E-పేపర్
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం. *పార్టీలకు అతీతంగా కదలిన యువత, విద్యార్థి లోకం వామపక్షాలు* ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి…కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, కడప పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి పర్యవేక్షణలో, రైల్వే కోడూరు పట్టణంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఐదు మండలాల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు, మరియు, వామపక్షాలు, మేధావులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో, కలిసి బుధవారం నాడు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ నుండి ర్యాలీగా మొదలై తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్ట ర్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం పత్రికా విలేకరులతో కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటినుండి రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలు ఉండగా 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రిగా పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకురాగా వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023-2024 లో ప్రారంభించారని తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఆదనంగా అందించారని, తదనంతరం గతేడాది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా గద్దెనెక్కడంతో వైద్య విద్యకు గ్రహణం పట్టుకుందని, 90 శాతం పనులు పూర్తయి మరికొన్ని నిర్మాణ దశలో ఉండంగా నేడు వాటిని చంద్రబాబు నాయడు పిపిపి విధానంలో ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క యొక్క ముఖ్య అనుచరులకు గంపగుత్తగా కట్టబెట్టే నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు, కొత్త వైద్య కళాశాలలను చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, ఎంబిబిఎస్ చదువు కోవాలన్న విద్యార్థుల ఆశలకు చంద్రబాబు సర్కారు గండి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు, వెంటనే ప్రైవేటీకరణను ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేట ఎంపీపీ సీనియర్ నాయకులు ముద్దా బాబుల్ రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, పుల్లంపేట మండల కన్వినర్ ముస్తాక్, పెనగలూరు మండల కన్వీనర్ చక్రపాణి, కోడూరు మండల కన్వీనర్, వైస్ ఎంపీపీ ధ్వజా రెడ్డి, రాయలసీమ జోగు బూత్ కమిటీ మెంబర్ తల్లెం రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోలమణి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రాజశేఖర్ జెడ్పిటిసి రత్నమ్మ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నంద బాల, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, వైయస్సార్సీపి ఎస్సీ సెల్ కార్యదర్శి లింగం లక్ష్మీకర్, సర్పంచులు ఎంపీటీసీలు ఐదు మండలాల కార్యకర్తలు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు