Thursday, 5 March 2026

Blog

అన్నమయ్య

చిట్వేల్‌లో ‘ఈ-బైక్స్’ విప్లవం.. షోరూమ్‌ను ప్రారంభించిన రూపానంద రెడ్డి!

పర్యావరణ హితమైన రవాణా దిశగా చిట్వేల్ పట్టణం మరో అడుగు ముందుకు వేసింది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సద్గురు ఎంటర్ప్రైజెస్, ఎకో మోటివ్ మోటార్స్ ఈ-బైక్స్ గ్రాండ్ షోరూమ్‌ను రైల్వే కోడూరు నియోజకవర్గ చిట్వేల్ లో టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి,గురువారం ఘనంగా ప్రారంభించారు. నిర్వాహకులు గోపిదేశి ప్రసాద్, భాను ప్రకాష్, పిడుగు ప్రసాద్‌ల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కలిసి ముక్కా రూపానంద రెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో ప్రదర్శించిన వివిధ రకాల ఎలక్ట్రిక్ బైకులను వారు పరిశీలించి, వాటి పనితీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో, కాలుష్యం లేకుండా ప్రయాణించే వీలుండటాన్ని వారు అభినందించారు. ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. “పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎకో మోటివ్ మోటార్స్ వంటి సంస్థలు స్థానికంగా అందుబాటులోకి రావడం వల్ల యువతకు ఉపాధితో పాటు, ప్రజలకు ఆధునిక సాంకేతికత అందుతుంది” అని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న స్థానిక యువతను ఆయన ప్రోత్సహించారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎన్డీయే కూటమికి చెందిన కీలక నాయకులు, పట్టణ ప్రముఖులు, స్థానిక వ్యాపారవేత్తలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిట్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ షోరూమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం 21వ డివిజన్‌లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం – ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: పిల్లల మర్రి వెంకట్ రజిత

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని 21వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం కొనసాగుతోంది. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లలమర్రి రజిత–వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకుడు తలారి చంద్రశేఖర్ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. డివిజన్‌లో పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో వాహనదారుల నరకం భారీగా ట్రాఫిక్ జాం

నెల్లూరు Date05-3-2026 ఆత్మకూరు బస్టాండ్ నుండి పెన్నా బ్రిడ్జ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్! ​నెల్లూరు: నగరంలో ట్రాఫిక్ కష్టాలు మళ్ళీ మొదటికొచ్చాయి. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆత్మకూరు బస్టాండ్ నుండి పెన్నా బ్రిడ్జ్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ​, ఆత్మకూరు బస్టాండ్,నుండి బ్రిడ్జ్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ,ఎండ తీవ్రతకు తోడు ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు మరియు అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయాయి. ​, పెన్నా బ్రిడ్జ్ వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ మరియు రోడ్డుపై ఏర్పడిన చిన్నపాటి అడ్డంకులు ఈ భారీ జామ్‌కు కారణమని తెలుస్తోంది. ​ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ, వాహనాల సంఖ్య భారీగా ఉండటంతో పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో వాహనదారుల నరకం భారీగా ట్రాఫిక్ జాం

నెల్లూరు Date05-3-2026 ఆత్మకూరు బస్టాండ్ నుండి పెన్నా బ్రిడ్జ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్! ​నెల్లూరు: నగరంలో ట్రాఫిక్ కష్టాలు మళ్ళీ మొదటికొచ్చాయి. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆత్మకూరు బస్టాండ్ నుండి పెన్నా బ్రిడ్జ్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ​, ఆత్మకూరు బస్టాండ్,నుండి బ్రిడ్జ్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ,ఎండ తీవ్రతకు తోడు ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు మరియు అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వాహనాలు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయాయి. ​, పెన్నా బ్రిడ్జ్ వద్ద పెరుగుతున్న వాహనాల రద్దీ మరియు రోడ్డుపై ఏర్పడిన చిన్నపాటి అడ్డంకులు ఈ భారీ జామ్‌కు కారణమని తెలుస్తోంది. ​ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ, వాహనాల సంఖ్య భారీగా ఉండటంతో పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. Uploaded Video:

రంగారెడ్డి

*మల్లు పెళ్లి వేడుక– సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని భట్టి ఆహ్వానం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 05 : గురువారం ఉదయం జరిగే వివాహ వేడుకకు రావాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక ఆహ్వానం పలికారు. గురువారం వివాహ వేడుక పనులను అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి – KLR సమీక్షించారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… వీఐపీ పార్కింగ్ / సాదారణ పబ్లిక్ వచ్చే ఏరియాల్లోఎలాంటఇబ్బందులు లేకుండా చూడాలని లక్ష్మారెడ్డి అధికారులను కోరారు.దేశ వ్యాప్తంగా వచ్చే ముఖ్య అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోటల్స్ / వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు KLR కార్యాలయం సిబ్బంది తెలిపారు.

కాకినాడ

అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి, భాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చిన — బిక్కిన విశ్వేశ్వరరావు

పెద్దాపురం దర్గా సెంటర్ లో ఉన్న రెండు ఫర్నిచర్ తయారీ షాప్లు మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో సహకరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. షాప్ యజమానులు ఒకో షాపు లో ఆస్తి నష్టం 5 లక్షలు పైన ఉంటుంది అన్నారు.సంఘటన స్థలానికి విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పెద్దాపురం మండల అధ్యక్షుడు బొలిశెట్టి రాంకుమార్,ఉపాధ్యక్షురాలు కాకి భార్గవి,జనరల్ సెక్రటరీ మిడతని శ్రీధర్, ఉపాధ్యక్షుడు దేవాడ శ్రీను, పార్టీ కార్యకర్తలు సందర్శించారు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆస్తి నష్టానికి తగిన పరిహారం ఇపిస్తామన్నారు. ఈ ఫర్నిషర్ తయారీ సంస్థ లో ఎక్కువగా మహిళలు పనిచేస్తుండేవారు అని షాప్ యజమానులు తెలిపారు. ఈ షాప్స్ వల్ల జీవనోపాధి కోల్పోయారని విశ్వేశ్వర్ రావు కు తెలిపారు.

E-పేపర్

ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు పై గరికపాటి నరసింహారావు మాటలు అర్ధరహితం ..

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ప్రెస్ మీట్ , రాజమండ్రి.. తేది : 4-3-2026 ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు పై గరికపాటి నరసింహారావు మాటలు అర్ధరహితం .. ఆంధ్రప్రదేశ్ పేరులో ప్రదేశ్ ను తొలగించి ఆంధ్ర రాష్ట్రం గా మార్చాల్సిందే . తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హిందీ పదంతొ ఆంధ్రులను అవమానించటం తగదు . ఎంటీఆర్ తెలుగునాడు గా ప్రకటించాలనుకున్న పేరు ను ఎంటీఆరే ఉపసంహారించుకున్నారు . పండిత పర్వం ఖ్యాతిని పెంచేలా ఉండాలి . దిగజార్చుకునేలా ఉండరాదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు .. గరికపాటి నరసింహారావు వారికి వేదం పైన , రామాయణ , హితిహశాల పట్ల ఎంతో పట్టు గల పండితులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు . ఈ మధ్య కాలంలో గరికపాటి వారికి అస్సులు సంబంధం లేని వాటిపై కొన్ని వ్యాఖ్యానాలు చేస్తు ఆపకీర్తికి గురవుతున్నారు . హిందూ ధర్మం పవిత్రత కోసం , ఆ ధర్మం యొక్క శక్తి సామర్థ్యల కోసం ఎంతగానో జ్ఞానోదయం గల గరికిపాటి గారు ఈ మధ్య పురాణ పురుషులును , దేవ దేవతలను ఏకవచనంతొ శంభోదిస్తు తన ఆహాన్ని , తన అహకార ఉపన్యాసాలను బోదిస్తున్నారు . గరికపాటి ప్రసంగాలు హిందూ మనోభావాలను గాయ పరుస్తున్నట్టుగా వుంటున్నాయి . అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టి ఆధ్యాత్మక విభాగం ప్రతినిధిగా ఉపన్యాసాలు గుప్పిస్తు ఆ ముసుగులో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు . పీఠధిపతులు, మత ఉద్బోదకులు సామజిక చైతన్యాన్ని , హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పేవిగా ఉండాలి . ఉన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఉండకూడదని ఆయన హితవు పలికారు . పండిత బిరుదాన్కితులైన గరికపాటి వారికి ఆంధ్ర ప్రాశిసత్యం కోసం , చరిత్ర మూలాలు కోసం , పౌరాణిక పవిత్రత , పోరాటాల కోసం తెలియ వంటారా ! తెలిసే ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా ప్రకటించమని గరికపాటి దుందుడుకు ప్రకటన చేస్తున్నారా ! తమిళనాడు రాష్ట్ర పేరును , ఈ మధ్య కేరళం పేరును మార్చుకున్నారు . అందుకని కొంతమంది మేధావులుగా పేర్కొంటున్న వారు ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగునాడుగా మార్చుకోవాలని గరికపాటి తదితర మేధావులు ఎక్కువగా అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు . ఆంధ్ర రాష్ట్ర చరిత్ర , గొప్పతనం , ఆ పేరులో గల శక్తి తెలియక అసందర్బ మాటలుతో గరికపాటి వంటి మేధావులు , వారి అనుంగ సేనలుతొ ఆంధ్రరాష్ట్ర ప్రతిష్ట దిగజారే ప్రమాదం వుందని ఆయన ఆవేదన చెందారు . ఆంధ్ర అనే నామం రామాయణ , మహాభారత కాలానికి ముందునుండి ఆచరణలో వుందని గరికపాటి వారు గ్రహించాలి . ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారతం గాను , ఆధునిక కవిత్వాన్ని అచ్చు వేయించిన బమ్మెర పోతన వంటి మహనీయులు ఆంధ్ర మహాభారతం , శ్రీ మద్ ఆంధ్ర భాగవతం గానే పురాణ కాల నిజాలను వ్రాసారు అని గరికపాటి వారు గుర్తించాలి . 12 వ శతబ్దనికి ముందు తెలుగు అనే పద ఉచ్చారణ లేదు . పురాతన గ్రంధాల్లో సైతం ఆంధ్ర పద ఉచ్చారణ వుందని తెలుసుకోవాలి . బాష (తెలుగు), జాతి , ప్రదేశం , సంస్కృతి కలిసిన సమైక్యతకు వారధిగా ఆంధ్ర పద ఉచ్చారణ దైవ సంకల్పంతొ ఆవిర్బవించిన పదమే ఆంధ్ర అని గరికపాటి వంటి మేధావులు ఆలోచింప చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టకు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన హితబోధ చేసారు . ఆంధ్ర పద ఉచ్చారణకు పురాణకాల చరిత్రతొ పాటుగా ఉద్యమ చరిత్ర కూడా వుంది . నిజాం కాలంలో జరిగిన అనేక పోరాట పోరు బాటల్లో ఆంధ్ర అనే పదం లేకుండా ఉద్యమాలే లేవు . ఆ కోణం లోనే ఆనాడు ” ఆంధ్ర మహాసభ ” ఆవిర్బవించిందన్నారు . ఆంధ్ర పదంను తొలగించమని నిజాం పాలనలో ఎన్ని ఒత్తిడిలు , వేధింపులు వచ్చినా ఆంధ్ర పదంను తొలగించలేదనేది జగమెరిగిన నిజం . తొలి రాష్ట్ర విభజన సమయంలో మద్రాస్ రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని కర్నూల్ రాజధాని గా విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం గానేనని గరికపాటి వారు మరువరాదు . పొట్టి శ్రీరాములు, టంగుటూరు ప్రకాశం పంతులు త్యాగాలతో ఏర్పడిన విభజన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గానే విడిపోయిందని మేధావులు , పండితులు గమనించాలి . ఆంధ్రుకరించారు అనే ఉచ్చారణ నుండి పురుడు పోసుకున్న పదమే తెలుగు నామం అన్నారు . నిజాం నిరంకుసత్వం పై జరిపిన పోరుబాటలో కూడా ఆంధ్ర పదం తొలగించటం కుదరదు అని నాటి కమ్యూనిస్ట్ లు సైతం ఆంధ్ర మహాసభ వేదికగ జరిగిన ఉద్యమాల్లో అండగా నిలిచారాని ఆయన గుర్తు చేసారు . గరికపాటి వారి పండిత నైపుణ్యాన్ని హిందూ ధర్మం కోసం , ఖ్యాతి కోసం మాత్రమే ఉపయోగించగలరని , ఈ దేశానికి మోదీ ఒక్కడే ఉత్తముడు, ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి తెలుగునాడుగా ప్రకటించండి అంటు మిమ్మల్ని అనుసరిస్తున్న వారికి మీ భోదనగా చెప్పి ఆంధ్ర ప్రతిష్టకు మకిలి పట్టించకండి . భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కుత్రిమ వ్యాధి ఒక్క ఆంధ్రరాష్ట్రం లోనే కొంతమందిలో వుంది . గరికపాటి వంటి మేధావులు , సినిమా వారు ఏది చెప్పినా వినటమే పనిగా ఆంధ్ర రాష్ట్రంలో మానసిక వైఖల్యం పెరిగిపోయింది . అనుసరించే వారు భక్తి మార్గం గాను, వినోదపు మాయా జాలం లోను ఒక రకమైన మత్తులో ప్రజల సొంత మేధస్సు ను నిర్వీర్యం చేసుకుంటున్నారు . గరికపాటి కొన్ని సందర్భాల్లో పవిత్ర రామాయణ, మహాభారతం కోసం కూడా వ్యంగ్యంగా ఛలోక్తులు చేస్తు భక్తి సూక్తులను ఆశ్యం చేస్తున్నారు . అఖండ భారతదేశం లోనే రామాయణ , మహాభారతాలకు ఒక ప్రాశిసిత్యం వుంది . మితి మీరిన అహంతొ పవిత్ర గ్రందాలను , దైవ యోధులను గౌరవ ఉచ్చారణ లేకుండా మాట్లాడటం గరికపాటి వారికి అలవాటుగా మారింది . దైవ సందేశంలో ఉండాల్సింది ఆశ్యం కాదు ఏకగ్రత ముఖ్యం అని గరికపాటి వంటి అవధానులు వారికి తెలిసి ఈ మధ్యన ఎందుకో వారి ఉపన్యాసాలు దారి తప్పి రాజకీయ భోదనలుగా మారుతున్నాయి . నా హిందూ ధర్మం పవిత్రత కోసం , నా ఆంధ్ర రాష్ట్ర ప్రస్థానం దారి తప్పుతున్న పరిస్థితులకు తీవ్ర ఆవేదనతొ మిమ్ములను ప్రశ్నించాల్సి వస్తుందని, యావత్ భారతదేశం లోనే ఏ రాష్ట్రానికి లేనటువంటి అదృష్టం , ఖ్యాతి ఆంధ్ర రాష్ట్రానికి వుంది . హిందూ ధర్మ ఆవిర్బావానికి ఏ విధంగా లెక్క కట్టలేమో ఆంధ్ర నామానికి కాలమానాన్ని లెక్కించలేరని ఆయన పేర్కొన్నారు .. మద్రాస్ రాష్ట్రం ను నుండి కర్నూల్ రాజధానిగా విడిపోయిన అనంతరం హైదరాబాద్ లో విలీనం జరిపిన సందర్బంలో ప్రదేశ్ అనే పదాన్ని చేర్చి ఆంధ్రప్రదేశ్ గా నామకరణం చేసారు . తెలుగుదేశం పార్టి ఆవిర్బవించిన సమయంలో కొంతమంది అప్పటి మద్రాస్ రాష్ట్రం వారు తమిళనాడు అని పెట్టుకున్నారు . మనం కూడా తెలుగునాడు అని పెట్టుకుంద్దాం అని చర్చ జరిపిన సందర్బంలో అప్పటి కొంతమంది మేధావులు కలుగచేసుకుని ఆంధ్ర ప్రాశిసత్యం , ఆంధ్ర మూలాలు , ఆ పదం యొక్క శక్తి , గొప్పతనం కోసం వివరించగా ఎంటీఆర్ ఆ ఆలోచనను విరమించుకున్నారనే నిజాన్ని గరికపాటి వారు తెలుసుకోవాలి . మండలి వేంకటేశ్వర రావు , మండలి బుద్ధ ప్రసాద్ సారద్యంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలో కూడా వక్తలు ఆంధ్ర చారిత్రిక మూలాలను కొనియాడారు . ముల్కి రూల్స్ కు వ్యతిరేకంగా పుట్టిన ప్రజా ఉద్యమం కూడా జై ఆంధ్ర నినాదంతోనే సాగిందని , ఆంధ్రప్రదేశ్ పేరును ఆంధ్ర రాష్ట్రంగా పేరు మార్చే దిశగా ప్రభుత్వం పరిశీలన చేయాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రుల త్యాగాల కోసం , చారిత్రిక మూలాల కోసం ఉద్విగ్నంగా మాట్లాడారు .. ఈ మీడియా సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ లంక దుర్గా ప్రసాద్ , పెండ్యాల కామరాజు, సిమ్మా దుర్గారావు , దుడ్డే త్రినాద్ , బర్ల ప్రసాద్ , వర్ధనపు శరత్ కుమార్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , కొల్లి సత్యనారాయణ, కాకర ప్రసాద్ , ఎస్ కే దేవి, మేకా అయ్యప్ప , కంతి రమాకాంత్ తదితరులు పాల్గొనియున్నారు …. END

తిరుపతి

రాష్ట్రపతి అవార్డు గ్రహీతలను సత్కరించిన మిత్ర బృందం

శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేటలో ఉంటున్న అప్పిని రాజేంద్ర, అప్పిన మాధవిలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపతి ముర్మూచే మన చేనేత బిడ్డలైన వీరికి కలంకారి కృషికి వీరికి రాష్ట్రపతి భవన్ లో సకల మర్యాదలతో 15 రోజులు పాటు చూసుకొని సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారి మిత్ర బృందం శ్రీ చాముండేశ్వరి కళ్యాణ సదన్ లో వీరికి స్నేహితులు అందరూ కలసి సత్కరించారు.

తిరుపతి

ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 18వ మహాసభల కరపత్రాలు పంపిణీ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 04 శ్రీకాళహస్తి ముళ్ళపూడి ఎస్టి కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఏప్రిల్ లో జరిగే అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 18వ మహాసభలను జయప్రదం చేయాలని గడపగడపకు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిథులుగా సిపిఐ నాయకులు మించల శివకుమార్ మాట్లాడుతూ….కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు ఎఐటియుసి నాయకత్వం లో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలలో అత్యంత ప్రధానమైన 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించి 2025 నవంబర్ 21 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు దీనివలన పారిశ్రామిక వివాదాల చట్టం ఫ్యాక్టరీస్ యాక్టు కార్మిక నష్టపరిహార చట్టం వంటి ముఖ్యమైన చట్టాలు రద్దు చేయబడతాయి అన్నారు కార్మిక సంఘాలు పెట్టుకోవాలన్నా తమ కోర్కెల కోసం సమ్మెలు చేయాలన్నా అవకాశం లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడలను రూపొందించిదని ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చే నాలుగు కార్మిక కోడ్ లు రూపొందించారని నాలుగు 4 కోడ్ లను రద్దు చేయాలని అప్పటివరకు పార్టీ ప్రజా సంఘాలు ఆందోళనలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు తిరుపతిలో జరిగే మహాసభలకు అన్ని కార్మిక వర్గాలు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బత్తేమ్మ సీనయ్య లక్ష్మమ్మ అంకమ్మ కాంతమ్మ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

8న బాలాలయంలోకి గుడిమల్లం పరశురామేశ్వర స్వామి

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 04 : భారతదేశంలో మొదటి శివాలయంగా గుర్తింపు పొందిన గుడిమల్లం శ్రీ పరుశురామేశ్వర స్వామి దేవాలయంలో ఏప్రిల్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు వైభవంగా మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో చిన్న మరమ్మతు పనులు చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గుడిమల్లం లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రాత్మక పుణ్యక్షేత్రం, శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 8 తేదీన స్వామివారు బాలాలయంలోకి వెళ్ళనున్నారు. బాలాలయం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామనీ బుధవారం నాడు గుడిమల్లంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆలయ పాలకమండలి చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈఓ కె. రామచంద్రారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ, పాలకమండలి సభ్యులు వివరాలు వెల్లడించారు. కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఆగమ శాస్త్రం ప్రకారం ఈ బాలాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రస్తుతం ఆలయంలోని రాజగోపురంతో పాటు ఇతర కీలక ప్రాంతాలలో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని శాస్త్రం ప్రకారం గర్భాలయంలో పనులు జరుగుతున్నప్పుడు, మూలవిరాట్ శక్తులను తాత్కాలికంగా అత్తి చెక్కతో చేసిన ప్రతిమలోకి (నమూనా) ఆవాహన చేసి, ప్రత్యేకంగా నిర్మించిన బాలాలయంలో ప్రతిష్ఠిస్తారు. పనులు పూర్తయ్యే వరకు స్వామివారికి నిత్య పూజలు అక్కడే జరుగుతాయని చైర్మన్ గిరి నాయుడు తెలిపారు. అనంతరమ ఆలయ వేదం పండితులు వంశీకృష్ణ శర్మ మాట్లాడుతూ…. ఆలయ మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత ఏప్రిల్ 19 నుంచి 23వ తేదీ వరకు మహా కుంభాభిషేకం 40 మంది రిత్వికులచే చెప్పటనన్నట్లు తెలిపారు. ఏప్రిల్ 19వ తేదీ పరశురామేశ్వర స్వామి జయంతి సందర్భంగా మహా కుంభాభిషేకం ప్రారంభమై 23వ తేదీ వరకు జరుగుతుందన్నారు. 42 రోజులు దర్శనం బాలాలయంలోనే జరుగుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.