కామారెడ్డి
పున్నమి ప్రతినిధి కామారెడ్డి – 29 డిసెంబర్ 2025* *కామారెడ్డిలో ఘనంగా గణిత ప్రతిభా పురస్కారాల ప్రధానం* ==================================== కామారెడ్డి జిల్లా స్థాయిలో గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వేణుగోపాల అధ్యక్షతన, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు నీలం లింగం గారి పర్యవేక్షణలో స్థానిక గంజ్ హైస్కూలు నందు గణిత ప్రతిభా ఫోటీ పరీక్షల కార్యక్రమం ఏర్పాటు చేయగా అందులో 225 మంది విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. డీ.ఈ.వో రాజు గారు మాట్లాడుతూ మనిషి జీవితంలో గణితం లేకపోతే మనకు మనుగడే లేదన్నారు. విద్యార్థులకు గణితమంటే చాలా భయం ఉంటదని ఆ అపోహలను గణిత ఉపాధ్యాయులు తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థులు గణితం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయి గణిత ఫోరం ప్రతిభా పోటీల విజేతలు *తెలుగు మీడియంలో* ప్రథమ స్డానంలో బి.రాంచరణ్ – బోర్లం హైస్కూలు ద్వితీయ స్థానంలో జే.శ్రీకాంత్ – బుడ్మి హైస్కూలు తృతీయ స్థానంలో యం.గీత హంగర్గా హైస్కూలు *ఇంగ్లీషు మీడియం విభాగంలో* ప్రథమ స్డానంలో కే.సాయి వర్షిణి చుక్కాపూర్ హైస్కూలు ద్వితీయ స్థానంలో కే.విష్ణు ప్రియ – మాచారెడ్డి హైస్కూలు తృతీయ స్థానంలో జి మ.ప్రదీప్ – చుక్కాపూర్ హైస్కూలు *ఉర్దూ మీడియంలో* ప్రథమ స్డానంలో షేక్ మారిన్ గవర్నమెంట్ హైస్కూలు అడ్లూర్ ద్వితీయ స్థానంలో ఫాతిమా గవర్నమెంట్ హైస్కూలు అడ్లూర్ తృతీయ స్థానంలో బుష్రానాజ్ గల్స్ హైస్కూలు కామారెడ్డి *మోడల్ స్కూల్ & రెసిడెన్షియల్ స్కూల్స్* విభాగంలో ప్రథమ స్డానంలో జి.లక్ష్మణ్ మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్ ఎర్రాపహడ్ ద్వితీయ స్థానంలో యస్.మానస సోషల్ వెల్ఫేర్ గల్స్ స్కూల్ దోమకొండ తృతీయ స్థానంలో కే శ్రీజ మాడల్ స్కూల్ ఎల్లారెడ్డి. పోటీలలో ప్రతిభ కనపరచి విజేతలైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ రాజు గారి చేతుల మీదిగా అందించడం జరిగింది. అనంతరం ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదవి పొందిన ఈ.నివేదిత గారికి, అశోక్ గారికి, బసంత్ రాజ్ గారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించిన రాజేంద్ర గారికి, స్కౌట్ మాస్టర్ గారికి, రాధాదేవి మేడంకు మొ,, వారికి సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో గణిత ఫోరం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్ గారు, జిల్లా సైన్స్ అధికారి సిద్దారాం రెడ్డి గారు, ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రతాప్ రెడ్డి గారు, నరేందర్, లక్ష్మణ్, మంజుల, మరియు జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు, విధ్యార్థులు పాల్గొన్నారు