Sunday, 7 December 2025

Blog

విశాఖపట్నం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు నగర మేయర్ ఘన నివాళి.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు నగర మేయర్ ఘన నివాళి. *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- సమాజంలో అన్ని వర్గాలకు సమానత్వం కల్పించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎంతో కృషి చేశారని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి జీవితాలలో వెలిగి నింపిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఈ పుడమి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో చిరస్మనీయునిగా ఉంటారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా భారత దేశ రాజ్యాంగాన్ని రచనలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో జివిఎంసి సూపరింటెండెంట్ లు రియాజ్ ,శ్రీనివాస్ , ఉద్యోగులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

26 ఏళ్ల మిలేనియం ఘన వార్షికోత్సవం – MACT-2025 టాపర్స్కు భారీ బహుమతులు

26 ఏళ్ల మిలేనియం ఘన వార్షికోత్సవం – MACT-2025 టాపర్స్కు భారీ బహుమతులు *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * “భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడుస్తోంది. అందుకు మనం సిద్ధంగా ఉండి, అవసరమైన నైపుణ్యాలను పొందాలి” అని పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి ముక్కవిల్లి గారు మిలేనియం ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్-2025 బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పేర్కొన్నారు. ట్రెండింగ్ టెక్నాలజీలను క్రమశిక్షణతో నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. MACT వంటి పరీక్షలు విద్యార్థుల్లో పోటీ భావనను పెంచుతాయని కూడా అభిప్రాయపడ్డారు. “ఎవరూ ఎదగడానికి ఎదురు చూసి సిద్ధం కాలేదు. ప్రారంభించడం ద్వారా మాత్రమే సిద్ధత వస్తుంది” అని వరదా రవికుమార్, సెంట్రల్ మేనేజర్, మిల్లేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రారంభ ప్రసంగంలో చెప్పారు. ఈరోజు కార్యక్రమం మిల్లేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 26వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణతో పాటు ప్లేస్మెంట్ సహాయంపై మిల్లేనియం ఎల్లప్పుడూ దృష్టి పెట్టిందని వివరించారు. CRT ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, 2023లో మిల్లీనియం ఆప్టిట్యూడ్ టెస్ట్ను 50 లక్షల రూపాయల ప్రతిభా వేతనంతో ప్రారంభించామని, ఇందులో ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, వర్బల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ వంటి ఇంటర్వ్యూలో కీలకమైన నైపుణ్యాలను పరీక్షించుకోడానికి విద్యార్థులకు అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం మిల్లేనియం ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్ 30 కళాశాలల్లో విజయవంతంగా నిర్వహించబడిందని, మొత్తం 5,500 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో 1,000 మంది ర్యాంకర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమం నిర్వహణలో సహకరించిన విశాఖ పరిసర ప్రాంతాల ప్రఖ్యాత కళాశాలల ప్రిన్సిపాళ్లు, HODలు, TPOలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మరిసెట్టి డింపుల్ (NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) మొదటి ర్యాంక్ సాధించి ₹50,000 నగదు బహుమతి గెలుచుకున్నారని ప్రకటించారు. 2వ ర్యాంక్ – వెమనమంద స్రీ సాయి ప్రణవ్ వర్మ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్) 3వ ర్యాంక్ – బెజవాడ నూక శ్రీనివాసరావు (ASK కాలేజ్ ఆఫ్ టెక్ & మేనేజ్మెంట్) 4వ ర్యాంక్ – షేక్ కరీముల్లా (MVR డిగ్రీ కాలేజ్) 5వ ర్యాంక్ – చింతల గణేష్ (సెంచూరియన్ యూనివర్సిటీ) తరువాత, బేహ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ CSE విభాగాధిపతి నారాయణరావు చొక్కాపు మాట్లాడుతూ—AI పరిశ్రమల్లో విస్తరిస్తున్నప్పటికీ, దాన్ని అమలు చేయడానికి ఇంజనీర్లు అవసరమని, విద్యార్థులు తాజా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. MVR డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ శ్రీ బి. రత్నకుమార్, విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఫిజిక్స్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఎల్. సరణ్య తదితరులు మిలేనియం 26 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని కొనియాడారు. VIET, సెయింట్ ఆన్స్, BVK డిగ్రీ కాలేజీల ప్రతినిధులు కూడా ఈ ఉపయోక్తమైన పరీక్ష నిర్వహణకు మిలేనియంను అభినందించారు. తర్వాత ముఖ్య అతిథి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.

విశాఖపట్నం

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు;

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు; వార్డు, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విశాఖ టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగింది. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం. శ్రీభరత్ గారు, శాసన మండలి ప్రభుత్వ విప్ డా.వేపాడ చిరంజీవిరావు గారు కమిటీల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వచ్చే స్థానిక సంస్థలలో విజయకేతనం ఎగురవేసే దిశగా నూతన కమిటీలు కృషి చేయాలని కోరారు. అధిక సంఖ్యలో ఉత్తర నియోజకవర్గ టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర్రక్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాలి*

*ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర్రక్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాలి* *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:-* *అధికారుల‌ను ఆదేశించిన రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ *జిల్లాలో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించిన క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ విశాఖ‌ప‌ట్ట‌ణం, డిసెంబ‌ర్ 06 ః ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్దేశించిన విధానాల ప్ర‌కారం జిల్లాలో ఓట‌ర్ల జాబితా మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్ధంగా నిర్వ‌హించాల‌ని జిల్లా అధికారుల‌ను రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వివేక్ యాద‌వ్ ఆదేశించారు. ముంద‌స్తు ఎస్.ఐ.ఆర్. నేప‌థ్యంలో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఒత్తిడికి గురికాకుండా ప్ర‌ణాళికాయుతంగా విధులు నిర్వ‌ర్తించాల‌ని చెప్పారు. శ‌నివారం జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, ఈఆర్వోలు, ఏఆర్వోలతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. వివిధ అంశాల‌పై సూక్ష్మంగా స‌మీక్షించిన ఆయ‌న ఓట‌ర్ల జాబితా విధానంలో భాగంగా నిర్వ‌హించే మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను ప‌క్కాగా చేప‌ట్టాల‌ని సూచించారు. ఓటరు జాబితాలో వారి పేర్లు, తండ్రి/తల్లి పేర్లను ధృవీకరించడానికి 2002 సంవత్సరం ఓటరు జాబితాను పరిశీల‌న‌లోకి తీసుకోవాల‌న్నారు. 2002 జాబితాను 2025 నాటి జాబితాతో స‌రిపోల్చి వివరాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని, ఆయా పోలింగ్ స్టేష‌న్, నియోజ‌క‌వ‌ర్గం వారీగా ఓట‌ర్ల వివ‌రాల‌ను మ్యాపింగ్ చేయాల‌ని సూచించారు. స్వీయ పత్రాల స్వీక‌ర‌ణ‌, మ్యాపింగ్ ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌క రీతిలో జ‌రిగేలా అధికారులు, సిబ్బంది చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులూ త‌లెత్త‌కుండా అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప్ర‌క్రియ‌ను స‌జావుగా చేప‌ట్టాల‌న్నారు. *జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 24.54 శాతం మ్యాపింగ్ జ‌రిగింది ః జిల్లా క‌లెక్ట‌ర్* ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు జిల్లాలో చేప‌ట్టిన ప్ర‌క్రియ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 24.54 శాతం మ్యాపింగ్ జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ సీఈవోకు వివ‌రించారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 20,20,726 మంది ఓట‌ర్లు ఉండ‌గా, 2,81415 మంది వివ‌రాల‌ను మ్యాపింగ్ చేశామ‌ని, మిగిలిన ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. వార‌సులు, ఇత‌ర సంతానం తాలూక వివ‌రాల‌ను కూడా జాగ్ర‌త్త‌గా అనుసంధానం చేస్తున్నామ‌ని చెప్పారు. అయితే జిల్లాలో దాదాపు అన్నీ పట్ట‌ణీక‌ర‌ణ ప్రాంతాలే కావ‌టం, వ‌ల‌స కార్మికుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల వివ‌రాల సేక‌ర‌ణ‌లో క్షేత్ర‌స్థాయిలో కొంచెం క్లిష్ట‌త ఏర్ప‌డుతోంద‌ని ఈఆర్వోలు సీఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఈఆర్వోలు సంగీత్ మాధుర్, ద‌యానిధి, సుధాసాగ‌ర్, మ‌ధుసూధ‌న్, సునీత‌, శేష‌శైల‌జ‌, జ్ఞాన‌వేణి, ప‌లువురు ఏఈఆర్వోలు స‌మావేశంలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖ తూర్పులో రూ. 62 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం*

*విశాఖ తూర్పులో రూ. 62 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం* *ఘనంగా శంఖుస్థాపన చేసిన ఎంపి భరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి* *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:-* *కేంద్ర నిధుల సద్వినియోగంతోనే అభివృద్ధి: ప్రభుత్వ విప్ చిరంజీవిరావు* *విశాఖ పార్లమెంట్ పరిధికి మూడు హాస్టళ్లు మంజూరు* గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, రూ. 62 కోట్ల SASCI నిధులతో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ముడసర్లోవలో నిర్మించనున్న ‘వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్’ భవన సముదాయానికి శంఖుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపి శ్రీ ఎం.శ్రీభరత్, ప్రభుత్వ విప్ శ్రీ వేపాడ చిరంజీవిరావు, తూర్పు ఎమ్మెల్యే శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. *కేంద్ర నిధులు – చంద్రబాబు సమర్థత*: ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అసమర్థత కారణంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన పాలన వల్ల, కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు గాడిన పడ్డాయని అన్నారు. *విశాఖకు దక్కిన సింహభాగం:* చంద్రబాబు గారి కృషితో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 5 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు మంజూరు కాగా, అందులో మూడు కేవలం విశాఖ పార్లమెంట్ పరిధిలోకే రావడం విశేషమని చిరంజీవిరావు తెలిపారు. ఎంపి శ్రీభరత్ చొరవతో విశాఖ తూర్పు, భీమిలి, గాజువాక ప్రాంతాలకు వీటిని కేటాయించినట్లు చెప్పారు. ముఖ్యంగా ముడసర్లోవలో ఈ హాస్టల్ ఏర్పాటు వెనుక స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పట్టుదల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఆయనకున్న తపన దాగి ఉన్నాయని కొనియాడారు. *అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణం:* దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో, 25 వేల చదరపు అడుగుల వైశాల్యంతో, ఐదు అంతస్తుల్లో ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు చేసే యువతులకు అత్యంత భద్రత, రక్షణ కల్పిస్తూనే, అందుబాటు ధరల్లో వసతి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఐటీ, ఫార్మా, పారిశ్రామిక, ఇతర సేవా రంగాల్లో పనిచేసే మహిళలకు ఈ హాస్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,ప్రైవేట్ హాస్పిటల్ వారికి సలహాలు సూచనలు

డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:-.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి సమావేశ మందిరంలో జిల్లా లో గల అన్ని ప్రైవేటు హాస్పిటల్స్/లాబ్స్ యాజమాన్యం వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ ప్రైవేటు హాస్పిటల్స్ వారందరూ కూడా హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని మరియు ధరలపట్టిక ను రిసెప్షన్ ఏరియా లో ప్రదర్శించాలని, స్క్రబ్ టైఫస్ వ్యాది గురించి అవగాహన కలుగచేశారు మరియు సీజనల్ వ్యాధుల గురించి ఎపిడిమిక్ విభాగం నందు డా.జగదీశ్ ప్రసాద్ వారికి మరియు హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. లకు సంబంధించి రిజిస్ట్రేషన్లను శ్రీ శశిభూషణ్ డి.పి.ఒ వారికి తెలియచేయాలని తెలిపారు. ఈ నెల 21.12.2025 న జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమంనకు అందరూ సహకరించాలని ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం వారిని కోరారు. మరియు అన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ మరియు స్కానింగ్ కేంద్రముల రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్ మరియు అన్ని నోటిఫై డిసీజెస్ గురించి సమాచారాన్ని ముందుగా అందచేయాలని ముఖ్యంగా హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. రిజిస్ట్రేషన్స్ పెండింగ్ గల వారిని సమీక్ష చేసి త్వరలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. లేనిపక్షంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం చర్యకు గురికాగలరని హెచ్చరించారు. ఈ సమావేశం నందు డా.ఉమావతి వారు మాట్లాడుతూ RCH 2.0 గురించి విపులంగా తెలియచేసారు. మరియు హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అని తెలియచేసారు. ఈ సమావేశం నందు డా.జగదీశ్ ప్రసాద్ DSO వారు మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్ వ్యాధి మరియు మిగతా నోటిఫై డిసీజెస్ గురించి విపులంగా తెలియచేస్తూ ప్రోఫర్మా ఆన్లైన్ లో ఉంచి సమాచారాన్ని ఇవ్వాలని తెలియచేసారు. తదుపరి శ్రీ బి.నాగేశ్వర రావు డెమో వారు మాట్లాడుతూ PC&PNDT ఫారం-ఎఫ్ పెండింగ్ గల ఆసుపత్రుల వారు త్వరలో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రతీ ఆసుపత్రి నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ పేరు, కాంటాక్ట్ నెంబర్ డెమో విభాగంలో సమర్పించాలని తెలియచేసారు. ఈ సమావేశం నందు డా.బి.ఉమావతి, DPMO-NHM, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, డా.జగదీశ్ ప్రసాద్, DSO, శ్రీ శశిభూషణ్, DPO, డా.అశోక్, వైరాలజీ ల్యాబ్, KGH మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీవీఎంసీ స్థాయి సంఘంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం.

జీవీఎంసీ స్థాయి సంఘంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం. – నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థాయి సంఘo సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థాయి సంఘం చైర్ పర్సన్ మాట్లాడుతూ స్థాయి సంఘం సమావేశంలో 257 ప్రధాన అంశాలు, 30 టేబుల్ అజెండాలతో పాటు మొత్తం 287 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి ప్రధాన అజెండాలోని 34 అంశాలను వాయిదా వేయడం జరిగిందని, 13వ అంశం పై సభ్యులు చర్చించిన పిదప సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ అంశాన్ని రద్దు పరచామని తెలిపారు. ప్రధాన అజెండాలో 172 నుండి 175 వరకు ఉన్న అంశాలపై సభ్యులు చర్చించి వాటిపై ఎంక్వయిరీ వేయాలని సూచించడమైనదని మేయర్ తెలిపారు. మిగిలిన 222 ప్రధాన అంశాలతో పాటు టేబుల్ అజెండాలోని వున్న 30 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని స్థాయి సంఘం చైర్పర్సన్ తెలిపారు. అలాగే బీచ్ రోడ్ లో ఉన్న అనధికార దుకాణాల నుండి అద్దె వసూలు చేయాలని, టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న దుకాణాలు బినామీ పేర్లతో ఉన్నాయన్న సమాచారంతో వాటిపై ఎంక్వయిరీ చేసి బినామీలను తొలగించి ఎవరైతే దుకాణాలు గుత్తకు తీసుకున్నారో వారే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మేయర్ సూచించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఎ.ఎమ్.ఒ.హెచ్ లు, యు సి డి ప్రాజెక్ట్ ఆఫీసర్, రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ పరిపాలన విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.

ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు. • హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు 9154282649, 9154282654 – జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ .ప్రభాకర రావు. *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలకసంస్థ పరిధిలో గల పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ప్రభుత్వం వారి G.O Ms No. 225, MA&UD (M) Dept..12.11.2025 ప్రకారము నగర పాలక సంస్థలు/ (urban Local Bodies) పరిధిలోని బిల్డింగ్స్ క్రమబద్ధీకరణకు (బిపిఎస్) స్కీమ్ ప్రభుత్వం విడుదల చేసిందని,అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్, ప్లాన్స్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వమువారు కల్పించియున్నారని , ఈ విషయమై ప్రజల సౌకర్యార్థం ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ స్కీములకు సంబంధించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడమైనదని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర రావు శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అదే విధముగా ఇటీవలే ప్రభుత్వం వారి G.O.లో ఆంధ్రప్రదేశ్ ఆమోదం పొందని లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు, 2020ని సవరించింది, ప్రభుత్వము వారు G.O 134, MA&UD (M) Dept, తేదీ: 26.07.2025 ప్రకారం, దరఖాస్తుదారు G.O జారీ చేసిన తేదీ నుండి 90 రోజుల ముందు అంటే 25.10.2025లోపు దరఖాస్తు చేసుకోవాలని మరియు స్వీకరించిన దరఖాస్తులను 25.04.2026 లోపు పరిష్కరించవలెనని ప్రభుత్వం తెలియజేసిందని తెలిపారు. తదుపరి ప్రభుత్వము వారు జివో 1173 ప్రకారం LRS దరఖాస్తులు చేసుకునేందుకు 2026 జనవరి 23 వరకు పొడిగించారన్నారు. కావున పైన పేర్కొన్న ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని, GVMCలో బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2025 మరియు అనుమతి లేని లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నియమాలు 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు ఉన్నత అధికారుల సూచనల ప్రకారం, ప్రజలను మరింత ప్రోత్సహించడానికి మరియు ఈ కార్యాలయ పనివేళల్లో BPS మరియు LRS ల పై ప్రజలకు అవగాహన కల్పించి సహాయం అందించడానికి మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రజల సౌకర్యార్థం టౌన్ ప్లానింగ్ సిబ్బంది తో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని , ఈ కార్యాలయం హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు., 9154282649 మరియు 9154282654 కావున ఈ అవకాశమును మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో గల ప్రజలు అందరు సద్వినియోగము చేసుకోగలరని ఇందు మూలముగా తెలియజేయడమైనదని చీప్ సిటీ ప్లానర్ తెలిపారు.

విశాఖపట్నం

ప్రభుత్వ విప్ సింహాచలం స్వామివారి దర్శనం

నమో నరసింహ! వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం – సింహాచలం ప్రభుత్వ విప్ సింహాచలం స్వామివారి దర్శనం ​విశాఖపట్నం డిసెంబర్ 6​పున్నమి ప్రతినిధి:- ​శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, సింహాచలం క్షేత్రాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సింహగిరిపై కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు. ​దంపతులకు దేవస్థానం అధికారులు ఆలయ సంప్రదాయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీ కె.వి.వి.ఎస్.ఎన్. మూర్తి, మరియు ప్రోటోకాల్ సహాయకులు సూర్యనారాయణ దంపతులకు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ​ ముందుగా ఆలయ మహాద్భుతమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, వారు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం, ఆలయ వేదపండితులు వారికి మంత్రోచ్ఛారణలతో వేద ఆశీర్వచనాలను అందించారు. పర్యవేక్షణ అధికారి కె.వి.వి.ఎస్.ఎన్. మూర్తి శ్రీ స్వామివారి పటం మరియు పవిత్రమైన ప్రసాదాలను అందజేశారు.

విశాఖపట్నం

ఉత్తర నియోజకవర్గ టిడిపిలో కొత్త స్ఫూర్తి – వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో ఘనంగా కమిటీల ప్రమాణ స్వీకారం

విశాఖపట్నం: విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు – వార్డు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నగరంలోని టిడిపి కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు ఎం. శ్రీభరత్, ప్రభుత్వ విప్ డా. వ్యాపాడ చిరంజీవిరావు కమిటీ ప్రతినిధులకు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముందు బహుజన చైతన్య సారథి డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి మాల్యార్పణ చేయడం జరిగింది. డా. వ్యాపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ— ఉత్తర నియోజకవర్గంలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయడానికి కొత్త కమిటీల ఏర్పాటుతో బలమైన బృందం సిద్ధమైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి విజయధ్వజం ఎగురవేయడం లక్ష్యంగా ప్రతిఒక్కరూ కట్టుబడి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. విశాఖపట్నం అభివృద్ధిలో టిడిపి పాత్రను ప్రజలకు చేరవేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉత్తర నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.