Saturday, 21 March 2026

Blog

రంగారెడ్డి

* శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న..సిహెచ్ యాదయ్య *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్న అమీర్‌పెట్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య వారితో పాటుగా మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్, మహేశ్వరం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ తదిరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* అయ్యప్ప స్వాముల సన్నిధాన పనులు పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : మహేశ్వరం మండలం కొత్వాల్ చెరువు తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్వాల్ చెరువు కట్టపై గతంలో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా పట్లోళ్ల కార్తీక్ రెడ్డి నిర్మించిన పరమేశ్వరుని 40 అడుగుల భారీ విగ్రహం పక్కన అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న సన్నిధాన నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డ అనంతరం మాట్లాడుతూ వీలైనంత త్వరగా సన్నిధాన పనులు పూర్తి చేసి స్వాములకు అందివ్వాలని మాలదారణ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోచారం సుధాకర్ రెడ్డి మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆదిల్ అలీ పిఎసిఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్ వద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* మల్రెడ్డి రాంరెడ్డి నగర్‌లో సీసీ రోడ్ అభివృద్ధి పనులకు శ్రీకారం –14 లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడ గ్రామం 26 వ డివిజన్ మల్రెడ్డి రాంరెడ్డి నగర్ కాలనీ రోడ్ నంబర్–2లో 14 లక్షల జనరల్‌ ఫండ్స్‌తో సీసీ రోడ్ అభివృద్ధి పనులను కాలనీ వాసులతో కలిసి సీసీ రోడ్‌ నిర్మాణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటెస్టెంట్ కార్పొరేటర్ నావారు మల్లారెడ్డి అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.గత బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి పనులు నిర్లక్ష్యం చెయ్యడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.ముఖ్యంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ కాలనీలలో అంతర్గత రోడ్లు మరియు మెయిన్‌ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు సీసీ రోడ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినసీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు,మహేశ్వరం ఇన్‌చార్జ్ కే.ఎల్.ఆర్ పారిజాత నరసింహ్మారెడ్డి,మున్సిపల్‌ కమిషనర్ సరస్వతి,డీఈ,ఏఈలకు కాలనీ వాసుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగన్నాధం యాదగిరి పోతులూరి చారి,మనోహర్ రెడ్డి వెంకటరమణ,బాషా వెంకటేశ్వర్లు,అశోక్ చారి,మహేష్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా –నవీన్ యాదవ్ విజయ తథ్యం- సిహెచ్ యాదయ్య *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరనుంది అని మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.గురువారం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్న లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు, కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు యాదయ్య మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో 282 బూత్ పరిధిలో పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించామని,యువ నాయకుడు నవీన్ యాదవ్ విజయం తద్దేమని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి ఎర్ర నవీన్ కుమార్,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* కామారెడ్డి బీసీల ఆక్రోశ సభను విజయవంతం చేద్దాం — బీసీఐఎఫ్ కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు పిలుపు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : కామారెడ్డిలో తలపెట్టిన బీసీల ఆక్రోశ సభకు బీసీ కులాల ప్రజలు పెద్ద పాల్గొని విజయవంతం చేయాలని బీసీఐఎఫ్ రంగా రెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు పిలుపు నిచ్చారు. గురువారం ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ నెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రం సత్య కన్వెన్షన్ హాల్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీల అక్రోశ సభకు బీసీ సంఘాల, బీసీ కుల సంఘాల, బీసీ మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీల ఆక్రోశ సభకు ముఖ్య అతిథులుగా బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీఐఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ చామకూర రాజు, తదితరులు పాల్గొననున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉప వర్గీకరణతో అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. స్థానిక సంస్థలో 42 శాతం రిజర్వేషన్లతో పాటు దాదాపు 21 హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు ఏళ్ళు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. బీసీ హక్కులను విస్మరించిన ఏ ఒక్క పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.

నాగర్‌కర్నూల్

విద్యార్థుల‌పై టీచ‌ర్ పైశాచికం.. ఏకంగా 30 మందిపై..!

క‌ల్వ‌కుర్తి : సాధార‌ణంగా జోక్ వేస్తే ఎవ్వ‌రైనా న‌వ్వుతారు. న‌వ్వ‌డ‌మే ఆ విద్యార్థులు చేసిన పాపం.. 30 మంది విద్యార్థుల‌ను గొడ్డును బాదిన‌ట్టు బాదాడు ఉపాధ్యాయుడు. ఈ ఘ‌ట‌న కల్వ‌కుర్తి ప‌ట్టణంలోని మినిస్టేడియంలో ఉన్న మ‌హాత్మ‌గాంధీ జ్యోతి బాపూలే గురుకుల విద్యాల‌యం(బాలుర‌) పాఠ‌శాల‌లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణంలోని మినీ స్టేడియంలో మ‌హాత్మ జ్యోతి బాపులే గురుకుల విద్యాల‌యంలో ఈనెల 11న 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మధ్యాహ్న భోజ‌న‌ సమయంలో బయాలజీ పరీక్ష నిర్వహించారు. ఇన్విజిలేటర్ గా గెస్ట్ టీచర్ అయిన వెంకటేశ్వర్లు ను పంపారు. అదే సందర్భంలో ఈ ఇన్విజిలేటర్ పిల్లలపై జోక్ వేయగా ఆ తరగతి విద్యార్థులు పడి పడి నవ్వారు. అదే క్రమంలో విద్యార్థులు గుసగుస లాడుతూ పగలపడి నవ్వడంతో ఆవేశంతో రెచ్చిపోయిన గెస్ట్ టీచర్ 30 మందికి పైగా విద్యార్థులను బెత్తంతో, చేతితో విపరీతంగా, క్రూరంగా వీపులపై, కాళ్ళపై వాతలు వచ్చేలా కొట్టాడు.ఈ విషయమై విద్యార్థులు వారి క్లాస్ టీచర్ తో వెళ్లి ప్రిన్సిపల్ ఉష రాణికి కంప్లైట్ చేశారు. మరుసటి రోజు విచారణ చేసిన ప్రిన్సిపల్ దీనిపై స్పందించి ఆర్సివో కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. గెస్ట్ టీచర్ ను విధుల నుంచి తోలగించింది. ఈ విషయమై గురువారం విద్యార్థి సంఘాలు, పలు సంఘాల నాయకులు వెళ్లి పాఠ‌శాల వద్ద నానా రభస చేశారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మా పిల్లలను క్రురంగా బాదిన టీచర్ పై విధుల నుంచి తొలగించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రిన్సిపల్ ను కోరారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఆ టీచర్ కు చర్యలు తప్పనిసరిగా ఉంటాయని ఆమె తెలిపారు.

అన్నమయ్య

జిల్లా స్థాయి టైక్వాండో పోటీలకు శ్రీ సాయి వికాస్ విద్యార్థుల ఎంపిక

అన్నమయ్య జిల్లా, చిట్వేల్‌లోని శ్రీ సాయి వికాస్ హై స్కూల్ విద్యార్థులు క్రీడా రంగంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో మెరిసిన ఈ విద్యార్థులు, ఆ తర్వాత రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అద్భుత ప్రదర్శన ఇచ్చి జాతీయ వేదికపై తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. …జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు: సాయి వికాస్ హై స్కూల్ నుండి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు: …వై. అనూజ్ (9వ తరగతి) …పి. సుదీప్ (9వ తరగతి) …కె. ధావనేశ్వర్ రెడ్డి (7వ తరగతి) …కె. గీతేశ్వర్ రెడ్డి (6వ తరగతి) కరస్పాండెంట్ అభినందన: ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య విద్యార్థులను ఘనంగా అభినందించారు. “చదువుతో పాటు క్రీడలలోనూ మా విద్యార్థులు ప్రతిభ చూపడం మాకు ఎంతో గర్వకారణం. జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించి, పాఠశాల ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను,” అని ఆయన అన్నారు. విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్ శివాజీ, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల ఈ విజయాలపై ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలోనూ ఈ విద్యార్థులు పతకాలు సాధించాలని వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నమయ్య

కేజీబీవీ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు — చిట్వేలి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శిబిరం – విద్యార్థులకు పరీక్షలు చేసిన ఆప్తలామిక్ అధికారి ఓబులేసు

చిట్వేలి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కోసం గురువారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యుడు డాక్టర్ మహమ్మద్ అన్సారి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. ఆప్తలామిక్ అధికారి ఓబులేసు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలున్న వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు.కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స లేదా కళ్లద్దాలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ తులసి, హెల్త్ ఆఫీసర్ విజయ్ కుమార్, హెచ్.పి. యా భాను, ఏ.ఎన్.ఏ. ఫరీదా సహా పలువురు ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఉక్కు కార్మికుల సమస్యలను పరిష్కరించండి . __ ఇంటక్ విజ్ఞప్తి . విశాఖ ఉక్కు కర్మాగారం లో కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్టీల్ ఇంటక్ ఉక్కు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ప్లాంట్ జనరల్ మేనేజర్ ( హెచ్.ఆర్) ఎన్. బాను కు ఇంటక్ ప్రతినిధి వర్గం వినతి పత్రం అందజేసింది . ఈ సందర్భంగా ఇంటక్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజ శేఖర్ , స్టీల్ ఇంటక్ అధ్యక్షులు పి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం నిర్దేశించిన మేరకు ఉక్కు ఉత్పత్తి, ఉత్పాదకల్లో భాగస్వాములై కృషి చేస్తున్నారని అన్నారు. ఉక్కులో మ్యాన్ పవర్ కొరత తీవ్రంగా ఉందని , తద్వారా ఉక్కు ఉద్యోగులపై పని బారం పెరిగిందని అన్నారు . తక్షణమే మ్యాన్ పవర్ పెంచాలని , మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల కార్మికులు సెలవులు వాడటం లేదని అన్నారు. ఈ సమస్య వల్ల ఈ ఎల్స్ వాడటం లేదని అన్నారు. ఈ ఎల్ ఎన్క్యాష్మెంట్ కు అవకాశం ఇస్తే ఉద్యోగుల పిల్లలకు స్కూల్ ఫీజు లు , ఇతర అవసరాలకు ఉపయోగ పడతాయని అన్నారు .ఈ ఎల్స్ అధికారులకు మాదిరిగా 200 లీవ్స్ నుండి 300 లీవ్స్ ఇచ్చినట్లయితే కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఇంటక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము ప్రసాద్ , సీనియర్ నాయకులు నడుపూరు వెంకన్న ,కోరిబిల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు కౌంటింగ్‌ కోసం మొత్తం 42 టేబుల్స్‌ ఏర్పాటు ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనున్న కౌంటింగ్‌ మొత్తం 10 రౌండ్లలో తేలనున్న ఉప ఎన్నిక ఫలితాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదట షేక్ పేట డివిజ‌న్ నుండి ప్రారంభం ఆ త‌ర్వాత వెంగ‌ళ్ రావు న‌గ‌ర్ , ర‌హ‌మ‌త్ న‌గ‌ర్, యూస‌ఫ్ గూడ‌, సోమాజిగూడ‌, బోర‌బండ‌, ఎర్ర‌గ‌డ్డ డివిజ‌న్లతో పూర్తి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.