Wednesday, 11 March 2026

Blog

వరంగల్

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి ఘాటు క్వింటా 29 వేలు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు రికార్డు సృష్టించిన్నాయీ గురువారం జరిగిన వేలంలో US 341 రకం మిర్చి ఏకంగా కింటాకు 29 వేల అత్యధిక ధర పలికింది, గత సోమవారం రూ 20 వేలు గా ఉన్న ధర నాలుగు రోజులలో రూ 9 వేలు పెరగడం విశేషం , ఉమ్మడి జిల్లాలలో దిగుబడులు తగ్గడం అంతర్జాతీయంగా ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఇ ధరల పెరుగుదలకు కారణమని ప్రముఖ వ్యాపార వేత్త , గజేంద్ర ఎంటర్ప్రైజెస్ సురేందర్ గారు తెలిపారు

తూర్పు గోదావరి

పుంత రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. గోపాలపురం మండలం భీమొలు గ్రామం సమీపంలో ఉన్న పుంత రోడ్డు కు ఇంత కాలానికి మోక్షం లభించింది ఎమ్మెల్యే మద్యపాటి వెంకట్రావు సహకారంతో ఈ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు 20 లక్షలు మంజూరయ్యాయి రెండు కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణానికి కుటమి నాయకులు బుధవారం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో టిడీపీ మండల అధ్యక్షుడు రాము భీమొలు గ్రామ అధ్యక్షుడు అప్పారావు కూటమి నాయకులు పాల్గొన్నారు END.

E-పేపర్

కుక్కల మృతదేహాల వెలికితీత యాచారం మండలం.. జంతు ప్రేమికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు

కుక్కల మృతదేహాల వెలికితీత యాచారం మండలం.. జంతు ప్రేమికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు కనిపించకుండా పోయిన కుక్కల మృతదేహాలను గుర్తించారు రంగారెడ్డి జిల్లా యాచారం: జంతు ప్రేమికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు కనిపించకుండా పోయిన కుక్కల మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటన రెండు రోజులగా తీవ్ర చర్చలకు దారి తీయగా సంచలనంగా మారింది. యాచారం మండల కేంద్రంలోని డంపింగ్ యార్డ్ వద్ద కనిపించకుండా పోయిన కుక్కల మృతదేహాలను పాతిపెట్టారన్న అనుమానంతో ఎస్సై మధు, ఆధ్వర్యంలో జెసిబితో పాతిపెట్టిన కుక్కల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనా స్థలంలోనే పదుల సంఖ్యలో బయటపడుతున్న కుక్కల మృతదేహాలను బయటకు తీసి వెటర్నర్ డాక్టర్లు, చనిపోయిన కుక్కలకు పోస్ట్ మార్టం చేశారు. గత కొంతకాలంగా పశువులు, మేకలు, వృద్ధులు చిన్న పిల్లలపై వీధి కుక్కలు కోతులు దాడులకు తెగబడుతున్నాయని గ్రామంలోని కుక్కలు కోతలను ఎక్కడికైనా తీసుకువెళ్లాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు.

వనపర్తి

డిజిటల్ రూపంలో విద్యా బోధన జరగాలి డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ టీమ్ హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్

*కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన డిస్టిక్ ఇన్స్పెక్షన్ హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్* *పున్నమి ప్రతినిధి, వనపర్తి జిల్లా:: తేదీ 22/ 01/2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల కొత్తకోట యందు జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ పదవ తరగతి విద్యార్థులను దూషించి మాట్లాడుతూ వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు పేదలు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయురాలు జి శ్రీలత ,రజియా బేగం, వారు హిందీ అభ్యసన ప్రక్రియలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పిల్లలకు సరళతరం చేస్తూ విద్యార్థులకు బోధన చేస్తుండడం అభినందనీయమని వారు తెలియజేశారు, డిజిటల్ ప్రక్రియలో హిందీని సులభతరంగా విద్యాబోధన చేయాలని వారు సూచించారు*

E-పేపర్

నంద్యాల జిల్లా లొ ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల Date22-1-2026 *నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట దగ్గర లో ఘోర రోడ్డు ప్రమాదం*నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న,ప్రైవేట్ ట్రావెల్ టైర్ పేలి బస్సు లారీ ని ఢీ కొట్టటం తో ఈ ప్రమాదం జరిగింది* *ఈ ప్రమాదం లో ఇద్దరు డ్రైవర్లు, క్లినర్ స్పాట్ లో చనిపోయారు* *వాహనాలు పూర్తిగా కాళిపోయాయి* *ఒక వ్యాన్ డ్రైవర్ బస్సు అద్దాలు పగల గొట్టటం తో ప్రయానికులు ప్రాణాలతో బయట పడ్డారు* *నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది*

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నాగ్‌పూర్ వేదికగా భారత్ టీ20లో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో తొలి గెలుపు

నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో లభారత్ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ 238 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అతడు 84 పరుగులతో జట్టు స్కోరును భారీగా పెంచాడు. అతడికి తోడుగా రింకూ సింగ్ 44 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 25 పరుగులతో చివర్లో వేగం పెంచాడు. భారత బ్యాట్స్‌మెన్ దూకుడైన ఆటతో న్యూజిలాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. భారత బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు. సమష్టి జట్టు ప్రదర్శనతో భారత్ తొలి టీ20ను తన ఖాతాలో వేసుకుని సిరీస్‌కు శుభారంభం చేసింది. Uploaded Video:

అనకాపల్లి

సోమన్నపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – బస్ ఢీకొని యువకుడు మృతి

అనకాపల్లి జిల్లా జనవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి మండలం సోమన్నపాలెం గ్రామం వద్ద బుధవారం రాత్రి 08.55 గంటల సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. పులపర్తి నుంచి అచ్యుతాపురం వెళ్తున్న AP 39 TF 6938 నంబర్ గల బ్రాండెక్స్ కంపెనీకి చెందిన SML ట్రావెల్స్ బస్, ఎదురుగా వస్తున్న AP 39 FE 7917 నంబర్ మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ఘటనలో యొకోహోమా టైర్స్ కంపెనీలో పనిచేస్తున్న గింజల తాత అబ్బాయి (S/o బాబ్జి) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

అనకాపల్లి

సోమన్నపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – బస్ ఢీకొని యువకుడు మృతి

అనకాపల్లి జిల్లా జనవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి మండలం సోమన్నపాలెం గ్రామం వద్ద బుధవారం రాత్రి 08.55 గంటల సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. పులపర్తి నుంచి అచ్యుతాపురం వెళ్తున్న AP 39 TF 6938 నంబర్ గల బ్రాండెక్స్ కంపెనీకి చెందిన SML ట్రావెల్స్ బస్, ఎదురుగా వస్తున్న AP 39 FE 7917 నంబర్ మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ఘటనలో యొకోహోమా టైర్స్ కంపెనీలో పనిచేస్తున్న గింజల తాత అబ్బాయి (S/o బాబ్జి) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

అనకాపల్లి

సోమన్నపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – బస్ ఢీకొని యువకుడు మృతి

అనకాపల్లి జిల్లా జనవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి మండలం సోమన్నపాలెం గ్రామం వద్ద బుధవారం రాత్రి 08.55 గంటల సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. పులపర్తి నుంచి అచ్యుతాపురం వెళ్తున్న AP 39 TF 6938 నంబర్ గల బ్రాండెక్స్ కంపెనీకి చెందిన SML ట్రావెల్స్ బస్, ఎదురుగా వస్తున్న AP 39 FE 7917 నంబర్ మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ఘటనలో యొకోహోమా టైర్స్ కంపెనీలో పనిచేస్తున్న గింజల తాత అబ్బాయి (S/o బాబ్జి) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

విశాఖపట్నం

స్టీల్ ప్లాంట్ VRSకు గడువు పొడిగింపు – స్పందన లేక వెనక్కి తగ్గిన యాజమాన్యం

విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(VRS)కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో VRS దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ప్లాంట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 24న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ నెల 20వ తేదీ లోపు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, స్పందన తక్కువగా ఉండటంతో గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 500 మంది ఉద్యోగులు మాత్రమే VRSకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుండగా, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, భవిష్యత్‌పై స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగులు ముందుకు రావడం లేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. గడువు పొడిగింపుతో అయినా మరింత మంది ఉద్యోగులు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.