రామారెడ్డి బస్టాండ్ లో వివేకానంద ఆణిముత్యాలు.. జయంతి వేడుకలు
యువతకు స్ఫూర్తి పంచిన జయంతి వేడుకలు రామారెడ్డి, 12 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది.. ఆత్మవిశ్వాసం విజయపథానికి దారి తీస్తుంది! స్వామి వివేకానందుని అమర వాక్యాలతో మార్గదర్శకత్వం చేసిన జయంతి వేడుకలు కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గల బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. యువతకు స్ఫూర్తి బిందువులు చల్లారని పలువు రు వక్తలు ప్రసంగించారు.వివేకానంద విగ్రహం ముందు జరిగిన కార్యక్రమంలో వక్తలు యుగాచా ర్యుని ఆణిముత్యాలను ఒక్కొక్కటిగా వివరిం చారు.ప్రయత్నం చేసి ఓడిపోకూడదు. ప్రయత్నం చేయకుండా ఓడిపోకూడదు అని, కెరటం నాకు ఆదర్శం.. పడినా లేచి నిలబడటానికి అని ప్రతి వాక్యం యువతను కుంగదీసింది.జాతి వ్యక్తిత్వం పరిరక్షణ: ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉంటుంది.. ప్రతి దేశానికీ, జాతికీ ఉంటుంది. దాన్ని కాపాడుకో వాలి, లేకపోతే జాతి నశిస్తుందని వక్తలు హెచ్చరిం చారు.ఏ పని అల్పం కాదు: ఇష్టమైన పని వస్తే మూర్ఖుడు కూడా సాధిస్తాడు. అన్ని పనులను తనకు నచ్చేలా మలచుకునేవాడే తెలివివాడని చెప్పారు. ఆత్మవిశ్వాసం లేనివాడే నాస్తికుడు: దేవునిపై నమ్మకం కాదు, ఆత్మవిశ్వాసమే నిజమైన భక్తి అని వివేకానందుడు బోధించాడని గుర్తు చేశారు.పదిమంది యువకులు చాలు పదిమంది యువకుల్ని ఇస్తే దేశ స్వరూపాన్ని మార్చేస్తాను అనే మాటలు యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించా యి.శ్రమించేవాడిని ఓటమి భయపడుతుంది. నిరంతర శ్రమతో చీకటిని తరిమితం చేసినట్టు ఓటమిని జయించాలని పిలుపునిచ్చారు. విశ్వాస మే బలం, బలహీనత మరణం. వెంటనే ప్రారంభిం చి క్రమక్రమంగా అభివృద్ధి సాధించాలని, అపజ యాలతో నిరుత్సాహపడకుండా వేయి సార్లు ప్రయత్నించాలని వక్తలు సూచించారు. మహిళలు, పురుషుల ఘనకార్యాలకు ఆత్మవిశ్వాసమే మూల శక్తని కొనియాడారు.వివేకానందుని అమితవీర్యం 162 సంవత్సరాల క్రితం ఈ పుణ్యభూమిపై జన్మిం చిన యుగపురుషుడు పాశ్చాత్యులకు హిందూ ధర్మ వైశిష్ట్యం, ‘వసుధైక కుటుంబం’ భావనను తెలియజేసినవాడు. ఒక పాశ్చాత్య స్త్రీకి “నన్ను దత్తత తీసుకో.. నీ కోరిక తీరుతుంది” అని, క్రైస్తవ సోదరికి “నీవు నిజమైన హిందువుగా, ముస్లింగా లేదా క్రైస్తవుడిగా జీవించు.. మతమార్పిడికి రాలే దు” అని సమాధానం ఇచ్చిన మహనీయుడు.ఈ జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని వక్తలు అన్నారు. స్థానికులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగుతామని సంకల్పం తెలిపారు.











