Thursday, 12 March 2026

Blog

విశాఖపట్నం

ఇస్కాన్లో ప్రారంభమైన ఆధ్యాత్మిక మహా సమ్మేళనం.

ఇస్కాన్లో ప్రారంభమైన ఆధ్యాత్మిక మహా సమ్మేళనం. *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి * సనాతన ధర్మాన్ని , ఆధ్యాత్మిక జ్ఞానాన్ని హైందవ సాంప్రదాయాన్ని సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయడం, కృష్ణ చైతన్యాన్ని సంకీర్తన ఉద్యమాన్ని బోధించడం మరియు ప్రోత్సహించడమే ధ్యేయంగా కొనసాగుతున్న, ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థను నడిపిస్తున్న ఆధ్యాత్మిక గురువులైన సుమారు వందమంది మన ఇస్కాన్ సాగర్ నగర్ మందిరానికి నిన్న చేరుకున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభానికి వచ్చి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి తీర్థప్రసాదాలను ఆశీర్వచనాన్ని అందరికీ అందజేశారు. బ్యూరో చైర్మన్ శ్రీ భక్తి రసామృత స్వామి మహరాజ్, భాను స్వామి మహరాజ్, గౌరంగా ప్రభు, రేవతీ రామన్ ప్రభు, శ్రీ లోకనాథ్ స్వామి మహరాజ్, శ్రీ రాదేశాం ప్రభు ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు జరిగిన సమావేశాల్లో భాగంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మారుమూల ప్రాంతాలకి ఏ విధంగా విస్తరింప చేయాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి ఇంట్లో భగవద్గీత మరియు భాగవతం ఉండేలా మరియు అందరికీ ఆ యొక్క జ్ఞానం అందించాలని ప్రభుపాదుల వారి ఆశయమని వారి యొక్క అడుగుజాడల్లో మనం ఆయన ఆశయాన్ని నిజం చేయాలని బ్యూరో చైర్మన్ శ్రీ భక్తి రసామృత స్వామి మహరాజ్ అన్నారు. ఈ యొక్క సమావేశాలు ఈనెల 10 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు మందిర ఆవరణలో జరుగుతున్నాయి.

విశాఖపట్నం

9, 10 తేదీలలో విశాఖ‌లో లైట్ హౌస్ ఫెస్టివల్

*9, 10 తేదీలలో విశాఖ‌లో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0* *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి * *మాజీ ఉప రాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాక‌ *ఏర్పాట్ల‌పై స‌మీక్షించిన జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్ విశాఖపట్నం, జ‌న‌వ‌రి 07 ః విశాఖప‌ట్ట‌ణం వైభ‌వాన్ని మ‌రింత చాటిచెప్పేలా పోర్ట్స్, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 09, 10వ తేదీల్లో ఎంజీఎం పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వ‌హించ‌నున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫెస్టివల్‌లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఇత‌ర విశేషాల‌తో కూడిన‌ కార్యక్రమాలు ఉంటాయ‌న్నారు. వేడుక‌ల‌కు మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, స్థానిక‌ ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు భాగ‌స్వామ్యం అవుతున్నార‌ని వెల్ల‌డించారు. గతంలో గోవా, పూరీ నగరాల్లో లైట్ హౌస్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో, విశాఖలో ఈ సారి మ‌రింత వైభవంగా నిర్వహించేందుకు పోర్టు అధికారులు, జిల్లా అధికారులు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని జేసీ సూచించారు. లైట్ హౌస్ ఫెస్టివల్ నిర్వ‌హ‌ణ‌ ఏర్పాట్లపై లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, పోర్ట్ అధికారులతో క‌లిసి కలెక్టరేట్‌లో మీటింగు హాలులో ఆయ‌న బుధ‌వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా చూసుకోవాల‌ని, శానిటేష‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, మెడిక‌ల్ క్యాంపు పెట్ట‌డంతో పాతు, ఇత‌ర మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని, బ‌స్సులు ఏర్పాటు చేయాల‌ని, మెయిన్ స్ట్రీమ్, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా విశాఖ నగరానికి పర్యాటక ప్రాధాన్యత మరింత పెరుగుతుందని ఆయ‌న ఆశాభావం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులు, పోర్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. స‌మావేశంలో లైట్ హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీరేంద్ర యాద‌వ్, విశాఖ పోర్టు కార్య‌ద‌ర్శి సాంబ‌మూర్తి, సీఏవో ర‌మ‌ణ‌మూర్తి, డిప్యూటీ చీఫ్ ఇంజ‌నీర్ వికాశ్, విశాఖప‌ట్ట‌ణం ఆర్డీవో సుధాసాగ‌ర్, జీవీఎంసీ, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, అగ్నిమాప‌క త‌దిత‌ర శాఖల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఎస్సీ, ఎస్టీ యువ‌త సివిల్ స‌ర్వీసుల్లో మెర‌వాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆకాంక్ష‌*

*ఎస్సీ, ఎస్టీ యువ‌త సివిల్ స‌ర్వీసుల్లో మెర‌వాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆకాంక్ష‌* *రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ‌, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి *రుషికొండ అంబేద్క‌ర్ స్ట‌డీ స‌ర్కిల్ లో ఉచిత సివిల్స్ శిక్ష‌ణా శిబిరం ప్రారంభం *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి* ఎస్సీ, ఎస్టీ యువ‌త సివిల్ స‌ర్వీసుల్లో మెర‌వాల‌న్న‌దే రాష్ట్ర ప్ర‌భుత్వ ఆకాంక్ష అని, దానిలో భాగంగా రూ.4.22 కోట్ల వ్య‌యంతో రాష్ట్రంలో మూడు కేంద్రాల్లో ఉచిత సివిల్స్ కోచింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ‌, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి తెలిపారు. ఇప్ప‌టికే తిరుప‌తి, విజ‌య‌వాడ కేంద్రాల్లో త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయని తెలిపారు. బుధ‌వారం రుషికొండ అంబేద్క‌ర్ స్ట‌డీ స‌ర్కిల్ లో నూత‌నంగా ప్ర‌వేశ‌పెట్టిన సివిల్స్ ఉచిత కోచింగ్ సెంట‌ర్ను ప్రారంభించిన ఆమె ఈ మేర‌కు మాట్లాడారు. అట్ట‌డుగు వ‌ర్గాల వారిని అభ్యున్న‌త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని, దానిలో భాగంగా ఇప్ప‌టికే గిరిజ‌న ప్రాంతాల్లో రూ.1,300 కోట్లు వెచ్చించి రోడ్లు వేశామని, ఫీడ‌ర్ అంబులెన్స్ ల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని, గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ఆధునిక వ‌స‌తుల‌తో కూడిన 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రులు అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సంకల్పంతో గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రీజియన్లలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా అట్ట‌డుగు వ‌ర్గాల‌ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఒక్కో కేంద్రంలో 100 చొప్పున మొత్తం 340 మందికి ఉచిత కోచింగ్‌తో పాటు వసతి, స్టడీ మెటీరియల్, నాణ్యమైన ఆహారం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి ప‌రీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల సన్నద్ధతను మెరుగుపర్చేందుకు మాక్ టెస్టులు, లైబ్రరీ, అనుభవజ్ఞులైన మెంటార్ల మార్గదర్శనం వంటి అన్ని సదుపాయాలను ఒకేచోట కల్పిస్తున్నామని చెప్పారు. చ‌దువు ద్వారానే అనుకున్న అభివృద్ధి, ఆశించిన పురోగ‌తి సాధ్య‌మ‌వుతుంద‌ని, శిక్ష‌ణ‌కు ఎంపికైన విద్యార్థులంతా స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకొని, అవ‌కాశాల‌ను వినియోగించుకొని ఉత్త‌మ స్థానాల‌కు చేరుకోవాల‌ని, ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి సూచించారు. మొబైల్ ఫోన్ ను అనవ‌స‌రంగా ఉపయోగించ‌వ‌ద్ద‌ని, స‌మ‌యం వృథా చేసుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. త‌న కుమార్తె మెడిష‌న్ చ‌దువుతోంద‌ని, కుమారుడు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడ‌ని ప్ర‌సంగంలో భాగంగా మంత్రి పేర్కొన్నారు. త‌న మాదిరిగానే మిగ‌తా త‌ల్లిదండ్రులు కూడా వారి పిల్ల‌ల‌ను త‌గిన విధంగా ప్రోత్స‌హించాల‌ని, ఆడపిల్ల విష‌యంలో ఎప్పుడు పెళ్లి చేసేద్దామా అని కాకుండా.. జీవితంలో స్థిర‌ప‌డేలా స‌హ‌కారం అందించాల‌ని హిత‌వు ప‌లికారు. గిరిజ‌న సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ సదా భార్గవి, శరత్ చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంట‌ర్ డైరెక్టర్ శ‌ర‌త్ చంద్ర‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తేజ‌ప‌రుస్తూ ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి చేరుకోవచ్చని స్పష్టం చేశారు. తాము కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాకే ఈ స్థాయికి చేరుకున్నామ‌ని గుర్తు చేశారు. కార్య‌క్ర‌మంలో భాగంగా య‌ల‌మంచ‌లి, విజ‌య‌న‌గ‌రం, పాడేరు ప్రాంతాల‌కు చెందిన జ్యోతి, సోమ‌శేఖ‌ర్, తౌడ‌మ్మ స్ఫూర్తిదాయ‌క సందేశం అందించారు. ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హ‌కారం వ‌ల్లే ఉచితంగా సివిల్స్ కోసం కోచింగ్ తీసుకోగ‌లుగుతున్నామ‌ని ధ‌న్య‌వాదాలు తెలిపారు. అనంత‌రం అభ్య‌ర్థులంద‌ర‌కీ మంత్రి చేతుల మీదుగా స్ట‌డీ మెటీరియ‌ల్ ను అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో అంబేద్క‌ర్ గురుకులాల‌ జిల్లా కో-ఆర్డినేట‌ర్ గ్రేస్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె. రామారావు, ట్రైబ‌ల్ వెల్ఫేర్ అధికారి సురేశ్, ఇత‌ర అధికారులు, శిక్ష‌ణ అభ్య‌ర్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష.

పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. *పోలవరం డిసెంబర్ పున్నమి ప్రతినిధి* సమీక్షలో పాల్గోన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులు. సమీక్షకు హాజరైన జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని… గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశం. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయాలన్న ముఖ్యమంత్రి. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచన. కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు చేయాలన్న చంద్రబాబు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని తనిఖీ చేస్తానని సీఎం వెల్లడి.

విశాఖపట్నం

విశాఖ పార్టీ కార్యాలయం లో మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజాదర్బార్*

*విశాఖ పార్టీ కార్యాలయం లో మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజాదర్బార్* *ప్రజలు,పార్టీ కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు స్వీకరణ* *ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ* *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖ 83వ డివిజన్ పరిధిలోని ఏఎంసీ కాలనీలో 192 కుటుంబాలకు రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన అపార్ట్ మెంట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇళ్లు పునర్ నిర్మించి తమను ఆదుకోవాలని కాలనీ వాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్థుల పిల్లల కోసం విశాఖలో కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు తగిన నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని విశాఖ కారుణ్య స్వచ్ఛాంధ్ర సేవా సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముషిడిపల్లిలో యాదవ సామాజికవర్గానికి ఇళ్ల స్థలాలు కేటాయింపుతో పాటు కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విశాఖ మద్దిలపాలెం కేఆర్ఎమ్ కాలనీకి చెందిన వెంపాడ స్తుతయ్య విజ్ఞప్తి చేశారు. వారసత్వంగా సంక్రమించిన భూమి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయగా వీఆర్వో తిరస్కరించారని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం, రామయోగి అగ్రహారానికి చెందిన నాగిరెడ్డి గొంగలయ్య కోరారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

విశాఖపట్నం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చెందిన 2500 ఎకరాల భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలనే ప్రతి పాదనలు చంద్ర బాబు కూటమి ప్రభుత్వం ఉపసంహరించాలి. సిపిఐ (ఎం) విశాఖ జిల్లా కమిటీ డిమాండ్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చెందిన 2500 ఎకరాల భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలనే ప్రతి పాదనలు చంద్ర బాబు కూటమి ప్రభుత్వం ఉపసంహరించాలి. సిపిఐ (ఎం) విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (విజజర్) పేర క్రీడాకుళం నుండి కాకినాడ జిల్లాల వరకు మొత్తం 9 జిల్లాల పరిధిలో (ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల కొరకు 232 పేజీలతో కూడిన ఒక ప్రణాళికను ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విడుదల వేసింది. ఇందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చెందిన సుమారు 2500 ఎకరాల భూమిని (ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు చేయబడ్డాయి. కుట్రపూరిత వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ.2400 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలను అడ్డం పెట్టుకొని ఈక్విటీగా మార్చుకొని అందుకు పరిహారంగా ప్లాంట్ భూములను తమ వశం చేసుకునేందుకు కన్నేసి నట్లు తెలుస్తున్నది. తక్షణం ఈ దుర్మార్గ ప్రతి పాదనను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, అలాగే స్టీల్ ప్లాంట్ భూములు ప్లాంట్ విస్తరణకు మాత్రమే ఉపయోగించాలని సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1100 ఎకరాల భూమిని ఎన్.ఎం.డీ.సి ముడి సరుకుల నిల్వల యార్డు కొరకు 33 ఏళు పాటు లీజుకు తీసుకుంది. ఇప్పటి వరకు ఈ భూమిలో యార్డ్ నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంచింది. దీనిని ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అదానీకి ధారాదత్తం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే స్టీల్ ప్లాంట్ యొక్క భూములు సుమారు 3500 ఎకరాలకు పైగా అదానీ, మిట్టల్ వంటి కార్పొరేట్ సంస్థల పరమయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది.” తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. పైకి ప్లాంట్ ను కాపాడుతాం అంటూనే దీనిని చావు దెబ్బ తీస్తున్నారు. గత ఏడాది కాలంలో నైపుణ్యత కలిగిన సుమారు 6 వేల మంది నిర్వాసిత మరియు కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించారు. విఆర్ఎస్ పేర 1700 మందికి పైగా పర్మినెంట్ కార్మికులను తొలగించారు. ఇపుడు మూడో సారి వి.ఆర్.ఎస్ నోటిఫికేషన్ ఇచ్చారు. నేడు తనకు అనుకూలంగా ఉన్న ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికులను తెచ్చిపెట్టుకుంటున్నారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించకుండా తీవ్ర ద్రోహం చేస్తున్నారు. ప్లాంట్ లో కోక్, సింటర్ ప్లాంట్ అవసరానికి తగ్గట్టు తయారు చేయకుండా బయటనుండి అదనంగా టన్ను కోకక్కు రూ.8 వేలు, సింటర్ ప్లాంట్ పెల్లెట్స్ కు రూ. 2వేలకు పైగా ఖర్చుచేసి రప్పించారు. వందలకోట్ల కమీషన్లకు పాల్పడ్డారు. ఫలితంగా ఉత్పత్తిలో రా మెటీరియల్ ఖర్చు 60 నుండి 78 శాతానికి పెంచేశారు. దీంతో ఉత్పత్తి భారీగా పెరిగినా ప్లాంట్ నష్టాలు బారిన పడుతున్నది. గడిచిన 9నెలల్లో రూ.780 కోట్లు పైబడి నష్టాలు వచ్చాయి. యంత్రాలు మరమ్మత్తులు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. ఈ వైఫల్యానికి కార్మికులమీద ప్రభుత్వం, యాజమాన్యం నెట్టబడుతోంది. బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నిర్వాహకంపల్ల ఈ నష్టాలు చవిచూసాయి. నరేంద్ర మోడీ – చంద్ర బాబు పవన్ కళ్యాణ్ కూటమి చర్యలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరింత నష్టాలు పాలుజేసేలా ఉ న్నాయి. కుట్ర పూరిత వ్యూహంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపటానికి చంద్రబాబు నాయుడు తరచూ విశాఖ స్టీల్ ప్లాంట్ పైనా, అందులో పనిచేసే కార్మికులపై విష ప్రచారం చేస్తున్నారు. అంతిమంగా ప్లాంట్ ను మిట్టల్, అదానీ వంటి కార్పొరేట్ లకు ధారాదత్తం చేసేందుకు వేగంగా పావులు కలుపుతున్నారు… (నమ్మి రమణ) సిఐటియు నాయకులు (ఎన్.రామారావు) సిఐటియు సీనియర్ నాయకులు (డా॥ బి.గంగారావు) 78వవార్డు కార్పొరేటర్ (కె.లోకనాధం) కేంద్రకమిటీ సభ్యులు

విశాఖపట్నం

వాడబలిజ మత్స్యకార కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి”

“వాడబలిజ మత్స్యకార కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి” *విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖ నగర పర్యట నిమిత్తం విచ్చేసినటువంటి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువగలం స్ఫూర్తిదాత శ్రీ నారా లోకేష్ గారిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం వాడబలిజ మత్స్యకార నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిత్తి సాయి బలరాం మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన వాడబలిజ మత్స్యకార కులస్తులకు ప్రత్యేక అభివృద్ధి మరియు సంక్షేమ బోర్డు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తద్వారా సముద్రం మీద నిత్యం తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రోజులు తరబడి బోట్లలో చేపల వేటకు వెళ్లే వాడబలిజ మత్స్యకార కులస్తులకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేయడం జరిగినది, గౌరవ లోకేష్ గారు వినతిపత్రం చూసి తప్పకుండా వాడబలిజ కులస్తులకు న్యాయం చేస్తానని సానుకూలంగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్

ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానమే పరమౌషదం- – స్వామి స్మరణానంద

శ్రీసిటీ, జనవరి ,. పున్నమి ప్రతినిధి: శ్రీసిటీ లో నిర్వహించిన “క్రియా యోగ ధ్యానం: ఒత్తిడి, ఆందోళనలకు శాశ్వత ఉపశమనం” కార్యక్రమంలో స్వామి స్మరణానంద ధ్యానం ఆధునిక జీవిత ఒత్తిడులను అధిగమించేందుకు పరమౌషదమని తెలిపారు. నిజమైన ఆనందం బయట కాదు, అంతరంగంలోనే ఉందని పేర్కొంటూ తైత్తిరీయ ఉపనిషత్తు, పరమహంస యోగానంద బోధనలను ఉదహరించారు. ధ్యానం శారీరక–మానసిక–ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందిస్తుందని అన్నారు. హంస, ఓం, క్రియ యోగ ధ్యాన పద్ధతుల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమం అనంతరం పలువురు YSSI హోమ్–స్టడీ కోర్సులకు నమోదు చేసుకున్నారు. స్వామీజీ శ్రీసిటీ పరిసరాలను సందర్శించి ప్రశంసించారు.

వనపర్తి

డిజిటల్ విద్య ద్వారా హిందీ భాషను సులభతరం చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్

*భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు భాషా ఉపాధ్యాయులు కృషి చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 7/ 1/ 2026* *జిల్లాలోని భాషా పండితులు భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుప్పల్లి మదనాపూర్ మండలంలో జరిగిన తరగతిగది అభ్యసన సామర్ధ్యాల పరిశీలనలో భాగంగా తెలియజేశారు, పిల్లల్లో హిందీ భాషా పట్ల సరళతరం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ద్వారా రూపొందించిన డిజిటల్ విద్య ద్వారా వారికి హిందీ విద్యా బోధనలను అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు*

వనపర్తి

డిజిటల్ విద్య ద్వారా హిందీ భాషను సులభతరం చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్

*భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు భాషా ఉపాధ్యాయులు కృషి చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 7/ 1/ 2026* *జిల్లాలోని భాషా పండితులు భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుప్పల్లి మదనాపూర్ మండలంలో జరిగిన తరగతిగది అభ్యసన సామర్ధ్యాల పరిశీలనలో భాగంగా తెలియజేశారు, పిల్లల్లో హిందీ భాషా పట్ల సరళతరం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ద్వారా రూపొందించిన డిజిటల్ విద్య ద్వారా వారికి హిందీ విద్యా బోధనలను అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.