రంగారెడ్డి
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 28 :గత 4 సంవత్సరాలు గా ప్రతి సంక్రాంతి పండగకు నిర్వహిస్తున్న సంస్థాన్ నారాయణపురం ప్రీమియర్ క్రికెట్ లీగ్ కు సహకరిస్తున్న నారాయణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ సహకారంతో ఎస్ ఎన్ పి ఎల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు అధ్యక్షతన దిగ్విజయంగా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటూ ఆదివారం ఎస్ ఎన్ పి ఎల్ కమిటీ సభ్యుల తో మీటింగ్ ఏర్పాటు చేసుకోని ఎస్ ఎన్ పి ఎల్ ..సీజన్ 5 నూతన అధ్యక్షుడి గా అధ్యక్షుడిగా కొండ నవీన్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన అధ్యక్షుడు కొండ నవీన్ గౌడ్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు మరియు కమిటీ సభ్యులు.. ఈ సందర్భంగా అధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ *త్వరలోనే 2026 ఎస్ ఎన్ పి ఎల్ సీజన్ 5 షెడ్యూల్ ని తెలుపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో. ఎస్ ఎన్ పి ఎల్ కమిటీ సభ్యులు కొండ శ్రీకాంత్ గౌడ్, సురపల్లి వెంకటేష్,దూసరి నారాయణ,పల్లె ఆనంద్ గౌడ్, పెద్దగొని రాజు, చెరుకుపల్లి భాస్కర్, గంగపురం సాయి ,సింగం కృష్ణ, కొప్పు రామకృష్ణ, మోగుదాల ప్రదీప్,మిరియాల శ్రీహరి, కడారి యశ్వంత్,చెరుకుపల్లి శ్రీకాంత్,వినుకొండ అజయ్, దేవరకొండ కార్తీక్, కట్ట నవీన్, బల్లెం జస్వంత్ తదితరులు పాల్గొన్నారు