భూమి అన్యక్రాంతమైందని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యేకి ఫిర్యాదు
తొట్టంబేడు పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి నియోజికవర్గ ఎమ్మేల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మా భూమిని ఆక్రమించి మాపై దౌర్జన్యం చేస్తున్నారు న్యాయం చేయండి అంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యేకు చోడవరం గ్రామస్తులు ఫిర్యాదు చేస్తూ…ప్రభుత్వం పేదవాళ్లకు పంపిణీ చేసిన భూ పంపిణీలో ఇద్దరు బీసీ మహిళలకు పట్టా పాస్ పుస్తకాలు అందజేశారని అన్ని రికార్డులు తమ పేరు మీద ఉన్నప్పటికీ అదే గ్రామ దళితవాడకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆ భూమిని ఆక్రమించుకుని ఇది తన భూమంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడని తెలియజేసి వినతి పత్రాన్ని శుక్రవారం నాడు ఎమ్మెల్యేకి అందజేశారు. వేదికలో బాదితులు తెలిపిన వివరాలు తొట్టంబేడు మండలం చోడవరం గ్రామానికి చెందిన బి సుజాత భర్త నాగరాజు పేరుమీద సర్వేనెంబర్ 250/2 లో విస్తీర్ణం 1:50 సెంట్లు, కే వెంకటసుబ్బమ్మ భర్త కే. అంకయ్య పేరుమీద సర్వే నెంబర్ 250/5లో విస్తీర్ణం 1:50 సెంట్లు చొప్పున భూ పంపిణీలో వీళ్ళ పేర్ల మీద ప్రభుత్వం డీకే టీ భూమి పంపిణీ చేశారు. వాళ్లు ఈ పాస్ పుస్తకాలపై బ్యాంకులో రుణాలు కూడా తీసుకుని ఉన్నారు. ప్రభుత్వం అందజేసే పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి పథకంలో కింద వచ్చే నగదు కూడా వారి బ్యాంకు ఖాతాల్లోని పడుతుంది. అన్ని రికార్డులు ఉన్నప్పటికీ కులం అడ్డం పెట్టుకుని తమ భూమి లోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే ముందు వారు మొరపెట్టుకున్నారు. 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు అర్జీలను అందజేసి పరిశీలించాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.











