Saturday, 19 July 2025

Blog

తెలంగాణ

శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు

పున్నమి: జూలై 18 ప్రతినిధి దూపం అంజనేయులు శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంటను ‘కృష్ణ గిరి’, దోమల పెంటను ‘బ్రహ్మగిరి’గా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.

తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తిచేయాలి- మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 18, పున్నమి ప్రతినిధి : బాచుపల్లి – గండి మైసమ్మ వరకు 6 వరసల రోడ్డు, బహుదూర్ పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపు పై రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్ ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జిహెచ్ ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చెల్స్ అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి, ఫారెస్టేతర స్థలాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అటవీ శాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాటిలిటీలన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెందిన భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 శాసన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అన్నారు. బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్-1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు శ్రీధర్ బాబుకు వివరించారు. బాచుపల్లి – గండి మైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీభూమి ట్రాన్సఫర్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్ నగర్ పైపు లైన్, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు.

నిర్మల్

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి, పాఠశాల ఆవరణలో మొక్క నాటరు.ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు గంగయ్య, నాగభూషణ్, అనిల్,అశోక్,రమేష్, నారాయణ, నరేందర్, సురేష్, శంకర్, శ్రావణ్, నర్సారెడ్డి, VDC కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నిర్మల్

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి, పాఠశాల ఆవరణలో మొక్క నాటరు.ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు గంగయ్య, నాగభూషణ్, అనిల్,అశోక్,రమేష్, నారాయణ, నరేందర్, సురేష్, శంకర్, శ్రావణ్, నర్సారెడ్డి, VDC కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించి, పాఠశాల ఆవరణలో మొక్క నాటరు.ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు జమాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు గంగయ్య, నాగభూషణ్, అనిల్,అశోక్,రమేష్, నారాయణ, నరేందర్, సురేష్, శంకర్, శ్రావణ్, నర్సారెడ్డి, VDC కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

ఆగస్టు 22 నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు*

యూపీఎస్‌సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 2025లో మొత్తం 979 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ఇందులో 38 ఖాళీలను దివ్యాంగులకు రిజర్వ్‌ చేశారు. మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరుగుతాయి. పూర్తి షెడ్యూల్‌ కోసం upsc.gov.in వెబ్‌సైట్‌ చూడొచ్చు

విశాఖపట్నం

నాన్నే నా హీరో

నాన్నంటే ఒక అభయం నాన్నంటే ఒక ఆయుధం నాన్నంటే ఆదరణ నాన్నంటే ఒక భరోసా నాన్నంటే ఒక బాధ్యత నాన్నంటే ఒక భవిష్యత్తు నాన్నంటే ఒకబరువు నాన్నంటే ఒకనిధి నాన్నంటే ఒక నమ్మకం నాన్నంటే ఒక జీవితం నాన్నంటే ఒక తరం నాన్నంటేమన చిరునామా నాన్న అంటే మన ఉన్నతి నాన్నంటే మన సర్వం అందుకే నాన్నే మన అందరి హీరో

తెలంగాణ పెద్దపల్లి

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: 2025-26 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో 3వ, 5వ, తరగతుల్లో ప్రవేశం కొరకు పెద్దపల్లి జిల్లాలోని గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు జూలై 26 లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు మొత్తము (5) సీట్లు కేటాయించడం జరిగిందని , వీటిలో 3 సీట్లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడ్డాయని తెలిపారు. మూడవ తరగతిలో ఎరుకుల బాలురకు ఒకటి, ఐదవ తరగతిలో గోండు నాయక్ బాలురకు ఒక సీట్ పెండింగ్ ఉందని వీటికోసం ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రెండు లక్షలు, రూరల్ ప్రాంతంలో ఒక లక్షా 50 వేలు ఉండాలని, ధ్రువీకరణ పత్రాలు ఆదాయం, కులం, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ 2 సైజ్ ఫోటోలను జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 26 లోగా కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు ఫోన్ నెంబరు 9652118867 నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

ఇంధన భద్రతపై మంత్రి శ్రీధర్ బాబు పలు కీలక ప్రతిపాదనలు

న్యూఢిల్లీ, జులై 17, పున్నమి ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత మండపం ‘ఉర్జా మంథన్ 2025’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారతదేశ ఇంధన భద్రత, సహకార విధానాలపై చర్చ జరిగింది. దేశంలోని 22 రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ తరఫున హాజరైన మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడంలో కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకారం అవసరాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణ నాయకత్వాన్ని హైలైట్ చేస్తూ.. రాష్ట్ర క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కింద తీసుకున్న కీలకమైన చర్యలను వివరించారు. బయో ఇంధనాలు, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ), సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లపై దృష్టి సారించి.. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ల విస్తరణలో హైదరాబాద్ నగరమే కాకుండా, ద్వితీయ శ్రేణి పట్టణాలలో సీజీడీ నెట్‌వర్క్‌లను వేగవంతం చేయాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా సమానమైన ఇంధన లభ్యతను పెంచాలని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. బీజీఎల్‌లో మరిన్ని సీజీఎన్జీ స్టేషన్లు, పెట్టుబడులు, సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను పెంచాలనీ, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్‌లో పెట్టుబడులను పెంచాలనీ, తద్వారా తెలంగాణలో పట్టణ, సెమీ-అర్బన్ పైప్డ్ గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తరణకు వీలు కల్పించాలని శ్రీధర్ బాబు కేంద్రాన్ని కోరారు. ఎల్ఎన్జీ, సీఎన్జీ టెర్మినల్స్‌కు నిధులు, పెరుగుతున్న పారిశ్రామిక, దేశీయ అవసరాలను తీర్చడానికి తెలంగాణలో సీఎన్జీ, ఎల్ఎన్జీ టెర్మినల్స్‌ను స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహ నిధుల వినియోగాన్ని మంత్రి ప్రతిపాదించారు. తెలంగాణ వ్యవసాయ వ్యర్థాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, తెలంగాణలో గణనీయమైన వ్యవసాయ వ్యర్థాల ఉత్పత్తిని ఉదహరిస్తూ రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి ఉపయోగించని సామర్థ్యాన్ని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం వీటిలో పెట్టుబడి పెట్టాలని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. సీబీజీ, వ్యర్థాల నుంచి శక్తి సాంకేతికతలు, వ్యవసాయ సంపన్న ప్రాంతాలలో కొత్త సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సాటాట్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి పథకాల కింద క్లీన్ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలను పెంపొందించడానికి ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించాలని మంత్రి వ్యాఖ్యానించారు. తూర్పు, పశ్చిమ పైప్‌లైన్ సినర్జీ, తూర్పు, పశ్చిమ గ్యాస్ పైప్‌లైన్ వెంబడి తెలంగాణ వ్యూహాత్మక స్థానాన్ని మంత్రి శ్రీధర్ బాబు హైలైట్ చేశారు. తక్కువ ఖర్చుతో గ్యాస్ ఆధారిత ఇంధన పారిశ్రామిక వినియోగాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాలను విస్తరించడంలో కేంద్రం నేతృత్వంలోని మరిన్ని పెట్టుబడులను ప్రతిపాదించారు. ఇంధన భద్రతపై దృష్టి, ఇంధన రంగంలో దేశంలో కీలక భాగస్వామిగా తెలంగాణ స్థిరమైన, సమగ్ర ఇంధన అభివృద్ధికి జాతీయ నమూనాగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. ప్రోయాక్టివ్ విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక సంసిద్ధతతో, భారతదేశం క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ తెలంగాణ

తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు..

*తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు..* *రీజినల్ రింగ్ రైలు అనుమతుల కోసం విజ్ఞప్తి..* న్యూఢిల్లీ, జులై 17, పున్నమి ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరుతూ కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కీలక భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రైల్ భవన్‌లో అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల అనుసంధానం, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. ఇందులో భాగంగా వికారాబాద్ – కృష్ణా (122 కి.మీ. – రూ.2,677 కోట్లు), కల్వకుర్తి – మాచర్ల (100 కి.మీ. – రూ.2 వేల కోట్లు), డోర్నకల్ – గద్వాల (296 కి.మీ. – రూ.6,512 కోట్లు), డోర్నకల్ – మిర్యాలగూడ (97 కి.మీ. – రూ.2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణలో రైల్వే అనుసంధానతను పెంచేందుకు నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు, దీనికి రైల్వే బోర్డు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. సుమారు రూ.8 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రైలుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, గ్రామీణ పేదరికం తగ్గి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఏర్పాటు చేయతలపెట్టిన హైటెక్ ఎలక్ట్రానిక్ పార్కుకు సంబంధించి EMC 2.0 పథకం కింద తెలంగాణ అభ్యర్థనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగ్ రోడ్డు సమీపంలో ఒక నూతన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా.. తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ, ప్రతిపాదిత అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్‌కు తక్షణ ఆమోదం తెలపాలని రేవంత్‌రెడ్డి కోరారు. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమని ఆయన చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్ డ్రైపోర్ట్ నుంచి బందర్ ఓడరేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతులు, పలు దిగుమతులకు ఈ మార్గం అత్యంత కీలకమని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ఆపరేషన్స్‌ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు భద్రత, వేగవంతమైన సేవలు అందించేందుకు ఇది అవసరమన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.