Wednesday, 11 March 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం? కూటమి ప్రభుత్వం కీలక అడుగులు

ఆంధ్రప్రదేశ్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత, విద్యపై సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం పరిశీలనలో ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దావోస్ వేదికగా మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న ‘అండర్-16 సోషల్ మీడియా చట్టం’ను ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిబంధన అమలులోకి వస్తే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌ల వినియోగంపై పిల్లలకు కఠిన ఆంక్షలు విధించనున్నారు. వయస్సు ధృవీకరణ విధానం తప్పనిసరి చేయడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా అకౌంట్లు తెరవకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. అలాగే, నిబంధనలు ఉల్లంఘించిన టెక్ కంపెనీలపై భారీ జరిమానాలు విధించేలా చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, అసభ్య కంటెంట్, డిజిటల్ వ్యసనాలకు గురికాకుండా కాపాడడమే ఈ ప్రతిపాదిత విధానத்தின் ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నారాయణపేట

జనవరి 26 సోమవారం నుంచి కున్సి గ్రామంలో జములమ్మ దేవి జాతర మహోత్సవం

నారాయణ పేట జిల్లా క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ జములమ్మ దేవి 10 వ జాతర మహోత్సవం జనవరి 26 27 తేదీలో భక్తిశ్రద్ధల మధ్య జరగనుంది. 26 తేదీ సోమవారం నాడు ఉదయం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రథోత్సవాన్ని మహిళలతో లాగడం ఇక్కడి విశేషం . ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

E-పేపర్

నిరుపేద కుటుంబానికి 1, లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

*నిరుపేద కుటుంబానికి 1, లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు* *మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు.* సర్పంచ్, ఉప సర్పంచ్ ఆడాల గణేష్ తదితరులు..* పున్నమి న్యూస్ ప్రతినిధి: 24 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : చనిపోయిన నరసింహ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ 1లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *మేడిపల్లి నక్కర్త గ్రామ వాస్తవ్యులు ఇటీవల కందడి నరసింహ గత కొన్ని రోజుల క్రితం చనిపోయిన సందర్భంగా తన పిల్లలు అనాధలుగా మిగిలిపోవడంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ముందుకు వచ్చి చందాలుగా సేకరించి* “1లక్ష రూపాయలు” *మేడిపల్లి నకర్త సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్, మోటి శ్రీశైలం మాజీ సర్పంచ్ ఎరుకలి బాలరాజ్ గౌడ్, ఉప సర్పంచ్ దింది మధుకర్ రెడ్డి, చిగురంతా సికిందర్ రెడ్డి, ఏవిజి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేష్ గారి చేతుల మీదుగా “పెద్ద కురుమ కలకొండ బీరప్ప”కి ఆ కుటుంబం తరఫున వారికి అందజేయడం జరిగింది.కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేస్తూ…* *ఈ కార్యక్రమం లో పార్టీ ఉపాధ్యక్షులు జమ్మ గుండాలు, వార్డు సభ్యులు మొక్కపల్లి మహేష్, ముచ్చర్ల ప్రకాష్, బన్ని జంగయ్య, బేత జంగయ్య,గడ్డం మల్లేష్, కలకొండ మల్లేష్, బండ రాజు,ఏరకలి కృష్ణ, జమ్మ శివ,మొరుగు మహేష్, బండ బీరప్ప, పోలే జంగయ్య పాల్గొన్నారు.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీస్పీ రాష్ట్ర మహిళ క్రాకటూరు పుష్పంజలి, మరియు పార్టీ వారు

కావలి నియోజకవర్గం లోని అల్లూరు మండలం వెలిచర్ల గ్రామానికి సంబంధించిన భూ సమస్యలను అధికారులతో కలిసి భూములను సందర్శించి సమస్య ఫై ప్రాతి నిద్యం చేశారు అనంతరం ఆ గ్రామ ప్రజలను సమావేశపరిచి బహుజన పార్టీ గురించి, మాయావతి గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధికారులు, బీస్పీ రాష్ట్ర మహిళ పుష్పంజలి,కన్వీనర్ టీ కృష్ణా,మరియు అడ్వైజర్, తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ నో షో..! ఐసీసీ సంచలన నిర్ణయం

2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ జట్టు తప్పుకుంది. భారత్లో తమకు భద్రతా ముప్పు ఉందని పేర్కొంటూ తమ మ్యాచ్‌లను పూర్తిగా శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేందుకు ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును కూడా బంగ్లాదేశ్ అంగీకరించలేదు. ఫలితంగా ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు ఈ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపింది. Uploaded Video:

తెలంగాణ

చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని పూల మాల వేసి నివలర్పించిన సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు నాయకులు*

*పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు చుక్క అప్పారావు తల్లి చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని అనసూర్య చిత్రపటానికి పూల మాల వేసి నివలర్పించిన కొత్తగూడెం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు సంగ అశోక్,గుంజి భాను, సత్తార్,అజీజ్, సాయి తేజ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

గూడూరు

ఎస్ కే ఆర్ లో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం & స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర

గూడూరు : ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో (జనవరి 25) జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సింహాద్రి మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, అర్హులని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, విద్యార్థిని విద్యార్థులు తమ పరిసర ప్రాంతాలలో ఓటర్ గుర్తింపు కార్డు తీసుకోని వారిని పేరు నమోదు చేసుకునేటట్లు చూడాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు రవిరాజు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పోరాడి పొందిన హక్కు ఓటు హక్కు అని, ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తుందని అటువంటి ఓటును విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, డాక్టర్ కే. శివప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణరాజు, అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ గోవిందు సురేంద్ర, శ్రీధర్ శర్మ, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ విజయ్ మహేష్, డాక్టర్ శైలజ, డాక్టర్ పీర్ కుమార్ తదితర అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. # స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర # ఎస్.కే.ఆర్ కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, ప్లాస్టిక్ రహిత, చెత్త రహిత, ఆకుపచ్చని పరిసరాలను పెంపొందించడం మొదలైన అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పరిసరాలను సంరక్షిస్తామని అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో ఘనంగా క్షీరాభిషేకం–అన్నదానం.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి).మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం, నూతన పట్టు వస్త్రాల సమర్పణతో పాటు విశ్వనాథ స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. వేమారెడ్డి వంశీకృష్ణ రెడ్డి–మోనిషా దంపతులు తమ కుమారుడు హనీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

రాజన్న సిరిసిల్ల

ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం అన్న జిల్లెల్ల గ్రామ సర్పంచ్

ప్రజల ఆరోగ్యమే గ్రామ సౌభాగ్యం అన్న జిల్లెల్ల. గ్రామ సర్పంచ్ ఇల్లంతకుంట/పున్నమిప్రతినిధి జనవరి 24 జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ గారి ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ బి.ఎన్.రావు టీం ఈరోజు జిల్లెల్ల గ్రామపంచాయతీ ఆవరణలో జిల్లెల గ్రామ ప్రజల కోసం ప్రజల బాగుకోసం నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపుకు విశేషమైన స్పందన లభించింది వీరి కృషికి ఈరోజు దాదాపుగా 450 పైగా ఓపీ కేసులు అదేవిధంగా అందులో 125 ఈసీజీ మరియు105 2D ఈకో చేయడం జరిగింది ఈ కృషికి ముఖ్యంగా జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ & ఉప సర్పంచ్ మొగిలి కరుణాకర్ గారికి పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రజలందరూ తన పరిసరాలు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉంటేనే అదే మనకు విలువైన సంపద అని సర్పంచ్ గారు ప్రజలకు తెలియజేశారు ఈ ఆరోగ్యం పైన ప్రజలకు కల్పించారు ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు వివిధ అధికారులకు ముఖ్యంగా వైద్య అధికారులకు వైద్య సిబ్బందికి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

E-పేపర్

నిరుపేద కుటుంబానికి 1,64000 వేలు ఆర్థిక సహాయం అందచేసిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు.

*నిరుపేద కుటుంబానికి 1,64000 వేలు ఆర్థిక సహాయం అందచేసిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలు.* *మృతుని పిల్లలు అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో పి ఎం సుకన్య యోజన పథకం కింద జమ* పున్నమి న్యూస్ ప్రతినిధి: 24 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: *రంగారెడ్డి జిల్లా యాచారం మండల మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన కందడి నర్సిహ ఇటీవల ఆత్మహాత్య చేసుకున్నారు… అతని మరణం తో వారి కుటుంభం పరిస్థితి గమనించిన స్నేహితులు గ్రామ వాసులు, మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. రూ.1,64000 సేకరించిన నగదును మృతుని పిల్లలు అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో పి ఎం సుకన్య యోజన పథకం కింద జమ చేసి ధ్రువపత్రాలను మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఈ లోకంలో పేద కుటుంభనికి తమ వంతుగా మిత్రుడు నరసింహ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ వాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థికసహాయ సహకారాలు అందించిన వారికీ పేరు పేరు నా..ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.