కొండగట్టు ఆలయంలో అర్చకుల నిరసన ఈవో వైఖరిపై నిరసనకు దిగిన ప్రధానార్చకులు
కొండగట్టు ఆలయంలో అర్చకుల నిరసన ఈవో వైఖరిపై నిరసనకు దిగిన ప్రధానార్చకులు జగిత్యాల జిల్లా, జనవరి 23, పున్నమి ప్రతినిధి : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ ఆలయం కొండగట్టు ఆంజనేయస్వామి ప్రధానార్చకులు శుక్రవారం ఆలయ గోపురం ముందు ఆలయ ఈవో శ్రీకాంత్ వైఖరి పై నిరసన చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పొగాకు రామచందర్ కొద్దిమంది కార్యకర్తలతో ఆలయంలోకి చేరుకున్నారు స్వామి వారి దర్శన అనంతరం ప్రధానార్చకులు వారికి ఆశీర్వచనం చేయడంపై ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారని అర్చకులు మండిపడ్డారు అర్చకులను పరుష పదజాలంతో ఈవో దూషించాడని మేము జారీ చేస్తానని బెదిరించడం పై శుక్రవారం నిరసనకు దిగారు శ్రీకాంత్ పై గతంలో ఎమ్మెల్యే కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు స్థానికుల ద్వారా సమాచారం తెలిసింది.











