రంగారెడ్డి
పున్నమి: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోజు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీలంకల దీపక్ రెడ్డి తో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి బూత్ వద్ద పోలింగ్ శాంతియుతంగా జరుగుతున్న విధానాన్ని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించడం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని తెలిపారు.ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం మందకొడిగా కొనసాగినప్పటికీ, ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిస్పాక్షికంగా ఓటు వేయాలని, ఇది ప్రజాస్వామ్య బలాన్ని పెంచుతుందని అన్నారు.పోలింగ్ కేంద్రాలలో వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలను, పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ప్రతి పౌరుడి గౌరవ చిహ్నమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించాలని కార్పొరేటర్ గారు తెలిపారు.మొత్తానికి ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో అందరూ చురుకుగా పాల్గొని అధిక శాతంలో పోలింగ్ నమోదు చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ రంగా రెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, నాయకులు జక్కిడి ప్రభాకర్, షకీల్ మిర్జా, బొంగు రఘు, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు…