Friday, 13 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు

ఉదయగిరి లోని 2025 సంవత్సరం ముగియనందున నూతన సంవత్సరంకు ప్రారంభమవుతున్నా సమయంలో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉదయగిరి సీఐ యన్ వెంకట్రావు తెలిపారు ఆయన విలేకరులు సమావేశం మాట్లాడుతూ 4 మండలాల్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరియు ఏ ఇతర డీజే కార్యక్రమలు ట్రిపులు రైడింగ్ మద్యం సేవించి రోడ్ల పైకి అనవసరంగా వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యాదాద్రి భువనగిరి

*ఎల్లంకి కాశమ్మ కుటుంబానికి భరోసాగా నిలిచిన చలమల కృష్ణారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 :సంస్థన్నా రాయణపురం మండలం సర్వేల్ (మర్రిగూడెం) గ్రామానికి చెందిన కామ్రేడ్ కీ”శే,ఎల్లంకి మారన్నా తల్లి ఎల్లంకి కాశమ్మ మరణించిన వార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి కుటుంబానికి భరోసాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహయం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు యువకులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది

యాదాద్రి భువనగిరి

* వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాచీన శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి సర్పంచిగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గెలుపొందిన తర్వాత మొదటిసారిగా శివాలయం ని దర్శించుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు రాజమౌళి ఉప్పల లింగస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సాయినాథ్ గౌడ్,క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునుగంటి రాజు గౌడ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

* మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన–కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి–

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 11 వ వార్డులో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి హాజరయ్యారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టుగిరి, 11వ వార్డు సభ్యులు చింతల శైలజ సత్యనారాయణ లతో కలిసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బల్గురి శివ, నీళ్ల అనిత శంకర్, చిలువేరు రమాదేవి శంకర్, పట్నం బాలకృష్ణ, రాచకొండ రమేష్ బాబు, భూపని బలరాం, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, బోయ శంకరయ్య, బొడ్డు పెళ్లి లోకనాథం, ఈసం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ లో మొండిగారెల్లి యువ కళాకారుడికి ఘన గౌరవం

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ లో మొండిగారెల్లి యువ కళాకారుడికి ఘన గౌరవం యాచారం: డిసెంబర్ 30 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్న వేళ కళలు–కళాకారులను ప్రోత్సహించాలనే సదుదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025” కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ షార్ట్ ఫిల్మ్, పాటల పోటీల్లో తెలంగాణ నలుమూలల నుంచి 536 మందికి పైగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాచారమ మండలం మొండిగారెల్లికి చెందిన పర్శమోని శ్రీను ముదిరాజ్ పాటల పోటీలో పాల్గొని విశేష గుర్తింపు సాధించారు. డింపుల్ డ్రీమ్స్ పతాకంపై శ్రీను ముదిరాజ్ రచన, స్వరకల్పన, దర్శకత్వం వహించిన “డ్రగ్స్ పైన ప్రతిజ్ఞ” అనే అవగాహనాత్మక గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు తెలంగాణ ప్రముఖ చలనచిత్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు, ప్రముఖ గాయని మంగ్లీ, సింగర్ మోహన భోగరాజు చేతుల మీదుగా ఘనంగా సత్కారం లభించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగి, సామాజిక అంశంపై సందేశాత్మక గీతంతో గుర్తింపు సాధించిన శ్రీను ముదిరాజ్‌కు గ్రామ ప్రజలు, కళాభిమానులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్షముని శ్రీను కుటుంబ సభ్యులు.నక్క బాలరాజా సంగీత తమ కుమారులు. విజయ్ టీచర్. శ్రీనివాస్ గుప్తా. తదితరులు పాల్గొన్నారు

కాకినాడ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రాణమైన త్యాగం చేస్తా. రాపర్తి రామకృష్ణ.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 30: గుమ్మా్రేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ను మాజీ ఎమ్ ఎల్ సి ఆగులూరి లక్ష్మి శివ కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాపర్తి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ శివ కుమారి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కరుడుగట్టిన కార్యకర్తరామకృష్ణ అని పార్టీ ఏ కార్యక్రమాలు ఆదేశించిన కష్టపడి పనిచేసే తత్వం కల రామకృష్ణ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడంతో ప్రత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు ఆయనను కలిసి మునుపటిలాగే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో రాపర్తి రామకృష్ణ పై వచ్చిన వార్తలు ఆ వాస్తమని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను పార్టీ ఎప్పటికీ వదులుకోదని లక్ష్మి శివకుమారి అన్నారు. అనంతరం రాపర్తి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ తన గొంతులో ప్రాణం ఉన్నంతసేపు వదలను అని నేనిప్పుడు జగన్కు విధేయుడినినని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్సీపీ నాయకులు అంకంరెడ్డి సతీష్, చిట్టిబాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, గుమ్మరేగుల వైఎస్ఆర్సిపి నాయకులు బచ్చల తమ్మారావు, నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కాకినాడ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రాణమైన త్యాగం చేస్తా. రాపర్తి రామకృష్ణ.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 30: గుమ్మా్రేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ను మాజీ ఎమ్ ఎల్ సి ఆగులూరి లక్ష్మి శివ కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాపర్తి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ శివ కుమారి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కరుడుగట్టిన కార్యకర్తరామకృష్ణ అని పార్టీ ఏ కార్యక్రమాలు ఆదేశించిన కష్టపడి పనిచేసే తత్వం కల రామకృష్ణ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడంతో ప్రత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు ఆయనను కలిసి మునుపటిలాగే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో రాపర్తి రామకృష్ణ పై వచ్చిన వార్తలు ఆ వాస్తమని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను పార్టీ ఎప్పటికీ వదులుకోదని లక్ష్మి శివకుమారి అన్నారు. అనంతరం రాపర్తి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ తన గొంతులో ప్రాణం ఉన్నంతసేపు వదలను అని నేనిప్పుడు జగన్కు విధేయుడినినని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్సీపీ నాయకులు అంకంరెడ్డి సతీష్, చిట్టిబాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, గుమ్మరేగుల వైఎస్ఆర్సిపి నాయకులు బచ్చల తమ్మారావు, నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ

విజయం సాధించిన కుమ్మర నాయకులను సన్మానించిన : రాష్ట్ర, జిల్లా నాయకులు

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర, జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మర్ల కులదేవత శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ధర్మేశ్ పురం లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్ లు, సర్పంచ్ లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కుమ్మరు నాయకులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘం ఐక్యతను చాటారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో ఘనంగా గణిత ప్రతిభా పురస్కారాల ప్రధానం

పున్నమి ప్రతినిధి కామారెడ్డి – 29 డిసెంబర్ 2025* *కామారెడ్డిలో ఘనంగా గణిత ప్రతిభా పురస్కారాల ప్రధానం* ==================================== కామారెడ్డి జిల్లా స్థాయిలో గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వేణుగోపాల అధ్యక్షతన, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు నీలం లింగం గారి పర్యవేక్షణలో స్థానిక గంజ్ హైస్కూలు నందు గణిత ప్రతిభా ఫోటీ పరీక్షల కార్యక్రమం ఏర్పాటు చేయగా అందులో 225 మంది విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. డీ.ఈ.వో రాజు గారు మాట్లాడుతూ మనిషి జీవితంలో గణితం లేకపోతే మనకు మనుగడే లేదన్నారు. విద్యార్థులకు గణితమంటే చాలా భయం ఉంటదని ఆ అపోహలను గణిత ఉపాధ్యాయులు తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థులు గణితం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయి గణిత ఫోరం ప్రతిభా పోటీల విజేతలు *తెలుగు మీడియంలో* ప్రథమ స్డానంలో బి.రాంచరణ్ – బోర్లం హైస్కూలు ద్వితీయ స్థానంలో జే.శ్రీకాంత్ – బుడ్మి హైస్కూలు తృతీయ స్థానంలో యం.గీత హంగర్గా హైస్కూలు *ఇంగ్లీషు మీడియం విభాగంలో* ప్రథమ స్డానంలో కే.సాయి వర్షిణి చుక్కాపూర్ హైస్కూలు ద్వితీయ స్థానంలో కే.విష్ణు ప్రియ – మాచారెడ్డి హైస్కూలు తృతీయ స్థానంలో జి మ.ప్రదీప్ – చుక్కాపూర్ హైస్కూలు *ఉర్దూ మీడియంలో* ప్రథమ స్డానంలో షేక్ మారిన్ గవర్నమెంట్ హైస్కూలు అడ్లూర్ ద్వితీయ స్థానంలో ఫాతిమా గవర్నమెంట్ హైస్కూలు అడ్లూర్ తృతీయ స్థానంలో బుష్రానాజ్ గల్స్ హైస్కూలు కామారెడ్డి *మోడల్ స్కూల్ & రెసిడెన్షియల్ స్కూల్స్* విభాగంలో ప్రథమ స్డానంలో జి.లక్ష్మణ్ మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్ ఎర్రాపహడ్ ద్వితీయ స్థానంలో యస్.మానస సోషల్ వెల్ఫేర్ గల్స్ స్కూల్ దోమకొండ తృతీయ స్థానంలో కే శ్రీజ మాడల్ స్కూల్ ఎల్లారెడ్డి. పోటీలలో ప్రతిభ కనపరచి విజేతలైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ రాజు గారి చేతుల మీదిగా అందించడం జరిగింది. అనంతరం ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదవి పొందిన ఈ.నివేదిత గారికి, అశోక్ గారికి, బసంత్ రాజ్ గారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించిన రాజేంద్ర గారికి, స్కౌట్ మాస్టర్ గారికి, రాధాదేవి మేడంకు మొ,, వారికి సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో గణిత ఫోరం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్ గారు, జిల్లా సైన్స్ అధికారి సిద్దారాం రెడ్డి గారు, ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రతాప్ రెడ్డి గారు, నరేందర్, లక్ష్మణ్, మంజుల, మరియు జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు, విధ్యార్థులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు

జిల్లా స్థాయిలో మెరిసిన టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోవూరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “స్పెల్‌బీ” పోటీల్లో టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మూడు దశలుగా జరిగిన ఈ పోటీల్లో అర్హత పరీక్ష, క్విజ్‌, ఇంగ్లీష్ పదాల ఉచ్చారణస్పెల్లింగ్ పరీక్షల్లో రాణిస్తూ, మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థిని గాయత్రీ నెల్లూరు జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. అదే కళాశాలకు చెందిన ఎంఫీసీ విద్యార్థిని నేహా నిపేక్ష ఆగ్రా లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచింది. సీఈసీ విద్యార్థి మహేంద్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాలపై ప్రిన్సిపాల్‌ సికిందర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు వివిధ నైపుణ్యాల్లోనూ రాణిస్తూ మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యాపక వర్గం కూడా విద్యార్థులను శుభాకాంక్షలు తెలిపింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.