విశాఖపట్నం
జి వి ఎం సి 3వ జోన్ లో డిసెంబరు 09న బహిరంగ వేలం *విశాఖపట్నo పున్నమి ప్రతినిధి:-* మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 3వ జోన్ (ఆశీలు మెట్ట) పరిధిలో ఖాళీగా వున్న షాపు రూములు, కమ్యూనిటీ హాల్ లకు డిసెంబరు 09న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడునని 3వ జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. 3వ జోన్ పరిధిలో గల యం.వి.పి కాలనీ వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.10,11,12,13,14,15&16 లకు, డైమండ్ పార్క్ వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.08 , 09 లకు, జగ్గారావు బ్రిడ్జి వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.06 నకు మరియు బి.టి.ఆర్ కాలనీ, రెల్లివీధి లో గల కమ్యూనిటీ హాల్ లకు 3 సంవత్సరముల కాలమునకు గుత్తలకు ఇచ్చుటకు గాను తేది: 09-12-2025 న ఉదయం 11 గంటలకు జీవీఎంసీ జోన్-3 ఆశీలు మెట్ట జోనల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని, ఆసక్తి గల పాటదారులు పూర్తి వివరాలకు 3వ జోనల్ కమిషనర్ కార్యాలయం లోని పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలియజేశారు