రెడ్డివారి గురవారెడ్డిని ఘంగా సన్మానించిన కూటమి నాయకులు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా రెడ్డివారి గురవారెడ్డిని నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, బిజెపి నాయకులు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దశరధాచారి మాట్లాడుతూ.. నాటి వైసిపి ప్రభుత్వ అరాచక చర్యలను ఎదుర్కొని నిలబడి, జగన్ రెడ్డిని గద్దె దించడానికి ముందుండి పోరాటాలు చేసిన బిసి, యస్సీ, యస్టీ, మైనారిటీ వర్గాలకు అటు నామినేటెడ్ పదవులలో ఇటు తెలుగుదేశం పార్టీ యొక్క వివిధ కమిటీలలో ఇప్పుడు ఇస్తున్న దాని కన్నా మరింతగా వారి ప్రాతినిధ్యం పెంచి, వారి త్యాగాలకు తగిన గౌరవం దక్కేలా చూసే బాధ్యత ఎన్డీయే కూటమి లోని తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సన్మాన గ్రహీత రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల త్యాగాలే తెలుగుదేశం పార్టీకి మూలధనం అని, జగన్ రెడ్డి యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎదుర్కునే క్రమంలో తమ మాన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప కార్యకర్తలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని అటువంటి ఘనత వహించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైనందుకు తాను గర్వంగా భావిస్తున్నానని, తనకు వచ్చిన విధంగానే తెలుగుదేశం పార్టీ విజయం కొరకు కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తనపై ఎంతో నమ్మకంతో తనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా అవకాశం కల్పించారని వారి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా గ్రంథాలయ సంస్థ ఔన్నత్యాన్ని పెంచడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. కార్యకర్తల త్యాగాలను విస్మరించకుండా, వారి కష్టనష్టాలకు పరిష్కారంగా నిలిచి, వారిని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముక్త కంఠంతో సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి, డా.యం.ఉమేష్ రావు,బీమాల భాస్కర్ ముదిరాజ్, డి.వి.నారాయణ, బిజెపి నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి,యస్వీ రమణ,వజ్రం కిషోర్,మునిరాజా యాదవ్,కోట చంద్రశేఖర్,ప్రముఖ న్యాయవాదులు సురేంద్ర ముదిరాజ్,అంకయ్య, బిసి, యస్సీ విభాగం విభాగం నాయకులు జనార్థన్ రెడ్డి,మణి,కుమార్, కూలి సన్నీ, రామకృష్ణ, సంజాకుల మురళీకృష్ణ,సుజిత్, సాయి నాయుడు, రమేష్, కృష్ణమూర్తి, నాగరాజు, శేఖర్,శంకరయ్య,పూల శేఖర్,సులేమాన్,భాస్కర్,ఆనంద్,గాజుల భగత్ తదితరులు పాల్గొన్నారు.











