Wednesday, 11 March 2026

Blog

కామారెడ్డి

రామారెడ్డి బస్టాండ్‌ లో వివేకానంద ఆణిముత్యాలు.. జయంతి వేడుకలు

యువతకు స్ఫూర్తి పంచిన జయంతి వేడుకలు రామారెడ్డి, 12 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది.. ఆత్మవిశ్వాసం విజయపథానికి దారి తీస్తుంది! స్వామి వివేకానందుని అమర వాక్యాలతో మార్గదర్శకత్వం చేసిన జయంతి వేడుకలు కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గల బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. యువతకు స్ఫూర్తి బిందువులు చల్లారని పలువు రు వక్తలు ప్రసంగించారు.వివేకానంద విగ్రహం ముందు జరిగిన కార్యక్రమంలో వక్తలు యుగాచా ర్యుని ఆణిముత్యాలను ఒక్కొక్కటిగా వివరిం చారు.ప్రయత్నం చేసి ఓడిపోకూడదు. ప్రయత్నం చేయకుండా ఓడిపోకూడదు అని, కెరటం నాకు ఆదర్శం.. పడినా లేచి నిలబడటానికి అని ప్రతి వాక్యం యువతను కుంగదీసింది.జాతి వ్యక్తిత్వం పరిరక్షణ: ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉంటుంది.. ప్రతి దేశానికీ, జాతికీ ఉంటుంది. దాన్ని కాపాడుకో వాలి, లేకపోతే జాతి నశిస్తుందని వక్తలు హెచ్చరిం చారు.ఏ పని అల్పం కాదు: ఇష్టమైన పని వస్తే మూర్ఖుడు కూడా సాధిస్తాడు. అన్ని పనులను తనకు నచ్చేలా మలచుకునేవాడే తెలివివాడని చెప్పారు. ఆత్మవిశ్వాసం లేనివాడే నాస్తికుడు: దేవునిపై నమ్మకం కాదు, ఆత్మవిశ్వాసమే నిజమైన భక్తి అని వివేకానందుడు బోధించాడని గుర్తు చేశారు.పదిమంది యువకులు చాలు పదిమంది యువకుల్ని ఇస్తే దేశ స్వరూపాన్ని మార్చేస్తాను అనే మాటలు యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించా యి.శ్రమించేవాడిని ఓటమి భయపడుతుంది. నిరంతర శ్రమతో చీకటిని తరిమితం చేసినట్టు ఓటమిని జయించాలని పిలుపునిచ్చారు. విశ్వాస మే బలం, బలహీనత మరణం. వెంటనే ప్రారంభిం చి క్రమక్రమంగా అభివృద్ధి సాధించాలని, అపజ యాలతో నిరుత్సాహపడకుండా వేయి సార్లు ప్రయత్నించాలని వక్తలు సూచించారు. మహిళలు, పురుషుల ఘనకార్యాలకు ఆత్మవిశ్వాసమే మూల శక్తని కొనియాడారు.వివేకానందుని అమితవీర్యం 162 సంవత్సరాల క్రితం ఈ పుణ్యభూమిపై జన్మిం చిన యుగపురుషుడు పాశ్చాత్యులకు హిందూ ధర్మ వైశిష్ట్యం, ‘వసుధైక కుటుంబం’ భావనను తెలియజేసినవాడు. ఒక పాశ్చాత్య స్త్రీకి “నన్ను దత్తత తీసుకో.. నీ కోరిక తీరుతుంది” అని, క్రైస్తవ సోదరికి “నీవు నిజమైన హిందువుగా, ముస్లింగా లేదా క్రైస్తవుడిగా జీవించు.. మతమార్పిడికి రాలే దు” అని సమాధానం ఇచ్చిన మహనీయుడు.ఈ జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని వక్తలు అన్నారు. స్థానికులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగుతామని సంకల్పం తెలిపారు.

నిర్మల్

అట్టహాసంగా సాగుతున్న మీడియా క్రికెట్ టోర్నీ

పున్నమి ప్రతినిధి నిర్మల్ జనవరి 12: ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రింట్- ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా కొనసాగుతోంది. ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం మాజీ ఎంపీటీసీ మాక్ధూమ్, మాజీ ఉప సర్పంచ్ సుభాష్ టాస్ ఎగురవేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు.అదే విధంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని పలు పట్టణాలకు చెందిన క్రికెట్ జట్లు సైతం పాల్గొంటూ గట్టి పోటీనిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో క్రికెట్ పోటీలు విద్యార్థులు, యువకులకు కనువిందు చేస్తున్నాయి. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. ప్రతిరోజు నాలుగు మ్యాచ్లు నిర్వహిస్తుండడంతో చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారు. క్రీడాకారులు సైతం ఎంతో ఉత్సాహంగా తమలోని క్రీడా నైపుణ్యాన్ని క్రికెట్ టోర్నీలో ప్రదర్శిస్తూ ఆహా అనిపిస్తున్నారు. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధిక సంఖ్యలో క్రికెట్ జట్లు టోర్నీలో భాగస్వాములు అయ్యాయి. క్రికెట్ టోర్ని క్రీడా పండుగను తలపిస్తుంది. వారం రోజులపాటు జరిగే క్రీడా సంబరాలు విద్యార్థులు- యువకులు-స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. సెలవుల్లో మరిన్ని టోర్నీలను నిర్వహించి గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసి జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించే వేదికగా మార్చాలని స్థానికులు ఆకాంక్షించారు. నిర్వాహకులు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ నాయకులు తాటేవర్ రమేష్, ధర్మపురి శ్రీనివాస్,మదన్ పటేల్, గంగాధర్,మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుండి రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయని ఊర్మిళ వాట్సప్‌కు మెసేజ్ పంపిన సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరిన ఊర్మిళ ఊర్మిళకు ట్రేడింగ్‌పై అవగాహన లేకపోవడంతో, మాయ మాటలు చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు పంపి తాను చెప్పిన విధంగా పెడితే 500% లాభాలు వస్తాయని నమ్మించిన దినేష్ సింగ్ అనే వ్యక్తి దినేష్ సింగ్ మెసేజ్స్‌ను బలపరుస్తూ తనకు నిజంగానే లాభాలు వచ్చాయని గ్రూప్‌లో స్క్రీన్ షాట్లు పెట్టిన వాళ్ళ ముఠాలోని సభ్యురాలు ప్రియసఖి దీంతో వీళ్ల మాయ మాటలు నమ్మి యాపిల్ యాప్ స్టోర్ నుండి MCKIEY CM అనే అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్యలో రూ.2.58 కోట్లు బదిలీ చేసిన ఊర్మిళ ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణ దగ్గర ఉన్న బంగారం కూడా తనఖా యాప్‌లో లాభాలు కనిపించినా విత్ డ్రా ఆప్షన్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని, వాటిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపిన పోలీసులు

E-పేపర్

హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య బోరబండ సమీపంలో ఒక యువతిని దారుణంగా హతమార్చిన యువకుడు

హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య బోరబండ సమీపంలో ఒక యువతిని దారుణంగా హతమార్చిన యువకుడు గతంలో బంజారాహిల్స్ సమీపంలో ఉన్న ఒక పబ్‌లో ఇద్దరికి పరిచయం కాగా ఇటీవల ఊర్వశి బార్‌కు షిఫ్ట్ అయిన యువతి దీంతో తనను పట్టించుకోవడంలేదని కోపంలో, మాట్లాడదామని పిలిచి యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యుత్ సమస్యలకు డయల్ యువర్ ఎస్స్ఈ కార్యక్రమం

నెల్లూర్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిస్కారానికి ప్రతి సోమవారం డయాల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తూనట్లు సూపర్డెంట్గ్ ఇంజనిర్ కె రాఘవేంద్ర,తెలిపారు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు నెo, 0861-2320427 నంబర్ కీ ఫోన్ చేసి నేరుగా తెలియజేయవచ్చు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చెప్పటినట్లు ఆయన పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🏏 మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 11 (పున్నమి ప్రతినిధి) మనుబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 28 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన జట్లకు మొదటి బహుమతిని, బొమ్మిరెడ్డి పర్వతీశ్వర్ రెడ్డి, ద్వితీయ బహుమతిని, మోపూరు ధనంజయ రెడ్డి, తృతీయ బహుమతిని మర్రి శశిధర్ రెడ్డి, లా సహకారంతో నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేస్తామని కార్యనిర్వాహకులు తెలిపారు.

నారాయణపేట

గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం- కున్సి గ్రామంలో క్రికెట్ కిట్ పంపిణీ

నారాయణ పేట జిల్లా, కృష్ణ మండలం , కున్సి గ్రామంలో యువకులకు క్రీడలపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. క్రీడల ద్వారా యువత శారీరకంగా మానసికంగా బలంగా ఎదగాలని గ్రామ స్థాయి మండల, జిల్లా స్థాయిలో మన గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు . ప్రతిభావంతులైన క్రీడాకారులుగా ఎదగాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే నారాయణ, బి శరణ్ , ఎన్ శ్రీనివాసులు, ఎస్ నారాయణ, జి శరత్, కే మల్లేష్ ,పి రామచంద్ర, బి అశోక్, కే మహాదేవప్ప, ఈ రాజు, ఏ మహదేవ్, బి, వెంకటేష్, కె,సంజీవ్, ఈ కాసింగౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బ్రాహ్మశ్వేరంలో గ్రామoలో ఇంటిoటి క్యాన్సర్ సర్వే

దుత్తలూరు మండలం బ్రాహ్మశ్వేరంలో గ్రామoలో జరుగుతున్న ఇంటిoటి క్యాన్సర్ సర్వే కార్యకమాన్ని దుత్తలూరు PHC వైద్యాదికారి ఆయాజ్ అప్సర్ పరిశీలించారు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి స్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ షుగర్, బీపీ, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ గర్భశాయ ముఖద్వారా క్యాన్సర్ ఉన్న అనుమానితులను గుర్తించి వారిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు పంపారు

అనకాపల్లి

ఘనంగా సంక్రాంతి సంబరాలు – ముగ్గుల పోటీలకు హోంమంత్రి అనిత పిలుపు..!

జనవరి 10, అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో పాయకరావుపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో ఉన్న హోంమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. మొదటి బహుమతి రూ.25 వేలు, రెండవది రూ.15 వేలు, మూడవది రూ.10 వేలు అందజేయనున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంక్రాంతి పండుగ సందర్బంగా క్రికెట్ పోటీలు ప్రారంభం

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మై దానంలో సంక్రాంతి పండుగ సందర్బంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం మాజీ ఎమ్మెల్యే చేంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గ్రందాలయ సంస్థ చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి ప్రారంభించారు వారు మాట్లాడుతూ యువతను ప్రోత్సహిoచ్చే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.