స్థానిక సమరంలో ఎన్నికల బహిష్కరణ
కామారెడ్డి, 11 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు మధ్య తండా రాజకీయాలు మండి పడ్డాయి. రెండు తండాల మధ్య సాగుతున్న పంచాయితీ తగాదా చివరికి ఎన్నికల బహిష్కరణ వరకు వెళ్లి, బూథుల వద్ద నిశ్శబ్దం రాజ్యమేలే పరిస్థితి కనిపిస్తోంది. గోకుల్ తండలో బూత్లకు తాళం రామారెడ్డి మండలానికి అంచున ఉన్న గూగుల్ తండ గ్రామం, ఈసారి బ్యాలెట్ బాక్సుల కంటే బహిష్కరణ తీర్మానంతో ఎక్కువ హీట్ క్రియేట్ చేసింది.గ్రామంలో కింది తండా వాసులు “సమస్య లు తీర్చకుండా, హక్కులు ఇవ్వకుండా ఓటు అడిగే హక్కు మీకెందుకు?” అంటూ ఎన్నికలకు దూరంగా ఉండాలని గ్రామ సభలోనే స్పష్టంగా ప్రకటించినట్లుగా స్థానిక వర్గాలు చెబుతున్నాయి. రెండు తండాల మధ్య పంచాయితీగూగుల్ తండ కు దగ్గరలోని మరో తండాతో కలిసి ఒకే పంచాయ తీగా కలిపిన విధానం పట్ల చిన్న తండా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయం లోనే తమ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వకుం డా, అభివృద్ధి పేరుతో ఓట్లు మాత్రమే అడిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి కంటే బహిష్కరణే బెటరా? చిన్నతండా ప్రాంతంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, గిరిజన టోలీలకు హౌజింగ్ సదుపాయాలు వంటి కీలక సమస్యలు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తండా పెద్దలు ఆరోపిస్తున్నారు.ఎన్నికల ముందు రోజుల్లో అధికారులు, నాయకులు తండాకు వచ్చి నా “ముందు G.O. చూపించండి, తర్వాత ఓటు మాట మాట్లాడండి” అంటూ గ్రామస్తులు నేరుగా బహిష్కరణ కార్డు వేసినట్లు స్థానిక సమాచారం. అధికారులు – నేతల పరుగులు వర్చువల్ బహిష్కరణ నిర్ణయం వెనక్కి తీసుకునే లా చేయాలని ఎన్నికల యంత్రాంగం, స్థానిక నేత లు వరుసగా చర్చలు నిర్వహించినా, గోకుల్ తండా వాసులు తమ నిర్ణయాన్ని మార్చే లక్షణా లు కనపర్చలేదని చెబుతున్నారు.వోటు వేసి మళ్లీ ఐదేళ్లు క్యూలో తిరగలేం, ముందుగా హక్కులు… ఆ తరువాతే మీ ఎన్నికలు” అనే భావోద్వేగ నినా దంతో యువత నుంచి పెద్దల వరకు ఒకే స్టాండ్లో నిల్చొన్నట్లుగా గ్రామస్థుల వర్గాలు చెబుతున్నా యి. పంచాయతీ ఎన్నికలకు గట్టి హెచ్చరిక గోకుల్ తండ బహిష్కరణ తెలంగాణ గ్రామాల్లో పెరుగుతు న్న అసంతృప్తికి ప్రతీకగా మారుతోంది. ఏకగ్రీవం పేరుతో, ఒత్తిడులతో, వాగ్దానాలతో గ్రామాలను మళ్లీ మోసం చేయొద్దు, సమస్యలు పరిష్కరిస్తే వోటు ఆటోమేటిక్గా వస్తుంది” అనే సందేశం ఈ బహిష్కరణ ద్వారా స్పష్టంగా వినిపిస్తోంది.











