Friday, 20 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

విజయవాడను షెల్టర్ జోన్‌గా ఎందుకు ఎంచుకున్నారు మావోయిస్టులు? పెనమలూరులో 27 మంది అరెస్ట్… పోలీసు దర్యాప్తుతో సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ, వాణిజ్య, భౌగోళిక పరంగా అత్యంత కీలకమైన నగరమైన విజయవాడను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా ఎంచుకోవడం ప్రస్తుతం రాష్ట్ర భద్రతా వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశమైంది. పెనమలూరు–న్యూ ఆటోనగర్ ప్రాంతంలో అద్దెకున్న ఒక భవనంలో దాక్కున్న 27 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ – హిడ్మా డైరీ ఆధారంగా సూత్రాలు ఇటీవల అల్లూరి జిల్లాలో జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ అనంతరం లభించిన హిడ్మా వ్యక్తిగత డైరీలో, “బెజవాడ – సేఫ్ జోన్” అనే సూచనలతో కూడిన వివరాలు భద్రతా బలగాలకు లభించాయి. ఈ వివరాలు నిజమేనా అన్న అనుమానాలపై పోలీసులు విస్తృత గాలింపు చేపట్టి పెనమలూరులో సరిగ్గా ఆ సూచనల ప్రకారం ఒక నెట్‌వర్క్ పనిచేస్తోందని గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చిన కీలక సభ్యులు అదుపులోకి తీసుకున్న 27 మందిలో చాలా మంది ఛత్తీస్‌గఢ్ దండకారణ్య జోన్‌ కు చెందినవారిగా తెలిసింది. వీరంతా హిడ్మా ప్రభావంలో పనిచేస్తున్నదిగా పోలీసులు భావిస్తున్నారు. సుమారు 15 రోజుల క్రితమే న్యూ ఆటోనగర్‌లో అద్దెకు చేరారు. అద్దెకు తీసుకునే సమయంలో “మేము కూలీ పనులకు వచ్చాం” అని ఇల్లు యజమానికి చెప్పినట్లు సమాచారం. ఏందుకు విజయవాడ? — పోలీసులు గుర్తించిన 5 కారణాలు 1. రాజధాని అమరావతి నిర్మాణ పనులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ▪ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది మంది కార్మికులు, ▪ రోజూ మారే మానవ ప్రవాహం వీటితో కలిసిపోయి, మావోయిస్టులు ఎవరూ గుర్తించరని భావించి ఉండవచ్చు. 2. పరిశ్రమలు & ట్రాన్స్‌పోర్ట్ హబ్ – “సందేహం రాని వాతావరణం” న్యూ ఆటోనగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో ▪ వర్క్‌షాప్‌లు, ▪ లారీ యార్డులు, ▪ కూలీలు, మెకానిక్లు, రోజువారీ కార్మికులు చాలా మంది ఉండటం వల్ల భాష, ప్రవర్తన, వస్త్రధారణ వల్ల కూడా ఎవరూ అనుమానించరని భావించారు. 3. భౌగోళిక ప్రయోజనం – “నడిబొడ్డులోనూ, అడవులకు చేరే మార్గాలు కూడా ఉన్నాయి” విజయవాడ నుండి: ▪ ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు రోడ్డు మార్గాలు, ▪ గుంటూరు–నల్లమల అటవీ మార్గాలకు కనెక్టివిటీ ఉండటం వల్ల పంపిణీ–సంపర్క కేంద్రంగా ఉపయోగించుకోవచ్చని భావించారు. 4. ఒడిశా–ఛత్తీస్‌గఢ్ లో పెరిగిన కంబింగ్ ఆపరేషన్లు ఇటీవల రెండు రాష్ట్రాల్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించడంతో, తాత్కాలికంగా AP లో దాక్కోవడం వీరు సురక్షితంగా చూస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. 5. “ఆపరేషన్ కోసం వచ్చారా?” అన疑ం హిడ్మా డైరీలో ఉన్న సర్వే పాయింట్లు ఆధారంగా ▪ ఏదైనా కొత్త ఆపరేషన్‌కు ముందుగా బెజవాడలో సమావేశం కావాలనుకున్నారా? ▪ లేక హిడ్మా ఆదేశాల కోసం ఇక్కడ ఎదురు చూసారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లు యజమాని విచారణలో కీలక వివరాలు భవన యజమాని అప్పలస్వామి విశాఖలో ఉండటం వల్ల ఆయనను కూడా ప్రశ్నిస్తున్నారు. ▪ అద్దె ఎలా ఇచ్చారు? ▪ ఎవరి ద్వారా సంప్రదించారు? ▪ ఐడీ ప్రూఫులు తీసుకున్నారా? అన్న అంశాలు పరిశీలనలో ఉన్నాయి. విస్తరిస్తున్న సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికే ▪ ఏలూరులో 12 మంది, ▪ కాకినాడ కొప్పవరం వద్ద 2 మంది మావోయిస్టులు అదుపులోకి రావడంతో భద్రతా బలగాలు అల్లూరి – కాకినాడ – ఏలూరు – కృష్ణా – ఎన్టీఆర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. పోలీసు వర్గాల విశ్లేషణ భద్రతా అధికారులు ఒక కీలక అంశాన్ని పరిశీలిస్తున్నారు: > “హిడ్మా డైరీ బయటపడకపోయి ఉంటే ఈ నెట్‌వర్క్‌ను గుర్తించడం చాలా కష్టమయ్యేదని” వీరు ఇప్పటికే అమరావతి నిర్మాణ ప్రాంతాలను, పరిశ్రమలను, రవాణా మార్గాలను రహస్యంగా రికార్డు చేసి ఉండవచ్చన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది.

ఎన్ టి ఆర్ జిల్లా

భగవద్గీత జయంతి సందర్భంగా పఠన శిక్షణ ప్రారంభం

విజయవాడ, లబ్బీపేట — పున్నమి ప్రతినిధి శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల తెలుగు విభాగం వారు డిసెంబరు 1న జరగనున్న భగవద్గీత జయంతి పురస్కరించుకొని, ఈరోజు (14-11-2025) నుండి భగవద్గీత పఠన శిక్షణ కార్యక్రమాన్ని INDIAN KNOWLEDGE SYSTEM వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో🙏🙏🙏 డాక్టర్ గుది మెళ్ళ మంజుల శిక్షణనిస్తున్నారు. ఈ శిక్షణలో పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటూ గీతా శ్లోకాల తాత్త్విక భావాలను తెలుసుకుంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ శిక్షణ విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, విలువలపట్ల అవగాహన పెంచుతుందని పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జాతీయ వ్యవస్థాపక దినోత్సవం: మహిళా సాధికారతపై ప్రత్యేక సెమినార్

ఈరోజు అనగా 18/11/25 వాణిజ్యం మరియు నిర్వహణ విభాగం జాతీయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా “Empowering women, Empowering earth: The story behind Biodegradable sanitary napkins” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు రిసోర్స్ పర్సన్ గా శ్రీమతి S.Jaya Lakshmi (పృధ్వీ ఇన్నోవేషన్స్ ప్రాజెక్టు డైరెక్టర్) గారు పాల్గొన్నారు. మిగత వస్తువులు ఎలా అయితే ఆరోగ్యానికి మేలు చేసేవి ఎంపిక చేసి కొనుగోలు చేస్తామో శానిటరీ నాప్కిన్స్ కొనేటప్పుడు కూడా అలానే ఏవీ ఆరోగ్యానికి హాని చేయవో వాటిని ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలని సిగ్గు పడాల్సిన అవసరం లేదని తెలియచేశారు. ఆమె ఈ వ్యాపారాన్ని లాభో ద్దేశంతో కాకుండా సేవా దృక్పథంతో ప్రారంభించామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr.V.V సుబ్రహ్మణ్య కుమార్ గారు ప్రసంగిస్తూం తమ కళాశాల నుంచి ఎంతో మంది విద్యార్ధులు ఎంట్రప్రిన్యూర్ల్స్ గా ఎదగాలి అనే ఉద్ధేశ్యంతో ఎంట్రప్రిన్యూర్సగా ఎదిగి విజయం సాధించిన వారిని రిసోర్స్ పర్సన్ గా ఆహ్వానించి వారి విజయగాధలలో విద్యార్థులలో ప్రేరణను నింపుతున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr. V.V. సుబ్రహ్మణ్య కుమార్ గారు, వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగాధిపతి, Dr. V. సంధ్యా లక్ష్మి . ఇతర అధాపకులు మరియు విదార్థినులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

గీతా జయంతి పురస్కరించుకొని పఠన శిక్షణ ప్రారంభం

📰 భగవద్గీత జయంతి సందర్భంగా పఠన శిక్షణ ప్రారంభం విజయవాడ, లబ్బీపేట — పున్నమి ప్రతినిధి శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల తెలుగు విభాగం వారు డిసెంబరు 1న జరగనున్న భగవద్గీత జయంతి పురస్కరించుకొని, ఈరోజు (14-11-2025) నుండి భగవద్గీత పఠన శిక్షణ కార్యక్రమాన్ని INDIAN KNOWLEDGE SYSTEM వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో ప్రారంభమైంది. శిక్షణలో పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటూ గీతా శ్లోకాల తాత్త్విక భావాలను తెలుసుకుంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ శిక్షణ విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, విలువలపట్ల అవగాహన పెంచుతుందని పేర్కొన్నారు.

విశాఖపట్నం

శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహణ!.. ఈఓ శోభారాణి.

విశాఖ పట్నం, నవంబర్ 19. నగరంలోని వన్ టౌన్ బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారికి శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ దేవస్థానం కార్యనిర్వహణాధి కారిణి కె.శోభారాణి తెలిపారు. బుధవారం దేవస్థానం ఆవరణలోని అన్న ప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మార్గశిర మాసోత్సవాలను నవంబర్ 21వ తేదీ శుక్రవారం నుంచి, డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం వరకు సాంప్రదాయ బద్ధంగా జరుపుతా మన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యా యన్నారు. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు వేద సభ అర్చక సదస్సును, డిసెంబర్ 13వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రథ యాత్ర, డిసెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్నదానం అదే రోజు సాయంత్రం 4 గంటలకు సహస్ర ఘటాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు ఘనంగా జరుపుతా మన్నారు. ఈ కార్యక్రమాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశా మన్నారు. చలువ పందిళ్ళు వేయడంతో పాటుగా, భక్తులకు మంచి నీటి సదుపాయం కూడా కల్పిస్తున్నా మన్నారు. భక్తులు దేవస్థానం సిబ్బంది, వాలంటీర్లకు సహకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ మీడియా సమావేశంలో విశాఖ జిల్లా సమాచార శాఖాధికారి సదారావు, జిల్లా సహాయ సమాచార అధికారి నారాయణ రావు, దేవస్థానం సహాయ కార్యనిర్వహణా ధికారి రాజేంద్ర కుమార్, దేవస్థానం పురోహితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చంద్రబాబు పరిశ్రమల దిశలో దూకుడు – రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు లక్ష్యం :- మేడా

జగన్‌రెడ్డి ప్రభుత్వ విధానాల వల్ల భయపడి రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిశ్రమలు, ఊపిరి పీల్చుకోలేని హీరూ ఫ్యూచర్స్, రెన్యూ,ఎబిసి లాంటి కంపెనీలను తిరిగి రాష్ట్రంలో స్థిరపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి ఎంతో కీలకం అవుతున్నాయని నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 17 నెలలలోనే 20 ఇండస్ట్రియల్ పాలసీలను ప్రకటించడం ద్వారా ప్రభుత్వ నిబద్ధత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది అని.పరిశ్రమల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందినీ.సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అని.రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం,వేగవంతమైన పారదర్శక పరిపాలన,ఆన్‌లైన్ సేవల ఆధారిత వ్యవస్థను బలోపేతం చేస్తూ,ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు రాష్ట్ర యువతకు లభించే అవకాశం ఉందని.ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడుల కోసం ముందుకు వస్తుండటం ఎంతో సంతోషకరం అని పేర్కొన్నారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు,పారదర్శక విధానాలు,శాంతి భద్రతలు, నైపుణ్య శిక్షణ ఇవన్నీ సమగ్రంగా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇండస్ట్రీస్ హబ్ గా నిలుస్తుందినీ.పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగాలు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల వరకు ఆర్థిక లావాదేవీలు,జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని అన్నారు.ప్రభుత్వం తీసుకొస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్కిల్‌ డెవలప్‌మెంట్,టెక్నాలజీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్ వైపు ముందుకు రావాలి” అని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

👆 టీటీడీకి రూ.2 కోట్లు విరాళం తిరుమల, 2025 : హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ శ్రీమతి రోషణి నాడర్ మంగళవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

ఈరోజు రెండో విడత నిధులను విడుదల

‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా అన్నదాతకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం చేస్తామన్న సూపర్ సిక్స్ హామీని నిలబెట్టుకుంటూ… మొదటి విడత కింద ఒక్కో రైతుకు రూ.7000 చొప్పున 2025 ఆగస్టు 2వ తేదీన రైతు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఈరోజు రెండో విడత నిధులను విడుదల చేస్తోంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ రోజు అన్నదాత సుఖీభవ & పీఎం కిసాన్ నిధుల జమ

ఈ రోజు దేశవ్యాప్తంగా రైతులకు భారీ శుభవార్త అందుతోంది. తమిళనాడు కోయంబత్తూర్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పీఎం కిసాన్ 21వ విడతగా రూ.7,000 వరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఈ నిధులు అందించబడుతున్నాయి. రైతులు తమ స్టేటస్‌ను తప్పకుండా ఒకసారి చెక్ చేసుకుని నిధులు ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలి. 🔗 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి: Annadatha Sukhibhava Status Check 2025: అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయా రావో చెక్ చేసుకోండి? 🔗 పీఎం కిసాన్ 21వ విడత స్టేటస్ చెక్ చేయండి: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూ.2,000 స్టేటస్ : PM Kisan Payment Status ప్రతి రైతు కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమకు లభించాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందుకున్నారో లేదో పరీక్షించుకోవాలి.

తెలంగాణ

నషా ముక్త భారత్ :కలెక్టర్

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాదక ధ్రవ్యాల దుర్వినియోగం పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మత్తుమందులు, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దని, ఇవి స్లో పాయిజన్ లాంటివని, ఒకసారి అలవాటైతే వదులుకోవడం కష్టమని, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు అని, జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని, చదువు వదిలేసి, మత్తుమందులకు అలవాటు పడితే జీవితాంతం ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, అందువల్ల క్రమశిక్షణతో, ఓపికగా చదువుకోవాలని, మంచి పౌరులుగా ఎదగాలని, చదువుతోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉందని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.