Wednesday, 29 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అమరావతి గడ్డపై అపర కుబేరుడు: ఇది కేవలం పర్యటన కాదు.. ఒక ఆశల వారధి!

నేటి సమాజంలో సాయం చేసే చేతిని కూడా అనుమానించే పరిస్థితి. కానీ, తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులకు ‘దాతృత్వం’ అంటే ఏమిటో నేర్పిన మహోన్నత వ్యక్తి బిల్ గేట్స్. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉంది. అది—సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని మార్చాలనే తపన. సంపద పంపిణీ కాదు.. సమస్యల పరిష్కారం బిల్ గేట్స్ పర్యటనను కేవలం ఒక పారిశ్రామికవేత్త పర్యటనగా చూడలేం. ఒక మనిషి తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, మళ్ళీ అదే మేధస్సును పేదరికం, రోగాలు, వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి ఎలా వాడుతున్నారనేది ఇక్కడ ముఖ్యం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో సాగుతున్న ‘సంజీవని’ వంటి ప్రాజెక్టులు వేలమంది ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనుండటం విశేషం. డేటా ఆధారిత పాలనలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా? సాంకేతికత ద్వారా అవినీతిని ఎలా అరికట్టవచ్చు? విపత్తుల సమయంలో సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ అంశాలపై గేట్స్ వంటి విజనరీకి చంద్రబాబు నాయుడు ప్రజంటేషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడలా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి సామాన్యమైనది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయనకు గేట్స్ తో ఉన్న సాన్నిహిత్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించుకున్న ఒక బలమైన బంధం. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయం నుండి నేటి అమరావతి వరకు, టెక్నాలజీని సామాన్యుడి ముంగిటకు తేవాలనే ఆయన ప్రయత్నమే గేట్స్ ఫౌండేషన్ ను ఇక్కడికి రప్పించింది. లోకేశ్ తో కూడిన మంత్రుల బృందం గేట్స్ కు స్వాగతం పలకడం ద్వారా ప్రభుత్వం అంతా ఒకే లక్ష్యం—’అభివృద్ధి’—కోసం పనిచేస్తోందని నిరూపించారు. ఈ పర్యటన ద్వారా రాబోయే మార్పులు అపారం: ఉండవల్లిలో డ్రోన్లు, AI (కృత్రిమ మేధ) సాయంతో చేసే వ్యవసాయాన్ని గేట్స్ పరిశీలించడం ద్వారా, భవిష్యత్తులో మన రైతులు ప్రపంచ స్థాయి సాగు పద్ధతులను అందుకోనున్నారు. వైద్యం & విద్య: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో స్కూళ్లలో డిజిటల్ విద్య, ఆసుపత్రుల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. గేట్స్ రాకతో ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా అమరావతిపై పడుతుంది. ఇది ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పడే బలమైన అడుగు. బిల్ గేట్స్ పర్యటన ఒక గంటలో.. రోజులో ముగిసే కార్యక్రమం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దొరికిన ఒక గొప్ప భరోసా. సంపద ఉన్న ప్రతివాడూ సాయం చేయడు, సాయం చేసే మనసున్న ప్రతివాడి దగ్గరా సంపద ఉండ దు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న గేట్స్, మార్పును ఆకాంక్షించే చంద్రబాబు కలిస్తే—అది సామాన్యుడి పాలిట వరం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న డ్రోన్ నిఘా-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు

జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనల మేరకు, సంబంధిత DSP గార్ల ఆధ్వర్యంలో ఆయా CI/SI ల సమక్షంలో డ్రోన్ తో, నెల్లూరు పట్టణ, శివారు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డు కట్టు వేస్తున్న నెల్లూరు పోలీసులు.  జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మరియు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు విస్తృతంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేసిన నెల్లూరు పోలీసులు  నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతూ, జల్లెడ పడుతున్న నెల్లూరు పోలీసులు.  అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది.  గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా… బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..  ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తాం..  నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా..  క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్న నెల్లూరు పోలీసులు.  బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది.  నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.  కావున ఎవరైన చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు.  గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారు పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.  జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు వినూత్న చర్యలు తీసుకుంటున్న నెల్లూరు పోలీసులు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి తెలపగలరు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం.. నెల్లూరు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్., గారు.

ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో 132 ఫిర్యాదులు స్వీకరణ. • ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదు.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటీషన్లను పరిష్కరించాలని ఆదేశాలు. • ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్టపరిధిలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా యస్.పి. గారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. 1. ఇందుకూరుపేట పరిధికి చెందినటువంటి వ్యక్తిని మరియు అతని స్నేహితుడిని, అనంతపురంకు చెందిన రాజు అనే వ్యక్తి, వాట్సప్ ద్వారా పరిచయమై సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి, ఒక్కొక్కరు వద్ద లక్ష యాభై వేల రూపాయలు తీసుకొని, జాబు ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు. 2. నెల్లూరు రూరల్ పరిధికి చెందిన వ్యక్తిని, సంతపేటకి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి చీటీలు వేయించుకొని, నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, మోసపోయామని, విచారించి న్యాయం చేయాలని కోరారు. 3. బిట్రగుంట పరిధికి చెందినటువంటి మహిళను, తన భర్త అత్తమామలు వేధిస్తున్నారని, భర్త చెడు వ్యసనాలకు బానిసై మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు. 4. కోట పరిధికి చెందిన వృద్ధురాలిని, తన పెద్ద కుమారుడు భార్య, మనవడు బెదిరిస్తూ, తన అనుమతి లేకుండా తనకు జీవనాధారం కోసం ఉంచుకున్నటువంటి పొలంలో నారు వేశారని, అడిగితే దాడి చేశారని, విచారించి న్యాయం చేయాలని కోరారు. 5. కలిగిరికి చెందినటువంటి మహిళ యొక్క కుమార్తె, 03.02.26 నుండి కనిపించడం లేదని, ఆచూకీ కనుగొని అప్పగించాలని కోరారు. 6. చిన్న బజారుకు పరిధికి చెందిన వ్యక్తిని, తన స్నేహితుడు ముజ్మల్ తనని కొట్టి గాయపరిచినట్లు, చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు, ప్రస్తుతం కోర్టులో కేసు విచారణలో ఉన్నదని, ముజ్మల్ తన మనుషులతో బెదిరిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్ గారు హామీ ఇచ్చారు.  ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, లీగల్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు, DCRB CI శ్రీ రామారావు, మహిళా స్టేషన్ CI శ్రీ సుబ్బారావు, SB-1 CI శ్రీ వెంకటేశ్వర రావు, SB-2 CI శ్రీనివాస రెడ్డి గార్లు మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మహా శివరాత్రి శోభతో తాళ్లపూడిలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం ఘన వైభవం

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాళ్లపూడి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ మదన గోపాలస్వామి ఆలయం లో శ్రీ మాత గోవింద మాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అర్చకులు ఖందగిరి గౌతమ్ శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షులు గానుగల వరహాలు దంపతులు, కోశాధికారి ముత్తోజు మురళి దంపతులు పీటలపై కూర్చొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు పట్నాల సతీష్, కార్యదర్శి కడలి కిరణ్ మాట్లాడుతూ తాళ్లపూడి మండలంలో బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. మండలంలోని ప్రముఖులు, సంఘ సభ్యులు సతీసమేతంగా హాజరుకావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమ ఏర్పాట్లను ఉపాధ్యక్షులు పట్నాల సూరిబాబు, దొంతోజు మూర్తి, ధర్నాలకోట ప్రసాద్, నాగమల్లి మహేష్, కాశీ ప్రసాద్, నాగులకొండ భద్రం సమర్థవంతంగా పర్యవేక్షించారు. మండల విశ్వబ్రాహ్మణ సంఘ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకకు ఘనత చేకూర్చారు.

E-పేపర్

రేపటికి ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ *రేపటికి ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక* …. రేపు కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేనా….? కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కౌన్సిలర్ ఆకుల యాదగిరి వచ్చాకనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని పోడియం వద్దకు పలుమార్లు వచ్చి వాగ్వాదానికి దిగారని వాగ్వాదానికి దిగారని,గగ్గోలు పెట్టారని ఆర్డిఓ అనంతరెడ్డి అన్నారు. కౌన్సిలర్లు సృష్టించిన గందరగోళం వాళ్ళనే రెండుసార్లు వాయిదా వేసిన ఫలితం లేకపోయిందని అందుకే *రేపటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డిఓ అనంతరెడ్డి తెలిపారు* . నేను కేవలం ఎక్స్ ఆఫీసీయోమెంబెర్ గా నా ఓటు వినియోగించుకోవడానికి మాత్రమే మున్సిపల్ కు రావడం జరిగిందని, ఎన్నికల అధికారులు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటానని *స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* అన్నారు. నూటికి నూరు శాతం బిఆర్ఎస్ పార్టీ పూర్తి ఆదిక్యంతో ఉండి, చైర్మన్ బై చైర్మన్ దక్కించుకుంటుందని జీర్ణించుకోలేక అక్కస్సుతోనే, ముమ్మాటికి అధికార పార్టీ చేస్తున్న తతంగం ఇది అని, దీనికి పోలీసులు,అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన…. *మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి* ఈ మొత్తం ఘటనపై పై అధికారులకు,ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు భారీ ఉత్కంఠ నడుమ మున్సిపల్ కార్యాలయం నుండి వెళ్లిన బిఆర్ఎస్ కౌన్సిలర్స్

విశాఖపట్నం

గాజువాకలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు

విశాఖ గాజువాక ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి): విజయనగర సామ్రాజ్య మహామహుడు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని గాజువాక రాయల్ కూడలిలో ఘనంగా నిర్వహించారు.కాపు సంఘ నేతలు దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నేతలు కరణంరెడ్డి నరసింగరావు,కాతా బాలకృష్ణ,గంధం వెంకటరావు మాట్లాడుతూ దేవరాయల పరిపాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కర్ణాటక,ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన దూరదృష్టి గల పాలకుడు ఆయనని పేర్కొన్నారు.యుద్ధవిద్యలలోనే కాక సాహిత్యరంగంలోనూ అపార ప్రతిభ కనబరిచిన రాయలు తెలుగులో ‘ఆముక్తమాల్యద’ మహాకావ్యాన్ని రచించి సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు.ఆయన పాలన విధానాలు శతాబ్దాలు గడిచినా ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.దేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో గుడివాడ అప్పలరామ్మూర్తి,అమ్మన్న,విందుల వెంకటరమణ,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఒకప్పుడు జగ్గు జంక్షన్‌గా ఉన్న ఈ ప్రాంతం దేవరాయల విగ్రహం ఏర్పాటు అనంతరం రాయల్ కూడలిగా మారి గుర్తింపు పొందిందని నేతలు తెలిపారు.

విశాఖపట్నం

నౌకాదళ విన్యాసాలు..రవాణా ఆంక్షలు ఇవే

విశాఖ ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి): విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష,మిలన్–2026 మహాసమ్మేళనాల సందర్భంగా ఈనెల 16నుంచి 19వరకు ఆర్కే బీచ్ రహదారిలో రవాణా ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు.మధ్యాహ్నం ఒకటిగంట నుంచి రాత్రి తొమ్మిదిగంటల వరకు అనుమతి పత్రాలు లేని వాహనాలకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.భద్రతా కారణాల దృష్ట్యా సముద్రతీర ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. సాధారణ ప్రజలు తమ వాహనాలను ఎంజీఎం గ్రౌండ్స్, ఆంధ్రయూనివర్సిటీ గ్రౌండ్స్ లేదా జిల్లా పరిషత్ ఆఫీస్ వద్ద నిలిపివేసి అక్కడి నుంచి కాలినడకన కార్యక్రమ ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు.భారీ వాహనాల రాకపోకలపై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు తెలిపారు.ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని,అధికారుల సూచనలు పాటించాలని కోరారు.నగర పోలీసు కమిషనర్ ప్రజలు సహనంతో వ్యవహరించి భద్రతా సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

విశాఖ తీరంలో మోహరించనున్న 90నౌకలు…అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు సిద్ధం

విశాఖ ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి): విశాఖ తీర ప్రాంతం అంతర్జాతీయ నౌకాదళ మహాసమ్మేళనానికి వేదికగా సిద్ధమవుతోంది. ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మిలన్ కార్యక్రమం భాగంగా విశాఖలోని నావికాదళ కమాండ్ సాముద్రిక ప్రాంగణంలో మిలన్ విలేజ్‌ను తూర్పు నావికాదళ చీఫ్ సంజయ్ భల్లా ప్రారంభించారు.ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా మొత్తం 90నౌకలు మోహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇందులో 71దేశీయ నౌకలు,19విదేశీ యుద్ధనౌకలు పాల్గొననున్నాయి.అలాగే 50యుద్ధవిమానాలు ఆకాశంలో విన్యాసాలు చేయనున్నాయి.సముద్రంలో నౌకలను ఆరు వరుసల్లో సక్రమంగా మోహరించి దేశాధ్యక్షుడైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమీక్షించనున్నారు.మిలన్ నౌకాదళ విన్యాసంలో ప్రస్తుతం 65దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయి.సముద్ర భద్రత,సహకార సంబంధాలు,వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి.ఈనెల 19న నిర్వహించనున్న సిటీ పరేడ్‌లో 45దేశాల నౌకాదళ కంటెంజెంట్లు పాల్గొని తమ సాంప్రదాయ దుస్తులు,సైనిక క్రమశిక్షణను ప్రదర్శించనున్నాయి.విశాఖ తీరంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మేళనం నగరానికి ప్రత్యేక గుర్తింపునందించనుండగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో సంగీత విభావరి.. కోటి స్వరార్చనకు భక్తులు పరవశం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టణంలో ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక ధూర్జటి కళా ప్రాంగణంలో ప్రముఖ సినీ సంగీత ర్శకులు కోటి, వారి బృందం నిర్వహించిన సంగీత ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక సాగరంలో మునిగితేలిన భక్తులు కోటి తన బృందంతో కలిసి ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు, శివతత్వ కీర్తనలు ప్రాంగణమంతా భక్తి పారవశ్యాన్ని నింపాయి. తనదైన శైలిలో హుషారైన, అదే సమయంలో భక్తితో కూడిన సంగీతాలాపనతో ఆయన భక్తులను మైమరిపించారు. కళా ప్రాంగణం కిక్కిరిసిపోగా, భక్తులు చప్పట్లతో సంగీత దర్శకుడిని ఉత్సాహపరిచారు. కార్యక్రమం అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కోటిని ప్రత్యేకంగా గౌరవిస్తు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తిరుపతి

ఎమ్మెల్యే దంపతులచే ఐ లవ్ శ్రీకాళహస్తి సెల్ఫీ పాయింట్ ప్రారంభం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తి పట్టణానికి సుదూర ప్రాంతల నుండి దర్శనార్థం వచ్చే వేలాది భక్తులకు, పట్టణ ప్రజలకు, ఆహ్లాదకర వాతావరణం కల్పించే ఉద్దేశంతో “ఐ లవ్ శ్రీకాళహస్తి” అనే ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ఫీ పాయింట్‌ను ఆదివారం నాడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషితా రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ ప్రదేశం గతంలో రెండు బ్రిడ్జీలు కలిసే ప్రాంతంలో చెత్తాచెదారాలతో అద్వానంగా ఉన్న స్థలాన్ని పూర్తిగా మార్పు చేసి, విద్యుత్ అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్ది పచ్చని గడ్డితో పార్క్‌లా అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా రూపొందించమని ఇప్పటి నుంచి శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చే భక్తులు, పట్టణ ప్రజలు ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించేందుకు అనువుగా మారిందని పట్టణ అందాన్ని పెంచే ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోందని ఆయన తెలిపారు. కార్యక్రమం అనంతరం “ఐ లవ్ శ్రీకాళహస్తి” బోర్డు వద్ద వారు స్వయంగా సెల్ఫీ తీసుకుని సందేశం ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.