Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

సూపర్ స్నేహితుల మిత్రబృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి పట్టణంలో 13 రోజులు పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రథోత్సవం రోజున సోమవారం నాడు సూపర్ స్నేహితుల మిత్రబృందం ఆధ్వర్యంలో భక్తులకు భారీ సంఖ్యలో అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్బగా ఛైర్మెన్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ… స్థానిక పానగల్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులందరు కలసి సూపర్ స్నేహితుల మిత్రబృందం అనే పేరిట ఒక గ్రూపుగా ఏర్పడి గత 16 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తీశ్వరా స్వామీ-అమ్మవార్ల రథోత్సవం రోజున భక్తిశ్రద్ధలతో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని నేడు సుమారుగా 2000 మందికి పైబడే రకరాల అన్న ప్రసాదాలు వితరణ చేశామన్నారు. తమ మిత్రబృందంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు, శుభకార్యక్రమాలు జరిగిన కలిసికట్టుగా ఉంటూ వారికి మేమున్నాం అంటూ భరోసాగా నిలబడుతున్నామని ప్రజలకు సేవ, సాయం చేయాలనే ఉద్దేశంతో తామంతా ఒక కమిటీగా ఏర్పడ్డామని అయన తెలిపారు. అన్నదాన సేవ అనంతరం అందరూ కలసి శ్రీ స్వామీ, అమ్మవార్ల దర్శనం చేసుకుని వేదపండితుల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్నేహితుల మిత్రబృందం ప్రెసిడెంట్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొట్లులూరు రవిచంద్ర, మమత, వైస్ ప్రెసిడెంట్లు ఎన్ ఎస్ రాఘవన్, అరుణ, ఎస్ మణి, పముజుల అమృతమ్మ, కార్యదర్శులు డీ అరవిందమ్మ, షేక్ అబ్దుల్ జబ్బర్, షేక్ జిలానీ, రెడ్డిపల్లి ప్రసాద్, చిర్రి గోపాల్, ట్రెజరర్ పట్టెం సురేష్, ఉచ్చురు హిందూ, సభ్యులు దామలచెరువు గిరిజేశ్వరి, షేక్ అక్బర్ భాషా, ఎస్ రమణ, దాసు గారి పార్వతీ, ఎన్ వెంకటేశన్, అత్తిరాల భాస్కర్, ఈశ్వరమ్మ, మోటుపాళ్యం శేఖర్, రాజేంద్ర, ఎ రవి, నీలవర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

భక్తులకు మజ్జిగ పంపిణీచేసిన భారతీయ జీవన పరివర్తన చారిటబుల్ ట్రస్ట్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి పట్టణంలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహించిన రథోత్సవంలో భాగంగా, భారతీయ జీవన పరివర్తనం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చంద్రప్ప భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ…సమాజ సేవే లక్ష్యంగా “భారతీయ జీవన పరివర్తనం చారిటబుల్ ట్రస్ట్” ను స్థాపించామని వేల సంవత్సరాలుగా భారతదేశం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, ప్రపంచానికి మార్గదర్శకంగా గురు స్థానంలో నిలిచిందని విదేశీ పరిపాలన కాలంలో మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు కొంత మేరకు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇతర సంస్కృతుల ప్రభావంలోకి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ భారతీయ సంప్రదాయాలు, ధర్మం, సంస్కృతి పునరుజ్జీవనం పొందుతున్నాయని విద్య, వైద్యం, విజ్ఞానం, సంస్కృతి, సాహసం, ఆధ్యాత్మికత వంటి అన్ని రంగాల్లో భారతదేశం మళ్లీ ప్రపంచానికి గురువుగా ఎదగాల్సిన అవసరం ఉందని సనాతన ధర్మ విలువలను కాపాడుకుంటూ, యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కండ్రిగ ఉమా , ప్రమీలమ్మ , పిల్లారీ బత్తినయ్య, మ్యాగీ క్లారా, తరుణ్, జస్వంత్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ నర్మదేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

తొట్టంబేడు, పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నలి పంచాయితీ కొత్త కన్నలి గ్రామంలో శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి మందిర నిర్మాణ స్థలంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ నర్మదేశ్వర మహాదేవుని సాన్నిద్యంలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం నాడు ఘనగా నిర్వహించారు. శ్రీ సద్గురు దత్తానంద్ మహారాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నుండి సోమవారం బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటలకు శ్రీ నర్మదేశ్వర మహాదేవునికి అభిషేకాలు, హోమాలు, నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ స్వామి భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ పరుశురామేశ్వరుని దర్శించుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సోమవారం నాడు భారతదేశంలో మొట్టమొదటి శివాలయం అయిన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలసి వున్న శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరుశురామేశ్వర స్వామి వారిని దర్శించుకున్నరు. వీరికి గుడిమల్లం దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీ స్వామివారి తీర్థ, ప్రసాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తలిమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఏర్పేడు మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్, గున్నేరు కిషోర్ రెడ్డి, చంద్ర, రాజశేఖర్,శ్రీవారి సురేష్,ఉత్తరాది శరవన్ కుమార్,సాధన మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యం, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో సేవా ప్రవాహం-రథోత్సవంలో మజ్జిగ పంపిణీ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నాడు నిర్వహించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనానికి ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు భారీ స్థాయిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి, బి.ఎమ్.ఆర్ సైనికుడు జి. విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవ మార్గంలో భక్తులకు చల్లని మజ్జిగను పంపిణీ నిర్వహించి భక్తుల దాహార్తిని తీర్చరు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఈ సేవ ఎంతగానో ఉపయోగపడింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎప్పుడూ ప్రజల సేవలో ఉండాలని మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారని మహాశివరాత్రి పుణ్యదినాన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సేవ చేయడం తమా అదృష్టంగా భావిస్తున్నామనీ పేర్కొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్రమపద్ధతిలో మజ్జిగ పంపిణీ సాగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బి.ఎమ్.ఆర్ సేవా దళం సభ్యులు పాల్గొని భక్తులకు సేవలందించారు.

తిరుపతి

నందిపై శివుని దివ్యతేజం: కైలాసనాథుని వాహన సేవతో పులకించిన పురవీధులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. పరమశివుని దర్శనార్థం తరలివచ్చిన భక్తకోటితో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఆదివారం నాడు రాత్రి మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అత్యంత ప్రధానమైన నంది వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. నందీశ్వరునిపైగంగాధరుడు..సింహవాహనంపైజ్ఞానాంబ జాగారం చేసే భక్తులను అనుగ్రహించేందుకు, భక్తవత్సలుడైన సోమస్కందమూర్తి గంగాదేవి సమేతుడై అధికార నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు గంభీరమైన సింహవాహనంపై ఆసీనులై స్వామివారితో కలిసి పురవీధుల్లో విహరించారు. విద్యుత్ దీపకాంతులు, మంగళ వాయిద్యాలు, భక్తుల ‘నమశ్శివాయ’ స్మరణల మధ్య వాహన సేవ అట్టహాసంగా సాగింది. భక్తిసాగరమైనపురవీధులు మహాశివరాత్రి నాటి ప్రత్యేక జాగరణలో ఉన్న వేలాది మంది భక్తులు స్వామివారి దివ్యతేజాన్ని దర్శించుకుని తరించారు. నందీశ్వరునిపై కొలువుదీరిన శివుని రూపం భక్తులకు కనువిందు చేసింది. కైలాసమే భూమికి దిగివచ్చిందా అన్నట్లుగా సాగిన ఈ ఊరేగింపులో కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు పురవీధుల్లో భక్తులు బారులు తీరారు. అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు.

తిరుపతి

నేడే శివ పార్వతుల కళ్యాణ వైభోగం

శ్రీకాళహస్తికి పెళ్లికళ… పెద్ద సంఖ్యలో రానున్న భక్తులు శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ బహుళ అమావాస్య సంద ర్భంగా శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున జరగనున్న శివ పార్వతుల కళ్యాణానికి ముక్కోటి దేవతలు దిగివ స్తారు. స్వర్ణముఖి నదీ తీరంలో ఆకాశం పందిరిగా, భూమి పీటగా జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అధికారులు, సర్వం సిద్ధం చేశారు. సాధారణంగా దేవతామూర్తుల కళ్యాణోత్సవం వారివారి ఆలయాల్లో నిర్వహిస్తారు. ఇక్కడ స్కోమస్కందుడు ప ట్టణం నడిబొడ్డున ప్రజల సమక్షంలో వివాహం చేసుకోవడం ఆనవాయితీ. గజవాహనంపై పరమేశ్వరుడు సింహవాహనంపై శ్రీజ్ఞా నప్రసూనాంబాదేవి మంగళవారం రాత్రి పయనమవుతారు. అర్ధరాత్రి తరువాత శాస్త్రోక్తంగా పూజారులు వివాహ మహోత్సవాన్ని నిర్వ హిస్తారు. నూతన వరుడుగా శివయ్య : కళ్యాణం సందర్భంగా వాయులింగేశ్వరుడు స్వర్ణాభరణాలు ధరింస్తాడు. ముందుగా చండికేశ్వరుడు, భృంగిరిటుడు, నికుంభనరుడు, భద్రకాలుడు తదితర ముక్కోటి దేవతలు సర్వేశ్వరుని వెంట నిలుస్తారు.

తిరుపతి

అభరాన్ని అంటిన రథోత్సవం…. ఆది దంపతులను దర్శించుకున్నా భక్త సంద్రం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారు నిర్వహించిన దథోత్సవం అభరాన్ని అంటింది ఆది దంపతులను దర్శించుకున్నా భక్త సంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన సోమవారం నాడు రథోత్సవం అంగరంగ వైభోగంగా జరిగింది. స్వామి, అమ్మవార్లు వేర్వేరు రథాలపై పురవీధులోల విహరిచారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో భక్తులతో కలసి పాల్గొని ఓం నమఃశి వాయ, శంభో …శివ … శంభో హరహర మహదేవ, శంభోశంకర అంటూ స్వామి రథాన్ని, జైజైకాళి అంటూ అమ్మవారి రథాన్ని లాగుతూ తన్మయత్వం చెందారు. రథాలపై ఉప్పు, మిరియాలు చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 10.00 గంటలకు రథోత్సవం ప్రాభంమైంది. మధ్యాహ్నం 2.00 గంటలకు రథాలు ఆలయం వద్దకు తిరి గి చేరుకున్నాయి. హలాహలం మింగిన పరమశివుడుతిరిగి మేల్కొన్న తర్వాత బ్రహ్మ చేసిన ఉత్సవమే రథోత్సవం. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమూ రథోత్సవం నేత్రపర్వర్వంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేక పూజలు జరిగాయి. తర్వాత అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో విశే ష పూజలు జరిగాయి. ఉత్సవమూర్తులను వివిధ స్వర్ణాభణాలు, సుగంధభరిత పుష్పాలతో సుందరంగా అలంకరిచారు. అనంతరం ఉరేగింపుగా అలయం వెలుపల ఉన్న నెప్పల మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ థాలపై ఆశీనులయ్యారు. గంగాదేవి సమేతంగా సోమస్కంధమూర్తి ఒక రథంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మరో ర థంపై కొలువుదీరారు. ముందుగా స్వామి వారి రథం…. తొలుత స్వామివారి రథం బయలుదేరింది. కళాబృందాల ప్రదర్శనలు ముందు సాగుతుండగా అధికారులు, అనధికారులు భక్తుల శివనామస్మరణల నడుమ ఆలయం వద్దనుంచి తేరువీధి, నెహ్రూవీధి మీరుగా పెళ్లిమండపం వద్దకు రథం చేరుకుంది. ఆ తర్వాత అమ్మవారి రథం బలుదేరింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న భక్తులు ఏ మాత్రం లెక్క చేయలేదు. ఉప్పు, మీరియాలు రథాలపై చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. నాలుగు వీధులు భక్తులతో క్కిక్కిరిసిపోయాయి. సూమారు లక్ష మంది ఈ రథోత్సవంలో పాల్గొన్నారని ఆలయాధికారుల అంచన. ఈ కార్యక్రమంలో ఆలయ పరిపాలనాధికారి బాపి రెడ్డి, పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పలక మండలి సబ్యులు, కూటమి నాయకులు పలువురు పాల్గోన్నారు. ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా డిఎస్పి నరసింహమూర్తి పటిష్టమైన భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులతో పాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, హెూంగార్డులు బందోబస్తు నిర్వహించారు. స్కౌట్లు, గైడ్లు స్కిట్ కళాశాల విర్యార్ధులు సేవలందిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, భాజపా నాయకులు కోలా ఆనంద్ పాలక మం డలి సభ్యులు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం సిబ్బంది, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

తాళ్లపూడి మండలంలో బస్సు షెల్టర్ల దుర్వినియోగం

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం పరిధిలోని వేగేశ్వరపురం మరియు తాళ్లపూడి,ప్రక్కిలంక గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్లు ప్రస్తుతం వారి ఉపయోగానికి కాకుండా ఇతరుల స్వార్థ ప్రయోజనాలకు వేదికలుగా మారినట్టు స్థానికులు వాపోతున్నారు. వేగేశ్వరపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన కైకాల సూర్యచంద్ర జూనియర్ కాలేజీ సమీపంలోని బస్సు షెల్టర్ ప్రయాణికులు కూర్చునే పరిస్థితిలో లేకుండా మారింది. చుట్టుపక్కల వ్యాపారులు తమ టూ వీలర్ వాహనాలను నిలిపివేసే స్థలంగా దానిని వినియోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే గ్రామంలో కొప్పుల గంగాధర్ సామిల్ వద్ద ఏర్పాటు చేసిన మరో బస్సు షెల్టర్‌లో కూడా కొంతమంది వ్యక్తులు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. తాళ్లపూడి గ్రామపంచాయతీ సమీపంలోని బస్సు షెల్టర్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రయాణికులు నిలబడేందుకు కూడా వీలు లేకుండా కాగితాలు, గ్లాసులు, ప్లాస్టిక్ బాటిళ్లు తదితర వ్యర్థ పదార్థాలతో నిండిపోయినట్లు కనిపిస్తోంది. అలాగే ప్రక్కిలంక గ్రామంలో అమరావతి లాడ్జ్ ఎదురుగా, మాజీ ఎంపీటీసీ సొలస నాగ సీతారామ కస్తూరి జ్ఞాపకార్థం వ్యయప్రయాసలతో నిర్మించిన బస్సు షెల్టర్ కూడా ప్రయాణికులకు ఉపయోగపడే స్థితిలో లేదు. పక్కనే ఉన్న టీ, టిఫిన్ హోటల్ యజమానులు వాడిన నీటిని షెల్టర్‌లోకి వదులుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల అక్కడ దుర్వాసన వ్యాపించి, దోమల పెంపక కేంద్రంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లేదా దాతలు ప్రయాణికులు ఎండ, వానల నుండి రక్షణ పొందేందుకు నిర్మించిన ఈ బస్సు షెల్టర్లు ప్రైవేట్ వ్యక్తుల అవసరాలకు వాడబడుతుండగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్సు షెల్టర్లను శుభ్రపరచి, అక్రమ వినియోగాన్ని అరికట్టి, ప్రయాణికుల కోసం వీటిని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

అమరావతి గడ్డపై అపర కుబేరుడు: ఇది కేవలం పర్యటన కాదు.. ఒక ఆశల వారధి!

నేటి సమాజంలో సాయం చేసే చేతిని కూడా అనుమానించే పరిస్థితి. కానీ, తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులకు ‘దాతృత్వం’ అంటే ఏమిటో నేర్పిన మహోన్నత వ్యక్తి బిల్ గేట్స్. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉంది. అది—సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని మార్చాలనే తపన. సంపద పంపిణీ కాదు.. సమస్యల పరిష్కారం బిల్ గేట్స్ పర్యటనను కేవలం ఒక పారిశ్రామికవేత్త పర్యటనగా చూడలేం. ఒక మనిషి తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, మళ్ళీ అదే మేధస్సును పేదరికం, రోగాలు, వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి ఎలా వాడుతున్నారనేది ఇక్కడ ముఖ్యం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో సాగుతున్న ‘సంజీవని’ వంటి ప్రాజెక్టులు వేలమంది ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనుండటం విశేషం. డేటా ఆధారిత పాలనలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా? సాంకేతికత ద్వారా అవినీతిని ఎలా అరికట్టవచ్చు? విపత్తుల సమయంలో సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ అంశాలపై గేట్స్ వంటి విజనరీకి చంద్రబాబు నాయుడు ప్రజంటేషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడలా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి సామాన్యమైనది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయనకు గేట్స్ తో ఉన్న సాన్నిహిత్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించుకున్న ఒక బలమైన బంధం. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయం నుండి నేటి అమరావతి వరకు, టెక్నాలజీని సామాన్యుడి ముంగిటకు తేవాలనే ఆయన ప్రయత్నమే గేట్స్ ఫౌండేషన్ ను ఇక్కడికి రప్పించింది. లోకేశ్ తో కూడిన మంత్రుల బృందం గేట్స్ కు స్వాగతం పలకడం ద్వారా ప్రభుత్వం అంతా ఒకే లక్ష్యం—’అభివృద్ధి’—కోసం పనిచేస్తోందని నిరూపించారు. ఈ పర్యటన ద్వారా రాబోయే మార్పులు అపారం: ఉండవల్లిలో డ్రోన్లు, AI (కృత్రిమ మేధ) సాయంతో చేసే వ్యవసాయాన్ని గేట్స్ పరిశీలించడం ద్వారా, భవిష్యత్తులో మన రైతులు ప్రపంచ స్థాయి సాగు పద్ధతులను అందుకోనున్నారు. వైద్యం & విద్య: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో స్కూళ్లలో డిజిటల్ విద్య, ఆసుపత్రుల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. గేట్స్ రాకతో ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా అమరావతిపై పడుతుంది. ఇది ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పడే బలమైన అడుగు. బిల్ గేట్స్ పర్యటన ఒక గంటలో.. రోజులో ముగిసే కార్యక్రమం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దొరికిన ఒక గొప్ప భరోసా. సంపద ఉన్న ప్రతివాడూ సాయం చేయడు, సాయం చేసే మనసున్న ప్రతివాడి దగ్గరా సంపద ఉండ దు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న గేట్స్, మార్పును ఆకాంక్షించే చంద్రబాబు కలిస్తే—అది సామాన్యుడి పాలిట వరం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.