Saturday, 21 March 2026

Blog

తెలంగాణ

మత్తు ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమం

మేడ్చల్–మల్కాజ్గిరి, నవంబర్ 13 : శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల (SNIST)లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) యూనిట్ మరియు Eagle Force సంయుక్త ఆధ్వర్యంలో మత్తు ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. యువతలో మత్తు ద్రవ్యాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ Dr. టి. చి. శివారెడ్డి గారు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ Dr. ప్రీతి జీవన్ గారు మరియు Eagle Force బృందం సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ప్రధాన అతిథులుగా శ్రీ సైదులు గారు (డీఎస్పీ), శ్రీ పి. శ్రీనివాస్ గారు (ఇన్స్పెక్టర్), శ్రీమతి కె. మాధవి గారు (నేషనల్ ప్రెసిడెంట్ – ఇంపాక్ట్ ఇంటర్నేషనల్), శ్రీ రామచంద్రుడు గారు (నేషనల్ సెక్రటరీ – ఇంపాక్ట్ ఇంటర్నేషనల్), శ్రీ పర్షురామ్ బింగి గారు (ఆంటీ డ్రగ్స్ సోల్జర్), శ్రీ ఎల్. రమేష్ గారు, మరియు శ్రీ తులసీకుమార్ గారు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు విద్యార్థులకు మత్తు ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, కుటుంబం మరియు సమాజంపై వాటి దుష్ప్రభావం గురించి వివరించారు. “మత్తు ద్రవ్యాలు మన భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి – వాటికి దూరంగా ఉండటం మన బాధ్యత” అని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా Eagle Force ప్రతినిధులు తమ సంస్థ దేశవ్యాప్తంగా చేపడుతున్న Anti-Drug Awareness కార్యక్రమాల గురించి వివరించారు. వారు మత్తు ద్రవ్యాల వ్యసనాన్ని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా తీసుకుని, ప్రతి జిల్లాలో యువతలో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాజంలో మత్తు ద్రవ్యాల వ్యతిరేక పోరాటం కొనసాగిస్తూ, ప్రభుత్వ సంస్థలతో పాటు విద్యాసంస్థల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా Eagle Force బృందం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతా భావం పెంచడంలో కీలకపాత్ర పోషించింది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో NSS యూనిట్ ముఖ్యపాత్ర పోషించింది. సామాజిక సేవా దృక్పథంతో ప్రతి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తూ, సమాజ అభివృద్ధికి NSS వాలంటీర్లు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా కూడా NSS తమ సేవాతత్వాన్ని మరొకసారి ప్రతిఫలింపజేసింది.

విశాఖపట్నం

ఈ నెల 14 తేదీన విడుదల కానున్న *రోలుగుంట సూరి* సినిమా.. చిత్రం విడుదల సందర్భంగా ‘రోలుగుంట సూరి’ మూవీ ప్రెస్ మీట్ గాజువాక ప్రజల మద్దతు కోరిన మూవీ టీం…

విశాఖపట్నం, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి): గాజువాక ప్రాంతానికి చెందిన యువ హీరో ప్రధాన పాత్రలో నటించిన ‘రోలుగుంట సూరి’ సినిమా ప్రెస్ మీట్‌ నిన్న గాజువాకలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హీరో మాట్లాడుతూ — “నేను గాజువాక ప్రాంతానికి చెందిన వాడిని. నా ఊరి ప్రజల ప్రేమ, ప్రోత్సాహం ఎప్పుడూ నాకు బలం. మా సినిమా రోలుగుంట సూరి లో మన ప్రాంతానికి చెందిన , మనుషుల జీవితం ప్రతిబింబిస్తుంది. అందరూ సినిమా థియేటర్‌కి వెళ్లి సపోర్ట్‌ చేయాలి” అని కోరారు. దర్శకుడు మాట్లాడుతూ — “సూరి కథ ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం. రియలిస్టిక్ టచ్‌తో ప్రతి సీన్‌ను తీర్చిదిద్దాం. ఈ సినిమా యాక్షన్‌తో పాటు భావోద్వేగాల సమ్మేళనం అవుతుంది” అన్నారు. నిర్మాతలు — “గాజువాకలోంచి వచ్చిన యువ హీరో ప్రతిభను పెద్ద స్థాయిలో చూపించాలన్న ఆలోచనతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం” అన్నారు. సినిమా ట్రైలర్‌కి ఇప్పటికే యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ రావడం, పాటలు మంచి స్పందన పొందడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ‘రోలుగుంట సూరి’ — యాక్షన్‌, భావోద్వేగాలు, స్థానికత కలగలిసిన సినిమా ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా ప్రజలందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని మూవీ టీం కోరారు.

ఆంధ్రప్రదేశ్

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

గత కొంతకాలంగా మద్యానికి బానిసై విపరీతంగా మద్యం తాగుతున్న ఓ వ్యక్తి బుధవారం హనుమంతునిపాడు మండలంలో మృతి చెందాడు. నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ అతిగా మద్యం తాగుతూ ఇంటికి వెళ్లడం లేదు. బుధవారం మద్యం దుకాణం వద్ద మద్యం తాగేందుకు వెళ్లి ఆదినారాయణ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.

భక్తి

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. అనపర్తి మండలం సోమేశ్వరంలొ బాలా త్రిపుర బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, శాంతి కళ్యాణం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఈ కోటి దీపాల కాంతులతో వెలిగిపోయాయి. వేదమంత్రాలు, భక్తి గేయాలతో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కందర్ప కామేశ్వరరావుగారు (గ్రామ పురోహితులు) మరియు వేద పండితుల సమక్షంలో జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో దేవీప్యమానంగా సోమేశ్వరం ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులు ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోకుండా, ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. End

అన్నమయ్య

కూటమి ప్రభుత్వ మరో హామీ అమలు – 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు శ్రీకారం మేడా విజయ శేఖర్ రెడ్డి

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో ముఖ్య హామీని అమలు దిశగా నేడు ముందడుగు వేసింది.అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసిన 3 లక్షల 192 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి, ఒకేసారి గృహప్రవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని. పేదలకు సొంతిల్లు కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం నిరంతర కృషి చేసింది అని. ఆ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 నెలల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగలిగాం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేడు ఈ భారీ గృహప్రవేశ కార్యక్రమం జరిగిందని.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేద కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది అని తెలిపారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది అందులో పీఎంఏవై-బీఎల్సీ కింద 2,28,034 ఇళ్లు,పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై-జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లు,మొత్తం 3,00,192 ఇళ్ల నిర్మాణం పూర్తయింది అని తెలిపారు. మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వ సంకల్పబలం,ప్రజా సంక్షేమానికి అంకిత భావానికి నిదర్శనం.ప్రతి పేద కుటుంబానికి గృహ భద్రత కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం నిజమైన సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది” అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేసారి జరిగే ఈ గృహప్రవేశాల ద్వారా ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని మరోసారి నిలబెట్టుకుంది అని.పేదల సంతోషం కుటుంబాల స్థిరత్వం ఇదే కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

అన్నమయ్య

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్

2025–26 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.5,434 కోట్లు కేటాయించడం పట్ల టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో విశ్వమానవతా మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.రెసిడెన్షియల్ స్కూళ్లలో మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడం యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి ఆకాంక్షాల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ,పిఎం విఖ్యాస్ పథకం కింద నైపుణ్య శిక్షణ, ఇమాములకు రూ.10,000, మౌజనులకు రూ.5,000 గౌరవ వేతనం,హజ్ యాత్రికులకు ఒకొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం వంటి పథకాలు ముస్లిం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టి ఫలితంగా మైనార్టీ సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, టీడీపీ ప్రభుత్వం ముస్లిం సమాజ అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పఠాన్ మెహర్ ఖాన్ తెలిపారు.ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రివర్యులు లోకేష్ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏల కల్ల V p.r కృషితో నేరవేరిన వేల

-జాతీయ రహదారి -16పై చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వధ వెచిలే అండర్ పాస్ యెర్పట్టుకు 115 కోట్లు మంజూరు – v.p.r అనుకుంటే సాధించి తిరుతరణి మరోసారి రుసువైంధి -గతంలో నిత్యం ట్రాఫిక్,ప్రమధాలతో అవస్థలు పడే వారు ప్రజలు -ఇకాపై ప్రమధలకు తవుందాదు….ట్రాఫిక్ కి ఇబంది వుండదు -చింతారెడ్డి పాలెం జంక్షన్ నుండి ముత్తుకూరు రోడ్డు వరకు ఇరువిపుల సర్వీస్ రోడ్లు ఏర్పటు -సి.ఎం.చంద్రబాబు గారికి,కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ వేమిరెడ్డి -వేమిరెడ్డి కృషి వల్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Blog

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం… కందం తొక్కిన వైసీపీ శ్రేణులు

వైద్య కళాశాలలను, వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని, ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్యలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి ఇచ్చిన పిలుపు మేరకు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, వైసిపి స్టేట్ కౌన్సిల్ నెంబర్స్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, స్టేట్ వైసిపి మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళ రెడ్డి ఎంపీపి, ఆర్థర్ సైమాన్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసిపి మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు కారు రవికుమార్ వైసీపీ జిల్లా సెక్రెటరీలు దేవనగర్ బాషా, శివనాగిరెడ్డి, సాంస్కృతిక విభాగం వైసీపీ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ గోస్పాడు మండలం వైసిపి అధ్యక్షుడు పి పి రాజశేఖర్ రెడ్డి నంద్యాల మండలం వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తమ రెడ్డి విజయ శేఖర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్చార్జులు, సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నేతల ఆధ్వర్యంలో, వైసీపీ విద్యార్థి విభాగం, వైసీపీ నేతలు, శ్రేణులు నేడు నంద్యాల పట్టణం ఉదయానందా రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడు చేయని విధంగా ఏకంగా 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. మొదటి విడతలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, ఈ కళాశాలల్లో 750 మెడికల్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లో నంద్యాల ఉండటం, అందులో చదివిన ప్రథమ సంవత్సరంలో చదివిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వకారణం అన్నారు. నంద్యాల మెడికల్ కళాశాలకు 16 పీజీ సీట్లు కేటాయించారని తెలిపారు. అలాగే 11 డిస్టింక్షన్ లు సాధించారని చెప్పారు. ఇటువంటి సమయంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలం చేయాలని, పేదవారికి మెడికల్ విద్య అందకుండా చేయాలని కక్ష గట్టారని విమర్శించారు. ఇది ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేట్ ప్రభుత్వమా అని సూటిగా ప్రశ్నించారు. 2లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తానని ప్రగల్బాలు పలుకుతున్న ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణాలకు 5వేల కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు, వారి వ్యాపార ప్రయోజనాల కొరకు పీపీపీ విధానం తీసుకు రావడం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెదచెరుకురు లో విషాదచాయలు

• ఎన్టీఆర్ నగర్ వధ హైవే పై జరిగినా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగురు పెదచెరుకూరు సిరిగార్డెన్స్ వాసులే • నెల్లూరు 2వ డివిజన్ పరిధిలోని సిరిగార్డెన్స్ లో మృతుల బౌతికకాయలకు నివాళర్పించిన సర్వేపల్లి శాసన సబ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి •ఒకే ప్రదేశానికి చెందినా ముగురు ఓకే ఘటనలో ప్రాణాలు కోల్పోవడం,అందులో ఇధారు తండ్రి కొడుకులు కవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సోమిరెడ్డి •బాధిత కుట్టుంబలను పరమర్సించి సానుబూతి తేలియపరిచిన సోమిరెడ్డి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దేశాలే ఈర్ష్యపడే అద్భుతం — గ్రేటర్ వైజాగ్ ట్రిలియన్ ఎకానమీ వైపు!

భారతదేశ అభివృద్ధి పటంలో విశాఖపట్నం ఒక కొత్త చరిత్ర రాయబోతోంది. సాంకేతికత, పరిశ్రమ, పర్యాటకం, మౌలిక సదుపాయాలు – అన్ని రంగాల్లో వేగంగా ముందుకెళ్తున్న గ్రేటర్ వైజాగ్ ఇప్పుడు ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు చిన్న పోర్ట్ నగరంగా ఉన్న విశాఖ, ఇప్పుడు ప్రపంచ దేశాలే ఈర్ష్యపడే స్థాయికి ఎదుగుతోంది. సముద్రతీర పరిశ్రమలు, ఐటీ పార్కులు, మెట్రో ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ పరిశోధనలు నగరానికి కొత్త ఊపును అందిస్తున్నాయి. ‘ఇది సాధ్యమేనా?’ అని ఎగతాళి చేసిన వారిని ఆశ్చర్యపరుస్తూ వైజాగ్ ఇప్పుడు గ్లోబల్ హబ్‌గా మారుతోంది. భారత సాంకేతిక రంగాన్ని మళ్లీ నిర్వచించే ఈ అద్భుతం, ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణం. గ్రేటర్ వైజాగ్ — రాబోయే తరాల గర్వం, భారత ఆర్థిక శక్తికి కొత్త గుర్తింపు!

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.