Sunday, 22 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెస్ఎంఈ పార్కులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటించి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 ఎమ్మెస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బహిరంగ సభ దృశ్యాలను లోకల్ యాప్ వీడియో రూపంలో అందిస్తుంది.

ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన విజయవంతం కావడంతో సిబ్బందిని అభినందించిన ఎస్పీ

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలో సీఎం ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పించామని, సీఎం పర్యటన సజావుగా సాగడంపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన నేపథ్యంలో 10 మంది అధికారులకు నోటీసులు

పీసీపల్లి మండలం లింగన్నపాలెం వద్ద ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈనెల 10న సీఎం రాకకు ముందు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించగా, ల్యాండింగ్ సమయంలో ఎగసిన దుమ్ముతో పైపైనే చక్కర్లు కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పలువురు అధికారులకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం.

విశాఖపట్నం

స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనుల ప్రారంభం — నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

గాజువాక, నవంబర్ (పున్నమి ప్రతినిధి): గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలోని సిద్ధార్థ నగర్ సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాధం (జగన్) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. మొత్తం నాలుగు ఎకరాలు యాభై సెంట్ల స్థలంలో క్రీడాకారుల అభ్యాసానికి అనువైన ఆధునిక సదుపాయాలు కల్పించనున్నాం. అధికారులు, కాంట్రాక్టర్‌లు పనులను వేగంగా పూర్తి చేయాలి. నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదు” అని తెలిపారు. ప్రారంభానికి సంబంధించి అధికారులు, కాంట్రాక్టర్ గ్రౌండ్‌లో మార్కింగ్ పనులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు విజయరామరాజు, బెల్లంకొండ రాజన్ రాజు, కాండ్రేగుల శ్రీనివాసనాయుడు, పావాడ రమణమూర్తి, డీవీ సూరిబాబు, బొడ్డా సన్యాసిరావు, గండేపల్లి రాము, జాన్ రమేష్, సుందర్ సునీల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

87వ వార్డులో అండర్‌గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ పనుల పరిశీలన

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డ్‌ పరిధిలో APEPDCL ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్‌గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ పనులను రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డ్‌ కార్పొరేటర్‌ బోండా జగన్నాధం (జగన్) గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాఫిక్‌కి ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డ్‌ అధ్యక్షులు విజయరామరాజు, రాజన్ రాజు, పావాడా రమణమూర్తి, కాండ్రేగుల శ్రీనివాసనాయుడు, డీవీ సూరిబాబు, బొడ్డా సన్యాసి, గండేపల్లి రాము, కోరుకొండ కళ్యాణ్‌చక్రవర్తి, సుందర్ సునీల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సినర్జీస్ క్యాస్టింగ్ ఉద్యోగుల నిరసనకు వైసీపీ మద్దతు

గాజువాక, నవంబర్ : (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గంలోని దువ్వాడలో గల సినర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు గత ఏడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఎదుట ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావంగా వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు, కార్పొరేటర్ పి.వి. సురేష్ హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే నిలుస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో 86వ వార్డు అధ్యక్షులు చేగొండి శ్రీనివాసరావు, వాడపల్లి రామచంద్రరాజు, చిట్టి బాలకృష్ణ, భూపతిరాజు శ్రీనివాసరాజు, శ్రీనివాస్ పట్నాయక్, రమణారెడ్డి, వెంకట్రావు, జీవీ రమణరెడ్డి, సినర్జీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి దాసు, జగన్, దేవర సత్తిబాబు, యువీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వైజాగ్ అభివృద్ధికి మరో మైలురాయి — సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంతెన ప్రారంభం

విశాఖపట్నం, నవంబర్ (పున్నమి ప్రతినిధి) నెవల్ డాక్‌యార్డ్ సమీపంలో ఉన్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంతెనను బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రభుత్వ విప్‌, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఘనంగా ప్రారంభించారు. దాదాపు 18 నెలల పాటు సాగిన వంతెన మరమ్మతు పనులు పూర్తి కావడంతో ఈ రోజు తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ — “ఈ వంతెన ప్రారంభంతో వైజాగ్ ప్రజలకు ప్రయాణం మరింత సులభం అవుతుంది. సమయం ఆదా అవుతుంది. ఇంతకాలం ఎదురుచూసిన ప్రజల సంతోషమే నాకు నిజమైన ఆనందం” అని తెలిపారు. వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. వైజాగ్ అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే గణబాబు కృషికి నిదర్శనంగా ఈ వంతెన నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ

ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా ప్రారంభించారు. మంగళవారం నాగార్జునసాగర్ మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14,19 పోటీలను నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం, ఉల్లాసానిస్తాయన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవాడతాయని క్రీడల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభ చాటుకోవాలని చెప్పారు. ఇప్పటినుంచి బాలికల పాఠశాలను నిత్యం విజిట్ చేస్తానన్నారు. బాలుర పాఠశాలలో కూడా విజిట్ చేస్తానన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కవాతును చూసి కలెక్టర్ అభినందించారు.

తూర్పు గోదావరి

యూనిటి మార్చ్ – ఎక్ భారత్ – ఆత్మనిర్బర్ భారత్.

రాజమహేంద్రవరం, నవంబర్ 11 : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిర్వహించిన యూనిటి మార్చ్ – ఎక్ భారత్ – ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కనాగేద్ర పాల్గొన్నారు. సర్దార్ వల్లభభాయి పటేల్ సేవలను స్మరించుకుంటూ, దేశంలో ఐక్యత—సమగ్రత —దేశభక్తి భావాలను మరింత బలపరచాలనే నినాదంతో స్థానిక ఆనం కళాకేంద్రం నుండి వై జంక్షన్ వి.టి కాలేజ్ వరకూ యూనిటి మార్చ్ పాదయాత్ర (ర్యాలీ ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడబాల రామకృష్ణ , కురగంటి సతీష్, రవిశంకర్, తగరం సురేష్, అడప వరప్రసాద్ ,పై బోయిన సురేంద్ర, కాలేపు సాయిరాం బురా రామచంద్రరావు మాట్ల ఆంజనేయులు , శ్రీను, ఎన్.సి.సి కేడెట్లు మరియు కార్యక్రమ నిర్వాహకులు మై భారత్ బృందం సభ్యులు , విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అభివృద్ధికి మారుపేరుగా నగరాన్ని నిలుపుతాం -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

– రూ. 32 లక్షలతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాప రాజమహేంద్రవరం, నవంబర్ 11 : అభివృద్ధికి మారు పేరుగా నగరాన్ని నిలుపుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక ప్రియాంక్‌ గార్డెన్స్‌ సమీపంలోని కొకొనట్‌ జ్యూస్‌ సెంటర్‌ నుంచి జాగృతి జంక్షన్‌ వరకూ రూ. 32 లక్షలతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనుల కోసం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. నగరంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇది తమకు… కూటమి ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధన్నారు. అయితే గత ఐదేళ్లూ వైకాపా వారికి కనిపించకపోవడం శోఛనీయమన్నారు. గత పాలకులు ఏదో మెయిన్‌ రోడ్లు వరకే అభివృద్ధి చేయడం, విశాలంగా ఉన్న రోడ్లను ఇరుకుగా చేయడం, డివైడర్లకు రాళ్లు అంటించడంతోనే సరిపెట్టారని, వారి అనాలోచిత పనుల వల్ల నేడు నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తాము ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అందరి ఆలోచనల మేరకు అవసరమైన పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. నగరంలో దాదాపుగా 30 పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.