Friday, 13 March 2026

Blog

తిరుపతి

రెడ్డివారి గురవారెడ్డిని ఘంగా సన్మానించిన కూటమి నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డివారి గురవారెడ్డిని నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, బిజెపి నాయకులు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దశరధాచారి మాట్లాడుతూ.. నాటి వైసిపి ప్రభుత్వ అరాచక చర్యలను ఎదుర్కొని నిలబడి, జగన్ రెడ్డిని గద్దె దించడానికి ముందుండి పోరాటాలు చేసిన బిసి, యస్సీ, యస్టీ, మైనారిటీ వర్గాలకు అటు నామినేటెడ్ పదవులలో ఇటు తెలుగుదేశం పార్టీ యొక్క వివిధ కమిటీలలో ఇప్పుడు ఇస్తున్న దాని కన్నా మరింతగా వారి ప్రాతినిధ్యం పెంచి, వారి త్యాగాలకు తగిన గౌరవం దక్కేలా చూసే బాధ్యత ఎన్డీయే కూటమి లోని తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సన్మాన గ్రహీత రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల త్యాగాలే తెలుగుదేశం పార్టీకి మూలధనం అని, జగన్ రెడ్డి యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎదుర్కునే క్రమంలో తమ మాన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప కార్యకర్తలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని అటువంటి ఘనత వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైనందుకు తాను గర్వంగా భావిస్తున్నానని, తనకు వచ్చిన విధంగానే తెలుగుదేశం పార్టీ విజయం కొరకు కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తనపై ఎంతో నమ్మకంతో తనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారని వారి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా గ్రంథాలయ సంస్థ ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. కార్యకర్తల త్యాగాలను విస్మరించకుండా, వారి కష్టనష్టాలకు పరిష్కారంగా నిలిచి, వారిని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముక్త కంఠంతో సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి, డా.యం.ఉమేష్ రావు,బీమాల భాస్కర్ ముదిరాజ్, డి.వి.నారాయణ, బిజెపి నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి,యస్వీ రమణ,వజ్రం కిషోర్,మునిరాజా యాదవ్,కోట చంద్రశేఖర్,ప్రముఖ న్యాయవాదులు సురేంద్ర ముదిరాజ్,అంకయ్య, బిసి, యస్సీ విభాగం విభాగం నాయకులు జనార్థన్ రెడ్డి,మణి,కుమార్, కూలి సన్నీ, రామకృష్ణ, సంజాకుల మురళీకృష్ణ,సుజిత్, సాయి నాయుడు, రమేష్, కృష్ణమూర్తి, నాగరాజు, శేఖర్,శంకరయ్య,పూల శేఖర్,సులేమాన్,భాస్కర్,ఆనంద్,గాజుల భగత్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

విద్యా జ్యోతి పాఠశాలలో వీర బాల దివస్ కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యా జ్యోతి పబ్లిక్ స్కూల్ నందు వీర బాల దివస్ కార్యక్రమాన్ని బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 9న 2022వ సంవత్సరం ఈ మేర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు, చరిత్రపుటల్లో అనేకమంది భరతమాత స్వేచ్ఛ కోసం సంస్కృతి యొక్క రక్షణ కోసం తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించారని ఆకోవలో పెద్దలే కాదు చిన్నారులు కూడా ఉన్నారని వారే బాబా జోరవర్ సింగ్, బాబా పతే సింగ్ వీరు పదవ సిక్కు గురువు అయినటువంటి శ్రీ గురు గోబింద్ జీ చిన్న కుమారులు ఆ చిన్నారుల ధైర్య సాహసాలని, త్యాగనిరతిని స్మరించుకుంటూ అటువంటి వీరపుత్రులను కన్న మాతృమూర్తులను నమస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా 26 డిసెంబర్ న వీర బాల దివస్ గా జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకురాలు కండ్రిగ ఉమా, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యను దర్శించిన సిని హిరో సుమన్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్దం శనివారం నాడు ప్రముఖ సిని నటుడు సుమన్ విచ్చేశారు. వీరికి ఆలయ కార్యనిర్వాహన అధికారి బాపిరెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మృత్యుంజయ స్వామి వారి సన్నిధి వద్ద శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

జూమ్లే పీర్ దర్గా పాల్గొన్న తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: పట్టణంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న జూమ్లే పీర్ దర్గా గందోత్సవంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచన మేరకు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఉరుసులో పాల్గొని దర్గాలో చద్దర్, బూంది సమర్పించి పూజా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన తరపున ఈ గందోత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గందోత్సవం రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్న శ్రీకాళహస్తి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్య నిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్.S.M షఫీ,దేవస్థానం పాలక మండలి సభ్యులు గాదిపాకుల గోపి,వార్డ్ ఇంచార్జ్. పోలూరు శ్రీనివాస్ రెడ్డి,ఐటీడీపీ. ఖాదర్,నియోజకవర్గం మైనారిటీ ఉపాధ్యక్షులు షఫీ, మీర్జా. ప్రధాన కార్యదర్శి.C.S. మస్తాన్,అధికార ప్రతినిధి జహీర్,కార్యదర్శి నయీమ్. రఫీ బాయ్. సాజిద్. జాకీర్. షాబుద్దీన్ హర్షద్. నాయకులు. దొరబాబు బుజ్జి. ఆర్ముగం. రూకేష్. తదితర నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

భారతీయ న్యావాదుల సంఘం సబ్యునిగ ఎన్నికైన అంకయ్య

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ (AILU) సభ్యునిగా కేసి అంకయ్య ఎంపిక శ్రీకాళహస్తి : ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇటీవల నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో (ఐలు) ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ యూనియన్ కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ఈనెల ఎనిమిదో తేదీన జిల్లా కమిటీని రద్దు చేశారు. దీని స్థానంలో తిరుపతి నుండి పత్తికొండ మురళి, హేమ చంద్రారెడ్డి చల్లా వెంకటయ్య, భాను సుందర్, చిత్తూరు నుండి సుగుణ శేఖర్ రెడ్డి, మదనపల్లి నుండి షాజహాన్ భాష, పీవీ ప్రసాద్, సోమశేఖర్, శ్రీకాళహస్తి నుండి కాకి చిన్న అంకయ్య లను 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక జరిగే వరకు వీరు కొనసాగుతారని తెలిపారు. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆలిండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థి సత్తు అంకయ్యకు తప్ప మరెవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. యూనియన్ తో సంబంధం లేని వారికి తాము మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ అభ్యర్థి సత్తు అంకయ్యకు ఐలు కార్యకర్తలు, న్యాయవాదులు తమ ప్రాధాన్యత ఓటు వేసి ఐలు అభ్యర్థి గెలుపుకు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఉరుసు ఉత్సవంలో తెలుగుదేశం నాయకులు.

విశాఖపట్నం

కూటమి పాలనలో అభివృద్ధి–సంక్షేమం వేగం: ఎమ్మెల్యే పల్లా

గాజువాక: డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ విశాఖను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. జీవీఎంసీ 70వ వార్డు శ్రీనివాస నగర్‌లో సుమారు రూ.6.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ ఉరుకూటి చందు తో కలిసి ఎమ్మెల్యే, నగర మేయర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని చెప్పారు. విశాఖ నగరం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇందుకు ఇటీవల నగరానికి వరుసగా వస్తున్న ప్రముఖ సంస్థలే కారణమని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు నాయకులు కొయిలాడ శంకరరావు, ఆడారి రామకృష్ణ, కృష్ణంరాజు, జెడ్సి శేషాద్రి, మురళీదేవి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల చౌరస్తాలో గంజాయి పట్టివేత

కందుకూరు చౌరస్తాలో గంజాయి పట్టివేత యువతను వ్యసనాల పాలు చేస్తున్న గంజాయి ముఠా గుట్టును ఎస్ఓటీ, స్థానిక పోలీసులు రట్టు చేశారు. బీహార్ నుంచి గంజాయి తరలించి కందుకూరు ఎక్స్ రోడ్డు సమీపంలో విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపడమే తన లక్ష్యమని సర్పంచ్ సరికొండ పాండు పేర్కొన్నారు.

తెలంగాణ

పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలన్న: కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ ఎల్ బి సి కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు.

విశాఖపట్నం

87వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 18.80 లక్షల జీఎంసీ నిధులతో కొత్త వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటు

గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం పరిధిలోని 87వ వార్డు తిరుమలనగర్‌లో తాగునీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడింది. తిరుమలనగర్‌లో కొత్తగా వాటర్ పైప్‌లైన్లు వేయుటకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలనగర్‌లో పాత వాటర్ పైప్‌లైన్ల లీకేజీల కారణంగా జీవీఎంసీ నీరు వృథాగా పోవడంతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రోడ్ క్రాసింగ్ ప్రాంతాల్లో కొత్తగా ఎమ్‌ఎస్ పైప్‌లైన్లు ఏర్పాటు చేయడానికి జీవీఎంసీ నిధుల నుంచి 18 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేయించి, పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే తాగునీటి సరఫరాలో మెరుగుదలతో పాటు నీటి వృథా కూడా తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు, ఆనంద్ కుమార్, కణితి ఈశ్వరరావు, మల్లా రాము, కడుపుట్ల శ్రీను, జాన్ రమేష్, భాగ్యలక్ష్మి, దాలయ్య, ఏటియన్ మూర్తి, కళ్యాణ్ చెక్రవర్తి, విశ్వేశ్వరరావు, పరమానందం, సన్యాసిరావు, తిరుమలనగర్ అసోసియేషన్ సభ్యులు, జీవీఎంసీ వాటర్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు

పోతుగల్ గ్రామ సర్పంచ్ గారైన పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ గారు ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి సమస్యలు మౌలిక వసతుల అవసరాలను ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లారు గ్రామంలో రోడ్లు డ్రైనేజీ తాగునీటి సౌకర్యాలు ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ ని కోరారు దీనిపైన స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.