Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు !

కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు ! ఈ ఆర్టికల్ క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యం గా మేనేజిమెంటు వారి కోసం , పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయి లో ఉన్న మేనేజర్ ల కోసం రాయబడింది. ముఖ్యం గా, శెలవు మంజూరు చేసే , లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం .  ‘ శెలవు ‘అనేది తమ హక్కు గా ఉద్యోగులు భావిస్తారు . శెలవు అనేది బాధ్యత గా వాడాలనీ , అవసరం ఉంటేనే వాడాలనీ, ఉన్నాయి కదా ? సంవత్సరాంతం లో మిగిలి పోయాయి కదా ? ‘ మురిగి పోతాయేమో ‘ ( వాడని లీవులు ) అని అవసరం ఉన్నా లేకున్నా డిసెంబరులో సగం రోజులు శెలవు పెట్టే ప్రాక్టీసు ను  పై అధికారులు  హర్షించరు !! సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్ వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోం ) సమూలం గా మార్చి వేసింది . ఉద్యోగినీ ఉద్యోగులు , పై స్థాయి మేనేజర్ ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది . కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బ తిన్నాయి . సెలవు దొరకడం అత్యంత కష్టమైన , అత్యవసర సర్విసుల లో ( ప్రభుత్వ మరియు ప్రైవేటు ) పని చేసే కొందరు మిత్రులతో మాట్లాడుతూ నే ఉన్నాను . ” మీ దగ్గర శెలవు దొరకడం కష్టం కదా ? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ? ” అని . ఒక గుడ్ న్యూసు ఏమిటంటే , చాలా చోట్ల , మన వాడు ఫోన్ చేసి , ‘ నాకు జలుబు దగ్గు ఉంది సార్ / మేడం ! మాస్కు కట్టుకుని రానా మరి ? ‘ అని దాదాపు బెదిరించే టెర్రరిష్టు ధోరణి లో అడగడం , పై వారేమో ‘ ఆహా వద్దు వద్దు ! కావాలంటే నువ్వు వారం శెలవు తీసుకో ! ” అని , ‘ ఆరోగ్యం జాగ్రత్త ‘ అని ముక్తాయిస్తున్నారట ! మన వాళ్ళు కొంత రిలీఫ్ తో చెప్పారు .  మీరు ఒక కంపెనీ ని నడుపుతూ ఉంటే, లేదా మీరు పర్యవేక్షక / లేదా పై స్థాయి లో పని చేసే సీనియర్ అధికారి ( ణి ) అయితే, మా వైపు నుంచి కొన్ని విజ్ఞప్తులు ! (1)   కుటుంబ సభ్యులని కోల్పోయిన ఉద్యోగులు దుఃఖం తో ఉంటారు . దశదిన కర్మ కంటే ఎక్కువ రోజులు, వారు మానసికం గా కోలుకునే వరకూ జీతం కూడిన లీవు ఇవ్వండి . (2)   వారు శెలవు లో ఉన్నప్పుడు, రెండు మూడు సార్లు ఫోన్ చెయ్యండి . ఏమైనా సహాయం కావాలా అడగండి . ఇల్లు దగ్గర ఉంటే ఒకసారి పర్సనల్ గా వెళ్ళి పరామర్శించండి . డబ్బు సాయం, ఆఫీసు నుంచి అడ్వాన్సు ఇప్పించడం , ఏవైనా ఆఫీసుల నుంచి నింపవలసిన  దస్తావేజులు ఉంటే వాటిని తెప్పించి ఇవ్వడం, ఇలా ఏదైనా ? (3)   ఎవరెవరు చనిపోతే జీతం తో కూడిన లీవు ఇవ్వాలి ? ఈ కరోనా సమయం లో ఇది సంక్లిష్టమైన ప్రశ్న . కేవలం కుటుంబానికే పరిమితం చేయకండి! (4)   మనమందరం ఎన్నో సంఘటనలు చూశాం , చదివాం . మన లొకాలిటీ లో ఎవరో వృద్ధులు కరోనా బారిన పడి చనిపోతారు . వారి పిల్లలు పెళ్ళయి , ఇక్కడ లేక పోవచ్చు . ఈ దేశం లో నే లేక పోవచ్చు. వారు వచ్చే దాకా , చుట్టు పక్కల వారు, ఫ్యామిలీ ఫ్రండ్స్ , ఎన్నో పనులు చేయాల్సి రావచ్చు . శవాన్ని ఐస్ బాక్సు లో ఉంచడం లాంటివి . అందరూ ఉండి, ఆపత్కాలం లో ఎవరూ లేని అనాధలు  గా చనిపోయే దయనీయ స్థితులను గత సంవత్సర కాలం గా ఎన్నో చూశాం . కాబట్టి, కేవలం భార్య / భర్త / పిల్లలు / తల్లిదండ్రులే కాక , అత్త, పిన్ని, బాబాయి, మామయ్య ,చుట్టాలు, పక్కాలు, ఇలా ఎవరు హఠాత్తు గా గతించినా, మీ ఉద్యోగులలో ఒకరు ఆ కారణం గా లీవు అడిగినా, ఈ విపత్కర సమయం లో కాదనకండి , కాస్త పెద్ద మనసు చేసుకుని , మంజూరు చేయండి . ఏమి జరుగుతోందో , కనిపెట్టి ఉండి , కనుక్కోండి. (5)   మీకు వాస్తవం తెలిస్తే, మీ ఉద్యోగి ( ని ) మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేటు , శ్మశానం నుంచి పత్రం , లేక డాక్టర్ సర్టిఫికేటు, అలాంటివి  అడగకండి . మరీ తప్పని సరి అయితే తప్ప , ఇలాంటి దస్తావేజులు లేకుండానే లీవు అప్రూవ్ అయేలా చూడండి . (6)   మీ సంస్థ , ఎవరైనా సైకాలజిస్టు తో వ్యాపార ఒప్పందం అయి ఉందా ? విపరీమైన మానసిక వత్తిడి ఉండి, పని లో లీనం కాలేక పోతున్న ఉద్యోగులకు కాస్త కౌన్సెలింగ్ ఇప్పించండి . కంపెనీ ఖర్చు తో . ఆ సమయం లో అది వారికి అవసరం కావచ్చు .  వీటిలో ఏవి  వీలైతే అవి మీ సంస్థ లో అమలు చేయండి. ఈ దేశం , ఆ దేశం అని కాకుండా, ప్రపంచం మొత్తం ఇలాంటి జీవన్మరణ సమస్య లో ఉన్నప్పుడు , మనం ఒకరి పట్ల ఒకరు కారుణ్యం తో, కాస్త పెద్ద మనసుతో మెలగడమే పరిష్కారం . ఆపత్కాలం లో మీరు చేసిన మేలు, మీ ఉద్యోగులు ఎన్నటికీ మరిచిపోరు . చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు . పదిమందికి చెబుతారు. CV Ramana, Hyderabad.

Featured ఆంధ్రప్రదేశ్

శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి

శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి వెంకటాచలం, ఫిబ్రవరి 6 (పున్నమి విలేఖరి): సర్వేపల్లి నియోజకవర్గంలో శాంతియుత ఎన్నికల నిర్వహణకు తాము కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నిడిగుంటపాళెంలో కట్టంరెడ్డి విజయ్ మోహన్ రెడ్డి నివాసంలో శనివారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో గొడవలను నివారించాలని, ఏకగ్రీవాలకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన కోరారు. పంచాయతీలు ఏకగ్రీవాలు అయితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని, వాటితో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఏకగ్రీవం అయిన చోట అప్పుడే దృవీకరణ పత్రాలు ఇవ్వొద్దని అధికారులను ఎస్ ఈ సి ఆదేశించడం సమర్థనీయం కాదన్నారు. ఏకగ్రీవాలు అనేది అనాది కాలం నుంచి వస్తుందని, ఇదేం కొత్తది కాదన్నారు. తాను అధికార పార్టీ శాసన సభ్యుడిగా ఎన్నికైన 18 నెలలకే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు. సోమిరెడ్డి మంత్రిగా 15 ఏళ్లల్లో చేయలేనిది తాను 18 నెలల్లో చేసి చూపానని వెల్లడించారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా సరే తమకంటే ఎక్కువ అభివృద్ధి చేసినట్లు సోమిరెడ్డి నిరూపిస్తే ఈ ఎన్నికల్లో ఆ పంచాయతీ వాళ్లకే వదిలేస్తామన్నారు. గ్రామాల్లో చిచ్చు రేపేందుకు టిడిపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎవరు కూడా సోమిరెడ్డి, ఆ పార్టీకి చెందిన కొందరు చోటామోటా నాయకుల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కనుపూరు కోదండరామిరెడ్డి, కట్టంరెడ్డి విజయ్ మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మందల వెంకట శేషయ్య, కొనిదెన భాస్కర్ నాయుడు, మోహన్ నాయుడు, అడపాల ఏడుకొండలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ..

  దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా జి. వాణీమోహన్ నియామకం.. పురావస్తు శాఖ కమిషనర్ గా వాణీమోహన్ కు పూర్తి అదనపు బాధ్యతలు… ఆప్కో ఎండీ, సహకార శాఖ కమీషనర్ గా బాబు.ఎ కు పూర్తి అదనపు బాధ్యతలు… రవాణా,రోడ్లు,భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి గా అర్జా శ్రీకాంత్ నియామకం.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా జి. జయలక్ష్మి కి పూర్తి అదనపు బాధ్యతలు..

Featured

సత్తా చాటిన నెల్లూరు బిడ్డ

_నెల్లూరు జిల్లా విద్యార్థినికి అభినందనలు తెలిపినా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు_* _జనవరి 26 ఢిల్లీ లో జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకలో NCC డ్రిల్ల్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన చిలకపాటి జ్యోత్స్న ను ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందించి 2లక్షల రూపాయలను బహుమతిని అందజేశారు._

Featured

జడ్పీ లో 100% కోవిద్ వ్యాక్సిన్ :CEO సుశీల

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో శ్రీమతి పి సుశీల ఆధ్వర్యంలో జడ్పీ ఉద్యోగులు కోవేట్ వ్యాక్సిన్ను విజయవంతంగా 100% వ్యాక్సిన్ను ఉద్యోగులందరూ వేసుకున్నారు ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో శ్రీమతి పి సుశీల దగ్గరుండి ప్రతి ఉద్యోగి వ్యాక్సిన్ వేసి ఉద్యోగుల బాగోగులను దగ్గరుండి చూసుకున్నారు వారికి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్కాకుల పెంచలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు జడ్పీ ఉద్యోగులకు కోవిద్ వ్యాక్సిన్ను వేయించుట కు సహాయం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ kvn చక్రధర్ బాబు గారికి మరియు జడ్పీ సీఈవో శ్రీమతి పి సుశీల గారికి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసినారు

Featured ఆంధ్రప్రదేశ్

అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతసాగరం వైసీపీ అభ్యర్థి

గురువారం అనంతసాగరం జనసంద్రంగా మారింది అశేష జనవాహినితో కలిసి రాపూరు వెంకట సుబ్బారెడ్డి గారు బట్రెడ్డి జనార్థన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా వైసిపి సర్పంచ్ అభ్యర్థి కమతం శోభ తన నామినేషన్ దాఖలు చేశారు వీరితో పాటు 14 వార్డులకు గాను 14 మంది వార్డు నెంబర్ లు కూడా నామినేషన్ దాఖలు చేశారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కు సంబంధించి అనంతసాగరం మండలం లో నామినేషన్ల చివరి రోజు ముగిసేనాటికి మొత్తం 25 గ్రామపంచాయతీలకు 121 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు అలాగే మండలంలో మొత్తం 226 వార్డులకు గాను 465 మంది దాఖలు చేశారు మండలంలోని చిలకమర్రి గ్రామంలో ఒకే ఒక్క సర్పంచ్ నామినేషన్ దాఖలు చేశారు అధికారులు ఏకగ్రీవం ప్రకటించడమే తరువాయి  

Featured ఆంధ్రప్రదేశ్

మనం మన పరిసరాల శుభ్రత పై అవగాహన ర్యాలీ

బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 5 ( పున్నమి విలేఖరి ) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం – 4 మరియు వవ్వేరు సచివాలయం – 2 ఏరియాలలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు స్వచ్ఛభారత్, మనం మన పరిసరాల శుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మన పరిసరాల్లో చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, నగర పంచాయతీ వాహనాల్లోనే చెత్తను వేయాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలని సూచించారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా చెత్త వేసిన యెడల జరిమానా విధించబడును హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2 సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, విఏవో లు పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు

Featured తెలంగాణ

ల కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి శ్రీమతి కొత్తపల్లి పద్మ గారు కనుమూశారు

సీనియర్ కూచిపూడి నృత్య గురువు, నర్తకీమణి శ్రీమతి కొత్తపల్లి పద్మ గారు హైదరాబాద్ లో కనుమూశారు కొంతకాలంగా ఆమె పక్షవాతానికి గురై అనారోగ్యం తో చికిత్స పొందుతున్నారు! డాక్టర్ వెంపటి చినసత్యం గారి దగ్గర 18 ఏళ్ల పాటు శిష్యరికం చేశారు! తెనాలికి చెందిన పద్మ గారు హైదరాబాద్ లో స్థిరపడి శ్రీనృత్యాలయ నాట్య సంస్థను ప్రారంభించి ఎందరో శిష్య ప్రశిష్యులను తీర్చి దిద్దారు ! తన ఐదవ ఏటనే నృత్యం పై మక్కువ పెంచుకున్నారు! టెన్త్ పూర్తీ కాగానే, విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నాట్యం లో డిప్లొమా పూర్తీ చేశారు! 1962 లో మద్రాస్ వెళ్లి పద్మభూషణ్ వెంపటి చిన సత్యం గారు నిర్వహించే కూచిపూడి ఆర్ట్ అకాడమీ లో శిష్యురాలిగా చేరారు! మద్రాస్ లో జరిగిన ఆమె కూచిపూడి నాట్య అరంగేట్రానికి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విచ్చేసిన విషయాన్నీ ఆమె ఎప్పుడూ గుర్తు చేస్తుండే వారు! శృంగారమణి, నాట్య మయూరి లాంటి బిరుదులూ పొందారు! ఆ రోజుల్లోనే కేంద్రం నుంచి స్కాలర్షిప్, ప్రశంసలు అందుకున్న గొప్ప నర్తకి గా గుర్తింపు పొందారు. ఐదు రోజుల క్రితమే ఆమె కుమారుడు కిరణ్ గుండెపోటు తో చనిపోయారు! ఆ దిగులు, అనారోగ్యపు ఇబ్బందులు పద్మ గారిని మరింత కుంగదీసాయి! కూచిపూడి ఆణిముత్యం పద్మ గారు లేని లోటు తీరనిది! వారికి నివాళి?

Featured

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై బోలా హర్షం.

మనుబోలు (పున్నమి విలేఖరి) 2, ఫిబ్రవరి :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిజెపి జిల్లా నాయకులు బోల శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు . ఈ బడ్జెట్ వల్ల దేశంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతోందని నూతన దశాబ్దంలో ఆర్థికమంత్రి నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్​ భారత విశ్వాసాన్ని పెంపొందించుతుంది. ఈ ఆశాజనక, ప్రగతిశీల బడ్జెట్​ వల్ల రానున్న కాలంలో భారత్ ఎంతో ఆరోగ్యవంతంగా, సంపన్న దేశంగా మారుతుంది అని అన్నారు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు వల్ల పన్ను చెల్లింపు దారులకు అసాధారణ రీతిలో ఉపశమనం కలుగుతుందని అన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం సంకల్పానికి ఈ బడ్జెట్​ ఎన్నో విధాలుగా దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. రైతులు, పేద, మధ్య తరగతి, వ్యాపార వర్గాలు లబ్ధిపొందే విధంగా బడ్జెట్​​ను రూపొందించిన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​కు నా అభినందనలు. ధాన్యం నిల్వ, నీటిపారుదలలో విధించిన నిబంధనలు.. రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పానికి దోహద పడతాయి. మౌలిక వసతులకు ఊతమివ్వడం, సహేతుకమైన పన్ను వ్యవస్థ, సులభతర వాణిజ్యంలో పెట్టుబడులు, బ్యాంకింగ్​ రంగాన్ని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. బడ్జెట్​ 2020 చా సమతూకంగా ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

Featured ఆంధ్రప్రదేశ్

కంటేపల్లిలో రైతు శిక్షణా కార్యక్రమం

కంటేపల్లిలో రైతు శిక్షణా కార్యక్రమం వెంకటాచలం, ఫిబ్రవరి 2 (పున్నమి విలేఖరి): మండలంలోని కంటేపల్లిలో మంగళవారం రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు హైమావతి, వ్యవసాయ అధికారి శిరీష, నెల్లూరు రూరల్ సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్, డాట్ సెంటర్ సైంటిస్ట్ శ్వేత హాజరయ్యారు. వరిలో వచ్చే తెగుళ్లు, పురుగులు, వాటి నియంత్రణకు తీసుకోవలసిన చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో జరుగుతున్న పొలంబడి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పక్క గ్రామమైన అనికేపల్లి – 2లో ఆర్బికెని సందర్శించి, వ్యవసాయ సహాయకుడు రికార్డులను తనిఖీ చేశారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజుల, కంటేపల్లి, అనికేపల్లి వ్యవసాయ సహాయకులు అభిషేక్, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.