Wednesday, 11 March 2026

Blog

E-పేపర్

కొండగట్టు ఆలయంలో అర్చకుల నిరసన ఈవో వైఖరిపై నిరసనకు దిగిన ప్రధానార్చకులు

కొండగట్టు ఆలయంలో అర్చకుల నిరసన ఈవో వైఖరిపై నిరసనకు దిగిన ప్రధానార్చకులు జగిత్యాల జిల్లా, జనవరి 23, పున్నమి ప్రతినిధి : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ ఆలయం కొండగట్టు ఆంజనేయస్వామి ప్రధానార్చకులు శుక్రవారం ఆలయ గోపురం ముందు ఆలయ ఈవో శ్రీకాంత్ వైఖరి పై నిరసన చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పొగాకు రామచందర్ కొద్దిమంది కార్యకర్తలతో ఆలయంలోకి చేరుకున్నారు స్వామి వారి దర్శన అనంతరం ప్రధానార్చకులు వారికి ఆశీర్వచనం చేయడంపై ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారని అర్చకులు మండిపడ్డారు అర్చకులను పరుష పదజాలంతో ఈవో దూషించాడని మేము జారీ చేస్తానని బెదిరించడం పై శుక్రవారం నిరసనకు దిగారు శ్రీకాంత్ పై గతంలో ఎమ్మెల్యే కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు స్థానికుల ద్వారా సమాచారం తెలిసింది.

E-పేపర్

తొర్రూరు గ్రామ గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్షులుగా నక్క శివలింగం గౌడ్

తొర్రూరు గ్రామ గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్షులుగా నక్క శివలింగం గౌడ్ రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్ సర్కిల్ ,జనవరి 23, పున్నమి ప్రతినిధి : అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరు గ్రామంలో శుక్రవారం గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎన్నికలో మాజీ వార్డు సభ్యులు నక్క శివలింగం ని ఏకగ్రీవంగా గ్రామస్తులు ఎన్నుకున్నారు.డైరెక్టర్ కో-ఆపరేటివ్ ఇన్స్పెక్టర్ వెంకట రాఘవ ఆధ్వర్యంలో నూతన ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శివలింగం మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పచెప్పిన ఈ బాధ్యతను ఎల్లవేళలా కుల సభ్యులకు పనిచేస్తానని, ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు తమ గౌడ కులస్తులకు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహాయంతో ప్రతి కుటుంబానికి చేరవేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నక్క ప్రవీణ్,వైస్ చైర్మన్ బాలగోని శ్రీనివాస్,సెక్రటరీ నక్క కొండల,డైరెక్టర్,గౌని నవీన్ కుమార్,

కామారెడ్డి

తండా గ్రామపంచాయతీ నూతన భవనం భూమి పూజ:

కామారెడ్డి, 23 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తండా గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. ఇది కేవలం ఒక భవనం కాదు – గ్రామ పరిపాలనకు, ప్రజా సేవలకు రివల్యూషనరీ స్టెప్, గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి నేతృత్వంలో ఈ ఐకానిక్ ప్రాజెక్ట్ కిక్‌ఆఫ్ అయింది.ఈ ఘన కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంగావత్ రమేష్, తండా కరోబారీ గంగావత్ రవీం దర్ ప్రధాన పాత్ర పోషించారు. వార్డు సభ్యులు – గంగావత్ సేవ్య, గంగావత్ సంతోష్, బుక్య సరిత, గంగావత్ సుజాత, గంగావత్ భూలి, సలావత్ లలిత, సలావత్ తిరుపతి – అందరూ ఎనర్జిటిక్‌ గా పాల్గొన్నారు. గ్రామ సెక్రెటరీ అధికారికంగా కో-ఆర్డినేట్ చేసి, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరయ్యారు. అభివృద్ధి కార్యక్రమంలో స్థానిక పండితులు వేద మంత్రోచ్చారణలు చేసి, భూమి పూజలు ఘనంగా జరిపారు. సర్పంచ్ బుచ్చిరెడ్డి మొదటి రాయి పట్టి పుణాదిని ప్రారంబించారు. ఈ భవనం మా గ్రామ పరిపాలనకు కొత్త డాక్యు మెంట్ అవుతుందన్నారు. ప్రజల సమస్యలు ఇక సాల్వ్ అయ్యేలా సూపర్ ఫెసిలిటీలు అని ప్రకటిం చారు. ఉపసర్పంచ్ రమేష్ మాట్లాడుతూ,ఇది మా టీమ్ వర్క్ ఫలితం. గ్రామ అభివృద్ధికి మైలురా యి అని అన్నారు.ఈ నూతన పంచాయతీ భవ నం మోడరన్ డిజైన్‌తో రానుందన్నారు. సమావేశా ల హాల్, డిజిటల్ రికార్డ్స్ రూమ్, ప్రజా గ్రీవెన్స్ కౌంటర్‌లు, సిస్టమ్ సహా అన్ని అడ్వాన్స్ ఫీచర్స్. ఇది గ్రామంలో పెండింగ్ వర్క్‌లు ఫాస్ట్ ట్రాక్ చేస్తుం దని చెప్పారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, సర్వేలు అండ్ వాటర్ స్కీమ్స్ సూపర్ ఈజీగా అవుతాయ న్నారు. గ్రామ ప్రజలు సంతోషంగా చెప్పుకుంటు న్నారు.వార్డు సభ్యులు ప్రజలతో అనుసంధానం అయి, ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.ఈ భూమి పూజ గ్రామంలో ఉత్సవ వాతావరణం సృష్టించింది.ఈ భవనం తండా గ్రామాన్ని మోడల్ పంచాయతీగా మార్చుతుందని నమ్మకం గ్రామాభివృద్ధికి జై హో! అని నినాదాలు చేశారు. .

కామారెడ్డి

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఎలా చేయవచ్చు !!

– దరఖాస్తు ఏ విధంగా చేయాలి.. కామారెడ్డి, 23 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం సులభం, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మౌఖికంగా లేదా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చాలు. తెలంగాణ లో FIR దరఖాస్తు విధానం CrPC 154 సెక్షన్ ప్రకారం జరుగుతుంది. ఎఫైఆర్ దరఖాస్తు చేయడం ఎలా? • నేరం జరిగిన ప్రాంతంలోని సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి, డ్యూటీ అధికారికి సంఘటన వివరాలు చెప్పండి. • తేదీ, సమయం, స్థలం, నిందితుల వివరాలు, సాక్షులు, ఘటన వివరణలు స్పష్టంగా ఇవ్వండి; రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే మరింత మంచిది. • పోలీసులు ఎఫైఆర్ రాసి చదివించి, సంతృప్తి చెందితే సంతకం తీసుకుని ఉచిత కాపీ ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం….. • తెలంగాణ పోలీస్ CCTNS పోర్టల్ (tspolice.gov.in)లో ‘Citizen Services’కు వెళ్లి, Mee Seva ద్వారా లాగిన్ అవ్వండి. • Lodge police complaint’ ఎంచుకుని, ఫిర్యాదు వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి (నాన్-కాగ్నిజబుల్ కేసులకు మాత్రమే). • రిఫరెన్స్ నంబర్ నోట్ చేసుకుని స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. తిరస్కరించినా ఏమి చేయాలి? • పోలీసులు FIR నమోదు చేయకపోతే, SP లేదా మేజిస్ట్రేట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. • ఎమర్జెన్సీలకు 100 లేదా 112 డయల్ చేయండి. – కామరెడ్డి జిల్లా ఎస్పీ మొబైల్: 8712686133.

గూడూరు

ప్రతిభ చూపిన ఎస్ కే ఆర్ కళాశాల విద్యార్థులు

స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం తిరుపతిలో జిల్లా స్థాయిలో జరిగిన వివిధ పోటీలలో పాల్గొని విజయం సాధించారు. క్విజ్ పోటీలో జిల్లాస్థాయిలో రెండవ బహుమతి R. శ్రీనివాసులు II BA, వ్యాసరచన పోటీలో రెండవ బహుమతి P. శిరీష IB.Com మరియు వక్తృత్వ పోటీలో మూడవ బహుమతి P. శిరీష IB.Com గెలుపొందారు. వీరు 25వ తేదీ ఆదివారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా స్థాయిలో జరిగే ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో గౌరవ మెజిస్ట్రేట్ చేతుల మీదుగా బహుమతులు అందుకోబోతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

కేంద్ర ప్రభుత్వం బిజేపి విధానాలపై కాంగ్రెస్ నేతల విమర్శ

ముస్తాబాద్/ఫున్నమి ప్రతినిధి/ జనవరి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్టాన్ని రద్దుచేసి జి రామ్ జి అనే పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చిన విషయం తెలిసిందె ఇందులో జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం కేంద్రం నిధుల కొరత పెట్టడం రాష్ట్రాలపై భారాన్ని మోపడం లాంటి చర్యలు తీసుకున్నది ఈ నేపథ్యంలో ఏఐసీసీ మాన్రే గా బచావో సంగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు మరియు రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు హాజరయ్యారు కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి సీనియర్ నాయకులు కనమెని చక్రధర్ రెడ్డి మరియు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

87వ వార్డులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) 87వ వార్డు పరిధిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక కార్పొరేటర్ బోండా జగన్నాథం (జగన్) హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేసి, అనంతరం వడ్లపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా జగన్నాథం, యువతకు ఆదర్శంగా నిలిచే నాయకుడు నారా లోకేష్ అని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ బొట్టా ప్రకాష్, రాజన్ రాజు, ప్రగడ దానయ్య, పావాడా వెంకటరమణమూర్తి, ద్రోణద్రి అప్పలనాయుడు, కణితి ఈశ్వరరావు, ఆనంద్ కుమార్, పెంటయ్య, కడుపుట్ల శ్రీను, వై.భాస్కరరావు, బొడ్డా సన్యాసి, భాగ్యలక్ష్మి, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, దాలయ్య, సుందర్, సునీల్, కనకసత్యం, పొతల కృష్ణ, ఆదినారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) మనుబోలులో సర్వేపల్లి యువనాయకుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు, నిరుపేదలు, గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా విద్యార్థులకు 3132 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. విద్య, ఐటీ శాఖల్లో లోకేష్ బాబు చేస్తున్న సేవలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతున్నాయని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ లో నేతాజీ జయంతి వేడుకలు

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి జనవరి 23 ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాల్‌రెడ్డి, పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, గజ్జల రాజు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ దేశభక్తి, త్యాగాలు యువతకు ఆదర్శమని మరియు దేశ యువతను ఐకమత్యంగా ఉంచడంతోపాటు ఐఎన్ఎ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని నడిపించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు జయంతి ఉండి వర్ధంతి లేని గొప్ప నాయకుడని ఈ సందర్భంగా వారు సుభాష్ చంద్ర బోస్ గారిని పలు విధాలుగా ఆయన త్యాగాలను కొనియాడారు.

అనకాపల్లి

యలమంచిలిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు: పేదలకు అన్నదానం, నిత్యావసరాల పంపిణీ

అనకాపల్లి జిల్లా జనవరి 23 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి పట్టణంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ శ్రీ పప్పల చలపతిరావు, రాష్ట్ర కార్యదర్శి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ధూళి రంగనాయకులు హాజరయ్యారు. ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేయగా, కొక్కిరాపల్లిలోని ప్రేమ సమాజానికి, భవనం వీధిలోని వేద పాఠశాలకు కాయగూరలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్లి శివన్నారాయణ మూర్తి, మండల అధ్యక్షులు లాలం భరత్, యువ నాయకులు ప్రగడ రాజు, లక్కవరం పీఏసీఎస్ చైర్మన్ కొలకలూరి విజయరామరాజు, జిల్లా నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.