Saturday, 21 March 2026

Blog

E-పేపర్

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే కోడూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనేంద్ర కుమార్ రెడ్డి.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే కోడూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనేంద్ర కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాజ్ కన్వెన్షన్ నుండి మండల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన రైల్వే కొడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఉమ్మడి కడప జిల్లా వైసిపి పార్లమెంటరీ పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి, రైల్వేకోడూరు నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు మౌనెంద్ర కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

అన్నమయ్య

ప్రమాద బాధితుడికి శాలివాహన సంఘం అండ

-కొత్త మంగంపేటలో నాగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం – భరోసా కల్పించిన సంఘ సభ్యులు చిట్వేల్, నవంబర్ 12: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం, కొత్త మంగంపేట గ్రామంలో ప్రమాదానికి గురై ఇబ్బందులు పడుతున్న ఒక నిరుపేద కుటుంబానికి శాలివాహన సంఘం మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది. -ప్రమాద వివరాలు: గ్రామానికి చెందిన గొట్టం నాగయ్య అనే వ్యక్తి గత పది రోజుల క్రితం రేషన్ బియ్యం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. ఈ ఘటనలో అతనికి ఎముక విరిగింది . దీంతో నాగయ్య కుటుంబం వైద్య చికిత్స కోసం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. -సంఘం భరోసా: ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాలివాహన సంఘం సభ్యులు తక్షణమే స్పందించారు. సంఘం నాయకులు మరియు సభ్యులు కలిసి నాగయ్య ఇంటికి వెళ్లి, వారికి ఆర్థిక సహాయం అందించారు.”కష్టాల్లో ఉన్నప్పుడు మేము మీకు అండగా ఉంటాము. ధైర్యం కోల్పోవద్దు,” అని భరోసా కల్పించారు. సంఘం చేసిన ఈ సహాయం పట్ల నాగయ్య కుటుంబ సభ్యులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమ సాటి వ్యక్తికి ఆపన్న హస్తం అందించిన శాలివాహన సంఘం సేవానిరతిని గ్రామస్తులు ప్రశంసించారు.

E-పేపర్

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే కోడూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనేంద్ర కుమార్ రెడ్డి.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే కోడూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనేంద్ర కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాజ్ కన్వెన్షన్ నుండి మండల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన రైల్వే కొడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఉమ్మడి కడప జిల్లా వైసిపి పార్లమెంటరీ పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి, రైల్వేకోడూరు నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు మౌనెంద్ర కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ నెల సదరం ధ్రువీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్-డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ IAS

రాష్టం లో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్దారణకు ఈనెల 14వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ చక్రదర్ IAS ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025 రెండు నెలలకుగాను సదరం స్లాట్ బుకింగ్ నిమిత్తం తమ దగ్గరలోని గ్రామ/వార్డ్ సచివాలయంలో సదరం స్లాట్ లు బుక్ చేసుకోవచ్చన్నారు. రాష్టం లోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులలొ మంగళవారం శారీరక, మానసిక, బధిరులు ,దృష్టి వైకల్యం ఉన్నవారికి ఎరియా హాస్పిటల్ లో శారీరక, దృష్టి వైకల్యం కలిగిన వారికి, సి.హెచ్.సి లో సోమవారం శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రదర్ ఐఏఎస్ తెలియజేసారు.

విశాఖపట్నం

పేదవాడి సొంతింటి కలే నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం : పల్లా శ్రీనివాసరావు

గాజువాక, నవంబర్ (ప్రత్యేక ప్రతినిధి) పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం గాజువాక జోనల్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో గాజువాక నియోజకవర్గానికి ఎంపికైన లబ్ధిదారులకు 2.5 లక్షల విలువైన వర్క్ ప్రొసీడింగ్స్‌ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పల్లా మాట్లాడుతూ — రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది లబ్ధిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఎంపికయ్యారని, అందులో విశాఖ జిల్లాకు 2,800 మంది, గాజువాక నియోజకవర్గానికి 1,343 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గాజువాక నియోజకవర్గ లబ్ధిదారుల గృహ నిర్మాణానికి సుమారు ₹335 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ లబ్ధిదారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ ఈఈ డి. సుబ్రహ్మణ్యం, ఏఈ గోపాలకృష్ణ, జోనల్ కమిషనర్ శేషాద్రి, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ ఇన్‌చార్జి కరణం రెడ్డి నర్సింగరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, బోండా జగన్, పల్లా శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పేదల సొంత యింటి కలలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట నియోజకవర్గం లోని వత్సవాయి మండలం & గ్రామంలో బుధవారం జరిగిన PM–JANMAN గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ: “పేదలకు సొంత ఇల్లు ఉండా లన్నది స్వర్గీయ నందమూరి తారక రామారావు మహాశయం. ఆ ఆశయాన్ని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోంది,” అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కూటమి ప్రభుత్వ చొరవతో కేవలం 17 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహాలను పేదలకు మంజూరు చేయడం చారిత్రా త్మక ఘనతగా పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాలు జరుగుతున్నాయని తెలియ జేస్తూ, లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం (₹1.50 లక్షలు), కేంద్ర ప్రభుత్వం 60 శాతం (₹2.50 లక్షలు) వాటా నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. బిల్లుల చెల్లింపులో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రభుత్వ పాలనలో పేదల ఇల్లు విషయం లో ఇసుక కొరత సృష్టించి పేదలను ఇబ్బందులకు గురి చేసిన గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, 2014–19లో మంజూరైన ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులకు రూ.920 కోట్లు చెల్లించకుండా నిలిపివేయడం పేదల పట్ల ద్రోహమని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలకు సౌకర్య వంతమైన గృహాలు అందించి, వారికీ ఆర్థిక భద్రత కల్పించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. నూతన గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులను ఆశీర్వదిస్తూ, “మీ కొత్త ఇళ్లలో సుఖసంతోషాలతో జీవించండి” అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్లు, దేవుని చిత్రపటాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు: RDO బాలకృష్ణ, వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, హౌసింగ్ పీడీ, స్థానిక తాసిల్దార్, అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేటలో 24వ వార్డును పర్యటించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ నీటి సమస్యలపై చర్యలు — లైటింగ్, డ్రైనేజ్ పనులకు ఆదేశాలు

జగ్గయ్యపేట పట్టణంలోని 24వ వార్డులో బుధవారం ఉదయం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పర్యటించారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ రంగాపురం రాఘవేంద్ర కూడా పాల్గొన్నారు. వార్డు పరిధిలోని నీటి సరఫరా, డ్రైనేజ్, వీధి లైటింగ్ మరియు పరిశుభ్రత అంశాలను వారు సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఈ వేసవిలో పట్టణంలోని ఏ ఇంటికీ నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. అవసరమైతే అదనపు నిధులు సమకూర్చి నీటి సరఫరా సమస్యలను పూర్తిగా పరిష్క రిస్తాము,” అని తెలిపారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఆయన, అవసరమైనప్రాంతాల్లో లైట్లు, డ్రైనేజ్ పనులను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే ‘స్వచ్ఛ జగ్గయ్యపేట’ లక్ష్యాన్ని సాధించేందుకు సానిటేషన్ పనులనుబలోపేతం చేయాలని సూచించారు. అవసరమైతే మున్సిపల్ మంత్రితో మాట్లాడి అదనపు పైప్‌లైన్ నిధులు సమకూర్చేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ నూకల కుమార్ రాజా, వార్డ్ కౌన్సిలర్ సదుపాటి రాజు, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, వార్డ్ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

E-పేపర్

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం. *పార్టీలకు అతీతంగా కదలిన యువత, విద్యార్థి లోకం వామపక్షాలు* ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి…కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం. *పార్టీలకు అతీతంగా కదలిన యువత, విద్యార్థి లోకం వామపక్షాలు* ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి…కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, కడప పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి పర్యవేక్షణలో, రైల్వే కోడూరు పట్టణంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఐదు మండలాల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు, మరియు, వామపక్షాలు, మేధావులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో, కలిసి బుధవారం నాడు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ నుండి ర్యాలీగా మొదలై తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్ట ర్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం పత్రికా విలేకరులతో కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటినుండి రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలు ఉండగా 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రిగా పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకురాగా వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023-2024 లో ప్రారంభించారని తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఆదనంగా అందించారని, తదనంతరం గతేడాది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా గద్దెనెక్కడంతో వైద్య విద్యకు గ్రహణం పట్టుకుందని, 90 శాతం పనులు పూర్తయి మరికొన్ని నిర్మాణ దశలో ఉండంగా నేడు వాటిని చంద్రబాబు నాయడు పిపిపి విధానంలో ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క యొక్క ముఖ్య అనుచరులకు గంపగుత్తగా కట్టబెట్టే నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు, కొత్త వైద్య కళాశాలలను చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, ఎంబిబిఎస్ చదువు కోవాలన్న విద్యార్థుల ఆశలకు చంద్రబాబు సర్కారు గండి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు, వెంటనే ప్రైవేటీకరణను ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేట ఎంపీపీ సీనియర్ నాయకులు ముద్దా బాబుల్ రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, పుల్లంపేట మండల కన్వినర్ ముస్తాక్, పెనగలూరు మండల కన్వీనర్ చక్రపాణి, కోడూరు మండల కన్వీనర్, వైస్ ఎంపీపీ ధ్వజా రెడ్డి, రాయలసీమ జోగు బూత్ కమిటీ మెంబర్ తల్లెం రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోలమణి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రాజశేఖర్ జెడ్పిటిసి రత్నమ్మ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నంద బాల, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, వైయస్సార్సీపి ఎస్సీ సెల్ కార్యదర్శి లింగం లక్ష్మీకర్, సర్పంచులు ఎంపీటీసీలు ఐదు మండలాల కార్యకర్తలు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు

E-పేపర్

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం. *పార్టీలకు అతీతంగా కదలిన యువత, విద్యార్థి లోకం వామపక్షాలు* ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి…కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం. *పార్టీలకు అతీతంగా కదలిన యువత, విద్యార్థి లోకం వామపక్షాలు* ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి…కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, కడప పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి పర్యవేక్షణలో, రైల్వే కోడూరు పట్టణంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఐదు మండలాల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు, మరియు, వామపక్షాలు, మేధావులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో, కలిసి బుధవారం నాడు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ నుండి ర్యాలీగా మొదలై తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్ట ర్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం పత్రికా విలేకరులతో కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటినుండి రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలు ఉండగా 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రిగా పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకురాగా వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023-2024 లో ప్రారంభించారని తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఆదనంగా అందించారని, తదనంతరం గతేడాది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా గద్దెనెక్కడంతో వైద్య విద్యకు గ్రహణం పట్టుకుందని, 90 శాతం పనులు పూర్తయి మరికొన్ని నిర్మాణ దశలో ఉండంగా నేడు వాటిని చంద్రబాబు నాయడు పిపిపి విధానంలో ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క యొక్క ముఖ్య అనుచరులకు గంపగుత్తగా కట్టబెట్టే నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు, కొత్త వైద్య కళాశాలలను చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, ఎంబిబిఎస్ చదువు కోవాలన్న విద్యార్థుల ఆశలకు చంద్రబాబు సర్కారు గండి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు, వెంటనే ప్రైవేటీకరణను ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేట ఎంపీపీ సీనియర్ నాయకులు ముద్దా బాబుల్ రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, పుల్లంపేట మండల కన్వినర్ ముస్తాక్, పెనగలూరు మండల కన్వీనర్ చక్రపాణి, కోడూరు మండల కన్వీనర్, వైస్ ఎంపీపీ ధ్వజా రెడ్డి, రాయలసీమ జోగు బూత్ కమిటీ మెంబర్ తల్లెం రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోలమణి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రాజశేఖర్ జెడ్పిటిసి రత్నమ్మ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నంద బాల, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, వైయస్సార్సీపి ఎస్సీ సెల్ కార్యదర్శి లింగం లక్ష్మీకర్, సర్పంచులు ఎంపీటీసీలు ఐదు మండలాల కార్యకర్తలు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు

తిరుపతి

ప్రైవేట్​ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీవో, సీఐ

పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ బస్సులను బుధవారం ఆర్టీవో దామోదరం నాయుడు, టూ టౌన్ సీఐ ప్రకాష్ కుమార్ సంయుక్తంగా తనిఖీ చేశారు. వాహనాల ఫిట్నెస్, పత్రాలు మరియు డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. పరిమితికి మించి విద్యార్థులను విద్యార్థులను తీసుకుని వెళుతున్న రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులపై జరిమానా విధించారు. అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల భద్రతను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని, డ్రైవర్లను వేగంగా నడపవద్దని ఆయన సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.