.. పని దొరక్క ఇబ్బందులు పడే రోజులు రానున్నాయి. ఇది వాస్తవం. ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పూర్వాపరాలు చర్చించి, మంచి చెడ్డలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు పార్లమెంటులో భేషరతుగా మద్దతిచ్చి.. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ పేరునే తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… దానికి సంబంధించిన శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ● కూటమి పాలనలో ప్రతి స్ధాయిలోనూ అవినీతి.. మరి పేదవాడి గురించి మీ ఆలోచన ఏమైంది? మీరు ఎందుకు దాని గురించి ప్రశ్నించడం లేదు? మీకు బాధ్యత లేదా? నేను ఒక బాధ్యత కోసమే ఈ పార్టీని స్థాపించానని చెప్పే మీరు.. ఈ పేదవాడి బ్రతుకు గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు? చంద్రబాబు నాయుడుకి ఎలాగూ పేదలు అవసరం లేదు? ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ వ్యక్తుల గురించే ఆలోచన చేస్తాడు, వారి గురించే ఆలోచిస్తాడు. పేద, మద్య తరగతి ప్రజల గురించి ఏనాడూ ఆలోచన చేయడు. మీక్కూడా పేదలు, పవన్ కళ్యాణ్ గారూ మీక్కూడా పేదల బాధలు అవసరం లేదా? ప్రశ్నిస్తానని పదే, పదే చెప్పే మీరు.. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి వైద్య ఆరోగ్యశాఖను ప్రజలకు దూరం చేస్తూ.. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామంటే మేము బెదిరిస్తున్నామంటారా? మా పార్టీ అధికారంలోకి రాదంటూ జ్యోతిష్యాలు చెబుతున్నారు. రాజకీయ పార్టీ అన్నప్పుడు.. ఒక సిద్ధాంతపరంగా ముందుకు వెళ్తుంది. ఆ ఆలోచన, ఆ లక్షణాలు కనిపించడం లేదు? ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కింద నుంచి పై స్థాయి వరకు అవినీతితో నిండిపోతుంది. శాంతిభద్రతలు లేవు. కనీసం ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు శుభ్రమైన భోజనం తిని, చక్కగా చదువుకునే పరిస్ధితులే లేవు. ఏ అంశాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. ● యూరియా కొరతపై కుంటిసాకులు.. డిప్యూటీ సీఎం ప్రసంగం వింటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు? యుక్రెయిన్ యుద్ధం వలన రాష్ట్రంలో యూరియా ధరలు పెరిగిపోయాయని చెబుతున్నాడు. ఇది విమర్శ కాదు. ఒక వేళ యుద్దం వలనే యూరియా డిమాండ్ వస్తే ఆ కొరత భారతదేశమంతటా ఉండాలి కదా, కానీ యూపీలో యూరియా ఎలా దొరికింది? బీహార్, హర్యానా, మన పక్కనే ఉన్న ఒడిషా లో ఎలా దొరికింది? ఏపీలో మాత్రమే ఎందుకు దొరలేదు? కేవలం ఆంధ్రా, తెలంగాణాకే యుద్దం ప్రభావం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ తప్ప ఎన్టీయే ప్రభుత్వాలు ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయో అక్కడ మాత్రం యూరియా పుష్కలంగా దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత ఉన్నా, రైతులు ఇబ్బండి పడుతున్నా అడిగే నాధుడు లేడు కాబట్టి, వ్యవసాయం శుద్ద దండగ అనేది

E-పేపర్

కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో.

పున్నమి ప్రతినిధి: కొత్త ఏడాది వేడుకలకు మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో… డిసెంబర్‌ 31న బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్‌లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి… వైన్‌ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి… ఈనెల 30, 31న ప్రత్యేక తనిఖీలుంటాయన్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్…

యాదాద్రి భువనగిరి

*సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ ను సన్మానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

పున్నమి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లా యాదిగిరి గుట్ట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జేతురం తండా సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ ని మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతులమీదుగా, ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని కావాల్సిన నిధులు ఇస్తామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు,

యాదాద్రి భువనగిరి

* కందకాలను పరిశీలించిన సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి *

పున్నమి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 23 : సంస్థాన్ నారాయణపురం నూతనంగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి మండల కేంద్రంలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి గ్రామానికి అనుకొని ఉన్న కందకం సమస్య. మంగళవారం వార్డు సభ్యులతో కలిసి స్వయంగా కందకాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని సగానికి పైగా డ్రైనేజీ మురికి నీరు కందకాల వద్ద నిలిచిపోవడం వలన దానిలో పడిన వ్యర్ధాలు కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంనాయి దీనివల్ల కందుకానికి ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ఇల్ల ప్రజలు విషపూరితమైనటువంటి పాములు దోమలు,వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అన్నారు ఈ యొక్క సమస్యను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగేటట్టు కృషి చేస్తానని గ్రామ ప్రజలకు హామీని ఇచ్చారు.మొదటగా దోమలు రాకుండా పాములు రాకుండా బ్లీచింగ్, ఫాగింగ్ చేయిస్తానని హామీని ఇచ్చారు. సర్పంచ్ హామీతో కాలనీవాసులు ప్రజలు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: ఘనంగా వినియోగదారుల దినోత్సవం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వినియోగదారుల దినోత్సవాన్ని జరిపారు. వినియోగదారులు నాణ్యత లేని, కల్తీ వస్తువులు అమ్మినా, ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధర వసూలు చేసినా అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ అన్నారు. బ్యాంకింగ్, భీమ, రవాణా విద్యుత్ వంటి ఏ ఇతర సేవల వలన ఇబ్బందులు ఏర్పడినా వినియోగదారుల కోర్టులను ఆశ్రయించవచ్చని కామర్స్ అధ్యాపకులు రాజు తెలిపారు. నిర్వహించిన పోటీలలో గెలిపొందిన వారికి బహుమతులు అందించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: పెసా అమలు తీరును తెలుసుకున్న ఉత్తర భారతీయులు

పెసా మహోత్సవంలో బాగంగా అరకులోయ మండలం లోని సుంకరిమెట్ట, చొంపి పంచాయితీలలో సర్పంచ్ చినబాబు, సుభద్ర ల అధ్యక్షతన మంగళవారం గ్రామసభలు జరిగాయి. ఈ గ్రామసభలలో కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రభాత్ హజరయ్యారు. గ్రామసభలో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్ ల నుండి పంచాయితీ ప్రతినిధులు పాల్గొని అల్లూరి జిల్లా లో పెసా అమలు తీరు, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకున్నారు. ఈ గ్రామసభలను ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యన్నారాయణ పర్యవేక్షించారు.

యాదాద్రి భువనగిరి

* గొర్లకు మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసిన..సర్పంచ్ విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 23 : జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పశు వైద్య అధికారి డాక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గొర్లకు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ,అందె యాదయ్య, పల్లె గోపాల్ రెడ్డి, ఎండి రహీం షరీఫ్, గునిగంటి రాజు గౌడ్, కడారి శంకరయ్య, అబ్బు, సాదిక్, ఎడ్ల నరసింహ, రాములు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.