క్రిస్మస్ పండుగ సందర్భంగా మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేసిన వ్యాపార వేత్త గోళ్ళ రాజేష్
నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురం పెద్ద చర్చి సమీపంలోని గూడెంలో కార్యనిర్వాకులు సీనియర్ రిపోర్టర్ ఏపీయుడబ్ల్యూజే నంద్యాల ఉపాధ్యక్షులు నూర్ భాషా ఆధ్వర్యంలో నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త గొళ్ళ రాజేష్ ఆదేశాలతో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద మహిళలకు వ్యాపార వేత్త గోళ్ళ రాజేష్ సౌజన్యంతో ఉచితంగా చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలను నిర్వహించే సమన్వయకర్త, సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా ఆధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు క్రిస్టియన్ జేఏసీ నాయకులు జానయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల్ల రహీం, సిపిఎం నాయకులు నర్సింహులు,శివరామిరెడ్డి, దైవ సేవకులు పాస్టర్లు తదితరులు మాట్లాడుతూ నంద్యాల పట్టణ వాసి, వ్యాపారవేత్త గొళ్ళ రాజేష్ స్థానికంగా వ్యాపార రిత్యా అందుబాటులో లేనప్పటికీ తాను నమ్మే సిద్ధాంతం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న ఉద్దేశంతో ఇప్పటికే నంద్యాల పట్టణ ప్రాంతాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనే తలంపుతో ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆయన కోరిక మేరకు ఈ రోజు దాదాపు 200 మందికి పైగా చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన యేసు ప్రభు వారిని ప్రార్థిస్తూ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి కోవత్తుల దీపాకాంతులతో క్రిస్మస్ పర్వదినం సంతోషాలను పంచుకోవడం జరిగింది. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గోళ్ళ రాజేష్ ఏసుక్రీస్తు పుట్టిన రోజు పవిత్రమైన క్రిస్మస్ పండుగను పేద మహిళలు కూడా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తన వంతు సహాయంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ గోళ్ళ రాజేష్ తమకు ఉచితంగా చేరాలను ఇవ్వడం మరువలేనిదని, ఆయన చల్లగా ఉండాలని ఏసుక్రీస్తు కృప ఆయన మీద ఉండాలని దీవించారు. ఈ పండుగ సమయాన తమకు చీరలు ఇవ్వడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య ప్రదర్శన ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం,ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ కన్వీనర్ మన్నెం జానయ్య, సిపిఎం జిల్లా నాయకులు పుల్లా నరసింహులు, చిరు వ్యాపారస్తుల సంఘం నంద్యాల ఉపాధ్యక్షులు చంద్రపాల్,శివ రామిరెడ్డి, దైవ సేవకులు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.











