Wednesday, 11 March 2026

Blog

విశాఖపట్నం

జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’ – సీ టు స్కై కాన్సెప్ట్‌తో 9 రోజుల పర్యాటక వేడుకలు

విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనున్నారు. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలను కేంద్రంగా చేసుకుని మొత్తం 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశాఖ నగరంలో జనవరి 24 నుంచి 31 వరకు, అనకాపల్లి ప్రాంతంలో జనవరి 29, 30 తేదీల్లో, అరకు లోయలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు దాదాపు 10 లక్షల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తుండగా, దాదాపు 3 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 1800 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహారోత్సవాలు, సాహస క్రీడలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

విశాఖపట్నం

పాత గాజువాకలో రాజశ్యామల అమ్మవారి దర్శనం – ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు

విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి): పాత గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన రాజశ్యామల అమ్మవారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్యామలానందనాథ స్వామీజీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక ప్రాంతంలో తొమ్మిది రోజుల పాటు రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు నిర్వహించడం ఎంతో శుభకరమని పేర్కొన్నారు. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు – పల్లా శ్రీనివాసరావు

గాజువాక (పున్నమి ప్రతినిధి): కష్టాల్లో ఉన్న కార్యకర్తను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను ఆయన సత్కరించి అభినందించారు. గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కష్టాలనే తన కష్టాలుగా భావిస్తూ పోరాడే వారికే ఈ గౌరవం దక్కుతుందని అన్నారు. పార్టీ కోసం స్వార్థాన్ని పక్కనపెట్టి ముందుండి నిలబడి పనిచేసే వాడే నిజమైన కార్యకర్త అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, లేళ్ళ కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, రాష్ట్ర డైరెక్టర్ మొలిపింటి రాజు, వార్డు అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ, కర్రి దసేంద్ర, బైపల్లి గాంధీ, నియోజకవర్గ నాయకులు తమిరె శివప్రసాదరావు, విల్లా రాంమోహన్, దొడ్డి సత్యారావు, అర్శివల్లి దీప్తి, పల్లా రమణ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కేన్సర్ పై అవగాహన సదస్సు

కేన్సర్ పై అవగాహన కార్యక్రమం అగనంపూడి, పున్నమి ప్రతినిధి. అగనంపూడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హోమి బాబా కేన్సర్ హాస్పటల్ వారు కేన్సర్ పై అవగాహన కార్యక్రమం అగనంపూడి హైస్కూల్ దగ్గర ఉన్న కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ లో బుధవారం జరిగినది. సుమారు 100 మందికి పైగా మహిళలు మరియు అగనంపూడి హైస్కూలు మహిళా విద్యార్థినులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. భవిష్యత్ లో కేన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హామీ బాబా కేన్సర్ హాస్పటల్ డాక్టర్లు, హాస్పటల్ సిబ్బంది మరియు విదేశాల నుంచి వచ్చిన డాక్టర్స్ వివరంగా చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమంలో డాక్టర్ డోలోరోసా ఫెర్నాండెస్,డాక్టర్ ప్రదీప్, డాక్టర్ నమిత మరియు హాస్పటల్ సిబ్బంది, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొనడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కు సమస్యలు పరిష్కరించాలి

స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించాలి స్టీల్ ప్లాంట్, (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించడంలో మీరు చొరవ చూపాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు బుధవారం పార్లమెంట్ సభ్యులకు విన్నవించారు. పార్లమెంట్ సభ్యుల పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసిన సభ్యులను నగరంలో కలిసి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలోనే సముద్రతీర ప్రాంతంలో గల ఏకైక ఉక్కు పరిశ్రమ ఇది ఒకటే అని వారు అన్నారు. దీనిని రక్షించుకొని దేశీయ ఉక్కు ఎగుమతులను మరింత ప్రోత్సహించడం ద్వారా దేశ సంపద మరింత అభివృద్ధి జరుగుతుందని వారు వివరించారు. నేడు కేంద్ర ప్రభుత్వం దీనిని రక్షించడం కోసం 11400 కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్ల రూపాయలను అందించినప్పటికీ సొంత గనులు లేకపోవడంతో దీని ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందని దీనివల్ల లాభాల స్థానంలో నష్టాలు వస్తున్నాయని వారు వివరించారు. దీనికి పరిష్కారం సొంత గనులు కేటాయించడం లేదా సెయిల్ లో విలీనం చేసి రా మెటీరియల్ కష్టాలను తగ్గించడం సాధ్యపడుతుందని వారు అన్నారు. నేటి స్టీల్ యాజమాన్యం అనాలోచితి నిర్ణయాలతో ఉత్పత్తి వ్యయం మరింత పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.స్టీల్ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలను మరింత అధికం చేస్తుందని వారు అన్నారు. కార్మికులు 2012 జీతాలను, అధికారులు 2007 జీతాలను తీసుకుంటున్నప్పటికీ ఆ జీతాలలో కోతలు విధిస్తోందని అన్నారు. ఇదే కాకుండా కార్మికులకు హెచ్ఆర్ఏ నిలుపుదల చేశారని, ఉక్కు నగరంలో నివసిస్తున్న వారికి ఎక్కడా లేని విధంగా యూనిట్ కరెంటు చార్జీలను అత్యధికంగా పెంచివేశారని, చివరకు 24 గంటలు అందుబాటులో ఉంచవలసిన క్యాంటీన్ సౌకర్యాన్ని కూడా నిలుపుదల చేశారని వారు వివరించారు. ఇలా కార్మికులను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ వైఖరిని ప్రశ్నిస్తే వారిపై నిర్బంధంతోపాటు శాఖ పరమైన చర్యలతో భయాందోళనలను సృష్టిస్తున్నారని వారు అన్నారు. కనుక ఈ విషయంలో మీరు దృష్టి సారించి ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించి స్టీల్ మంత్రిత్వ శాఖకు తగిన సూచనలు అందించాలని వారు అభ్యర్థించారు. ఎస్ రాధా మోహన్ సింగ్ చైర్ పర్సన్, కామ్రేడ్ వి సల్వరాజ్, జ్యోతి మణి, శ్రీ జగదీష్ షట్టర్, రాజీవ్ భరద్వాజ్, ముజిబుల్లా ఖాన్, బిష్ణు పండారాయ్ పార్లమెంటు సభ్యులను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె అయోధ్యరామ్, దాలినాయుడు, సురేష్ బాబు, జె రామకృష్ణ, ఎల్ వి రమణ కలిశారు.

ఆంధ్రప్రదేశ్

ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల్లో అనుమకొండ వరదరాజులు

నెల్లూరు, జనవరి (పున్నమి ప్రతినిధి): ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ అనుమకొండ వరదరాజులు గారు ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదేళ్లు (2021–2025) స్థానం సంపాదించడం గర్వకారణం. రసాయన శాస్త్రం, పాలిమర్ సైన్స్, గ్రీన్ కెమిస్ట్రీ రంగాల్లో ఐదు దశాబ్దాల పరిశోధనా అనుభవంతో 250కుపైగా పత్రాలు ప్రచురించారు. కాలేయ క్యాన్సర్ కణాలపై ప్రభావవంతమైన నానో కాంపోజిట్‌కు భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. స్టాన్ఫోర్డ్–ఎల్సీవియర్ డేటా ఆధారంగా ఈ గుర్తింపు లభించింది. యువ శాస్త్రవేత్తలకు ఆయన ఆదర్శం.

E-పేపర్

కలెక్టర్ ఆదేశాలు బెఖాతార్ …!

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో గల వీరభద్ర కాలనీ లో నిత్యం చెత్త కాలుస్తూనే ఉన్నారు గత సంవత్సరము కలెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసినా స్థానిక అధికారులు ప్రజలకు కిందిస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అర్థమవుతుంది. చెత్త కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కి కారణం కూడా అవుతుందని ప్రభుత్వం హెచ్చరించినా గానీ కింది స్థాయి ఉద్యోగులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. ట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. చిత్త పోయ్యోద్దు అంటూ మైక్ పెట్టి ఉన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి,విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు మర్రిపాడు లో కేంద్రం లో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామానారాయణ రెడ్డీ ఆదేశాలతో 23 న మర్రిపాడు బస్సు స్టాండ్ నందు ఉదయం 10 లకు నిర్వహించడం జరుగుతుంది ముందుగా అభయంజానేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కేక్ కటీంగ్ చేయబడును మర్రిపాడు మండలంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు లోకేష్ జన్మదిన వేడుకలో పాల్గొనాలని, కార్యక్రమం విజయవంతం చేయవలసిందుగా, మర్రిపాడు గ్రామం ప్రజలు కోరుతున్నారు.

కాకినాడ

పెద్దాపురం RDO కార్యాలయం లో బిజెపి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో జనతా వారధి.

పున్నమి న్యూస్, పెద్దాపురం సోమవారం ఉదయం 10.30 కి భారతీయ జనత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా ప్రజా సమస్యలు ను RDO కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్సెల్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలును పరిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలు తమ సమస్యలును భాజపా చేపట్టిన జనతా వారధి ద్వారా త్వరిత గతిన పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం కు బిజెపి పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దాట్ల సాహితి వర్మ, పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రాంకుమార్, జనరల్ సెక్రెటరీ మిడతాని శ్రీధర్, ఓడిమని శివ, చెల్లిపోయిన రత్నం, కె ధనలక్ష్మి, అద్దేపల్లి వెంకట్రావు, నెల్లిపూడి బ్రహ్మాజీ పాల్గొన్నారు

E-పేపర్

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర* : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది

*మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర* : బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం నిన్న తొలిసారి రూ.1.50 లక్షలను అధిగమించగా, ఈరోజు మరింతగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో మంగళవారం రాత్రి 11.55 గంటలకు రూ.1,52,800 ఉన్న ధర, బుధవారం ఒక్కరోజే రూ.6,000కు పైగా పెరిగి రూ.1,59,000కు చేరింది. ఇక వెండి ధర కిలో రూ.3,19,000 దాటింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.