Sunday, 22 March 2026

Blog

సాహితీ

“మంచి మనిషి మాయమైపోయాడు – అందెశ్రీ గారికి అక్షరాంజలి”

అక్షర తుణిరం.. అందెశ్రీ అక్షరాలకు మాటలు నేర్పిన అందే శ్రీ ఆకాశానికి తుణిరమై ఏగినావా.. మనుషుల్లో మంచితనం కొరబడిందని ఆవేదనతో మనుషులు మారాలని మంచి మనసుతో ఉండాలని.. ఆశించిన నీ మనసుకు. నీకు జోహార్లు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు అంటూనే.. మా నుండి మాయమయ్య వా.. వెన్నపూస మనసున్న ఓ అందెశ్రీ అన్న నిస్వార్ధానికి నిరాడంబరతకు నిలువెత్తు దర్పణం నీవన్న సామాజిక కవులకు నీవే ఆదర్శం తెలంగాణ తల్లి శిఖరాన నువోక కిరీటం.. నీ మనసున ఉవ్వెతున లేచిన అక్షర కెరటాలు.. తెలంగాణ జాతీయ గీతం రెపరెపలు చదువు లేకున్నా నువ్వు ఒక అక్షర జ్ఞానివి.. నీ కంటాన మెరిసేను కాకతీయ డాక్టరేటు. దొడ్డ మనసున్న.. దొరతనం కానరాని అందరి వాడవు నీవే అన్న అందుకే గంగతో ఆదరించెను నంది అవార్డు తెలంగాణ నా కోటి రతనాల వీణ అన్న దాశరధి పురస్కార గ్రహీతవు . తెలంగాణ ప్రభుత్వ అధినేత రేవంత్ అన్న నీకు అందించెను కోటి రూపాయలు రొక్కమును.. శృంగేరి పీఠ స్వామి శంకర్ మహారాజు దీవెనలతో.. వాణి, గిర్వాణిని భాసర సరస్వతమ్మ ను వాక్కులమ్మగా ఆరాధించిన విజ్ఞానులు మీరు.. సిద్ధప్ప వారకవి స్ఫూర్తితో రచనలు చేసినంటివి.. గుండారెడ్డిపల్లికి వెళ్లి. వారకవి రచనల అవపోసానా పడితివి తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మకు వినుసంపైన మాటలను రాస్తివి నీ అక్షరార్చనతో.. పల్లె నీకు వందనాలమ్మ అంటూ వందనాలు చేస్తివి.. కొమ్మ చెక్కితే బొమ్మ రా అంటూ అమ్మ విలువను.. అవనికి చాటితివి.. అవారగాడువై.. ఆ చిత్రానికి… మొన్న తెచ్చాను నీ పాటలు వస్తావా జానకి వంగతోటకు అంటూ మాయ చేసావా మనిషి కదా అని….. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించితివి.. తెలంగాణ కవి గుండెల్లో మరుపురాని చిత్రానివై.. ఆ సూర్యుడికి సింధూరమైనవా.. అందరి శ్రీ ఎల్లన్న.. నీకు నా కవిత పుష్పాంజలి ఘటిస్తూ.. అక్షర నివాళి నీ వారసులైన ముగ్గురమ్మలకు వారసునికి నా ప్రగాఢ సానుభూతి.. రచన: ఇమ్మడి రాంబాబు తొర్రూరు జిల్లా మహబూబాబాద్ 9866660531

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో వైఎస్సార్సీపీ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

నందిగామ పట్టణం కోర్ట్ రోడ్డులో వైఎస్సార్సీపీ నందిగామ నియోజకవర్గ లీగల్ సెల్ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించబడింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మొండితోక జగన్మోహన రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు మరియు న్యాయవాదులతో కలిసి సంతకాలను స్వీకరించారు. పార్టీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తంగిరాల సౌమ్యపై పెట్టిన కేసులు కోర్టు కొట్టివేత; ప్రజాస్వామ్య హక్కులు రక్షితమని తీర్పు

నందిగామ మంగళవారం: నందిగామ సబ్‌డివిజన్ పరిధిలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మంగళవారం రోజు విచారణలో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పై 2019–2024 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన లో పెట్టిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో, కంచికచర్ల మరియు పేరకలపాడు ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసిన సౌమ్య పై రాజకీయ ప్రతీకారంగా తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శలు వెలువడ్డాయి. విచారణ అనంతరం జడ్జ్ కేసులలో చట్టపరమైన ఆధారం లేనని తేల్చి వాటిని రద్దు చేశారు. ఈ తీర్పుతో తంగిరాల సౌమ్య అనుచరులు, కూటమి నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తంగిరాల సౌమ్య, “నిజం ఎప్పటికీ గెలుస్తుంది. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఎల్లప్పుడూపోరాడుతాను. తప్పుడు కేసులు నన్ను వెనక్కి తగ్గించలేవు,” అన్నారు. కోర్టు తీర్పు, శాంతియుత నిరసన లను పోలీస్ లేదా రాజకీయ పీడనంతో అడ్డుకోవడం సరికాదు అని స్పష్టం చేసింది.

అన్నమయ్య

ఢిల్లీ బాంబు పేలుడు అమానుషం: జనసేన నాయకులు మాదాసు నరసింహ

-‘ఇది పిరికిపంద చర్య’ – మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చిట్వేల్/, నవంబర్ 11: పున్నమి ప్రతినిధి దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద సోమవారం రాత్రి జరిగిన కారు బాంబు పేలుళ్ల సంఘటన** అత్యంత అమానుషమని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమాయక ప్రజలు 9 మంది మృతి చెందడం మరియు 20 మందికి పైగా గాయాలబారిన పడటం తీవ్ర విచారకరమన్నారు. -అమానవీయ చర్య: “ఏమాత్రం దయ, కనికరం లేకుండా, అన్యం పుణ్యం ఎరుగని సామాన్య ప్రజల పట్ల ఇంతటి క్రూరంగా వ్యవహరించడం పిరికిపంద చర్య గా ఆయన అభివర్ణించారు. దేశ భద్రతను ఉల్లంఘిస్తూ, పౌరుల ప్రాణాలను తీయడం అత్యంత హేయమైన చర్య” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -డిమాండ్‌లు: ఈ పేలుళ్లకు బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామన్నారు.ఇటువంటి అమానవీయ సంఘటనలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో ఖండించాలని, ఉగ్రవాద చర్యలను అణిచివేసేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తల్లి వర్థంతి సందర్భంగా ఘన నివాళులు

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ తమ మాతృ మూర్తి కస్తాల మరియమ్మ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రంలోని కుటుంబ ఘాట్ వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో వారు తమ తల్లి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు పాల్గొని మరియమ్మ స్మృతులను స్మరించారు. ఈ సందర్భంగా మొండితోక సోదరులు మాట్లాడుతూ – తమ తల్లి సాదాసీదా జీవన విధానం, సేవా మనసు, కష్టానికి విలువ ఇచ్చే స్వభావం తమకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

విశాఖపట్నం

ఏపీలో పరిశ్రమల పునరుజ్జీవనం — 17 జిల్లాల్లో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తే మా లక్ష్యం : సీఎం చంద్రబాబు విశాఖలో ఏడు పార్కులు — రూ.700 కోట్ల పెట్టుబడులు

గాజువాక, పెద్ద గంట్యాడ నవంబర్ (పున్నమి ప్రతినిధి): రాష్ట్రాన్ని తిరిగి పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో మైలురాయిని సృష్టించారు. 17 జిల్లాల్లో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపారు. రెండో దశలో 329 ఎకరాల్లో 15 పార్కులు ప్రారంభమవ్వగా, మరో 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేట్ పార్కులకు శంకుస్థాపన జరిగింది. “కనిగిరి కనకపట్నం అవుతుంది — అభివృద్ధి దిశలో ఆగని యాత్ర కొనసాగుతుంది” అని సీఎం పేర్కొన్నారు. తుఫానులో సమర్థవంతంగా పనిచేసిన అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశంసిస్తూ, “ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని నిరూపించాం” అన్నారు. “చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది. ఇతరులు ఉద్యోగాలు ఇస్తామని చెబుతారు, కానీ నేను ఇంటికొక వ్యాపారవేత్తను తయారు చేస్తానని హామీ ఇస్తున్నాను” అని చెప్పారు. విశాఖలో 7 కొత్త పార్కులు: విశాఖ జిల్లా పెదగంట్యాడ ఏపీఐఐసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డోలా వీరాంజనేయులు, మేయర్ పీలా శ్రీనివాస్, ఎంపీ ఎం. భరత్, ఎంఎస్ఎంఈ చైర్మన్ గండి బాబ్ది, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మంత్రులు పెదగంట్యాడ, పెందుర్తి, ముదసరలోవ, గోపాలపట్నం ప్రాంతాల్లో రూ.700 కోట్ల వ్యయంతో ఏడు పార్కులను ప్రారంభించారు. లక్ష్యం — 175 నియోజకవర్గాలు, 175 పార్కులు: ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే లక్ష్యం” అన్నారు. 70 శాతం ప్రైవేట్ పెట్టుబడులు, 30 శాతం ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పార్కులు ఏర్పడుతున్నాయని వివరించారు. “గత పాలకుల విధ్వంసక పాలనతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి. వారు చేసిన పనులు బుద్ధి ఉన్నవాళ్లు చేయరు” అని చంద్రబాబు విమర్శించారు. “ఇప్పుడు పెట్టుబడులు వర్షం కురుస్తున్నాయి — గూగుల్‌తో సహా లక్షా నలభై వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి” అని తెలిపారు. సీఐఐ సదస్సుతో మరిన్ని పెట్టుబడులు: నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సులో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి సుభాష్ వెల్లడించారు. “పవన్ కళ్యాణ్ అండగా, లోకేష్ పట్టుదలతో, కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి దిశలో దూసుకుపోతోంది” అని సీఎం హామీ ఇచ్చారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సీసీఐ పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించాలి — రైతు సంఘం డిమాండ్

నందిగామ మార్కెటింగ్ యార్డు వద్ద సీసీఐ (Cotton Corporation of India) పత్తి కొనుగోలు వెంటనే ప్రారంభించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డు కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ, నవంబర్ 7న ఘనంగా ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రం ఇంకా పత్తి కొనుగోలు ప్రారంభించకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. గ్రామాల్లో వ్యాపారులు తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని, రైతులకు నష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సంఘం నాయకులు చనుమోలు సైదులు మాట్లాడుతూ, సీసీఐ పత్తి కొనుగోలులో మిల్లర్లకు అవకాశ మివ్వడం వల్ల రైతులు నష్ట పోతున్నారని తెలిపారు. గుంటూరుకు వెళ్లి పత్తి అమ్మే పరిస్థితి లేదని, స్థానిక మార్కెట్‌ యార్డులోనే కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రైతులు “కాపాస్ కిసాన్ యాప్”లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిన నిబంధన తో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, దీన్ని రద్దు చేసి “ఈ-క్రాప్” రిజిస్ట్రేషన్ ఆధారంగా కొనుగోలు జరపాలని కోరారు. ఈ ఆందోళనలో రైతు సంఘం నాయకులు గడిపూడి వీరప్రసాద్, కమతం పుల్లారావు, సైదల్లి, సయ్యద్ ఖాసిం, అలాగే సీఐటియు నాయకుడు కే. గోపాల్ తదితరులుపాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆర్టీసీ బస్సు ఢీకొన్న బైక్ ఒకరు మృతి

పల్నాడు జిల్లా కారంపూడి నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని కారంపూడి వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తి బలంగా ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే బైకిస్టు మృతి చెందిన సంఘటన కారంపూడి జూలకల్లు మధ్య ప్రాంతంలో జరిగింది.. ప్రమాదం తాలూకా వివరాలు మరియు మృతుడు తాలూకా వివరాలు తెలియాల్సి ఉంది ? బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఎదురుంగా వస్తున్న ఆర్టిసి బస్సుని బలంగా ఢీకొట్టడంతో తలకి బలమైన గాయం అవ్వడంతో ఘటనా స్థలంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో భద్రతా చర్యలపై చైర్మన్ పర్యవేక్షణ

ఢిల్లీలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మంగళవారం నాడు ఆలయంలోని భద్రతా విభాగాలను పరిశీలించి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న భద్రత సిబ్బందితో మాట్లాడి, భక్తుల భద్రత కోసం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, క్షుణ్ణమైన తనిఖీలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, లగేజ్ స్కానింగ్, అత్యవసర ప్రతిస్పందన చర్యలు వంటి అంశాలపై సూచనలు చేసారు. ఈ సందర్బంగా ఆలయ పాలకమండలి చైర్మన్ మాట్లాడుతూ…ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రతి భక్తుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఏ మాత్రం చిన్న సందేహ వచ్చినా వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం తగదని, సెక్యూరిటీ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి, అన్ని ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ధర్మకర్త మండలి అధ్యక్షులు ఆలయ ఆవరణంలో షాపుల ఆకస్మిక తనిఖీలు చేశారు షాపులు యజమాన్యాలతో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు భక్తి భావంతో నడుచుకోవాలని భక్తుల మీద వ్యాపారస్తులు అధికంగా భారం వెయ్యొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

తెదేపా నాయకునికి నివాళులార్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తొట్టంబేడు నవంబర్ 11, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మంగళవారం నాడు తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు తిరుమాన్యం ముత్తా రెడ్డి మృతిచెందగా అయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులార్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.