Friday, 6 March 2026

Blog

Featured

దేశ ప్రగతి బి.జె.పి తోనే సాధ్యం

మనుబోలు (పున్నమి విలేఖరి)21, మార్చి:త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని భాజపా నాయకులు కోరినారు కుడితపల్లి గ్రామం నందు ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వివరించి త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను కోరినారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి పేదవాడికి నిత్యవసర సరుకులు అందజేసిందని అన్నారు కావున ప్రజలందరూ త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు మాధవి ,స్వాతి, శిల్ప జ్యోతి ,ధనలక్ష్మి ,జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మండల అధ్యక్షుడు ఒడూరు శ్రీనివాసులు రెడ్డి నాయకులు కృష్ణారెడ్డి ,శేఖర్ ,వెంకయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Featured

ప్రాణం తీసిన ఈత సరదా

అనంతసాగరం మండలం చిలకమర్రి గ్రామ సమీపంలో సోమశిల ఉత్తర కాలువ వద్ద మృత్యువాత పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సోమశిల ఎస్ఐ సి వి సుబ్బారావు గారి కథనం సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్దామని వచ్చిన వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ కు చెందిన కంబాల రవిశంకర్ (42) వైఎస్ఆర్ జిల్లా గోపవరం లో ఎం ఈ ఓ కార్యాలయం నందు కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవు రోజు కావడంతో సరదాగా స్నేహితులు విష్ణు, వినోద్ కలిసి చిలకమర్రి సమీపంలో ఉన్న ఉత్తర కాలువలో ఈతకు దిగాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో రవిశంకర్ , విష్ణు వినోద్ లు కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అతికష్టం మీద వారిని వెలుపలికి తీశారు. వారిని వెలుపలికి తీసే లోపే అపస్మారక స్థితికి చేరుకున్నారు. రవిశంకర్ అప్పటికే మృత్యువాత పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఇరువురిని ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Featured విశాఖపట్నం

మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలి –  నాయకులు శ్రీమతి మెహరున్నిసా,శ్రీమతి పుష్ప,శ్రీమతి రజిని

  విశాఖపట్నం, 21 మార్చి: కోవిడ్ మహమ్మారి తరువాత ఏర్పడిన దురదృష్టకర పరిస్థితులు వల్ల ఆదాయం కోల్పోయి అధిక వడ్డీలకు అప్పులు చేసి , అప్పులు తీర్చే మార్గం లేక అత్యంత దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న బడుగు బలహీన దళిత వలస కుటుంబాల నుండి మహిళలు, వారి పిల్లలు అక్రమ రవాణాకు గురికాకుండా నిరోధించేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వ సమగ్ర అక్రమ రవాణా చట్టం రూపొందించి పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందే విధంగా చూడాలి అని అక్రమ రవాణా బాధితులతో ఏర్పాటైన రాష్ట్ర సమాఖ్య విముక్తి డిమాండ్ చేస్తుంది. ఆదివారం ఉదయం విశాఖ ప్రెస్ క్లబ్ లో విముక్తి రాష్ట్ర నాయకులు శ్రీమతి మెహరున్నిసా,శ్రీమతి పుష్ప,శ్రీమతి రజిని విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్ పాల్గొన్నారు . ఈ సమావేశంలో విముక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నిసా మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 250 మంది అక్రమ రవాణా బాధితులు, సెక్స్ వర్కర్లతో 2018 లో “విముక్తి ” అనే సమాఖ్య ప్రారంబించారు అన్నారు . కోవిడ్ అనంతరం రాష్ట్రంలో అక్రమ రవాణా పెరిిగిందని అంటూ, కోవిడ్ అనంతరం ఉపాధి లేకపోవటంతో ఎన్నో కుటుంబాలు తమ పిల్లలని బాండెడ్ కూలీలుగా , ఇండ్లలో చాకిరి కోసం తరలి వెళ్తున్నారని ఫలితంగా వీరిపై నియంత్రణ నిఘా లేనందున వీరు అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు..శ్రీమతి రజిని విముక్తి కో కన్వీనర్ మాట్లాడుతూ మనదేశంలో 2019 లో 2080 మంది అక్రమ రవాణా కు గురైనారని , అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 356 మంది(15.19%) అక్రమ రవాణా కు గురైనారు. ఈ 350 మంది లో 245 మంది వ్యభిచారం కోసం , 14 మంది బాలికలు బలవంతపు పెళ్లి కోసం , 31 మంది ఇండ్లలో పని, ఫ్యాక్టరీలలో పనికోసం మరో 60 మంది వివిధ ఇతర కారణాలు కోసం అక్రమ రవాణా కు గురి కావడం జరిగిందన్నారు. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి మన రాష్ట్రంలో సుమారు1500 మంది అక్రమ రవాణా నుండి విడిపించటం జరిగిందని(2014 నుంచి 2019) వరకు కానీ వీరిలో ఇద్దరు మాత్రమే బాధితుల నష్టపరిహారం పథకం క్రింద నష్టపరిహారం అందుకున్నారు, మరి మిగిలిన బాధితులకు పరిహారం అందలేదు అని శ్రీమతి పుష్ప ఆందోళన వ్యక్ఘం చేశారు. క్రింద ప్రభుత్వం 2018లో అక్రమ రవాణా (నిరోధం, రక్షించడం మరియు పునరావాసం ) నిరోధక బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది . కానీ రాజ్యసభలో ఆమోదం పొందక పోవడం వల్ల ఆ బిల్లు రద్దు అయ్యింది . కనుక వెంటనే సమగ్రంగా అన్ని రకాల అక్రమ రవాణా నిరోధిస్తూ బిల్ ను ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టాలని విముక్తి డిమాండ్ చేస్తుంది అని అన్నారు. ఆ బిల్లులో అక్రమ రవాణా బాధితులకు 1.కమ్యూనిటీ పునరావాసం కల్పించాలి కానీ షెల్టర్ హోమ్ లు వద్దు. 2.అక్రమ రవాణా బాధితులకు మానసిక ఆరోగ్య చికిత్సలు , సేవలు అందేలా చూడాలి. 3.అక్రమ రవాణా బాధితులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణలు అందించాలి. 4.అక్రమ రవాణా బాధితులు సమాజంలో వివక్షత,చిన్న చూపు,పునరావాసం బాధ్యతలు గ్రామపంచాయతీ నుండి జిల్లా స్థాయి అధికారులు బాధ్యత వహించాలి,అందులో విఫలం అయితే ఆ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి . 5. 100% ట్రాఫికర్స్ కు కఠిన శిక్షలు పడే విధంగా చూడాలి. 6. ఈ కేసులు విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి మా వినతి తో కూడిన డిమాండ్స్: 1. అన్ని రకాల అక్రమ రవాణాను నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం లేదా బిల్లు తీసుకొని రావాలి. 2. అన్ని రకాల అక్రమ రవాణాలను బిల్లులో లేదా కొత్త చట్టంలో చేర్చాలి. 3. అక్రమ రవాణ కేసుల దర్యాప్తులో అంతర్రాష్ట్ర సమన్వయం ఉండాలి. 4. రెస్క్యూ చేసిన తరువాత బాధితులను బలవంతంగా షెల్టర్ హోమ్ లకు పంపించ కూడదు. 5. కమ్యూనిటీ పునరావాసం మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించి బిల్లులో నిబంధనలు ఉండాలి. షెల్టర్ హోమ్ లో కౌన్సిలింగ్ ఉపయోగపడదు 6.15 రోజుల్లోనే మద్యంతర నష్టపరిహారం ఇవ్వాలి, బాధితులకు పూర్తి మరియు తక్షణ బాధితుల నష్ట పరిహారం అందించాలి. 7. అక్రమ రవాణా దారులకు ఒక సంవత్సరంలోపు వెంటనే శిక్ష పడాలి. 8. అక్రమ రవాణా దారులకు మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించాలి. 9. మైనర్ తో లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రతి వారికి కఠినంగా శిక్షలు పడే విధంగా చూడాలి. 10. కోర్టులు (వేగవంతమైన విచారణ ద్వారా తీర్పు త్వరగా ఉండాలి మరియు అక్రమ రవాణా కేసుల్లో అప్పీలు చేయకూడదు). 11. బాధితులకు వ్యక్తిగతమైన, చట్టపరమైన ప్రాతినిధ్యం ఉండాలి. 12. అన్ని ఐ పి సి 370, 372, 373 లను అమలు చేయడానికి నిబంధన ఉండాలి నిబంధనలు అమలు చేయాలి. 13. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా ( వేధింపులు) జరిగితే ఆయా అధికారులకు శిక్ష విధించాలి. 14. ప్రత్యేక పునరావాస నిధి ఉండాలి. 15. బాధిత మహిళల పిల్లలకు సంస్థాగత /జిల్లా స్థాయి లో విద్యా సౌకర్యం కల్పించాలి. 16. శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కల్పించాలి. 17. రెస్క్యూ చేయబడిన బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఉపాధి విషయంలో సహాయం అందించాలి. 18. ఎం ఎం ఆర్ ఈ జి ఏ (MNREGA) కింద 200 రోజుల పని ఉండాలి.వేతనాలు సమయానికి అందించాలి. 19.బాధితులకు ప్రభుత్వ పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందించాలి. 20.ప్రభుత్వం షెడ్యూల్ చేసిన తేదీ మరియు సమయానికి సమాధానం ఇవ్వాలి. ఆర్టీఐ స్పందన , జవాబుదారీతనం కట్టుబడి ఉండాలి. 21. బాధితులకు పారిశుద్ధ్య హక్కు, విద్యా , సామాజిక హక్కులతో సహా వలస సేవలు అందించాలి. 2020 సంవత్సరం మానవత్వ చరిత్రలో సెక్స్ వర్కర్లకు ఒక చెత్త సంవత్సరంగా ఉండనియ్యండి . కానీ రానున్న 2021 సంవత్సరాన్ని అయినా “మానవత్వ హక్కుల సంవత్సరంగా ” చేద్దాం. విముక్తి సభ్యులుగా ….మేము మన సమాజానికి మరియు మన దేశానికి ప్రతిజ్ఞ చేస్తున్నాము ……”మానవత్వం కోసం చేసే పోరాటంలో , సెక్స్ వర్కర్లుగా మేము అన్ని చెడు, స్వార్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అందరితో కలిసి పనిచేస్తాము”..

Featured

తప్పు ఎవరిది అధికారులదా కాంట్రాక్టర్ దా

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం: సోమశిల గ్రామంలోని మామిడి చెట్ల హిల్ కాలనీలో వేస్తున్న సిమెంట్ రోడ్డును ఆపివేసిన అధికారి గత 30 సంవత్సరాల ముందు వేసిన రోడ్డు రాళ్లు బయటపడి గుంటలు గుంటలుగా ఉండడంతో రోడ్డు వేస్తామని జె సి బి తో ఉన్న రోడ్డును ధ్వంసం చేసి మరమ్మతులు చేపట్టారు. తీర రోడ్డు పనులు ప్రారంభించగానే రోడ్డు పనులు ఆఫ్ చేయండి అంటూ అధికారులు చెప్పడంతో అక్కడ నివసించే జనాలు అవాక్కయ్యారు. ఇంతకాలానికి మా కాలనీలో సిమెంట్ రోడ్లు వేస్తున్నారని సంతోషపడే లోపే ఉన్న రోడ్లను నాశనం చేసి కొత్త రోడ్డును వేయకుండా ఆపి వేయడం వెనుక మర్మం అధికారులకే తెలియాలని,ఇక్కడ వేసిన రోడ్డు ఏ దొంగలు ఎత్తుకెళ్లారో ఆ అధికారులే చెప్పాలి.ఇక మా నడక ముళ్ళబాటేనా అయ్యా నాయకులారా మా మీద దయ ఉంచి కొత్త రోడ్లు వ్వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముసలి ముతకా పిల్ల జల్లా నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులు మరియు నాయకులు ఈ రోడ్డు పనులు మరమ్మతులు చేయవలసిందిగా మామిడి చెట్ల కాలా నీ ప్రజలు కోరుకుంటున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

జపాన్‌ ‌జీవనశైలికి జై కొట్టాల్సిందే!

జపాన్‌ ‌జీవనశైలికి జై కొట్టాల్సిందే! ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన 116 సంవత్స రాల వ్యక్తి మరణించాడు. ఆయన జపాన్‌ ‌పౌరుడు. ఆయన తన తొంభై సంవత్సరాల వయసు వరకు పని చేస్తూనే ఉన్నాడు. ఆయనే కాదు, జపాన్‌ ‌పౌరులు ఎక్కువ కాలం జీవించడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక ఇక్కడి మహి ళలయితే గత పాతిక సంవత్స రాలుగా ఇతర దేశాల మహిళల కంటే అదనపు సగటు జీవిత కాలంతో జీవితాన్ని ఎంజాయ్‌ ‌చేస్తు న్నారు. 2010లో వీరి సగటు జీవిత కాలం 86.3 సంవత్సరా లుగా ఉంది. 2011లో ఒక్కసారి మాత్రమే 85.9కి తగ్గి హాంకాంగ్‌ ‌కి మొదటి స్థానం ఇచ్చి రెండో స్థానానికి వెళ్లారు ఈ మహిళలు. ఇందుకు కారణం 2011 మార్చిలో వచ్చిన ‌తుఫాన్‌ ఇక ఇక్కడి మగవారి సగటు జీవిత కాలం 79.4 సంవత్సరాలు. ఇది మహి ళల కంటే తక్కువే అయినా ఇతర దేశాల మగవారితో పోలిస్తే ఇది ఎక్కువే. ప్రస్తుతం జపాన్‌ ‌జీవన కాలం విషయంలో 84.46 సగ టుతో ప్రపంచంలో మూడో స్థా నంలో ఉంది. దాని ముందు మొనాకో, మకావ్‌ ఉన్నాయి. ఈ విషయంలో 67.80 సగటు జీవిత కాలంతో ప్రపంచదేశాల్లో 163వ స్థానంలో ఉన్న మనం, జపాన్‌ ‌పని రాక్షసులు అంత ఎక్కువకాలం ఎలా జీవిస్తున్నారో తెలుసుకుని తీరా ల్సిందే…. వీరు తమదైన సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. చేపలు, వరి అన్నం, ఉడికించిన కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. వైద్య సదు పాయం తేలిగ్గా అందుబాటులో ఉం టుంది. ఇవన్నీ కాకుండా వృద్ధుల పట్ల ఇక్కడ శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిసి వారి జీవితకాలాన్ని పెంచు తున్నాయి. ముఖ్యంగా తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. సోయాబీన్స్‌తో తయారయిన తోఫు అనే కొలెస్ట్రాల్‌ ‌లేని పెరుగుని వాడతారు. ఇందులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వేల సంవత్సరాలుగా చైనావారు ఔషధాల్లో వాడుతున్న షీటేక్‌ ‌పుట్ట గొడుగులను జపాన్‌ ‌వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగానూ, కొవ్వు తక్కువగానూ ఉంటుంది. ఉప్పు ఎక్కువ వాడాల్సిన వంట కాలు, చేపల వేపుడు, నిలవ పచ్చళ్లు, సోయాసాస్‌ ‌లాంటివాటిని బాగానే తీసు కుంటారు. అక్కడి మగవారు స్మోకింగ్‌ ‌కూడా ఎక్కువే చేస్తారు. ప్రతి ముగ్గురిలో ఒకరు పొగతాగుతారు. ఆల్కహాల్‌ ‌సంబం ధింత పానీయాలు సైతం ఎక్కువే తీసు కుంటారు. అయితే వారిలో ఒబేసిటీ సమస్య అనేది కనిపించదు. 80శాతం పొట్టనిండగానే తినడం ఆపేయమనే ఒక జపనీస్‌ ఆరోగ్య సూక్తిని వారు బాగా పాటిస్తారు. రెండేళ్ల క్రితం టోక్యో ప్రొఫెసర్‌ ఒకరు జపాన్‌ ‌ప్రజల జీవితకాలం ‌పై అధ్యయనం చేశారు. ఆయన వెల్లడించిన విషయాల్లో ముఖ్యమైనది జపాన్‌ ‌ప్రజలు శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మనస్తత్వం వారి జీవితాల్లోని అన్ని కోణాల పై మంచి ప్రభావాన్ని చూపు తోంది. విద్య, సంస్కృతి, పర్యావరణ పరి రక్షణ, కాలుష్యనివారణ వీటన్నింటిపై శుభ్రత పట్ల వారికున్న శ్రద్ధ ప్రభావం చూపుతోందని ఆయన అధ్యయనంలో తేలింది. అక్కడ షింటో అనే సంప్ర దాయం ఉంది. దీని ప్రకారం ఇతరులను కలిసే ముందు శరీరం, మనసు శుచిగా ఉండాలని జపాన్‌వారు నమ్ముతారు. వీరిలో ఆరోగ్య స్పృహ ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఆరోగ్య పరీక్షలు నిరంతరం జరుగుతుంటాయి. పాఠశాల ల్లోనూ, పనిప్రదేశాల్లోనూ ఇలాంటి సదు పాయాలు ఉంటాయి.ఇవి కాకుండా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు సైతం ఈ సౌకర్యాలు కల్పిస్తాయి. ఇక్కడి ప్రభుత్వాలు ఆర్థిక పెరుగుదలతో పాటు ప్రజల ఆహార ప్రమాణాన్ని పెంచడంలో చర్యలు తీసుకుంటాయి. ఇవన్నీ కాకుండా జపాన్‌కి తైవాన్‌కి మధ్య ఉన్న ద్వీప ప్రాంతాల్లో నివసిస్తున్న వారు మరింతఎక్కువ కాలం జీవిస్తున్న ట్టుగా పరిశోధకులు తేల్చారు. వీరిలో గుండె జబ్బులు, క్యాన్సర్‌లు తక్కువ ఉన్నాయి. వీరిలో తరతరాలుగా వస్తున్న జన్యు లక్షణాలు పలురకాల వ్యాధులను రాకుండా నివారిస్తున్నట్టుగా పరిశోధ కులు కనుగొన్నారు. మొత్తానికి చురుకైన జీవన శైలి, ఆరోగ్యకరమైన తాజా ఆహారం, పరిశుభ్రత, కడుపునిండా తినకపోవడం ఇవే జపాన్‌ ‌ప్రజల ఆరోగ్యరహస్యాలుగా తెలుస్తోంది.

Featured తెలంగాణ బిజినెస్

మన ఉద్యోగం ప్రమాదంలో పడింది అని చెప్పడానికి 10 సంకేతాలు

మన ఉద్యోగం ప్రమాదంలో పడింది అని చెప్పడానికి 10 సంకేతాలు (పున్నమి ప్రతినిధి) : ఛా ఛా ఛా! ఎలా అయిపోయింది నా జీవితం!!? ఒక్క సంవత్సరంలో! ఎలాంటి ఆర్టికల్‌ ‌రాయాలని మొదలు పెట్టినా, ‘‘అసలే ఈ కరోనా కష్టకాలంలో’’ అని మొదలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఆర్టికల్‌ ‌కూడా! ‘‘అసలే ఈ కరోనా కష్టకాలంలో’’ ఎన్నో ఇండస్ట్రీలు, పారిశ్రామిక రంగాలు, ఐటీ నుంచి, తయారీ రంగం, నిర్మాణ రంగం మొదలైన వాటిలో పని మందగించి, లాభాలు తగ్గి, ఉద్యోగాల కోత ప్రారంభం అయింది. దీనికి ఎవరూ అతీతం కాదు! అయితే, వేటు మన మీద పడక ముందే, ఆ సంకేతాలు ఆ ‘కళలు’ మా తెలంగాణా భాషలో చెప్పాలి అంటే, ఆ ‘శకలు’ ఎలా ఉంటాయో ఈ వారం ఆర్టికల్‌లో చూద్దాం. వేటు పడక ముందే, మనం పెట్టే బేడా సర్ధుకుని మరో అవకాశం కోసం ప్రయత్నించడం కోసం. కంపెనీ శకలు / పోయే కాలం వచ్చిన కళలు : (1) సడన్‌గా బాసుల కఠినమైన భాష ఇంక్రిమెంటులు ఉం డవు. రివ్యూలు కర్కశంగా ఉంటాయి. బెదిరింపుల భాష ! ‘మరొక్క సారి ఇలాంటి తప్పు చేశావో’ భాష ! వారి పై అధికారులు వాడమన్న భాష. (2) మెర్జర్‌ : ‌మీ కంపెనీని ఇంకొక కంపెనీ కొనుక్కోవడం. ఇలా అయితే, కనీసం 40 శాతం మంది ఉద్యోగాలు పోతాయి. కానీ, మీ కంపెనీ, మరొక కంపెనీని కొనేస్తే, మీరు సేఫ్‌! ‌మీకు ఏమీ కాదు! (3) హఠాత్తుగా మానవ వనరుల శాఖ (హెచ్చార్‌)‌లో కొత్త వారిని, మరీ సీనియర్‌ ‌పొజిషన్‌లో (అనగా, జనరల్‌ ‌మేనేజర్‌, ‌వైస్‌ ‌ప్రెసిడెంటు) తీసుకోవడం. కంపెనీ నష్టాలలో ఉన్నా! (4) హెచ్చార్‌లో కొత్త ముఖాలు కనబడితే, మన ఉద్యోగానికి గండమే ! మేకను నరకాలంటేనే కదా, కసాయి వారిని పిలుస్తారు? (5) హెచ్చార్‌లో ఎక్కువ జూనియర్‌లని తీసుకుంటే, కంపెనీ ఎక్కువ మంది కొత్త వారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అని అర్ధం. మొదటి రౌండు ఇంటర్‌వ్యూలు, స్క్రీనింగ్‌ ‌కోసం వీరిని తీసుకుంటారు. (6) కానీ, కంపెనీ సంక్షోభంలో ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన హెచ్చార్‌లని నియమించుకుంటే, అది నిలువునా నరకడానికే అని భావము. కత్తి మన మెడ మీద పడక ముందే మనం బయటి దిక్కు చూడడం మంచిది. (7) కంపెనీలు కొత్త వారిని తీసుకోవడం (ఏ పొజిషన్‌లో నయినా) పూర్తిగా బంద్‌ ‌పెట్టినప్పుడు. ఒక 2 సంవత్సరాలు ఒక్క కొత్త పురుగు కూడా కంపెనీలోకి రాలేదు ( బయటికి పొయ్యే వారు పోతున్నారు కానీ!), అంటే, మనకి గండం ఉంది అనే! (8) ఎప్పుడూ లిబరల్‌గా ఉండే కంపెనీ వారు, ఖర్చుల మీద నియంత్రణ పాటించాలి అని సర్‌క్యులర్‌లు పంపినప్పుడు ! పెన్ను లు, జిరాక్సులు, పేపర్‌లు. కంపెనీ పొదుపు మంత్రాలు పఠించినప్పుడు. ప్రయాణించే సేల్స్ ‌వారికి సెకండ్‌ ఏసీ కోసేసి స్లీపర్‌లో వెళ్ళాలి అనడం, తక్కువ బడ్జెట్‌ ‌హోటల్‌లో ఉండమని చెప్పడం. (9) ఆర్ధిక పరమైన సంకేతాలు : జీతాలు రావడం ఆలస్యం కావడం. బిజినెస్‌ ‌ట్రావెల్‌ ‌చేసిన వారి డబ్బులు రిఇంబర్స్ ‌కావడంలో ఆలస్యం. మీ కంపెనీకి సరుకు అమ్మిన వారికి చెల్లింపులు లేట్‌ ‌కావడం వగైరా.. (10) ‘‘కొంతమందిని తీసేస్తారట!’’ అంటు రూమర్‌లు వ్యాపింప జేయడం. వాటిని కంపెనీ ఖండించక పోవడం. మౌనం పాటించడం. ఏదైనా ఒక్క సంకేతం ఉంటే భయపడే అవసరం లేదు కానీ, 3 లేక 4 సంకేతాలు కలిపి ఒక మూడు నెలల పాటు కనిపిస్తే, ప్రమాద సంకేతాలు అని అర్ధం. మరో ఉద్యోగం కోసం బయటి చూపులు చూడడం బెటర్‌, ‌మన ప్రస్తుత ఉద్యోగం సిన్సియర్‌గా చేస్తూనే ! జీతానికి న్యాయం చెయ్యాలి కదా?

Featured ఆంధ్రప్రదేశ్

అనంతసాగరం మండలం: *లింగంగుంట* గ్రామంలో *డాllవై.ఎస్.ఆర్ పొలంబడి* కార్యక్రమాన్ని *అగ్రికల్చర్ అసిస్టెంట్ వడ్లపల్లి నాగేంద్ర* ఏర్పాటు చేయడం జరిగింది. పరిసరాల విశ్లేషణలో భాగంగా గింజ గట్టిపడే దశలో కేళీలు ఉన్నాయేమో గమనించి వాటిని పెరికించి వేయాలని, *వెన్ను దశలో తాలు గింజలు ఎన్ని వున్నాయో లెక్కించి దిగుబడి అంచనా ఎలా వేయాలో తెలియజేయడం జరిగింది.* రైతులు పండించే పంటలపై వారికి అవగాహనా కల్పిస్తూ, వారికీ తెలియని విషయాలు తెలియజేస్తూ, *పొలంబడి రైతులకు క్విజ్ పోటీలను* పెట్టి రైతులకు మరింత జ్ఞానాన్ని పెంపొందించడం జరిగింది. ఈకార్యక్రమంలో.. పొలంబడి రైతులు మరియు *హరీష్ ,హాసేన్ సౌజన్య, ప్రసన్న వెంకటేష్ వాలెంటీర్స్* పాల్గొనడం జరిగింది.

Featured ఆంధ్రప్రదేశ్ పిల్లలకు

పిల్లలకు ఏం చెబుతున్నాం? ఏం చెప్పాలి?

(పున్నమి ప్రతినిధి) : సీనియర్లు ర్యాంగింగ్‌ ‌చేశారని, అవమానించారని, ప్రిన్సిపాల్‌, ‌వార్డెన్లు, తల్లిదండ్రులు తిట్టారని, పరీక్ష పాస్‌ ‌కాలేదని, ప్రేమలో గెలవలేదని, పాఠాలు అర్థం కావడం లేదని, నచ్చిన చదువు చదవలేకపోతున్నామని?.ఇంకా ఎన్నో కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతీ యువకులను చూసినపుడు?అరె అలా చేయ కుండా ఉండాల్సింది.. ఇంత విశాలమైన ప్రపంచంలో వారికి జీవితం పట్ల పిడికెడు నమ్మకాన్ని ఇచ్చే వారే దొరకలేదా?గుప్పెడు ధైర్యాన్ని అందించేవారే కరువ య్యారా అనే బాధ కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అనే ఆవేదన కలుగుతుంది. ఏదిఏమైనా ఇప్పటి తల్లిదండ్రుల ఒక పెద్ద బాధ్యత ఉంది?తమ పిల్లలు ఇత రుల మనసులను గాయ పరచ కుండా, తాము గాయపడ కుండా ఉండేలా వారికి తర్ఫీదు ఇవ్వాల్సి ఉంది? మరి అది సాధ్య మేనా?? నిజానికి ఒక పాతిక ముప్పయి ఏళ్ల క్రితం ఉన్నంత తీవ్రంగా జీవన కష్టాలు, పేదరికం బాధలు ఇప్పుడు లేవు. నాటి యువతరం అనేక కష్ట నష్టాలను భరించి ఇప్పడు ఆర్థికంగా నిలదొక్కుకున్న మధ్య తరగతి కేటగి రీగా ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్నారు. వీరి పిల్లలే నేటి యువతరంగా ఘనమైన విజయాలు సాధించి చూపుతున్నారు. ఊహిం చని అవకాశాలను అందిపుచ్చుకుం టున్నారు. రెండుపదుల వయసు దాటితే చాలు కెరీర్‌ అం‌టూ పరుగులు పెడుతున్నారు. పాతికేళ్లు వచ్చేసరికే తామెంటో నిరూ పిస్తున్నారు?ఇదంతా నాణేనికి ఒక వైపు. వీరిలోంచే అతి చిన్న కారణా లతోనే ప్రాణాలు తీసుకునే వారూ తయారవుతున్నారు. వీరిలోనే లక్షలు ఖర్చుపెట్టి చది వినా, అది జీవితానికి పనికొస్తుందో లేదో తెలియక సతమతమవుతున్న వారు ఉంటున్నారు, ఏ చిన్న అవమానం ఎదురైనా, ఏ విమర్శ వచ్చినా భయకంపితులై జీవితం నుండి పారిపోయే వారు ఉంటున్నారు. ఇంటికి ఒక్కరుగా లేదా ఇద్దరు పిల్లల్లో ఒకరుగా పుట్టి అల్లారుముద్దుగా పెరిగిన నేటి యువతరానికి, ఇంతకుముందు తరాలకంటే బతుకు భయం, ఒత్తిడి ఎక్కువ ఉంటున్నాయి. ఎలాగొలా బతకొచ్చులే అనే ధీమా వారిలో ఉండడం లేదు. ఇంటికి ఒక్క కొడుకు ఉంటాడు?ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఆ తల్లిదండ్రుల కలల్ని నిజం చేసి తీరాల్సిందే. మరొక ఆప్షన్‌ ‌లేదు. అలాగే ఇంటికి ఒక్క కూతురు ఉంటుంది. ఎలాగైనా ఆమె ఒక కోటీశ్వరుడి ఇంటికి కోడలిగా వెళ్లాల్సిందే. పిల్లలకు ఏ చిన్న లోటూ రాకుండా పెంచడమే ఇప్పటి తల్లిదండ్రుల ఏకైక ధ్యేయం. జీవితంలో లోటు?.జీవితంలో అన్నీ ఉండటం?రెండింటిలో ఏది సహజంగా కనబడుతోంది. మొదటిదే కదా?కానీ మనం ఆ సహజత్వాన్ని వదిలేసి, అత్యంత అసహజమైన రెండవదాని వెంటే పడుతున్నాం. నిజానికి ఇప్పటి పిల్లలకు మనం ఒక అబద్దపు ప్రపంచాన్ని చూపిస్తున్నాం. చిన్నతనం నుండీ మనం పెంచే విధానం అలాగే ఉంటున్నది. పిల్లలు అడిగినవన్నీ వారి చేతికి అందుతాయి. అందరూ వారిని ప్రేమిస్తారు, అందరూ అభిమానిస్తారు, జీవితం అంటే ఆనందాల పూల బాట అనే భ్రమ కల్పిస్తున్నాం. దాంతో వారు ఆత్మవిశ్వాసంతోనే పెరుగుతున్నారు. అయితే అది నిజమైన ఆత్మవిశ్వాసమా, కాదా అనేది వారికంటూ వ్యక్తిగతంగా సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయినప్పుడే తెలుస్తుంది. నిజానికి ఆత్మవిశ్వాసమంటే, పదిమందిలో ధైర్యంగా మాట్లాడడం, ముందుకు వెళ్లడం, గెలవడం?ఇవే అన్నట్టుగా మనం చెబుతున్నాం. కానీ అన్నీ ఉన్నపుడు, అంతా బాగున్నపుడు నాకన్నీ ఉన్నాయి? అనే ధీమాతో ఉండటం, ఆవిధంగా ధైర్యంగా బతకడం మాత్రమే ఆత్మవిశ్వాసం కాదు? ఏవి లేక పోయినా ధీమాగా ఉండగలను అనే ధైర్యమే ఆత్మవిశ్వాసం. పదిమంది పొగిడినపుడు కాలర్‌ ఎగరేయడం కాదు, పదిమంది విమర్శించినపుడు, తన పక్కన ఒక్కరు కూడా నిలబడనపుడు కూడా ధైర్యంగా ఉండడమే ఆత్మ విశ్వాసం అని ఇప్పటి పిల్లలకు తల్లిదండ్రులు చెప్పడం లేదు. ఎందుకంటే తమ పిల్లలకు జీవితంలో అన్నీ ఇచ్చేయాలనే తపన తప్ప, వారికి లేమి, అవమానం, విమర్శలు, సమాజంలోని కుటిలత్వం ఇవన్నీ సహజమని, వాటితో పాటు మనం బతకాలని నేటి అమ్మానాన్నలు పిల్లలకు చెప్పాలనుకోవడం లేదు. ఒక పాతిక ముప్పయ్యేళ్ల క్రితం?పిల్లలు తమని ఏ పిన్నో, బాబాయో, అత్తో, మామో తిట్టారని తల్లిదండ్రులకు చెబితే?.ఫరవాలేదు, పెద్దవాళ్లు ఒక మాట అంటే నష్టమేం లేదు? అయినా నువ్వేం చేయకుండానే అత్త ఆ మాట అనదు కదా?నువ్వేం చేశావు?చెప్పు? అని అడిగే పరిస్థితి ఉండేది. నలుగురు ఉన్నపుడు, నలుగురిలోకి వెళ్లినపుడు నాలుగుమాటలు వినడం, పడటం, లేదా వాటిని ఎలా ఎదిరించాలో, లేదా ఎలా సహనం పాటించాలో?. ఇవన్నీ పిల్లలకు అర్థమవుతుండేవి. ఇవన్నీ జీవితంలోని భిన్న పార్శ్వాలు. అదే ఇప్పటి పిల్లలు నన్ను ఫలనా టీచరు, లేదా ఫలానా బంధువర్గంలోని వ్యక్తి ఇలా అన్నాడు?.అనగానే?ఇంకేవి ‌ప్రశ్నించకుండానే?ఒక్కగానొక్క నా కూతురిని, నాకొడుకుని నేనే అంతమాట అనను? వాడంటాడా?అంటూ కాలు దూసే తల్లిదండ్రులే ఎక్కువ ఉంటున్నారు. అసలు ఇంతకుముందులా మేనమామలకు. పెద్దనాన్నలకు తాతలకు భయపడే పిల్లలు ఇప్పుడున్నారా?. ఇంట్లో భయం అనేది ఎలా ఉంటుందో, అవమానం ఎలా ఉంటుందో తెలియని పిల్లలకు ఒక్కసారిగా బయటి ప్రపంచంలో ఒడిదుడుకులు, అనుకోని విమర్శలు ఎదురయినపుడు, అప్పటివరకు ప్రేమని మాత్రమే చూసి ఉండటం వలన, ఒక్కసారిగా వారికి వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. మరో పక్క తమకు ఎంత ఇచ్చారో అంతా తమనుండి చదువు, ఉద్యోగాల రూపంలో డిమాండ్‌ ‌చేసే తల్లిదండ్రులకు చెప్పాలంటే అపరాధ భావన వెంటాడుతుంది. దాంతోవారు పూర్తిగా నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. అసలు వారికి మనం గాయపడకుండా ఉండటం ఎలాగో నేర్పడం లేదు?పోనీ ఏ గాయాలూ లేని సమాజాన్ని ఇచ్చామా?అదీ ఇవ్వలేదు. మన చేతులారా మనమే వారి మనసులను గాజుబొమ్మలుగా మార్చి, రాళ్లు కురిసే ప్రపంచంలోకి వెళ్లి ఆనందంగా ధైర్యంగా బతికేయ్‌ అని చెప్పినట్టుగా ఉంటోంది పరిస్థితి. ‌ప్రపంచాన్ని మార్చే శక్తి మనకు లేనపుడు, మన పిల్లలకు బయట ప్రపంచాన్ని యధాతథంగా పరిచయమన్నా చేయాలి. వారికి సమస్తం ఇచ్చేసి, పువ్వులా సున్నితంగా చూసుకోవడమే ప్రేమనుకుంటే అంతకంటే పెద్ద పొరబాటు మరొకటి ఉండదు. ఏవి లేని ప్రపంచంలో కూడా ఆనందంగా ధైర్యంగా బతకడమెలాగో నేర్పడమే నిజమైన బాధ్యత అవుతుంది. ఎప్పుడూ మనం డిగ్రీలు, జ్ఞానం, స్నేహితులు, పేరు ప్రఖ్యాతులు, ధనం, గౌరవం ఇలాంటివన్నీ సంపాదించుకోమనే పిల్లలకు చెబుతుంటాం. అలా ఉండడమే గొప్పతనమని నూరిపోస్తుంటాం. మన దృష్టిలో అలా ఉండడం మాత్రమే ప్రపంచం. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగకపోవచ్చు కూడా?అందుకు కూడా సిద్ధపడి ఉండాలి? అనే కనీస జ్ఞానమే అన్నింటికంటే గొప్ప జ్ఞానమని పిల్లలకు చెప్పాలి. ‌కానీ ఈ ఒత్తిళ్ల ప్రపంచంలో పిల్లలు ఒదగలేకపోవచ్చు?అప్పుడు వారేం చేయాలి? ఈ ప్రశ్న పిల్లలకు వేయవద్దు. అమ్మానాన్నలు తమకు తాము వేసుకోవాలి. పిల్లలు తాము పుట్టి పెరిగిన పొదరిల్లు దాటి భవిష్యత్తులో బతకబోయేది మన కలల ప్రపంచంలో కాదని, అత్యంత కృతకంగా, అస్తవ్యస్తంగా ఉన్న ప్రపంచంలోనని మనం గుర్తుంచుకోవాలి. పిల్లలు మనకు అందమైన పువ్వులే?కానీ వారు మానసికంగా సుశిక్షితులైన సైనికులుగా పెరిగితేనే వారు ఇతరుల మాటలకు గాయపడకుండా ఉంటారు?అలాగే ఇతరులను గాయపరచకుండా, తమనితాము గాయపరచుకోకుండానూ ఉంటారు. ఏమంటారు?..

Featured ఆంధ్రప్రదేశ్

క్యూబా కాలేజీలో జాబ్ మేళా – – – 60 మంది ఎంపిక

క్యూబా కాలేజీలో జాబ్ మేళా – – – 60 మంది ఎంపిక వెంకటాచలం, మార్చి 18 (పున్నమి విలేఖరి): వెంకటాచలంలోని క్యూబా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఉద్యోగ మేళా నిర్వహించినట్లు ఆ కళాశాల అకాడమీక్ డైరెక్టర్ డాక్టర్ హయ్యత్ రజ్వి తెలిపారు. తడ శ్రీ సిటీ ఆధ్వర్యంలో, క్యూబా ఇంజనీరింగ్ కళాశాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తడలోని శ్రీసిటీకి చెందిన 3 కంపెనీలు ఉద్యోగ మేళాకు హాజరయ్యాయని, ఉద్యోగ మేళాకు 226 మంది అభ్యర్థులు విచ్చేశారన్నారు. ఇందులో 60 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఉద్యోగ మేళాలో ఎంపికైన అభ్యర్థులందరూ వారు ఎంపికైన కంపెనీల్లో రేపటి నుంచే విధులకు హాజరు కావచ్చు అని అన్నారు. కార్యక్రమంలో తడ శ్రీ సిటీ హెచ్ఆర్ షేక్ హిమాయత్ బాషా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాజిద్, కళాశాల ప్లేస్మెంట్ అధికారి పి.బాబు, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మానసిక బలవంతులు ఇలా వుంటారు….

మానసిక బలవంతులు ఇలా వుంటారు…. (పున్నమి ప్రత్యేకం) శారీరక సౌందర్యం కంటే మానసిక అందం ఎంత ముఖ్యమో, శారీరక బలం కంటే మానసికంగా స్ట్రాంగ్‌ ఉం‌డటం అంతే అవసరం. అసలు మానసిక బలం అంటే ఏమిటి, అది ఉన్నవారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు సైకో థెరపిస్ట్ ‌మోరిన్‌. ఆమె, థర్టీన్‌ ‌థింగ్స్ ‌మెంటలీ స్ట్రాంగ్‌ ‌పీపుల్‌ ‌డోంట్‌ ‌డూ అనే పుస్తకాన్ని రాశారు. మనం మానసికంగా ఎంత బల వంతులం అనే విషయాన్ని వార సత్వంగా వచ్చిన మన శరీరంలోని జన్యువులు, మన వ్యక్తిత్వ లక్షణాలు, మనం ఎదుర్కొన్న అనుభవాలు నిర్ణయిస్తాయని చెబుతున్నారామె. మానసిక బలవంతులు ఏఏ పనులు చేయరు. అనే అంశాలను పుస్త కంగా రాసిన ఆమె, మరి వారు ఏ పనులు చేస్తారు. అనే అంశం గురిం చి వివరణ ఇచ్చారు. ఆ విశేషాలు ఇవి- మానసిక బలవంతులకు భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి, వారు తమ ఎమోషన్స్‌ని అణ చేసు కుంటారని చాలామంది అను కుంటారు. కానీ అది నిజం కాదు. వారు తమలోని ఎమోషన్స్‌ని బాగా గమనిస్తారు. రోజంతా వాటిపై నిఘా ఉంచుతారు. తమ ఫీలింగ్స్ ‌తమ ఆలోచనలను, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలి స్తుంటారు. ఆ పరిశీలన వల్లనే వారు తమ భావోద్వేగాలతో కాకుండా ఆలో చనలతో పనిచేస్తుంటారు. ఒక ఫీలింగ్‌ ‌కారణంగా నష్టం కలుగుతుందనుకుంటే వారు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు కూడా. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఎవరూ ఉండలేరు. అలా ఉంటే అది నెగటివ్‌ ఆలోచనల్లోకి దారితీస్తుంది. అది మానసిక బలవంతులకు తెలుసు. అలాగే తమ ఆలోచనలన్నీకరెక్ట్ ‌కాదన్న సంగతిని వారు అర్థం చేసుకుంటారు. మైండ్‌ ‌నెగెటివ్‌ ఆలోచనల్లోకి వెళ్లి పోతున్నప్పుడు, వాటిని ఆపి వాస్తవం ఏమిటనే పునరాలోచన చేయగలుగు తారు. మానసిక బలవంతులు అను త్పాదక పనులు ఎప్పుడూ చేయరు. అంటే ఎవరికీ ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వని కాలక్షేపం పనులు. ఈ రోజు చాలా చెత్తగా నడిచింది. అనుకున్న సమయాల్లో, ఆ రోజుని అలా మార్చిం ది ఎవరు, ఏమిటి అనేది పరిశీలించుకుని, ఆ పద్ధతి మార్చుకుంటే కలిగే రిస్క్‌ని లెక్క వేసుకుంటూ ముందుకు నడుస్తారు. -మానసిక బలవంతులు తప్పులు చేస్తే అప రాధ భావం, పశ్చాత్తాపాలతో కుమిలిపోరు. దాన్నుండి పాఠం నేర్చుకుని తమని తాము క్షమించుకుంటారు. ముఖ్యంగా మానసి కంగా బలంగా ఉన్నవారు తమపట్ల తాము చాలా దయగా ఉంటారు. వీరు ఆత్మ విమర్శ చేసుకుంటారు కానీ, పనిగట్టుకుని విమర్శిస్తూ, కుంగదీసే మనసుని పట్టిం చుకోరు. తమ మాటలు, చేతలకు తామే పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఇతరులు తమని నడిపించాలని, నియంత్రించాలని ఆశించరు. మంచయినా, చెడయినా తమ పనులకు తామే బాధ్యులమని ఒప్పు కుంటారు. మానసిక బలవంతులకు కాలం విలువ తెలుసు. అందుకే వారు సమయాన్ని వృథా చేయరు. గతాన్ని తవ్వుకుంటూనో, ఇతరుల కోసం కాలం వెచ్చించి, తరువాత వారిని తిట్టుకుంటూనో కాలం గడపరు. ఏదైనా ఉత్పాదకతనిచ్చే పనిని మాత్రమే చేస్తారు. వీరి మెదడులో తమ లక్ష్యం తాలూకూ పూర్తి చిత్రం ఉంటుంది. ఈ రోజు తీసుకున్న నిర్ణయం, దీర్ఘ కాలంలో తమని ప్రభావితం చేస్తుందనే విషయం వీరికి తెలుసు. వారు ప్రతి సవాల్లోనూ ఒక అవకాశాన్ని సృష్టించు కుంటారు. తమకి తిరుగులేదు అనే అహంకారం మానసిక బలవంతులకు ఉండదు. ప్రతిరోజూ ఎదిగేందుకు సిద్ధంగా ఉంటారు. తమ బలహీన తలను గుర్తిస్తారు, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. వీరికి తప్పులకు సాకులు వెతుక్కోవడం కంటే, వాటి గురించి పూర్తిగా తెలుసుకుని, మరొక సారి అలా జరగకుండా జాగ్రత్త పడ టమే ఇష్టం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.