Sunday, 15 March 2026

Blog

తిరుపతి

భూమి అన్యక్రాంతమైందని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యేకి ఫిర్యాదు

తొట్టంబేడు పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి నియోజికవర్గ ఎమ్మేల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మా భూమిని ఆక్రమించి మాపై దౌర్జన్యం చేస్తున్నారు న్యాయం చేయండి అంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యేకు చోడవరం గ్రామస్తులు ఫిర్యాదు చేస్తూ…ప్రభుత్వం పేదవాళ్లకు పంపిణీ చేసిన భూ పంపిణీలో ఇద్దరు బీసీ మహిళలకు పట్టా పాస్ పుస్తకాలు అందజేశారని అన్ని రికార్డులు తమ పేరు మీద ఉన్నప్పటికీ అదే గ్రామ దళితవాడకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆ భూమిని ఆక్రమించుకుని ఇది తన భూమంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడని తెలియజేసి వినతి పత్రాన్ని శుక్రవారం నాడు ఎమ్మెల్యేకి అందజేశారు. వేదికలో బాదితులు తెలిపిన వివరాలు తొట్టంబేడు మండలం చోడవరం గ్రామానికి చెందిన బి సుజాత భర్త నాగరాజు పేరుమీద సర్వేనెంబర్ 250/2 లో విస్తీర్ణం 1:50 సెంట్లు, కే వెంకటసుబ్బమ్మ భర్త కే. అంకయ్య పేరుమీద సర్వే నెంబర్ 250/5లో విస్తీర్ణం 1:50 సెంట్లు చొప్పున భూ పంపిణీలో వీళ్ళ పేర్ల మీద ప్రభుత్వం డీకే టీ భూమి పంపిణీ చేశారు. వాళ్లు ఈ పాస్ పుస్తకాలపై బ్యాంకులో రుణాలు కూడా తీసుకుని ఉన్నారు. ప్రభుత్వం అందజేసే పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి పథకంలో కింద వచ్చే నగదు కూడా వారి బ్యాంకు ఖాతాల్లోని పడుతుంది. అన్ని రికార్డులు ఉన్నప్పటికీ కులం అడ్డం పెట్టుకుని తమ భూమి లోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే ముందు వారు మొరపెట్టుకున్నారు. 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు అర్జీలను అందజేసి పరిశీలించాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

తిరుపతి

ఘనంగా స్వాతంత్ర సమరయోధులు సర్దార్ పసుపులేటి సుబ్బరామదాసు జయంతి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ పసుపులేటి సుబ్బరామ దాసు 123 వ జయంతి సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి ఎండీవో శివ ప్రసాద్, పాల్గొని సంక్షేమ భవనములోగల స్వతంత్ర సమరయోధులు సర్దార్ పశువులేటి సుబ్బరామ దాసు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సుబ్బరామ దాసు యొక్క విరోచిత పోరాట పటిమ గురించి స్వతంత్ర సమరయోధులను రేపటి తరాలకు వారి ప్రతిభను తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం సంస్థ సభ్యులు ఎం జి బాలాజీ, సిద్ధులు గారి ప్రసాద్, ఉప్పు కృష్ణయ్య, పోలీ సుజాతమ్మ, కోలా సంగీతారావు, వరలక్ష్మి, నరేంద్ర, గిరిరాయల్, చైతన్య, జనార్ధన్, మాధుసూధన్, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎంజీఎం విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేని ఆహ్వానించిన డాక్టర్ మయూర్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి పట్టణంలో ఎంజీఎం విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొనాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఎంజీఎం విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…. తమ తండ్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంబించబడ్డ ఎంజీఎం విద్యా సంస్థల సిల్వర్ జూబిలీ వేడుకలకు తాను తప్పక హాజరువుతానని ఎంజీఎం డైరెక్టర్ డాక్టర్ మయూర్ కు తెలిపారు. అనంతరం డాక్టర్ మయూర్ మాట్లాడుతూ….శ్రీకాళహస్తి పట్టణంలో ఎంజీఎం విద్యా సంస్థలను 2001వ సంవత్సరంలో స్వర్గీయ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, నారా రామమూర్తి నాయుడుల చేతుల మీదుగా ప్రారంభమై నేటికీ ఎంజీఎం విద్యాసంస్థలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న సందర్బంగా ఎంజీఎం విద్యాసంస్థలు సిల్వర్ జూబ్లీ వేడుకలు 2026 జనవరి నెలాఖరున జరుగుతాయని ఈ కార్యక్రమమునకు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా, దగ్గుబాటి పురందేశ్వరి గౌరవ అతిథిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ శాఖ మంత్రి రాజానగరం మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్, గౌరవ అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు.

తిరుపతి

అక్కుర్తి ప్రభుత్వ పాఠశాలకు క్రీడా పరికరాలు భహుకరణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి ప్రభుత్వ పాఠశాలకు SOS స్వచ్ఛంద సేవా సంస్థ ద్వార రూ.35,000 విలువచేసే క్రీడా పరికరాలైన గ్రీన్ చాక్ బోర్డులను ప్రధానోపాధ్యాయురాలు జయకుమారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ….విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని, సంస్థ చేసిన సేవ ప్రశంసనీయంమని ఆమె పేర్కొన్నారు. అనంతరం SOS సంస్థ ప్రతినిధులు మాట్లాడతూ..విద్యార్థుల్లో క్రీడాభిరుచి, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అక్కుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి రూ.35 వేల విలువైన క్రీడా పరికరాలు,గ్రీన్ చాక్ బోర్డులు అందజేసామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాశం రాజు, చెంగళ్రాయులు, అంజనీ ప్రసాద్, రమీజా, డాక్టర్ దేవరాజులు, గోపాలకృష్ణ, ప్రకాశంరాజు, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

తెలంగాణలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ నెల 23,27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్? ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.*

పున్నమి ప్రతినిధి: *తెలంగాణలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ నెల 23,27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్? ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.* గ్రామ సర్పంచ్,వార్డు మెంబర్ ఎన్నికలు మెదటిది 11,రెండో విడత 14,మూడో విడత 17 నా పూర్తి ఐతున్న సందర్బంగా సర్కార్ వాడి వేడిగా నిర్వహణకు భారీగా సన్నాహాలు మొదలు పెట్టింది….2026 జనవరి 26 రోజున గ్రామా,మండల కేంద్రాల్లో నూతనంగా గెలుపొందిన వారు జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణకు స్పీడ్ పెంచినట్లు సమాచారం…..*

తెలంగాణ

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : జాతీయ ప్రాధికార సంస్థ

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) వరదలు పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్రస్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించే విషయమై శుక్రవారం ఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈనెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో జరుగుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రమాదాలను నివారించడం, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పోలీసులు తెలిపారు. వాహనాలను ఒక్కోటిగా ఆపి డ్రైవర్‌లను చెక్ చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

విశాఖపట్నం

IIAM బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025 కి ఆహ్వానం

విశాఖపట్నం: ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ (IIAM) వైజాగ్ వారిచే ప్రతి ఏడాది నిర్వహించే ప్రతిష్టాత్మక Alumni Meet 2025 ఈ నెల 13, 14 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రతినిధులు ప్రకటించారు. MVP కాలనీలోని IIAM క్యాంపస్‌లో ఉదయం 10 గంటలనుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు “Re-unite, Interact & Have Fun” అనే థీమ్‌తో మళ్లీ ఒక్కచోట చేరనున్నారు. పూర్వ విద్యార్థుల ఎదుగుదల,వారి అనుభవాలను పంచుకుంటూ, కొత్త అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో జరిగే ఈ మీట్ కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం, అలాగే క్యాంపస్ టూర్‌ కోసం ప్రత్యేకంగా QR కోడ్‌లు కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయని IIAM బిజినెస్ స్కూల్ అధినేత డా ఎస్ పి రవీంద్ర, ప్రతినిధులు తేజ ముత్యం తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కళాశాలల నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలింది గత ప్రభుత్వమే పీపీపీతో పేదలకు ఉచిత వైద్యం–విద్య అందుతుందని స్పష్టం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ నాయకత్వ ఘాటైన స్పందన

ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంపై నిన్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు చేసిన విమర్శలను నందిగామ టీడీపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య పద్ధతులు కానని, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చేం దుకే దుష్ప్రచారం” టీడీపీ నేతల వివరాల ప్రకారం— 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన ₹8,480 కోట్లలో కేవలం ₹1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, మిగతా నిధులను ఇతర పనులకు మళ్లించడం వల్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయా యని ఆరోపించారు. “గతప్రభుత్వ పనితీరుతో వెళ్లి ఉంటే ఈ కళాశాలలు పూర్తవడానికి కనీసం 20–23 సంవత్సరాలు పట్టేది. పేదలకు వైద్యం, యువతకు వైద్య విద్య అందుబాటులోకి రాకుండా ఆలస్యం చేసింది ఇదే ప్రభుత్వమే” అని టీడీపీ నాయకులు విమర్శించారు. “నిజమైన ప్రైవేటీకరణ చేసిందెవరు?” వైద్య విద్యలో ప్రభుత్వ సీట్ల ఫీజులను ₹12 లక్షల నుంచి ₹20 లక్షలకు పెంచిన ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్’ మోడల్‌ను గత ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తుచేశారు. “అది నిజమైన ప్రైవేటీకరణ. ఇప్పుడు పీపీపీపై అబద్ధాలు చెప్పడం నిస్సిగ్గు రాజకీయమే” అని నేతలు వ్యాఖ్యానించారు. *పీపీపీతో లభించే ప్రయోజనాలు* ప్రభుత్వం స్పష్టంచేసిన పీపీపీ విధానం వివరాలను టీడీపీ నేతలు మీడియాకు తెలియజేశారు: కళాశాలలు 100% ప్రభుత్వ యాజమాన్యంలోని వారేనని సీట్లలో 50%పేద–మధ్యతరగతి విద్యార్థులకు పూర్తిగా ఉచితమని, ఆసుపత్రులలో 70% బెడ్లు ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచిత చికిత్స కోసం కేటాయించనున్నారని, ఆలస్యాలను నివారిస్తూ ఆధునిక మౌలిక వసతులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నమని చెప్పారు. “పీపీపీ అంటే ప్రజల భాగ స్వామ్యం ప్రైవేటీకరణ కాదు” ప్రజల ఆరోగ్యం, విద్యను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో లేనివేననిఅర్ధమవుతోందన్నారు.

విశాఖపట్నం

*విశాఖ క్వీన్ మేరీ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక!*

విశాఖపట్నం, డిసెంబర్, 12: విశాఖపట్నం పాత పట్నం పాటపట్నం క్వీన్ మేరీ హై స్కూల్ కి చెందిన పూర్వ విద్యార్థులంతా నగరంలో ఆర్ కె బీచ్ తీరాన ఓ ప్రముఖహోటల్ లో కలసి సందడి చేసారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిసాము,చదువుల చెట్టు నీడలో అంటూ 1968 సం లో క్వీన్ మేరీ హైస్కూల్ లో చదివిన పూర్వ విద్యార్ధులు 15 మందీ .. అందరూ ఓ చోటచేరిన తమ ఆత్మీయ కలయిక వారి జీవితాల్లో మధుర ఘట్టంగానిలిచిపోయింది. పూర్వ విద్యార్థులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆట,పాటలతో మైమరచిపోయారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒకేచోట తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ యోగక్షే మాల అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బెంగులూరు, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో వైద్య తదితర ఉద్యోగాలలో స్ధిరపడి, రిటైర్ట్ అయిన ఉద్యోగులు కూడా ఈ ఆత్మీయ కలయికలో పాల్గోని మధురానుభూతిని పొందారు. ఈ సందర్బంగా బాలభాను విద్యాలయం ట్రస్టీ, క్వీన్ మేరీ హై స్కూల్ పూర్వ విద్యార్థిని వారణాసి పార్వతి మాట్లాడుతూ అమెరికా నుంచి గొల్లపూడి లక్ష్మి రాక సందర్బంగా తామంతా కలిశామని, ఇప్పటి వరకూ 8 సార్లు కలిసి తమ జ్నాపకాలను గుర్తు చేసుకున్నామని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.