కున్సి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల జోరు ప్రచారం
క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నల్లె శ్రీనివాసులు ,కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది ,గ్రామం లో పలు వార్డు వార్డు తిరుగుతూ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ ,కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది . ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి నల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముందుంటానని , ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని ఆయన అన్నారు. ప్రచారం లో పార్టీ కార్యకర్తలు, నలే వెంకటేష్, ఖందొడ్ది నారాయణ, బాడీయల్ శరణ్ బస్వ, ప్రభు గౌడ , ఉల్ల సోము,పల్లె సురేష్, చంద్రశేఖర్, బడియల్ నర్సప్ప,వార్డు మెంబర్ సభ్యులు పాల్గొనడం జరిగింది.











