Friday, 6 March 2026

Blog

Featured అనంతపురం

అనంతపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అనంతపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అనంతపురం, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అనంతపురం నగరంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజా సమాఖ్య అధ్యక్షులు గోర్తి వెంకటస్వామి గారు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గోర్తి వెంకట్ మాట్లాడుతూ, ‘‘డాక్టర్ అంబేద్కర్ ఒక మహానేత మాత్రమే కాక, ప్రపంచం గర్వించదగిన మేధావి. భారతదేశానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించిన గొప్ప రాజనీతిజ్ఞుడు. 2004లో అమెరికా కోలంబియా యూనివర్శిటీ రూపొందించిన ప్రపంచ టాప్ 100 మేధావుల జాబితాలో అంబేద్కర్ ప్రథమ స్థానంలో నిలిచారు’’ అని గుర్తుచేశారు. ‘‘చదువుతో వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందనడానికి అంబేద్కర్ జీవితం గొప్ప ఉదాహరణ. సామాజిక సమానత్వానికి ఆయన పాటించిన మార్గం నేటి తరానికి మార్గదర్శకం. మహిళల హక్కుల పరిరక్షణలో, కార్మికుల సంక్షేమం కోసం ఆయన రాజ్యాంగంలో చేసిన మార్పులు యుగప్రభావం కలిగించాయి,’’ అని పేర్కొన్నారు. ‘‘విద్య, రాజకీయం, సమాజం, ఆర్థిక రంగం, న్యాయవ్యవస్థ ఇలా అన్నింటినీ స్పృశించిన మహోన్నత నాయకుడిగా అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం,’’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్తూరు మెయిన్ స్కూల్ హెడ్‌మాస్టర్ గోర్తి వెంకటస్వామితో పాటు ఉపాధ్యాయులు కె.జె.పి. రామన్న, హెచ్. రామాంజనేయులు, ఏ.హెచ్. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఘనంగా నివాళి అర్పించిన అడిషనల్ ఎస్పీ సౌజన్య

  నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) భారత రాజ్యాంగ నిర్మాత, మహామహుడు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి చి. సౌజన్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘మన దేశంలో ప్రతి మతానికి ఓ పవిత్ర గ్రంథం ఉన్నట్టే, అన్ని వర్గాల ప్రజలు అనుసరించే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన శిల్పి ఆయనే. న్యాయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన అంబేద్కర్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా, ‘‘అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా, నిబద్ధతతో సేవలందించిన మహామానవుడు. ఆయన జీవితయాత్ర అనేక ఉద్యమాలకు పునాది వేసింది. రాజ్యాంగం ప్రతీ పౌరుడికి స్వేచ్ఛ, హక్కులు అందించే దిక్సూచి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీ చంద్రమోహన్, డీసీఆర్‌బీ సీఐ శ్రీ రామారావుతో పాటు ఇతర పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విజయవంతంగా ర్యాలీ ముగింపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు: జిల్లా ఇంచార్జ్ ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,IPS.

  *పటిష్ట బందోబస్త్ నడుము ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ-జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,IPS., *శోభయాత్ర AC సుబ్బారెడ్డి స్టేడియం నుండి RSR స్కూల్ వరకు నిర్వహణ.* *ఎప్పటికప్పుడు శోభయాత్ర కదలికలను కమాండ్ కంట్రోల్ నుండి CC కెమెరాల ద్వారా పరిశీలిస్తూ అధికారులకు తగిన సూచనలు జారీ.* *ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా శోభయాత్ర నిర్వహణ.* *మంచి సమన్వయంతో విజయవంతంగా బందోబస్త్ నిర్వహించిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని అభినంధించిన ఎస్పీ గారు.* నెల్లూరు పట్టణంలో ఆదివారం జరిగిన హనుమ భక్త శోభాయాత్ర బైక్ ర్యాలీ, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి KVR పెట్రోల్ బంక్ మీదగా RTC బస్టాండ్, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదగా స్టోన్‌ హౌస్‌పేటలోని ఆర్ఎస్ఆర్ (RSRM) పాఠశాల వరకు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా, ఉత్సాహంగా ముగిసింది. వేలాది మంది భక్తులు జై హనుమాన్ జై శ్రీరామ్ అని వినాదాలు చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ యాత్రలో పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రను జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి సీసీ కెమెరాల ద్వారా జిల్లా ఇన్చార్జి ఎస్పీ గారు నిరంతరం పర్యవేక్షిస్తూ, శోభాయాత్ర సాఫీగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాత్ర మార్గంలో ట్రాఫిక్‌ను మరియు ప్రజల కదలికలను, శోభయాత్ర జరుగుతున్న విధానం, వెళ్ళే మార్గం, చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు తెలియజేశారు. పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకొని, సజావుగా కార్యక్రమం ముగియడానికి కృషి చేశామని, శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తుగా అన్ని భద్రతా ఏర్పాట్లను చేపట్టి, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల మానిటరింగ్, మొబైల్ పార్టీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది సహకారం, కృషి కారణంగానే విజయవంతంగా, ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా బందోబస్తు నిర్వహించగలిగామని ఇంచార్జ్ ఎస్పీ గారు తెలిపారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తి తో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు. ఎవరికి కేటాయించిన విధులను వారు అప్రమత్తంగా ఉంటూ సమర్ధవంతంగా నిర్వర్తించడం, వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సాఫీగా సాగేలా నిరంతరం పర్యవేక్షించి, బందోబస్తు విధులు నిర్వహించి, విజయవంతంగా ర్యాలీ ముగింపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు” తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.  

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ అవార్డు పొందిన కేతరాజు నరేంద్రకు అభినందనలు

నెల్లూరు జిల్లా, ధనలక్ష్మీపురంలో ఉన్న వీ.బి.ఆర్ పాఠశాలలో హిందీ పండిట్‌గా సేవలందిస్తున్న శ్రీ కేతరాజు నరేంద్ర కు గౌరవనీయమైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు లభించింది. గుంటూరులోని సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ను ఈరోజు, తేదీ: 13-04-2025 న నరేంద్ర గారికి అందజేశారు. హిందీ భాషాభివృద్ధి, విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించటం గర్వకారణం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో, హిందీ భాషపై వారి ఆసక్తిని పెంపొందించడంలో కేతరాజు నరేంద్ర గారి పాత్ర ప్రశంసనీయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీ.బి.ఆర్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, తోటి ఉపాధ్యాయులు, మిత్రులు మరియు కుటుంబ సభ్యులు నరేంద్ర గారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నరేంద్ర గారు మరిన్ని పురస్కారాలు అందాలని వారు ఆకాంక్షించారు. ఈ అవార్డు విద్యారంగానికి, హిందీ భాషాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి నిదర్శనం.

Featured జాతీయ అంతర్జాతీయ

ధీరవనిత సునీత విలియమ్స్ :యం.వి.చలపతి

  సునీత విలియమ్స్ శాస్త్రీయ ధీరవనిత. అంతరిక్షంలో చిక్కుకున్న మహిళ. భూమి మీద నుండి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 8 రోజులలో తిరిగి రావాల్సి ఉండగా అంతరిక్షంలోనే తొమ్మిది నెలల పాటు చిక్కుకొని ధైర్యంగా తాను చేయవలసిన పరిశోధనలు చేసి, ఎట్టకేలకు భూమి మీదకు దిగారు. ఈమె విశ్వనారి .తండ్రి గుజరాతీ భారతీయ మూలాలున్న అమెరికన్ పౌరుడు. తల్లి మధ్య యూరప్ లోని స్లోవీనియా దేశ మూలాలు ఉన్న అమెరికన్ పౌరురాలు.  వీరి ముగ్గురు సంతానంలో చివరి వారు సునీత విలియమ్స్. ఈమె  భర్త మైఖేల్ జె విలియమ్స్ ,అమెరికన్ మార్షల్, హెలికాప్టర్ పైలెట్ . ఈమెకు మనము భావించే జాతీయత ఎల్లలు ఉన్నాయా ?ఎల్లలు లేని అంతర్జాతీయ మహిళ .అంతేకాదు అంతరిక్ష మహిళ కూడా.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి భూమి చుట్టూ 90 నిమిషాలకు ఒకసారి అంటే రోజుకి 16 సార్లు చొప్పున, ఇటీవలి 286 రోజులపాటు ఐఎస్ఎస్ లో ఉన్న కాలంలో 4576 పర్యాయాలు భూమి చుట్టూ ప్రదర్శనం చేశారు .అంటే 12 కోట్ల 10 లక్షల మైళ్ళ ప్రయాణం చేశారు. ఈమె 68 రోజుల 20 నిమిషాలు అంతరిక్షంలో గడిపింది రెండు పర్యాయాలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు కమాండర్ గా వ్యవహరించింది 62 గంటల 6 నిమిషాలు అంతరిక్ష కేంద్రం నుంచి వెలుపలకు వచ్చి స్పేస్ వాక్ చేసిన సాహసి.  నాలుగు  అంతరిక్ష ప్రయాణాలు చేశారు మూడు ముఖ్యమైన మిషన్లలో శాస్త్ర పరిశోధనలు చేశారు.     ఇలా అంతరిక్ష ప్రయాణాలు చేస్తూ, అంతరిక్షంలో ఉండి శాస్త్ర పరిశోధనలు చేయాలంటే విజ్ఞాన శాస్త్రంలో పట్టు ఉండాలి. విజ్ఞాన శాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉండాలి .అలాగే సాంకేతిక నైపుణ్యం లో అపారమైన మెళుకువలుఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది .అంతేగాని కేవలం మొండి ధైర్యం కాదు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇచ్చిన ధైర్యం. అంతేకాదు మానవ శాస్త్రీయ కార్యాచరణ పైన  సునీత విలియమ్స్ కు బుచ్ విల్ మోర్లకు నమ్మకం ఉండబట్టే  వారు ఈ విషయంలో విజయం సాధించారు. సైన్స్ ని నమ్మి సైన్స్ పద్ధతిని ఆచరించి నవారు తప్పక విజయం సాధిస్తారు.అనే సందేశాన్ని సునీత విలియమ్స్ ఆమె సహ అంతరిక్ష నావికుడు ,పరిశోధకుడు అయినా బుచ్ విల్ మోర్ లు చాటిచెప్పారు. 2024లో బోయింగ్ స్టార్ లైనర్ లో వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు ఎనిమిది రోజులకే తిరిగి రావాల్సి ఉండగా సదరు స్టార్లైనర్ లో హీలియం వాయువు లీక్, ప్రొపల్షన్ సిస్టంలో లోపాలు తలెత్తాయి. ఫలితంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వీరిద్దరూ మరో 9 మాసాలు అక్కడే ధైర్యంగా గడిపి పరిశోధనలు చేయవలసి వచ్చింది. సమస్యలు ఏర్పడ్డాయి .అవి సాదాసీదా సమస్యలు కాదు. జీవన్మరణ సమస్యలు. అంతరిక్ష నావికురాలు కల్పనా చావ్లా దుర్ఘటన కళ్ళ ముందు కదలాడుతున్నా, విజ్ఞాన శాస్త్ర సంకల్పబలం, ఆలంబనతో సశాస్త్రీయయ వైజ్ఞానిక ఆచరణతో పరిష్కరించగలం అని నమ్మి శాస్త్ర సమాజం కృషిచేసి వారిని భూమికి దింపగలిగింది.            సైన్స్ ను నమ్మి ,సైన్స్ పద్ధతిని త్రికరణ శుద్ధిగా ఆచరించి ,సాంకేతికంగా అభివృద్ధిని సాధించి  ,పరిశ్రమిస్తే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. అని మరోసారి రుజువైంది. ఇదే సశాస్త్రీయ మానవ వాదం.  మానవుడు నడక నుండి వాహనాల సాయంతో మొదట, నేల మీద ప్రయాణించే వాహనాలు, నీటి మీద ప్రయాణించే పడవలు ,నౌకలు తదనంతరం గాలిలో ప్రయాణించే విమానాలు, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయాణించే రాకెట్లు, స్పేస్ షటిళ్ళు వచ్చేశాయి.  ఈ అంతరిక్ష వాహనాలతో ప్రయాణించి చంద్రుడు మీద కాలు మోపాడు మానవుడు. 2030 నాటికి అంగారకుడి మీద దిగాలని మానవుడుఉవ్విళ్లూరుతున్నాడు.చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం అని అందరికీ తెలిసిందే. కానీ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగపెట్టుకుని మానవుడు కృత్రిమ ఉపగ్రహాలని భూకక్షలోకి ప్రవేశపెటుతున్నాడు.అవి భూమి చుట్టూ ప్రదక్షినం చేస్తూ మానవులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. కొన్ని కృత్రిమ ఉపగ్రహాలు సముద్ర పరిశోధన కోసం, మరి కొన్ని వాతావరణ పరిశోధన కోసం ,మరికొన్ని కమ్యూనికేషన్ సేవల కోసం, ఇంకొన్ని వ్యవసాయానికి మరికొన్ని విపత్తుల నుండి రక్షణ కొరకు, మరికొన్ని అయితే యుద్ధ రంగానికి ఉపయోగపడే దానికోసం కూడా కృత్రిమ ఉపగ్రహాలని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రృత్రిమ ఉపగ్రహాలని భూకక్షలో ప్రవేశపెట్టే దానికి రాకెట్లు స్పేస్ షటిళ్ళను వాహనాలుగా ఉపయోగిస్తారు.        ఇప్పుడు సునీత విలియమ్స్ మరి కొంతమంది అంతరిక్ష నావికులను అంతరిక్షంలోనికి ఈ రాకెట్లు ,స్పేస్ షటిళ్ళు తీసుకువెళుతున్నాయి. తిరిగితీసుకొని వస్తూన్నాయి. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల కోసం అంతరిక్ష పర్యాటక రంగాన్ని ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ప్రారంభించాడు.   సునీత విలియమ్స్ విచ్ విల్ మోర్ మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణికులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమి మీదికి తీసుకొచ్చేదానికి ఎలాంటి స్పేస్ ఎక్స్ నాసాతో ఒప్పందం చేసుకొని ఫ్రూట్ డ్రాగన్ వాహక నౌక ద్వారా భూమి మీద తీసుకొచ్చారు.     సైన్స్ సాంకేతిక రంగాలను మానవులు మానవ కళ్యాణం కోసం అభివృద్ధి పరిచారు. అదే సైన్సును నేటి వ్యాపారులు తమ లాభార్జన కోసం వినియోగించుకుని కొటానుకోట్ల ఆస్తుల్ని కూడబెట్టుకుంటున్నారు అంతేకాదు రాజకీయాలను కూడా శాసిస్తున్నారు.   సైన్స్ తనంత తానుగా మానవ కళ్యాణానికి ప్రస్తుత సామాజిక వ్యవస్థలోఉపయోగపడదు. దాన్ని ఉపయోగించే రాజ్య వ్యవస్థను బట్టి సైన్స్ మానవ వికాసానికా ?లేక వినాశానికా ? అనేది నిర్ణయించబడుతుంది. సైన్సు, సాంకేతిక రంగాలను మార్కెట్ లాభాపేక్ష కోసము కాక మానవాభివృద్ధి కోసం ఉపయోగించే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత సమాజానికున్నది.    

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో “పాటల సవ్వడి”కి కళా ప్రియుల ఆహ్వానం

  నెల్లూరు: సంకీర్తన కళా సమితి ఆధ్వర్యంలో 98వ కార్యక్రమంగా “పాటల సవ్వడి” పేరిట సాంస్కృతిక సంగీత సభ ఈ శనివారం (12.04.2025) సాయంత్రం 5.30 గంటలకు నెల్లూరు టౌన్ హాల్‌లో జరగనుంది. ఈ సందర్భంగా నెల్లూరు ప్రాంతానికి చెందిన 40 మంది ప్రముఖ మరియు యువ గాయకులు భారతీయ సినిమాల్లోని అద్భుతమైన గీతాలను ఆలపించనున్నారు. సంగీత ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరై స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. సంస్థ సేవలు, స్థానిక ప్రతిభా అభివృద్ధికి చేసిన కృషి నేపథ్యంలో ఈ కార్యక్రమం ఒక సంగీత పండుగగా మారనుంది. సంగీతాభిమానులు, సాహిత్యాభిమానులు తప్పక హాజరై ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సంకీర్తన కళా సమితి సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మీ హాజరును ఆతురతతో ఎదురుచూస్తున్నాం.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దువ్వూరు రామిరెడ్డి జయంతి సభ ఘనంగా నిర్వహణ

నెల్లూరు: ప్రసిద్ధ కవి, చింతన కర్త దువ్వూరు రామిరెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మార్చి 4వ తేదీన నిర్వహించిన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరేబా ల కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీ దొడ్ల మురళీ కృష్ణా రెడ్డి, కుమారి ప్రవల్లిక, శ్రీమతి శ్రీదేవి, శ్రీ దగ్గుమాటి కృష్ణ, శ్రీ మక్కెన అంకయ్య చౌదరి, శ్రీ జయ ప్రతాప్ రెడ్డి, శ్రీమతి గూడూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దువ్వూరి గారి సాహిత్య సేవలను గుర్తు చేస్తూ వారందరూ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. సభను బి. సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రటరీ, దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి నిర్వహించారు.

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు వెదాయపాలెంలో ఆక్యుపంక్చర్ & రిఫ్లెక్సాలజీ వైద్య శిబిరం

ఆక్యుపంక్చర్ మరియు రిఫ్లెక్సాలజీ వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో విశ్వాసాన్ని పొందుతున్నాయి. శరీరంలోని ప్రత్యేక పాయింట్లను ఉద్దీపన చేయడం ద్వారా సహజ చికిత్సను అందించే ఈ పద్ధతులు, నాడీ సంబంధిత సమస్యలు, నొప్పులు, ఒత్తిడి, మానసిక ఆందోళనలు వంటి అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెదాయపాలెంలో రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. ఏప్రిల్ 14 (సోమవారం), 15 (మంగళవారం) తేదీలలో ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఈ చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ప్రజల ఆరోగ్యానికి తోడ్పడే ఉద్దేశంతో విశ్రాంత ఆరోగ్య నిపుణులు వీటిని అందించనున్నారు. ఆసక్తి గల వారు ముందస్తు వివరాల కోసం కింది ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. విస్సా సత్యరాజు ఫోన్: 9444443590

Featured శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బి.సి.భవన్ మరోసారి రక్తదాన శిబిరం ప్రసాద్ పిలుపు కి యువత స్పందన

జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (ఏప్రిల్ పున్నమి) పూలే జయంతి సందర్భంగా బి‌‌సి ఐక్యతా భవన్ కావలి ఏరియా హాస్పిటల్ లో మరో సారి మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. భవన్ వ్యవస్థాపకులు, పాత్రికేయులు చిన్ని వరప్రసాద్ రక్తదాన కార్యక్రమం తో కావలి నలుమూలల నుంచి బలహీన వర్గాల నేతలను ఒక వేదిక మీదకు సమీకరించడం విశేషం. సుమారు నలభై మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. కావలి ఏరియా ఆసుపత్రి లో రక్తదానం చేయడం వలన ప్రజలకు నేరుగా ప్రతి రక్తపు చుక్క అందుతుందనే ఆశయం తో తమ సంఘం ఇక్కడే నిర్వహిస్తున్నట్లు వర ప్రసాద్ తెలిపారు. దేశ సేవ కోసం పూలే దంపతులు పిల్లలు వద్దనుకొని ఆదర్శ దంపతులయ్యారు. ఆనాటి కాలంలో మహిళలకు విద్య నిషేధం నడుస్తున్న తరుణంలో పూలే దంపతులు మహిళలకు, బాలికలకు విద్యను అందించిన ఘనత వారికే దక్కిందని వారికి భారతరత్న ఇవ్వాలని ప్రసాద్ కోరారు. రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన యువత సమాజ అభివృద్ధిలో కీలకం అయ్యేందుకు తమ బి.సి భవన్ కృషి చేస్తుందని ప్రసాద్ తెలిపారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మావతి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విజయవేణి మాట్లాడుతూ బి.సి భవన్ నిర్వాహకులు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రతి సారి ఇక్కడే రక్తదానం చేయడం హర్షణీయం అని, ఏరియా ఆసుపత్రి కి ఎంతో అండగా నిలిచినట్లు అని అభినందించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జనసేన కావలి ఇంచార్జి అళహరి సుధాకర్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సహాయ కార్యదర్శి ముక్కు మురళీమోహన్ డాక్టర్ రోహిత్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సాయి, సేవా సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా, రోటరీ క్లబ్ కార్యదర్శి మొగల్ సలీం, బిజెపి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ పూలమాల వేసి నివాళులు అర్పించి బి.సి ల‌సంక్షేమానికి పాటుపడుతున్న బి.సి.భవన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ ను అభినందించారు‌. వర ప్రసాద్ పిలుపు మేరకు యువకులు కొత్తగా స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం అని ప్రసాద్ భవిష్యత్తు లో బి.సి ల సంక్షేమం కు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ప్రశంసించారు. . బ్లడ్ వారియర్ టీం సభ్యులు వినయ్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్ అలీం, షేక్ ఖరీర్బీ, సోమిశెట్టి బ్రహ్మయ్య, భవన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉరిటి గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జీవో సిద్ధం!

  అమరావతి, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం కొత్త అక్రిడిటేషన్ జీవోను ఈ నెల 15వ తేది తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. పలు మార్పులతో, పకడ్బందీగా ఈ జీవోను తయారు చేసినట్టు సమాచారం. గతంలో ఉన్న విధానానికి భిన్నంగా, ఈసారి ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త జీవోలో పత్రికా ప్రతినిధుల అర్హతలు, ఫార్మాట్, అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు స్పష్టంగా ఉండనున్నాయి. జీవో విడుదలైన వెంటనే, జర్నలిస్టులు ఆన్లైన్‌లో ఫోటోలు, విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లతో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అప్లికేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇకపై సమగ్ర సమాచారం, పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్‌తో మాత్రమే అక్రిడిటేషన్ మంజూరు కానుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.