మనెపల్లి జ్యువెల్లర్స్లో డిజిటల్ గోల్డ్ యాప్ ప్రారంభం
పున్నమి ప్రతినిధి Manepally Jewellers Pvt. Ltd. వినియోగదారుల సౌకర్యార్థం ‘డిజిటల్ గోల్డ్ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రోజువారీ బంగారం ధరలను తెలుసుకోవడంతో పాటు 10 గ్రాముల బంగారంపై పెట్టుబడి చేసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్ కొనుగోలు, భద్రత, పారదర్శకతతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో పెట్టుబడిదారులకు ఇది అనుకూలమని తెలిపారు.











