Wednesday, 18 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా

వెంకటాచలం నవంబరు (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు డేవిడ్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి, సత్య ప్రియ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రానికి పూలదండ అర్పించి ఆయన చేసిన రాజ్యాంగ సేవలను స్మరించారు. అనంతరం సిబ్బంది, విద్యార్థులు కలిసి రాజ్యాంగ పీఠికను వాచించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డేవిడ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో ప్రారంభమైన రచనా ప్రక్రియ 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు సాగి, 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిందని, 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి విద్యార్థులు రాజ్యాంగ విలువలను ఆచరించి ఆదర్శ పౌరులుగా ఎదగాలని సూచించారు. తరువాత వక్తృత్వ, క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. మిఠాయిలు పంచి, జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది. ఉపాధ్యాయులు కొమ్మల కృష్ణయ్య, శ్రీలక్ష్మి, సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం*

*ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం* *రాజోలు విశాఖ పున్నమి ప్రతినిధి:- * – రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో పల్లె పండగ 2.0 – గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనులకు శ్రీకారం – రూ. 5,838 కోట్ల అంచనాతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు, రూ.375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు – రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు – ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు – మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది – అబద్ధపు హామీలతో జెన్ జి యువతను మోసం చేయలేం – సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది – రాజోలు నియోజక వర్గం శివకోడు గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండగ తొలి దశకు సంబంధించి చేపట్టిన పనులు ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా తిలకించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ. ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించిన కేంద్రం. ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మీ సిమ్‌ దుర్వినియోగమైతే మీదే బాధ్యత: డాట్‌

కొందరు సిమ్‌కార్డులు ఎడాపెడా కొనుగోలు చేసి మూలన పడేస్తుంటారు. వాడడం లేదన్న కారణంతో ఏదో ఒక సందర్భంలో తెలిసిన వ్యక్తులే కదా అని ఇచ్చేస్తుంటారు. ఒకవేళ అలా ఇచ్చిన నంబర్‌ సైబర్‌ మోసాలకో, చట్టవ్యతిరేక కార్యకలాపాలకో వాడినట్లు తేలితే ఆ సిమ్‌ కార్డు యజమానిగా మీరూ బాధ్యులే!

అన్నమయ్య

కందుల గుండయ్య నాయుడు బౌతికాయానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించిన కె.కె. చౌదరి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీ కందుల గుండయ్య నాయుడు గారి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ​బుధవారం ఉదయం చిట్వేలి మండలంలోని కె. కందులవారిపల్లిలో కందుల గుండయ్య నాయుడు గారి అంతిమ యాత్రకు ముందు, చైర్మన్ కె.కె. చౌదరి ఆయన భౌతికకాయానికి టీడీపీ జెండాను కప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, ప్రజలకు కందుల గుండయ్య నాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. ​ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి విశ్వనాథ నాయుడు, చిట్వేలి మాజీ ఎం.పీ.పి కట్టా గుండయ్య నాయుడుతో పాటు చిట్వేలి మండలంలోని పలువురు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాయకులు అంతా కలిసి దివంగత నాయకుడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అన్నమయ్య

కందుల గుండయ్య నాయుడు బౌతికాయానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించిన కె.కె. చౌదరి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీ కందుల గుండయ్య నాయుడు గారి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ​బుధవారం ఉదయం చిట్వేలి మండలంలోని కె. కందులవారిపల్లిలో కందుల గుండయ్య నాయుడు గారి అంతిమ యాత్రకు ముందు, చైర్మన్ కె.కె. చౌదరి ఆయన భౌతికకాయానికి టీడీపీ జెండాను కప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, ప్రజలకు కందుల గుండయ్య నాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. ​ఈ నివాళి కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కస్తూరి విశ్వనాథ నాయుడు, చిట్వేలి మాజీ ఎం.పీ.పి కట్టా గుండయ్య నాయుడుతో పాటు చిట్వేలి మండలంలోని పలువురు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాయకులు అంతా కలిసి దివంగత నాయకుడికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తూర్పు గోదావరి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా IAB మీటింగ్ పెడితే గోదావరి డెల్టాకి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రైతులు, ప్రజాప్రతినిధులు తెలియచేయడం జరుగుతుందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా IAB మీటింగ్ పెడితే గోదావరి డెల్టాకి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రైతులు, ప్రజాప్రతినిధులు తెలియచేయడం జరుగుతుందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి IAS గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా యిరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రాజమండ్రిలో జరిగిన మీటింగులో MLA నల్లమిల్లి మాట్లాడుతూ… ఆయకట్టు ధవళేశ్వరంలో మొదలై అటు కాకినాడలో గానీ ఇటు కోనసీమలో గానీ ముగుస్తున్న తరుణంలో ఆ రెండు జిల్లాలకు చెందిన యంత్రాంగం లేకుండా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అధికారులతో మాత్రమే సమావేశం కావడం వల్ల ఉపయోగం ఉండదు గోదావరి డెల్టా విడిపోయిన 3 జిల్లాలకు ఇంటర్ లింక్ కావడం చేత మూడు జిల్లా అధికారులతో కలసి ఒకటే మీటింగ్ పెట్టడం వలన సమస్యల పరిష్కారం సులభంగా ఉంటుంది గతంలో గోదావరి డెల్టా అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు రెండూ కలిపి మీటింగ్ జరిపేవారు, అప్పుడు ఒక డెసిషన్ తీసుకునేవారు కానీ ఇపుడు ఇలా విడిగా పెట్టడం వలన ఫలవంతమైన డిస్కషన్లు జరుగవు MLA నల్లమిల్లి వాదనను సమర్ధిస్తూ మూడు జిల్లాలకు సరైన కోఆర్డినేషన్ జరుగకపోతే విడి మీటింగ్ ల వలన ఉపయోగం ఉండదని MP పురంధేశ్వరి గారు సమావేశంలో అధికారులను ఉద్దేశ్యించి అన్నారు. ఇరిగేషన్ సర్కిల్ ధవళేశ్వరం అని ఏలూరు అని ఇస్తున్నారు, ఈస్ట్రన్ సర్కిల్ అంటే కంబైన్డ్ గోదావరి జిల్లాలు, ఇది సరైన విధానం కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా IAB మీటింగ్ పెడితే గోదావరి డెల్టాకి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రైతులు, ప్రజాప్రతినిధులు తెలియచేయడం జరుగుతుందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి గత ప్రభుత్వం హయాంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మతులకు, గేట్స్ రిపేర్స్ కి నిమిత్తం వరల్డ్ బ్యాంక్ 200కోట్లు నిధులు మంజూరు చేస్తామన్నా పట్టించుకోక పోవడంతో మొత్తం 175 గేట్లకు గాను 115 గేట్లు పాడైపోయి బ్యారేజ్ ప్రమాదకర స్థితికి వెళ్లిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 150 కోట్లు మంజూరు చేసి కాటన్ బ్యారేజ్ ను ప్రమాదకర పరిస్థితి నుండి కాపాడినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, యిరిగేషన్ మినిస్టర్, జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టాలి. సభ్యులoదరూ తీర్మానానికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు, కొవ్వూరు శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శ్రీ మేఘా స్వరూప్ IAS రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్ డి వో లు, DC చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అన్నమయ్య

అరవపల్లి లైబ్రరీలో రాజ్యాంగ దినోత్సవం — అంబేద్కర్‌కు పుష్పాంజలి

భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ,రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని అరవపల్లి గ్రామ లైబ్రరీలో మంగళవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి గ్రామ పెద్దలు,లైబ్రరీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు కలిసి పూలమాలలు వేసి వినయపూర్వకంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం,స్వేచ్ఛ, న్యాయంను హామీ ఇస్తుందన్నారు.సామాజిక వివక్షను నిర్మూలించి, పేదల ఎత్తుగడ కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారని చెప్పారు.ఆధునిక భారత నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అపూర్వమని,ఆయన చూపించిన మార్గం నేటికీ యువతకు ఆదర్శమని అభిప్రాయపడ్డారు.గ్రంథాలయ నిర్వాహకులు ఈ సందర్భంగా రాజ్యాంగంపై పుస్తక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి, గ్రామస్తులకు అందుబాటులో ఉంచారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా గ్రామంలో సామాజిక సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అంబేద్కర్ చూపించిన స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అరవపల్లి లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ “మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ” కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.

రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ “మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ” కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి కార్యాలయంలో గోదావరి జోన్ “మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ” కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గార్లతో కలసి పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

అన్నమయ్య

యల్లటూరు శివరామరాజు నేతృత్వంలో ‘రైతన్నా! మీ కోసం’ – పథకాలపై రైతులకు పూర్తి వివరాలు

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఊటుకూరు పంచాయతీలో బుధవారం “రైతన్నా! మీ కోసం” కార్యక్రమం ఘనంగా జరిగింది.అన్నదాత సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో రైతులకు చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు,మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూ బకర్ పాల్గొన్నారు.రైతులకు పథకాలను అందించే విధానం,వాటి ప్రయోజనాలు వివరించే కరపత్రాలను ప్రజల్లో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యల్లటూరు శివరామరాజు మాట్లాడుతూ ఇకపై రైతును అన్నదాత అన్న మాటకు తగిన గౌరవంతో నిలిపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.రాబోయే ఐదు సంవత్సరాల్లో రైతును రాజు చేయడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యం.నీటి భద్రతా కార్యక్రమాలు, డిమాండ్ ఆధారిత పంటల ప్రోత్సాహం,శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పంటల పర్యవేక్షణ వంటి ఆధునిక వ్యవసాయ చర్యలను సమర్థంగా అమలు చేస్తోంది అని తెలిపారు.అలాగే అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ వంటి పథకాలలో రైతులు ఎదుర్కొంటున్న భూముల నమోదు లోపాలు,ఆధార్ లింక్ సమస్యలు మరియు ఇతర సాంకేతిక ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ నాగలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శిరీష, రాజేశ్వరి,పద్మ,ఇంజనీరింగ్ అసిస్టెంట్ అచ్యుత్ పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు పెడకాల సుధాకర్,లక్ష్మీపతి రాజు,పెడకాల వెంకటసుబ్బయ్య,మలిశెట్టి వెంకటరమణ,సంబారు రాజశేఖర్, చల్లా వెంకటేష్,సగినాల వేణుగోపాల్ రాజు, అయ్యప్ప హరిరాజు, లవిడి ఈశ్వర్ రాజు, సమ్మెట సుబ్బరాజు, సంబారు ఓబులేష్, శివుడు తదితరులు పాల్గొన్నారు.రైతు సమస్యలను గ్రామ స్థాయిలోనే గుర్తించి, పరిష్కారం దిశగా ముందడుగు వేసే కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరొకసారి ప్రజలకు చేరవేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.