Sunday, 22 March 2026

Blog

తూర్పు గోదావరి

మౌలానా అబ్దుల్ కలాం అజాద్ 137 వ జయంతి వేడుకలు.

రాజమహేంద్రవరం : నవంబర్ 11, మంగళవారం మౌలానా అబ్దుల్ కలాం అజాద్ 137 వ జయంతి సందర్బంగా రాజమండ్రి స్థానిక జాంపేట మార్కెట్ లో అజాద్ చౌక్ వద్ద ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అజాద్ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరింగింది. అబ్దుల్ కలాం సమితి అధ్యక్షులు ఎం.డి సెహనశా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఈసందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ తరపున అధ్యక్షులు బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని మౌలానా అబ్దుల్ కలాంకు జోహార్లు అర్పించారు ఈసందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం లో మౌలానా ప్రముఖ పాత్ర పోసించారాని స్వాతంత్ర అనంతరం ఈ దేశ మొదటి విద్యా శాఖ మంత్రివర్యులు గా పనిచేసి విద్యా వ్యవస్థ లో పెను మార్పులు తీసుకొని వచ్చారని దేశంలో ఐఐటీ లు యూనివర్సిటీలు స్థాపించి ఈనాటి దేశ అభివృద్ధికి బాటలు వేశారని దేశములో హిందూ ముస్లిం ఐక్యతకు ఇదే నిదర్శనం అని నేటి మత తత్వం శక్తుల మాయ లో పడవద్దు అని మాట్లాడరు. కొవ్వురి శ్రీనివాస్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం సేవలు నిత్య స్మరనీయం అని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం లో మహ్మద్ అలీ, లాలఖాన్ మజీద్ అధ్యక్షులు, మొహమ్మద్ ఆరీఫ్, నాయీమ్ ఉదీన్, సల్మాన్, భాష, ఖాన్ బాబు, మొయిన్, రబ్బానీ, షబ్బెర్, తదితర ముస్లీమ్ సోదరులు తో పాటు కాంగ్రెస్ నాయకులు ఇజ్జరౌతు సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.

Blog

ప్రధమ భారత విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి.

భారత దేశ ప్రధమ విద్యామంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్ లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ల జోన్ చైర్మన్ నిజాముద్దీన్ సౌజన్యంతో ఇద్దరు పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేశారు. విద్యార్థుల తరఫున వారి తండ్రులు నగదు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ ప్రధమ విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్యం తర్వాత దేశంలో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, విద్యార్థుల తండ్రులు మధు, రాజ్ కుమార్ పాల్గొన్నారు

Blog

నంద్యాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

నంద్యాల భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం 2025 ను మొదటగా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థూపం దగ్గర ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి సబిహా పర్వీన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ , నంద్యాల డియోసెస్ బిషప్ ఆర్టీ రెవ్ సంతోష్ ప్రసన్నరావు జోసప్ , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల డిఈఓ జనార్దన్ రెడ్డి, ఉర్దూ డిఐ అస్ముద్దీన్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్ , మెప్మా పీడీ వెంకట దాస్ తదితరులు హాజరయ్యారు ముందుగా, ముఖ్య అతిథులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ చేసిన పోరాటం, అలాగే స్వతంత్ర భారతంలో ఆయన తొలి విద్యా శాఖ మంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. “ఆజాద్ గారు దేశంలో శాస్త్ర, సాంకేతిక విద్య అభివృద్ధికి, ఉన్నత విద్య సంస్థల ఏర్పాటుకు బలమైన పునాదులు వేశారని . ఆయన కృషి ఫలితంగానే నేడు మన దేశం విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తోందని . నేటి యువత ఆజాద్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి సబిహా పర్వీన్ మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని, ఐకమత్యాన్ని పెంపొందించడంలో ఆజాద్ ఆశయాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు మెమెంటోను , ప్రశంసా పత్రాన్ని బహుకరించడం జరిగింది. అలాగే వివిధ రంగాలలో ప్రావీణ్యం సాధించిన మైనార్టీ , క్రిస్టియన్ మైనార్టీ ప్రజలను ముఖ్యఅతిథిలు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ మైనార్టీ సంఘాల నాయకులు , మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, నంద్యాల పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్బంగా సీనియర్ పాత్రికేయుడు అబ్దుల్ మజీద్ కు సన్మానం

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి విద్యామంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు జన్మదినం సందర్బంగా మంగళవారం నంద్యాల మునిసిపల్ టౌన్ హాల్ లో మైనారిటీశాఖ ఆధ్వర్యంలో జరిగిన మౌలానా ఆజాద్ జయంతి వేడుకల్లో సీనియర్ పాత్రికేయుడు, అబ్దుల్ మజీద్ ఘనంగా సన్మానించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనారిటీ సంక్షేమశాఖ అధికారిణి సబిహా పర్వీన్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మనియర్ ఖలీల్, డీఈఓ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ముస్లిం మైనారిటీ పెద్దలు మాట్లాడుతూ అబ్దుల్ మజీద్ పాత్రికేయ వృత్తిలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజాభివృద్ధికి దోహద పడుతున్నారని కొనియాడారు.

E-పేపర్

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్బంగా సీనియర్ పాత్రికేయుడు అబ్దుల్ మజీద్ కు సన్మానం

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి విద్యామంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు జన్మదినం సందర్బంగా మంగళవారం నంద్యాల మునిసిపల్ టౌన్ హాల్ లో మైనారిటీశాఖ ఆధ్వర్యంలో జరిగిన మౌలానా ఆజాద్ జయంతి వేడుకల్లో సీనియర్ పాత్రికేయుడు, అబ్దుల్ మజీద్ ఘనంగా సన్మానించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనారిటీ సంక్షేమశాఖ అధికారిణి సబిహా పర్వీన్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మనియర్ ఖలీల్, డీఈఓ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ముస్లిం మైనారిటీ పెద్దలు మాట్లాడుతూ అబ్దుల్ మజీద్ పాత్రికేయ వృత్తిలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజాభివృద్ధికి దోహద పడుతున్నారని కొనియాడారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: పర్యాటక ప్రాంతాలలో పటిష్ట భద్రతతో తనిఖీలు

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో మంగళవారం అరకు సీఐ ఎల్ హిమగిరి అరకులోయ లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అరకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం, సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జి అన్ని పర్యాటక ప్రాంతాలలో అణువణువు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులు తిరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అరకులోయ ఎస్సై గోపాల్ రావు తెలిపారు.

కాకినాడ

సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు గా కరెడ్ల శ్రీదేవి

పున్నమి న్యూస్, పెద్దాపురం 11/11 కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటకు చెందిన శ్రీమతి కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈమె గతంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా సేవలందించారు. ఆనురు కొండపల్లి చెందిన దువ్వ వెంకటపతి, గంగా భవాని పుణ్యం దంపతుల కుమార్తె అయినా కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపునాడు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ వేల్పూర్ శ్రీనివాస్ ఈ సందర్భం నియామక పత్రాన్ని పంపించారు. రాష్ట్ర బిజెపి శాఖలో కీలక నాయకురాలుగా ఉన్న, డాక్టర్ కరెడ్ల శ్రీనివాస్ సతీమణి అయిన శ్రీమతి కరెడ్ల శ్రీదేవి (సైకాలజిస్ట్)గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ అధ్యక్షురాలుగా నియమించిన సందర్భంగా కాపు సంఘాల జేఏసీ కన్వీనర్ కె.వి.ఆర్ నాయుడు, NDA కూటమి నాయకులు,తదితరులు శుభాకాంక్షలు తెలియపరిచారు.

ఆంధ్రప్రదేశ్

గిరిజన ప్రాంతాల్లో హోం స్టేలకు రూ.5 లక్షల ప్రోత్సాహకం తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో హోం స్టేలను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. కలెక్టర్ కీర్తి చెక్కూరి వివరాల ప్రకారం, కొత్తగా హోం స్టేలు ప్రారంభించే వారికి రూ.5 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. ఇప్పటికే పునరుద్ధరణ పనులు చేపట్టే వారికి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఏడు సంవత్సరాలపాటు 100 శాతం SGST మినహాయింపు ఇవ్వబడుతుందని ఆమె తెలిపారు. తొలి మూడు సంవత్సరాలు రిజిస్ట్రేషన్ రాయితీలు కొనసాగుతాయి. యజమానులు తమ హోం స్టేలను అదే ప్రాంగణంలో కొనసాగించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి

అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డికి కలెక్టర్ అభినందనలు

తూర్పుగోదావరి జిల్లా నిదదవోలు మండలానికి చెందిన కైవల్య రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాలో చెండిన బ్రైట్‌నెస్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు అస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి, కైవల్య రెడ్డిని రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు. కైవల్య రెడ్డి సాధన తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్

*లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారికి ఘన నివాళులు*

*లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారికి ఘన నివాళులు* నాగర్ కర్నూల్ ప్రతినిధి, నవంబర్11 (పున్నమి) : మంగళవారం లింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల సోమయ్య గారు మరణించడం జరిగింది. ఆయన మరణం మరణం ఎంతో బాధాకరం. ఒక సాక్షి రిపోర్టర్ గా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెల్దండ మండలంలో రిపోర్టర్లలో అందరికంటే ఎక్కువగా జూపల్లి గ్రామాన్ని ఇష్టపడేవారు జూపల్లి గ్రామం మండలం కావాలని లింగారెడ్డిపల్లి గ్రామం గ్రామపంచాయతీ కావాలని ఆ రోజులలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు జూపల్లి గ్రామానికి పూర్తి మద్దతు తెలిపారుఇక్కడ తెలంగాణ వాదాన్ని ఆయన పేపర్ ద్వారా అందరికంటే ఎక్కువ రాసేవారు. సోమయ్య గారి మృతదేహానికి జూపల్లి గ్రామ యువనాయకులు. వారి పార్థివ దేవానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జూపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ జగపతి. భాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్ . కాంగ్రెస్ నాయకుడు గిరి యాదవ్ నివాళులు అర్పించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.