రంగారెడ్డి
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : కామారెడ్డిలో తలపెట్టిన బీసీల ఆక్రోశ సభకు బీసీ కులాల ప్రజలు పెద్ద పాల్గొని విజయవంతం చేయాలని బీసీఐఎఫ్ రంగా రెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు పిలుపు నిచ్చారు. గురువారం ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ నెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రం సత్య కన్వెన్షన్ హాల్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీల అక్రోశ సభకు బీసీ సంఘాల, బీసీ కుల సంఘాల, బీసీ మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీల ఆక్రోశ సభకు ముఖ్య అతిథులుగా బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీఐఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ చామకూర రాజు, తదితరులు పాల్గొననున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉప వర్గీకరణతో అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. స్థానిక సంస్థలో 42 శాతం రిజర్వేషన్లతో పాటు దాదాపు 21 హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు ఏళ్ళు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. బీసీ హక్కులను విస్మరించిన ఏ ఒక్క పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.