Tuesday, 10 March 2026

Blog

తిరుపతి

రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: విజయవాడ ఆంధ్ర రత్న భవనంలో PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశమునకు తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నరు. సమావేశంలో YS షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) నీరుగారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త పథకం VB గ్రామ్ జీ పథకం వల్ల నిరుపేదలకు తీరని అన్యాయం జరుగుతుందని, రాబోవు రోజుల్లో ఆ పథకంపై నిరసన తెలుపుతూ జిల్లాల పర్యటన కార్యక్రమం తో ప్రజలకు చేరువై ఉపాధి హామీ పథకం యొక్క విశిష్టతను తెలియజేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బల్ల హరి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సీతారామ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివశంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎంజీఎం పాఠశాలలో జాతీయ రహదారి భద్రతపై వ్యాసరచన పోటీలు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర నాయుడు ఆద్వర్యంలో జాతీయ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్. టి. ఓ. మాట్లాడుతూ.. పిల్లలందరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేశారు. అనతరం ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఎంజీఎం స్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ ను పాటించే విధంగా తమ స్కూల్ నుండే ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని తప్పక హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా ప్రోత్సహించాలని విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా సూచించారు. జాతీయ రహదారి భద్రత వ్యాసరచన పోటీలలో ఎంజీఎం స్కూల్ విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులను అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఎస్ టి యు

శ్రీ కాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ టి యు రాష్ట్ర శాఖ ఆదేశాలు మేరకు ఎస్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దారుకు వినతి పత్రం సమర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుణశేఖర్, ప్రధాన కార్యదర్శి వి మధు, జిల్లా అధ్యక్షులు వూడి సుధాకర్ యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్ చిర్రి. హరికృష్ణ యాదవ్, జిల్లా ఆదనపు ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళి, జిల్లా ఉపాధ్యక్షులు తొండు కృష్ణయ్య ,శ్రీకాళహస్తి డివిజనల్ కన్వీనర్ సురగాని. నాగూర్ పాల్గొని, ఉపాధ్యాయుల సమస్యలను తహసీల్దార్ కి వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ టి యు అధ్యక్షులు మాట్లాడుతూ… ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిందిగా కోరామనీ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోSTU నాయకులు శివ కుమార్, మోహన్, దామోదరం, స్టాలిన్, రమణయ్య ,శ్రీనివాసులు, హరినాధ రెడ్డి , శ్రీహరి, చంద్రశేఖర్ ,ధన కిషోర్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.

పల్నాడు

చలికాలానికి ఔషధం లాంటి అంజీర్

చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడంలో అంజీర్ సహాయపడుతుంది • అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది • కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహకరిస్తుంది • జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది • జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం నివారిస్తుంది • గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది • స్త్రీలు, పురుషులలో సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది • చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి మెరుపు తీసుకువస్తుంది • శక్తిని పెంచి అలసటను తగ్గిస్తుంది

అనకాపల్లి

కొండకర్ల ఆవ పర్యాటక అభివృద్ధితో అనకాపల్లి జిల్లాకు కొత్త ఊపిరి..!

అనకాపల్లి జిల్లా, జనవరి 30 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): అనకాపల్లి ఉత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు గారు, రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ గారు, ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయకుమార్ గారు తదితర ప్రజాప్రతినిధులు హాజరై ఉత్సవాలకు శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొండకర్ల ఆవలో ఏర్పాటు చేసిన బోటు షికారీ, సెల్ఫీ పాయింట్‌ను వారు సందర్శించారు. అక్కడ అమలులో ఉన్న పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కొండకర్ల ఆవ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను సందర్శించి స్థానిక కళాకారులు, స్వయం సహాయక సంఘాల ద్వారా తయారైన వస్తువులను పరిశీలించారు. కొండకర్ల ఆవను పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, దీని ద్వారా స్థానిక మత్స్యకారులు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

ఖమ్మం

గాంధీ వర్ధంతి సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాళులు

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ ఆశయాలు, అహింస మార్గం నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గాంధీజీ బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (KKC) జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కేకేసీ జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు బి. సతీష్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట నాయుడు, నగర కమిటీ సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి

*పదవ తరగతి విద్యార్థుల పై దృష్టి సారించాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 30/01/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘన్పూర్ మండలం ఈరోజు హిందీ కాంప్లెక్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసి అకాడమీ మానిటరింగ్ అధికారి మహానంది మరియు డిస్టిక్ టీం ప్రతాపరెడ్డి గారు మరియు డిసిఇబి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మద్దిలేటి గారు డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం లీడర్ బి .శ్రీనివాసులు మరియు సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్ గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే మార్చి నెలలో జరగబోయే వార్షిక పరీక్షల్లో హిందీలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, తజుద్దీన్, శ్రీధర్, లతీఫ్, వెంకటేష్, రామ్ సింగ్, సురేష్ శ్రీనివాసులు అంజలయ్య ,గీత ,మేడం కవిత ,సులోచన, తదితరులు పాల్గొన్నారు*

వనపర్తి

పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి

*పదవ తరగతి విద్యార్థుల పై దృష్టి సారించాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 30/01/2026* *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘన్పూర్ మండలం ఈరోజు హిందీ కాంప్లెక్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసి అకాడమీ మానిటరింగ్ అధికారి మహానంది మరియు డిస్టిక్ టీం ప్రతాపరెడ్డి గారు మరియు డిసిఇబి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మద్దిలేటి గారు డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం లీడర్ బి .శ్రీనివాసులు మరియు సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్ గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే మార్చి నెలలో జరగబోయే వార్షిక పరీక్షల్లో హిందీలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, తజుద్దీన్, శ్రీధర్, లతీఫ్, వెంకటేష్, రామ్ సింగ్, సురేష్ శ్రీనివాసులు అంజలయ్య ,గీత ,మేడం కవిత ,సులోచన, తదితరులు పాల్గొన్నారు*

విశాఖపట్నం

జీవీఎంసీ కౌన్సిల్‌లో రచ్చ.. మేయర్–వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్‌లో తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అది స్వల్ప తోపులాటకు దారితీసింది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించిన వైసీపీ సభ్యులు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కౌన్సిల్ హాల్‌లో నేలపై పడుకుని నిరసన తెలిపారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొంతసేపు కౌన్సిల్ సమావేశం గందరగోళంగా కొనసాగింది.

కామారెడ్డి

గొల్లపల్లి సర్పంచ్‌లు వెంటనే స్పందించి కొత్త బోరు మోటర్ బిగించారు.

– తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం కామారెడ్డి,30 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గొల్లపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామస్తులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను తెలు సుకున్న వెంటనే గ్రామపంచాయతీ పాలక వర్గం సభ్యులు స్పందించారు. పాత మోటర్‌ను తీసివేసి, కొత్త బోరు మోటార్‌ను త్వరగా బిగించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తీర్చిపెట్టారు. గ్రామ స్తుల సౌకర్యం కోసం 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించిన పాలకవర్గానికి గ్రామవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి త్వరిత చర్యలు గ్రామంలో అభివృద్ధికి మేలు కలిగిస్తాయని సర్పం చ్ కిషన్ యాదవ్ అన్నారు.ఈ సంఘటన గ్రామ పంచాయతీల్లో ప్రజా సంక్షేమానికి పాలకుల వెంట నే స్పందించామని అన్ఎంనారు.గొల్లపల్లి గ్రామస్తు లు ఇప్పుడు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కిషన్ యాదవ్, గ్రామ సెక్రటరీ జనార్ధ న్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.