Friday, 6 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నెల్లూరు జిల్లా పోలీసులు:అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) CH.సౌజన్య

నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) SPS నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారతీయ సామాజిక సంస్కర్త, మేధావి, రచయిత శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) CH. సౌజన్య , జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “జ్యోతిరావు పూలే గారు పాశ్చాత్య సమాజ రుగ్మతలను ఎదురించి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. బాలికల విద్య కోసం పాఠశాలలు స్థాపించి, వితంతువుల రక్షణ కోసం ఆశ్రమాలు నిర్మించారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేకు విద్యను నేర్పి, ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడం ద్వారా మహిళా విద్యకు మార్గం తీర్చారు. ఈయన ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకం,” అని తెలిపారు. జిల్లా పోలీసులు జయంతిని ఘనంగా నిర్వహించి, పూలే గారి సేవలను స్మరించుకున్నారు. వారి ఆశయాల సాధన దిశగా అందరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

Featured ఆంధ్రప్రదేశ్

అక్షర యోధుడికి శతకోటి వందనాలు…**

** విశాఖపట్నం తీరాన్ని తాకే ప్రతి పుటలో ప్రజల గొంతుకగా, వాస్తవాల వికాసానికి వేదికగా నిలిచిన అక్షర యోధుడు **ఓలేసి ప్రసాద్ రావు** గారు — పాత్రికేయ ధర్మాన్ని తన కలంతో నిలబెట్టిన అభినవ అనుభవ వీరుడు. **సీనియర్ పాత్రికేయుడు**, **సూర్య దినపత్రిక ఉత్తరాంధ్ర ప్రతినిధి**గా తన విలక్షణ రచనా శైలితో, సమాజంలోని నిస్సహాయుల ఆక్రందనను అక్షరాలుగా మలిచిన వారు. ముఖ్యంగా ఆదివాసీ సమాజ హక్కుల కోసం ఆవిర్భవించిన **ఆదివాసి జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా** ఆయన పోరాట పటిమ ప్రశంసనీయమైనది. నిరంతర సేవ, నిబద్ధత, మరియు ప్రజల పట్ల ఉన్న బాధ్యతను పదే పదే నిరూపించుకున్న ఈ గొప్ప పాత్రికేయునికి సన్మానం చేయటం మాకు గర్వకారణం. ఆయన కలం తూటాను తలపించి, నిజాన్ని నిర్భయంగా చెబుతుంది. ప్రజల గొంతుకగా నిలిచిన ఈ అభినవ పాత్రికేయునికి మా హృదయపూర్వక వందనాలు. **మీ కలం మాకు మార్గదర్శకం కావాలి…** **మీ పోరాటం మాకు ప్రేరణ కావాలి…** **మీ రచనలతో సమాజంలో మార్పు కొనసాగాలి…** శతజయంతి వరకు మీ సేవ జారదోర్లని కోరుకుంటూ, **ఈ గౌరవ సన్మానాన్ని అందిస్తున్నాం.**

Featured

అక్షర యోధుడికి శతకోటి వందనాలు…**

** విశాఖపట్నం తీరాన్ని తాకే ప్రతి పుటలో ప్రజల గొంతుకగా, వాస్తవాల వికాసానికి వేదికగా నిలిచిన అక్షర యోధుడు **ఓలేసి ప్రసాద్ రావు** గారు — పాత్రికేయ ధర్మాన్ని తన కలంతో నిలబెట్టిన అభినవ అనుభవ వీరుడు. **సీనియర్ పాత్రికేయుడు**, **సూర్య దినపత్రిక ఉత్తరాంధ్ర ప్రతినిధి**గా తన విలక్షణ రచనా శైలితో, సమాజంలోని నిస్సహాయుల ఆక్రందనను అక్షరాలుగా మలిచిన వారు. ముఖ్యంగా ఆదివాసీ సమాజ హక్కుల కోసం ఆవిర్భవించిన **ఆదివాసి జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులుగా** ఆయన పోరాట పటిమ ప్రశంసనీయమైనది. నిరంతర సేవ, నిబద్ధత, మరియు ప్రజల పట్ల ఉన్న బాధ్యతను పదే పదే నిరూపించుకున్న ఈ గొప్ప పాత్రికేయునికి సన్మానం చేయటం మాకు గర్వకారణం. ఆయన కలం తూటాను తలపించి, నిజాన్ని నిర్భయంగా చెబుతుంది. ప్రజల గొంతుకగా నిలిచిన ఈ అభినవ పాత్రికేయునికి మా హృదయపూర్వక వందనాలు. **మీ కలం మాకు మార్గదర్శకం కావాలి…** **మీ పోరాటం మాకు ప్రేరణ కావాలి…** **మీ రచనలతో సమాజంలో మార్పు కొనసాగాలి…** శతజయంతి వరకు మీ సేవ జారదోర్లని కోరుకుంటూ, **ఈ గౌరవ సన్మానాన్ని అందిస్తున్నాం.**

E-పేపర్ Featured ఆంధ్రప్రదేశ్

ప్రస్తుత రాజకీయాలు కార్యకర్తలు ప్రజలు అర్ధం చేసుకో లేక పోతున్నారా????

ఆయన రాయలసీమకు చెందిన అధికారపార్టీ అయిన ‘టిడిపి’కి చెందిన కీలకమైన మంత్రి. అయితే తమ పార్టీ బద్దశత్రువైన మాజీ మంత్రి ‘ఆర్‌.కె.రోజా’ను ఆయన తన ఇంటికి ఆహ్వానించారని, ఆమెతో రాజకీయ చర్చలే కాకుండా..ఆమెకు సంబంధించిన పనులు కూడా చేసి పెట్టారట. ‘విజయవాడ’లోని సదరు మంత్రి ఇంటికి వైకాపాకు చెందిన మాజీ మంత్రి ‘రోజా’ వెళ్లడం..తరువాత ఆమె పనులు చకచక అవడం..రాజకీయ, అధికారవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’, ఆయన తనయుడు ‘లోకేష్‌’లపై ఒంటికాలితో విరుచుకుపడే..‘రోజా’ను ఆ మంత్రి ఎలా తన ఇంటికి రానిచ్చారనే దానిపై టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. బద్దశత్రువును ఎలా రానిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ‘రోజా’ మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం..‘చంద్రబాబు’ను ‘లోకేష్‌’ను పరుషపదజాలంతో విమర్శలు చేసేది. ముఖ్యంగా ‘లోకేష్‌’ను వాడూ..వీడూ అంటూ నోరుపారేసుకుంది. అసెంబ్లీలో ‘చంద్రబాబు’ గురించి, ఆయన భార్య గురించి, ‘లోకేష్‌’ భార్య గురించి కూడా అసహ్యంగా మాట్లాడేది. దీంతో..ఆమె విమర్శలపై టిడిపి కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే..‘రోజా’ సంగతి చూస్తామని అప్పట్లో వారు..తెగ ఇదయ్యేవారు. కానీ..అధికారంలోకి వచ్చి పది మాసాలు అవుతున్నా..‘రోజా’ను ఇంత వరకు ఏమీ చేయలేకపోయామనే బాధ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఒకవైపు వాళ్లు ఇలా బాధపడుతుంటే మరోవైపు మంత్రులు అయినవారి ఆమెకు ఇంటికి ఆహ్వానాలు పంపుతున్నారట. రాయలసీమకు చెందిన ఈ మంత్రి వ్యవహారశైలిపై ఇప్పటికే పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి ఆయన పట్ల ఎంతో ఔదార్యంతో వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేతను నీచంగా దూషించిన వారిని ఇంటికి ఎలా రానిస్తున్నారని, నైతికంగా, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటివి తగవని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

మజ్జిక పంపిణీ: జెర్రీపోతుల ముత్యాలు.

సత్య సాయిబాబా సమితి ఆధ్వర్యంలో జరిగిన మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన PCC అధికార ప్రతినిధి, AP Telangana State INTUC Vice President జెర్రీపోతుల ముత్యాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్య సాయిబాబా సమితి సభ్యులు నరవ శ్రీను, కొండ బాబు, బాబురావు, కృష్ణ మరియు మహిళలు.

Featured ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు’ను ఆయన కుమారుడు ‘లోకేష్‌’ను పవన్ కళ్యాణ్ అందరూ PRO లకు డబ్బులిచ్చి టిట్లు తిట్టoచుకుంటున్నారా ???

తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్లో పదే పదే తప్పులు చేస్తూనే ఉంటుంది. పార్టీకి నష్టం చేకూరుస్తున్నా..వాటిని సరిదిద్దడానికి ఎవరూ ముందుకు రావడానికి ఇష్టపడరు. ఎందుకో..కొన్ని విషయాలను చాలా చిన్న విషయాలుగా భావించి…వదిలేస్తారు. చివరకి అవే..పార్టీని ఇబ్బందుల పాలుచేస్తుంటాయి.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఉద్యోగుల విషయాల్లో చాలా రగడ జరిగింది. కొన్నిశాఖల్లో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగులను నియమించారని, వారికి భారీగా వేతనాలు ఇచ్చారనే విషయంపై ‘టిడిపి’లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి చివరకు ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌గా ఉన్న ‘జివిరెడ్డి’ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇబ్బడిముబ్బడిగా వైకాపా కార్యకర్తలను, ‘సాక్షి’ ఉద్యోగులను ‘ఫైబర్‌నెట్‌’లో నియమించారని, వారిని తొలగించాలని ‘జీవీరెడ్డి’ డిమాండ్‌ చేయడం..దానికి అప్పటి దాని ఎండి వేగంగా చర్యలు తీసుకోకపోవడంతో..అది పెద్ద ఎత్తున రచ్చ కావడంతో..‘జీవీరెడ్డి’ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే..ఆయన రాజీనామా తరువాత..ఇలా అక్రమంగా నియమించిన కొందరు ఉద్యోగులు..ఇప్పుడు ఈ ప్రభుత్వం తమనేమీ చేయలేదని విర్రవీగుతున్నారు. తమను ఈ ప్రభుత్వం తొలగించలేదని చెబుతూ..‘చంద్రబాబు’ను ఆయన కుమారుడు ‘లోకేష్‌’ను బూతులు తిడుతున్నారు. వారిద్దరూ ఏమీ పీకలేరని, తమను కదిలించలేరని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇలా చేస్తోన్నవారిలో చాలా మంది ‘పిఆర్వోలు’ కూడా ఉన్నారు. గత ‘జగన్‌’ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో కొందరు ‘జగన్‌’ భక్తులను ‘పిఆర్వోలు’గా నియమించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరినెవరినీ తొలగించలేదు. దాంతో..వీరు కొన్ని కీలకమైనశాఖల్లో ఇప్పటికీ ‘పిఆర్వోలు’గా చలామణి అవుతున్నారు. కూటమి నేతల మంచితనాన్ని అలుసుగా తీసుకుని వీరంతా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా కొందరు మంత్రుల వద్ద పనిచేసే ‘పిఆర్వోలు’ అయితే..అలవికావడం లేదు. మంత్రుల వద్దకు వచ్చే సందర్శకుల ముందే ‘జగన్‌’ గొప్పవాడు..మంచివాడు..ధైర్యవంతుడు.. అంటూ ఆయన భుజకీర్తులు తొడుగుతున్నారు. సరే..జగన్‌ను పొగుడుతున్నారని సర్దుకున్నా..వారు అంతటితో ఆగడం లేదు. ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ను ఆయన తనయుడు ‘లోకేష్‌’ను దూషిస్తున్నారు. వేల కొద్ది జీతాలు తీసుకుంటూ వీళ్లు చేస్తున్న పనులు ఇవి. నిత్యం సచివాలయంలో వివిధ విభాగాల్లో ఉన్న వీరు..ప్రతిచోటా రాజకీయ చర్చలు చేస్తూ..వారిద్దరితో పాటు ఉపముఖ్యమంత్రి ‘పవన్‌’ను ఎద్దేవా చేస్తున్నారు. ‘జగన్‌’ హయంలో నియమితులైన వీరిని తొలగించకుండా వాళ్లకు కూటమి ప్రభుత్వం మేలు చేసినా..వీళ్లు తమ బుద్దిమాత్రం మార్చుకోవడం లేదు. దాదాపు లక్షన్నర జీతం తీసుకుంటూ ఓ శాఖలో పిఆర్వోగా ఉన్న ఓ వ్యక్తి నిత్యం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వ మంచితనాన్ని చేతకానితనంగా భావించి వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరిస్తున్నవారిపై ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకపోతే..ప్రభుత్వానికి, పార్టీకి మరిన్ని ఇబ్బందికర పరిస్థితులను వీరు సృష్టిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు పిఆర్వోలుగా వీరు చేస్తోన్న పని ఏమిటో..? వీరు ఏమేమి చేస్తున్నారో..పర్యవేక్షించేవారు లేకపోవడమే దీనంతటికి కారణం. నిత్యం సచివాలయానికి రావడం..అక్కడా ఇక్కడా పెత్తనాలు చేయడం..పైరవీలు చేసుకోవడం…పది మంది ఉన్నచోటకు చేరి..ప్రభుత్వ పెద్దలను దూషించడం.. ‘జగన్‌’కు భుజకీర్తులు తొడగడమే పనిగా వీరు వ్యవహరిస్తున్నారు. వీళ్లే కాదు.. ఇటీవల కొందరు పిఆర్వోలుగా నియమితులైన వారి వ్యవహారాలు కూడా ఇలా ఉన్నాయి. ట్రాన్స్‌కోలో రూ.90వేల జీతంతో నియమించబడ్డ..ఓ పిఆర్వో అయితే..నిత్యం సచివాలయంలో ప్రదిక్షిణలు చేస్తున్నారు. ఆయన పనిచేసేది ట్రాన్స్‌కోలో అయితే..ఆయన మాత్రం సచివాలయంలో ప్రతి సెక్షన్‌లో దర్శనమిస్తుంటారు. అయితే.. ఆయనకు మంత్రే ఏ పనిచెప్పకండి…? ఆయనను అలా వదిలేయండి..జీతం మాత్రం ఇవ్వండి అని చెప్పారని ఆయన చెప్పుకుంటున్నారట. ఇతగాడు..గత ‘జగన్‌’ ప్రభుత్వంలో పైరవీలు చేసుకుని..ఇప్పుడు ‘టిడిపి’ మద్దతుదారు కోటాలో ‘పిఆర్వో’గా నియమించబడ్డారు. ఈయనగారు ట్రాన్స్‌కోలో ఏమి ఉద్దరిస్తున్నాడో..కానీ..నిత్యం సచివాలయంలో మాత్రం హాజరు వేయించుకుంటారు. పబ్లిసిటీ సెల్‌లో పిచ్చాపాటి చేస్తూ కాలం గడిపేస్తున్నారని..మంత్రి పేరు చెప్పుకుని జీతం తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా మరో మంత్రి వద్ద ఉన్న పిఆర్వోదీ అదే దారి. ‘చంద్రబాబు’ను ఆయన కులాన్ని దూషించే ఈయన గారు..‘జగన్‌’ హయాంలో నియమింపబడ్డారు. ఆయనను కూడా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. ‘జగన్‌’ పార్టీ నుంచి వచ్చి మంత్రి అయిన ఆయన దగ్గర ఈయనగారు పిఆర్వో పదవి వెలగబెడుతున్నారు. ఇటువంటి వారినంతా కూటమి ప్రభుత్వం ఎందుకు పెంచిపోషిస్తుందో..వాళ్లకు జీతాలు ఇచ్చి..ఎందుకు..తిట్టించుకుంటుందో..ఎవరిఈ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా..ఇటువంటి వారిని ఇంకా కొనసాగిస్తే..ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందులు తప్పవు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకుందాం – జనతా వాకర్స్ అసోసియేషన్”

  జనతా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ జనతా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిల్డ్రన్స్ పార్క్ నందు వివిధ మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే పనిలో భాగంగా ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాన్నిచేపట్టామని, అలాగే రాబోవు రోజుల్లో మిగతా అన్ని పార్కులలో మొక్కలు నాటే కార్యక్రమాన్నిచేస్తామన్నారు.వేగంగా విస్తరిస్తున్న నగరాలు దృష్ట్యా , పరిశ్రమలు,విపరీతమైన వాహనాలవలన విడుదలయ్యే కాలుష్యం దృష్ట్యా , ప్రజలందరూ కాలుష్య భూతంలో చిక్కుకుపోతున్న తరుణంలో, నగరమంతా కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పరిస్థితులను మనం చూస్తున్నామని దానిని నివారించే పనిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. వేసవికాలంలో అంతకంతకు ప్రతి ఏటా పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా, అన్ని కాలాలలో అన్ని ఋతువులు సక్రమంగా వర్షాభావం లేని కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతినిందని దీనికి పరిష్కారం మనందరం తప్పనిసరిగా మొక్కలు పెంచాలని అన్నారు . పై కార్యక్రమంలో జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కాయల మధు, పోలిచెర్ల ఉదయ్ కుమార్ సభ్యులు బండ్ల ప్రసాద్ గౌడ్ వేనేటి సుధాకర్ గౌడ్, జంపాణి వంశీ గౌడ్, హర్షవర్ధన్ ,కిషోర్ ,జానకిరామ్ మహేష్ ,పార్థసారథి, కృష్ణమోహన్ మరియు ఇతర వాకర్సు మరియు క్రీడాకారులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయంలో బాబు జగ్జీవన్ రాం జయంతి.:ఆచార్య జి. విజయ ఆనంద కుమార్ బాబు

విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ పరిరక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ఆచార్య జి. విజయ ఆనంద కుమార్ బాబు గారు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశ చరిత్రలో సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప నాయకులు. అనేక సామాజిక వివక్షలను ఎదుర్కొంటూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులు. విద్యార్థులు ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందాలి. సమాజంలో హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి. సమానత్వం, న్యాయం వంటి విలువలు మన దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. ఉదయ శంకర్ అల్లం, డా. అనిల్ కుమార్ పాల్గొన్నారు. వారు తమ సందేశాల్లో బాబు జగ్జీవన్ రాం గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఆయన చేసిన సేవలు, సామాజిక ఉద్యమాల పట్ల చూపిన అంకితభావం గురించి వివరించారు. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. మహానేత జీవితం, సందేశాలు విద్యార్థుల మనసుల్లో స్ఫూర్తిని నింపేలా ఈ కార్యక్రమం కొనసాగింది. విద్యార్థుల్లో సామాజిక న్యాయం, సమానత్వం పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇది మంచి వేదికగా నిలిచింది.

Featured ఆంధ్రప్రదేశ్

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్. జయంతి ఉత్సవ సభ ఏర్పాటు: ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు

    ఏపీ ఎన్జీవో భవనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నందు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు అధ్యక్షతన దార్శనికుడు పరిపాలన దక్షుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగినది.ముందుగా జగజ్జీవన్ రామ్ గారి చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సభనందు ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని బడుగు వర్గాల హక్కుల పరిరక్షకుడు కీర్తిశేషులు డాక్టర్ బాబు జగజ్జివన్ రావు గారు భారత రాజకీయ రంగంలో అర్థ శతాబ్దానికి పైగా అగ్రశ్రేణి నేతగా శాసనసభ్యత్వం మొదలుకొని దేశ ఉప ప్రధాని వరకు ఎన్నో పదవులు అలంకరించి అసమాన ప్రజ్ఞా పాటవాలు కనబరిచి ఘన విజయాలు సాధించి మేరు పర్వతంలా మెలిగిన మహోన్నత జాతీయ నాయకులు బాబు జగజ్జివన్ రావు గారిని వీరు భారత దేశ రాజకీయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారని,డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు బీహార్ రాష్ట్రంలో షాబాద్ జిల్లాలోని చంద్వా గ్రామంలో శ్రీ శోభిరామ్ బసంత దేవి దంపతులకు 5/4/ 1908న జన్మించారని ఆయన తండ్రి కొంతకాలం బ్రిటీష్ సైన్యంలో పనిచేశారని అటు తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి రైతుగా స్థిరపడ్డారని తెలిపారు ఆయన ఆధ్యాత్మిక చింతనాపరుడు బాబూజీ చిన్నతనం నుంచి ధర్మ ప్రవర్తన గురువుల యందు భక్తి శ్రద్ధలు కలిగివుండే వారు.1914 వ సంవత్సరంలో ఆయన ఆరా పట్టణంలో ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించి 1921 వ సంవత్సరంలో మెట్రిక్ పూర్తి చేసి కళాశాల విద్యను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కొనసాగించారు మరియు 1931 వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ పట్టబద్రులైనారని తెలియజేశారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్న తాత్కాలిక మంత్రివర్గంలో చేరిన మంత్రులలో బాబు జగజీవన్ రావ్ అందరికంటే చిన్న వయసు కలిగిన వారని తన పరిపాలన దక్షిత వలన ఎనలేని ప్రజాసేవ వలన నిరంతరం మంత్రివర్గంలో కొనసాగుతూ 1979 వ సంవత్సరంలో సీనియర్ మంత్రులలో ముఖ్యులుగా దేశ నాయకులలో అగ్రగామిగా ఉప ప్రధాని పదంలో నియమించబడినారని ఈ దేశ వ్యవహారములలో చురుకుగా పాల్గొనే వారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామకృష్ణ అసోసియేట్ అధ్యక్షులు నందిమండలం ఆంజనేయ వర్మ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య ఉపాధ్యక్షురాలు ఈదురు కరుణమ్మ సంయుక్త కార్యదర్శి కృష్ణ కుమార్ నెల్లూరు నగర అధ్యక్షులు చిలక రామకృష్ణారెడ్డి, కార్యదర్శి మార్కండేయులు నగర కోశాధికారి సురేష్ కుమార్ నగర అసోసియేట్ అధ్యక్షులు స్వర్ణలత నగర సంయుక్త కార్యదర్శి రాధ కృష్ణ,మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నవోదయ రమేష్ బాబు సీతారామయ్య మొదలగు వారు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

హిందీ పండిట్ నరేంద్ర కు అంబేద్కర్ పురస్కారం.

హిందీ పండిట్ నరేంద్ర కు అంబేద్కర్ పురస్కారం. నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి ) నెల్లూరు వి.బి.ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో హిందీ పండిట్ గా విధులు నిర్వహిస్తున్న కేతరాజు నరేంద్ర కు డాక్టర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం లభించింది. గుంటూరులో ని సదరన్ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్ అసోసియేషన్ ఈ నెల13 న అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా గుంటూరు విజ్ఞాన మందిరంలో నరేంద్ర కు ఈ పురస్కారం అందించనున్న ది. నరేంద్ర కు ఈ పురస్కారం లభించడం పట్ల పలువురు ఉపాధ్యాయులు తమ అభినందనలు తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.