Wednesday, 18 March 2026

Blog

తూర్పు గోదావరి

బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా కూచిపూడి కళాధామం విద్యార్థులచే నృత్య ప్రదర్శన

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. బిక్కవోలు, 28 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా మూడవరోజు అయిన 28.11.25 శుక్రవారం సాయంత్రం 6 గంటలనుండి కూచిపూడి కళాధామం విద్యార్థులచే నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుందని కూచిపూడి కళాధామం బిక్కవోలు నిర్వాహకురాలు నాట్యాచారిణి పి. జాహ్నవి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

🌅 శుభోదయం పన్నమి పాఠకులకు!

ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం… కొత్త ఆశ, కొత్త ఆలోచన, కొత్త ప్రారంభాన్ని అందిస్తుంది. ఈరోజు చిన్నదైనా ఒక మంచి పని చేయండి. మీ లక్ష్యాల వైపు వేసే ప్రతి అడుగు— మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ✨ 🍃 ఇవాళ్టి ఆరోగ్య సూచన “ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి.” ఇది మీ శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, మెటబాలిజం పెంచి, రోజంతా ఫ్రెష్‌గా ఉండేందుకు సహాయపడుతుంది. 💧💚 మరిన్ని మంచి వార్తలు, హెల్త్ టిప్స్, ఇన్స్పిరేషన్స్ కోసం 📲 పున్నమి యాప్‌ను ప్రతిరోజూ ఓపెన్ చేయండి!

అమరావతి

అమరావతిలో బ్యాంకింగ్ హబ్‌కు బాట – 15 సంస్థలు, 6,541 ఉద్యోగాలు

పున్నమి ప్రతినిధి రాజధాని అమరావతి వేగంగా ఆర్థిక కేంద్రంగా మారుతోంది. ఇక్కడ 15 బ్యాంకులు, బీమా సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం మొత్తం రూ.1,328 కోట్లు పెట్టుబడిగా పెట్టనుండగా, దాదాపు 6,541 ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందులో SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, యూనియన్ బ్యాంక్, బరోడా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, LIC, న్యూ ఇండియా అస్యూరెన్స్ వంటి ప్రధాన సంస్థలు ఉన్నాయి. ఈ అభివృద్ధి వల్ల అమరావతిలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి.

హెల్త్ టిప్స్

స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రాణాంతక రసాయనం – ఆరోగ్య ప్రమాద హెచ్చరిక

పున్నమి ప్రతినిధి దోమల నివారణ కోసం వాడుతున్న స్లీప్‌వెల్ అగరబత్తీల్లో మెటాఫ్లూత్రిన్ (Metafluthrin) అనే ప్రమాదకర పురుగుమందు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. విజయవాడలోని ఓ దుకాణంలో సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌కు పంపగా, ప్రాణాంతక రసాయనం ఉన్నట్టు తేలింది. దీని వల్ల శ్వాసకోశ, నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్

హైదరాబాద్ మెట్రోకి 8 ఏళ్లు – లక్షలాది ప్రయాణికులకు వేగవంతమైన సేవలు

పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన హైదరాబాద్ మెట్రో నేటితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి దశను ప్రారంభించగా, 29 నుంచి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 57 రైళ్లు, దాదాపు 1,100 ట్రిప్పులతో రోజూ 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. మెట్రో విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఆంధ్రప్రదేశ్

2026 జనవరి 1న ఆయుధ పోరాటానికి ముగింపు – మావోయిస్టు పార్టీ ప్రకటన

పున్నమి ప్రతినిధి 2026 జనవరి 1 నుంచి సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ప్రధాన స్రవంతిలో కలవడానికి కొంత సమయం కావాలని ఇటీవల కేంద్రానికి వారు వినతిపత్రం పంపిన విషయం తెలిసిందే. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం, హిడ్మా ఎన్‌కౌంటర్ తరువాత పార్టీ బలహీనపడింది. మిగిలినవారు కూడా లొంగిపోవాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డిప్యూటీ ఎంపీడీవోలు నియామకం

22 మండలాలకు నియమించిన కలక్టర్ మహేష్ కుమార్ డాక్టర్ బీఅర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాలకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ గురువారం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా సచివాలయ పరిపాలనకు సంబంధించి కొత్తగా డిప్యూటీ ఎంపీడీవో (జిఎస్‌డబ్ల్యూఎస్)లను నియమించారు. గ్రామపంచాయతీలో ఎలాంటి కేసులు లేని సీనియర్ గ్రేడ్-1 కార్యదర్శులను, మండల పరిషత్ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ లకు పదోన్నతి ఇచ్చి డిప్యూటీ ఎంపిడివొలుగా అవకాశం ఇచ్చారు. ఈ 22 మందిలో మందిలో 13 మంది కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారు కాగా మరో ఆరుగురు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. అలాగే పశ్చిమగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లా నుంచి ఒక్కొక్కరు వచ్చారు. జోన్ 2 పరిధిలో ఉన్న ఈ 22 మందిని కోనసీమ జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.దీంతో వారికి జిల్లా కలెక్టర్ మండలాలలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల వారీగా డిప్యూటీ ఎంపీడీవోలు వీరే 1. అయినవిల్లి.. శెట్టిమల్లి రాజమోహన్ 2.ఆలమూరు… చీమకుర్తి వీర్రాజు 3.అల్లవరం… వై లక్ష్మీనారాయణ 4.అమలాపురం.. జి రవి 5.అంబాజీపేట.. అబ్బాస్ అలీ మహమ్మద్ 6.ఆత్రేయపురం.. కె రమేష్ బాబు 7.ఐ. పోలవరం.. వి రాజేష్ 8.కె. గంగవరం.. కొత్తల సాంబమూర్తి 9.కపిలేశ్వరపురం.. వెలిశెట్టి శ్రీరామ్మూర్తి 10.కాట్రేనికోన.. సరిపల్లి సూర్యనారాయణ రాజు 11.కొత్తపేట.. గుడే నారాయణరావు 12.మలికిపురం.. చిటికెన సత్యనారాయణ 13.మామిడికుదురు.. తిక్కిరెడ్డి శ్రీనివాస్ 14.మండపేట.. శ్రీరాముల అనిల్ కుమార్ 15.ముమ్మిడివరం.. బి సుజాత 16.పి గన్నవరం.. ఆర్ సూర్యనారాయణ మూర్తి 17. రామచంద్రపురం.. పినిశెట్టి వీరభద్రరావు 18. రావులపాలెం..వెంటూరి అమరనాథ్ చౌదరి 19. రాయవరం.. వేగిశెట్టి కృష్ణంరాజు 20.రాజోలు… పి సత్తిబాబు 21.సఖినేటిపల్లి.. దీక్షితుల శ్రీనివాస్ 22.ఉప్పలగుప్తం.. డి.కాంతారావు

ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో ‘రైతన్న… మీ కోసం ‘

సిఎస్ పురం: పెద్దగోగులపల్లి, ఆర్ కె. పల్లి, కంభంపాడు గ్రామల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండలం వ్యవసాయ అధికారి పి. మధుబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రతి రైతు ఇంటిని సందర్శించి ముఖ్యమంత్రి సందేశాన్ని రైతులకు వివరించాలని తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురుంచి వివరించారు. అన్నదాత సుఖీభవ పిఎమ్ కిసాన్ పథకం మరియు నీటి భద్రత, డిమాండ్ ఆదారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్ గురుంచి రైతులకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్

విద్యుత్ ఘాతంతో మత్స్యకారుడు మృతి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెం లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మత్స్యకారుడు జాలయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

విద్యుత్ ఘాతంతో మత్స్యకారుడు మృతి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెం లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మత్స్యకారుడు జాలయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.