Wednesday, 11 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అదునిక సాగుతోనే రైతులకు మేలు

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానని అందిపుచ్చుకొని రైతులు మెరుగైన లాభాలు సాదించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల శనివారం కోవూరులో ఛాంపియన్ ఫార్మర్ శ్రీనివాసులు సాగు చేస్తున్న వరి పొలాన్ని పరిశీలించారు పురుగుల నివారణకు వాడుతున్న సోలార్ లైట్ ట్రాప్స్ పని తిరిను అడిగి తెలుసుకున్నారు ఇలాoటి పద్ధతులను గ్రామంలోని ఇతర గ్రామలో వివరించాలని అధికారులను ఆదేశించారు.

కామారెడ్డి

దొంగల భయం గ్రామీణ ప్రాంతాల్లో.. ఏ.ఎస్.పి చైతన్య రెడ్డి వెంటనే చర్యలు !

కామారెడ్డి, 10 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం జరిగిన దొంగతనం సంఘటన గ్రామ ప్రజల్లో భయాన్ని సృష్టించింది. ఈ కేసులో బాధితురాలి ఇంటికి ఏ.ఎస్.పి చైతన్య రెడ్డి త్వర గా చేరుకొని వివరాలు సేకరించడం ప్రశంసలు అందుకుంది. స్థానిక పోలీసు సిబ్బంది, మహిళా కానిస్టేబుల్‌తో పాటు గ్రామస్థుల సాంద్రతలో ఈ పరిశీలన జరిగింది.బాధిత ఇంటి ముందు ఏ.ఎస్. పి చైతన్య రెడ్డి బాధితురాలితో మాట్లాడుతూ, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గ్రామంలో ని ఓ ఇంట్లో దొంగతనం జరిగి ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఇలాంటి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోని దొంగతనానికి పాల్పడడం నీచమైన చర్యగా పరిగణించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల దొంగతన కేసులు పెరుగుతున్నాయి. ముగ్గురు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపిన సమాచా రం ఆధారంగా, ఈ పరిశీలన ఆ కొత్త దర్యాప్తులకు దారితీస్తుందని అంచనా. బాధితురాలు, ఆమె కుటుంబం ఈ దొంగతనంలో ఎక్కడి వస్తువులు కోల్పోయారో వివరించారని సమాచారం. పోలీసు చర్యలు, గ్రామస్థుల స్పందన ఏ.ఎస్.పి చైతన్య రెడ్డి దొంగలను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.గ్రామీణ ప్రాంతా ల్లో పెట్రోలింగ్‌ను పెంచి, భద్రతా చర్యలు తీసుకుం టామని పోలీసులు హామీ ఇచ్చారు.బాధిత కుటుం బానికి ఆర్థిక సహాయం, చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తగ్గాలంటే గ్రామ పంచాయి తీలు, పోలీసుల మధ్య సమన్వయం అవసరమని అన్నారు.ఈ దొంగతనం రామారెడ్డి మండలంలోని ఇతర గ్రామాల్లో భయాన్ని పెంచింది. గతంలో ఉప్పల్వాయి, మద్దికుంట వంటి ప్రాంతాల్లో ఇలాం టి కేసులు జరిగాయి. పోలీసులు ఈ కేసులో వేగవంతమైన దర్యాప్తుతో నేరస్థులను పట్టుకుంటే ప్రజలు మరింత ధైర్యం చెందుతారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి

ఇసన్నపల్లి గ్రామంలో అకాల మరణాలు

మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబాద్రి కుటుంబాలకు సహాయం కామారెడ్డి, 10 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇసన్నపల్లి అనారోగ్యంతో మరణించిన గ్రామస్తుడు ఎర్రబాబు కుటుంబానికి రూ.2,000నగదు,50 కేజీలబియ్యం కామారెడ్డి నీటితోట్టిలో పడి మరణించిన చిన్నారు డు బుద్ధ రణవీర్ కుమార్ కుటుంబానికి రూ.3,000, 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ గ్రామంలోనే జరిగిన అకాల మరణాలకు సంతాపం వ్యక్తం చేసిన మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబా ద్రి తన సొంత ఆర్థిక సహకారంతో కుటుంబాలను ఆదుకున్నారు.ఇసన్నపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల్లో దుర్భాగ్యకర ఘటనలు జరిగాయి. మొద ట, గ్రామానికి చెందిన ఎర్రబాబు అనారోగ్యంతో చనిపోవడం చాల బాదాకరం అన్నారు.అదే గ్రామా నికి చెందిన చిన్న పిల్లవాడు బుద్ధ రణవీర్ కుమార్ ఆడుకుంటూ కామారెడ్డి లో నీటితోట్టిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది.ఈ సంఘటనలు గ్రామంలో భద్రతా చర్యల అవసరాన్ని తలెత్తించా యి. ముఖ్యంగా, నీటితోట్టిల పరిసరాల్లో రక్షణా చర్యలు, అనారో గ్యాలకు వైద్య సహాయం వంటి అంశాలపై గ్రామ ప్రజలు చర్చిస్తున్నారు. మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబాద్రి మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా కష్టాల్లో పడితే సహాయం చేయడమే నా బాధ్యత అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంశాల్లో సహకారం ముందుంటామని చెప్పారు.

విశాఖపట్నం

గాజువాక ఏసీపీ వెంకట్రావుపై విజిలెన్స్ దర్యాప్తు ఆదేశాలు జీవీఎంసీ ఖజానాకు కోట్ల నష్టం… టౌన్ ప్లానింగ్‌లో తీవ్ర అవకతవకలు

విశాఖపట్నం గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) కె.వెంకట్రావుపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టిన అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మెమో నెంబర్ 3098470/Vig-1/2026, తేదీ 08-01-2026తో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజులు, పీనాల్టీలు, అభివృద్ధి చార్జీలు వసూలు చేయకపోవడం వల్ల జీవీఎంసీ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా గుర్తించింది. గాజువాక జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైళ్ల నిర్వహణ, బిల్డింగ్ ప్లాన్ల ఆమోదం, అనుమతుల మంజూరులో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదోవ పట్టించారా? విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం జరిగిందా? అన్న అంశాలపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో దోషాలు నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.

విశాఖపట్నం

మంగలంపాలెం జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం కాలనీలో జివిఎంసీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విశాఖ గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 88వ వార్డ్ మంగలంపాలెంలో జివిఎంసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. స్థానిక వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకే కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగలంపాలెం వార్డులో క్రైస్తవ, ముస్లిం సోదరులకు వేరువేరుగా స్మశాన వాటికలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పిల్లలు, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త అంగనవాడి కేంద్రం, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే రేషన్ డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రసాదుల శ్రీనివాస్, కాలనీ టీడీపీ అధ్యక్షులు ముమ్మడివరపు రాము, స్థానిక నాయకులు బాబా, రాజు, శ్రీను తదితరులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. Uploaded Video:

కామారెడ్డి

ఘనంగా అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

కామారెడ్డి, 10 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : దక్షిణ కాశి కాలభైరవ ఆలయ సన్నిదిలో అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండ లం రామారెడ్డి – ఇసనపల్లి గ్రామ శివారుల్లో వెలి సిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ కాలభైరవ స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అద్భుతంగా నిర్వహించారు. భక్తుల ఉల్లాసంతో, శ్రీ కాలభైరవ స్వామి ఆశీస్సులతో కూడిన ఈ కార్యక్రమం గ్రామవాసుల్లో ఉత్సాహాన్ని మేల్కొల్పింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం వద్ద గడిపిన బాల్య జ్ఞాపకాలు, ఆలయ చరిత్ర అనంతరం ప్రధాన అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రసంగించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, ఈ ఆలయం నా బాల్యంలోనే ప్రత్యేక స్థానాన్ని పొందింది. గ్రామ శివారుల్లో స్వయంభూగా వెల్లివచ్చిన ఈ పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి స్థానం అని తెలిపారు. ఆలయ పూర్వ విశేషాలను వివరిస్తూ, పదవులు శాశ్వతం కావు. ధర్మకర్తల మండలి సభ్యులు సేవనే బాధ్యతగా తీసుకుని పనిచేయాలి. ఆధ్యా త్మిక చింతనతో ఉండి, పూర్వజన్మ సుకృతంగా సేవా భాగ్యాన్ని పొందాలని సూచించారు. ఆయన మాటలు భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నూతన చైర్మన్ చింతల శంకర్ సంకల్పం నూతన చైర్మన్ చింతల శంకర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడుతూ, ఈ పదవి నాకు వరించిన గొప్ప అవకాశం. దీన్ని దుర్వినియోగం చేయకుం డా, సేవనే లక్ష్యంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సంకల్పం తెలిపారు. గ్రామస్తుల నుంచి మార్గదర్శకత్వం, భక్తుల నుంచి మద్దతును పొందు తానని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆలయ సౌక ర్యాలు, దేశ స్థాయి ఆకాంక్షలు ఆలయ ఈవో ప్రభు మాట్లాడుతూ, ఆలయానికి అవసరమైన అన్ని సౌకర్యాలకు తక్షణమే నిధులు మంజూరు చేసి, భక్తులకు మెరుగైన వాతావరణాన్ని కల్పించాలి అని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ ప్రసంగంలో, దక్షిణ కాశిగా విరాజిల్లుతున్న ఈ శ్రీ కాలభైరవ స్వామి ఆలయా నికి దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని కల్పించాలి. ఇక్కడి భక్తి సాంప్రదాయాలు అందరినీ ఆకర్షిస్తా యి అని అభినందించారు.ఆలయ అభివృద్ధికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయానికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని పలువురు వ్యక్తం చేశారు ఈ మహోత్సవంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తు లు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల….. కల్చరల్ టీo విజయభేరి…………

తరుణీ తరంగాలు… విజయవాడ వారు జనవరి 7.8….2026 న నిర్వహించిన పోటీలలో…. ఏక పాత్రాభినయం…. మొదటి బహుమతి జానపద గీతం…… రెండవ బహుమతి జానపద నృత్యం…… రెండవ బహుమతి జాతీయ గీతం….మూడవ బహుమతిని గెలుపొందారు..ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ VV SUBRAMANYA కుమార్ గారు కల్చరల్ విద్యార్థులను….. కో ఆర్డినేటర్ శ్రీమతి రత్నశ్రీ ని అభినందించారు.

E-పేపర్

రేషన్ మాఫియా అక్రమ దందా : దొండపూడిలో బట్టబయలైన తూకంలో మోసం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం గోపాలపురం మండలం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలోని రేషన్ దుకాణంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నిరుపేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులను పక్కదారి పట్టిస్తూ, తూకంలో కోత విధిస్తున్న వైనాన్ని ఒక సామాన్య పౌరుడు ధైర్యంగా నిలదీయడంతో ఈ ఉదంతం బయటపడింది. ఘటన వివరాలు గ్రామస్థుల కథనం ప్రకారం.. దొండపూడి రేషన్ దుకాణ నిర్వాహకుడు మస్తాన్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడి తన లైసెన్సును రద్దు చేయించుకున్నారు. అయితే, ఉన్నతాధికారుల అండదండలతో తిరిగి పర్మిషన్ పొంది, యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపారని పలువురు ఆరోపించారు. వృద్ధులు, అమాయక ప్రజలకు అందాల్సిన పంచదార, బియ్యాన్ని తక్కువగా ఇస్తూ, మిగిలిన సరుకును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారుల మౌనంపై విమర్శలు స్థానిక రెవిన్యూ కార్యాలయ అధికారులకు భారీగా లంచాలు ఆశ జూపి, మస్తాన్ తన అక్రమ సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూకంలో మోసాన్ని పసిగట్టి ప్రశ్నించిన సామాన్యుడికి నిర్వాహకుడు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో లైసెన్స్ రద్దయిన వ్యక్తికి తిరిగి బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలను సరఫరా చేస్తుంది. అయితే, క్షేత్రస్థాయిలో కొంతమంది డీలర్లు అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. గతంలో తప్పు చేసి శిక్ష అనుభవించిన వారే మళ్లీ అదే స్థానంలో కూర్చోవడం వల్ల వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం సడలుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక ప్రజలు తూకాల్లో జరిగే మోసాలను గుర్తించలేకపోవడం వీరికి వరంగా మారుతోంది. *గ్రామస్థుల డిమాండ్*…..జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, దొండపూడి రేషన్ దుకాణంపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకుడి లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయాలని, అతనికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుపేదల నోటి కాడ కూడును కొల్లగొడుతున్న ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు END Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వాలి బాలు టోర్నమెంట్ పోటీలు ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకుడు

ఉదయగిరి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వాలి బాల్ టోర్నమెంట్ పోటీలను రాష్ట్ర టీడీపీ మైనారిటీ నాయకుడు రియాజ్, ఉపాధ్యాయులు మాన్యూర్ ప్రసాద్ పోటీలను ప్రారంభించారు పోటీల్లో విజేతగా నిలిచిన వారికీ మొదటి బహుమతి 30,000లు రెండో బహుమతి 20,000 మూడో బహుమతి 10,000 లు అందజేస్తాన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు

నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు.. రాహుల్ గాంధీ ఒక 420 రాహుల్ గాంధీ ఒక చెల్లని పైసా.. మమ్మల్ని దగా చేసి కుట్ర పన్నారు కోదండరాం కూడా మంచోడు అనుకున్నాము.. వాళ్ళు మమ్మల్ని వాడుకొని పదవులు పొందారు బల్మూరి వెంకట్ పెద్ద దొంగ.. పుస్తకాలు పక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.