Friday, 13 March 2026

Blog

E-పేపర్

రేపు అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్

రేపు అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యేందుకు ఆదివారం సాయంత్రం నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న కేసీఆర్

జోగులాంబ గద్వాల

కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానంటున్నమాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్*

గద్వాల్ డిసెంబర్ 28( పున్నమి ప్రతినిధి) కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానంటున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు భరోసాగా నిలుస్తున్న సంపత్ కుమార్ . అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం సింధనూరు గ్రామంలో కొద్దిరోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థులు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారిని కలిసి శాలువ తో సత్కరించి ఓటమి చెందిన అభ్యర్థులు ఓటమి ను తలచుకుని బాధపడటం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ సంపత్ కుమార్ ఎల్లవేళలా అండగా ఉంటారని గ్రామాల అభివృద్ధిలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పాలుపంచుకోవాలని గ్రామాభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని వారికి సంపత్ కుమార్ గారు తెలిపారు.అనంతరం ఆ గ్రామంలో గెలిచిన వార్డు సభ్యులకు శాలువ కప్పి సత్కరించారు

జోగులాంబ గద్వాల

గద్వాల జిల్లాలో ఇంకేవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పేరు చెప్పుకుంటే అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తా

*గద్వాల జిల్లాలో ఇంకేవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని పేరు చెప్పుకుంటే అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తా.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాలిచేటి రాజీవ్ రెడ్డి * కాంగ్రెస్ పార్టీలో *వెనుపోటు రాజకీయాలు* చేస్తే సహించం * * తప్పుడు ప్రచారాలు చేయొద్దు * పాత కాంగ్రెస్… కొత్త కాంగ్రెస్ అనేది ఉండదు *అందరికి ఒకటే కాంగ్రెస్ పార్టీ* * * భీఫామ్స్ ఇచ్చేది *కాంగ్రెస్ పార్టీ DCC మాత్రమే*.. * * ఎవ్వరు ఇంట్లో వాళ్లు కూర్చొని రాజకీయాలు చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ను,*వాడుకొని వదిలేస్తాము అంటే, పార్టీ కి* అన్ని విషయాలు తెలియచేస్తాము * * అయిదవ *తారీఖు నుంచి ప్రతి ఊర్లో* పర్యటిస్తాం. * * ఎప్పుడూ, నిరంతరం మీ మధ్యలోనే ఉంటూ, *పార్టీ అభివృద్ధి కి కృషి* చేస్తాను. * * కాంగ్రెస్ పార్టీ *కార్యకర్తలందరిని* ఆహ్వానిస్తున్నాం * * కాంగ్రెస్ కార్యకర్తలు అందరు *కలిసికట్టుగా వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా* పాల్గొన్నాలి అని జిల్లా అధ్యక్షులు మాలిచేటి రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు

నాగర్‌కర్నూల్

అంగన్వాడి భవనానికి మహర్దశ.

అంగన్వాడి భవనానికి మహర్దశ. వెల్దండ డిసెంబర్ 28 : వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. గ్రామపంచాయతీ పరిధిలోని అంక మోనికుంట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న అంగన్వాడి భవనంలో గల పిచ్చి మొక్కలను, చెట్లను తొలగించి, అంగన్వాడి భవనానికి మహర్దశ కల్పించారు. అంగన్వాడి కేంద్రాన్ని గత 8 సంవత్సరాల కింద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోకి మార్చడం జరిగింది. నాటి నుండి నిరుపయోగంగా ఉండి, పిచ్చి మొక్కలతో కూరుకుపోయి ఉన్న సమస్యను గ్రామ సర్పంచ్ జెసిబి సహాయంతో మొక్కలను తీసివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి భవనానికి మరమ్మతులు చేయించి, అవసరమగు డోర్లు కిటికీలు బిగించి, రంగులు వేయిస్తానని చెప్పారు. సర్పంచ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నందున గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, గ్రామస్తులు నరసింహ, సత్తూరి శేఖర్, మొకురాల శ్రీకాంత్, వంశీ, జంగయ్య, కిరణ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

మేడిపల్లి నక్కర్త నూతన సర్పంచ్ కి సన్మానం ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు

*నూతన సర్పంచ్ గారికి సన్మానం* ఈరోజు శంషాబాద్ *కె.ఎల్.సి.సి కన్వెన్షన్ హాల్ లో* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా లో నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం గౌరవ శాసనసభ్యులు *శ్రీ మల్ రెడ్డి రంగా రెడ్డి* మరియు ఐటి శాఖ మంత్రివర్యులు *దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా మేడిపల్లి నక్కర్త నూతన సర్పంచ్ గా గెలిచిన *”ముచ్చర్ల సుగుణ సంపత్”*కు శాలువాతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది.

E-పేపర్

VI సిగ్నల్ లేకపోవడంతో సుమారుగా 10రోజులుగా వినియోగదారులు ఇబ్బందు పడుతున్న పట్టించుకోని VI

Vi (సిగ్నల్) నెట్వర్క్ లేక ప్రజలు ఇబ్బంది… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం లో ని నక్కర్త మేడిపల్లిలో గ్రామంలో VI సిగ్నల్ లేకపోవడంతో సుమారుగా 10రోజులుగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు

కామారెడ్డి

కాంగ్రెస్ సఖ్యం ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

ఉపాధి హామీలో గాంధీ పేరు తొలగింపు హేయమైన చర్య! కామొరెడ్డి, 28 డిసెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం భారత మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవా న్ని ఘనంగా జరుపుకున్నారు.గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధా ని మోడీల ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం తీవ్రంగా ఖండించా రు. గాంధీ ఆదర్శాలను కాపాడాలని కాంగ్రెస్ కార్య కర్తలు పిలుపునిచ్చారు.ఈ చర్య గాంధీవాద సిద్ధాంతాలకు అవమానమని అన్నారు.దేశ తల్లి కాంగ్రెస్‌కు అగౌరవమని కాంగ్రెస్ నాయకులు ఘాటుగా విమర్శించారు. రామారెడ్డి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశం స్వాతంత్ర్యం పొందింది. గాంధీజీ స్వప్నాల్లో భాగంగా మనం మాత్రమే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తీసివేయడం దేశ చరిత్రకు మచ్చగా నిలుస్తుందని ఆరోపించారు. గ్రామస్థులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొ న్నారు.కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను గుర్తు చేసుకునే ఈ దినోత్సవం మహా ఆందోళనలు, సమావేశాలతో సార్వత్రికంగా జరు గుతోంది. ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా పేదలకు ఆధారం కాలిగించినప్పటికీ, గాంధీ పేరు తొలగింపు తెలంగాణ ప్రజల్లో కోపాన్ని రేకెత్తిస్తోంద ని అన్నారు. అనంతరం మండలంలో నూతన సర్పంచ్లకు సన్మానం ఘనంగా చేశారు. కాంగ్రెస్ నాయకులు మరిన్ని ఆందోళన లకు సిద్ధమవుతున్నారని చెప్పారు అనంతరం నూతన సర్పంచ్లకు ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్ర మంలో ఉపాధ్యక్షులు ల్యాగల ప్రసాద్, మండల జనరల్ సెక్రెటరీ ఎండి రావుఫ్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ముఖ్య సలహాదా రులు చీలాసాగర్, పిప్పరి లింగం, ఏఎంసీ డైరెక్టర్ బట్టు సత్యనా రాయణ, బి పేట రంజిత్, రామారెడ్డి సర్పంచ్, ప్రవీణ్ కుమార్, కన్నాపూర్ సర్పంచ్ గొల్లమహేశ్, గొల్లపల్లి సర్పంచ్ కిషన్ యాదవ్, ఇసన్నపల్లి సర్పంచ్ దోకీ లచ్చాయ్యా, రామారెడ్డి మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, పోసానిపేట్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త లు రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్ గొల్ల పల్లి సర్పంచ్ కిషన్ యాదవ్ ఇసనపల్లి సర్పంచ్ డోకి లచ్చయ్య, కన్నాపూర్ సర్పంచ్ గొల్ల మహేష్ యాదవ్, రామారెడ్డి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నామాల రవి,3వా వార్డు సభ్యులు పిప్పిరి లింబాంద్రీ, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రేషన్ బియ్యం దొంగ లించిన దొంగలకు 14 రోజులు రిమాండ్

ఉదయగిరి గౌడ్ న్ లో సంస్థ గోదాంలో రూ 2.10 కోట్ల విలువైన రేషన్ సరుకులు నొక్కేసిన ముగ్గురికి ఆత్మకూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ 14 రోజులు పాటు రీమండ్ విధించినట్లు ఎస్ ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు అంనంతరం నిందితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు మునీఫ్, షాహిద్, రఫీని, ఆత్మకూర్ సబ్ జైల్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ

ఈ రోజు ఆత్మీయత సేవా సొసైటి గత 8 సంవత్సరాలుగా ఎంతో మంది…

నిరుపేద కుటుంబాలకు ఎన్నో రకాలుగా నిస్వార్థంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనం ఫౌండేషన్ ఫౌండర్ Dr.చక్రవర్తి గారు హైదరాబాద్ లో డైరెక్టర్ రేలంగి నరసింగరావు చేతుల మీదులుగా “Best Seva Golden Nandi National Award – 2025” అనే అవార్డు ని అందించారు. ఈ సందర్బంగా ఆత్మీయత సేవా సొసైటి ఫౌండర్ మరియు అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు మాట్లాడుతూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ అవార్డు ని బహుకరించిన మనం ఫౌండేషన్ చైర్మన్ Dr. చక్రవర్తి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఈ అవార్డు రావడానికి కారకులైన సేవా చేయడానికి ఎల్లవేళలా ప్రోత్సహిస్తున్న నా భార్య సంధ్యారాణి గారికి,ఆత్మీయత సేవా సభ్యులకు మరియు సొసైటికి ఎల్లవేళలా సహాయం అందిస్తుస్తున్న దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఆత్మీయత సేవా సొసైటి సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. 🙏🙏💐

అల్లూరి సీతారామరాజు

అరకు: ఒకే రకమైన వస్త్రదారణలో ఆకట్టుకున్న మహిళలు

అరకులోయ మండలం, కొత్తభల్లుగుడ పంచాయితీ, కొర్రగుడ గ్రామంలో శనివారం ఘనంగా ఐక్య క్రిస్మస్ జరుపుకున్నారు. ఈ మేరకు గ్రామ చర్చ లో ప్రత్యేక ప్రార్ధనలు పాస్టర్ శ్యాంసన్ నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా గ్రామంలోని మహిళలంతా ఒకే రకమైన వస్త్రధారణలో తమలోని ఐక్యతను చాటుకున్నారు. యువతీ యువకులు ఆట పాటలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.