Friday, 13 March 2026

Blog

E-పేపర్

కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ*

కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ* పున్నమి న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం డిసెంబర్ 26 ) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలని కోరుతూ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 పిలుపుమేరకు ఈనెల 27న చేపట్టనున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా జయప్రదం చేయాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 9:30 గంటల వరకు జర్నలిస్టులందరూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా జారీ చే సిన జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో 252ను నిరసిస్తూ ధర్నా చేపడం జరుగుతుందన్నారు. అర్హులైనజర్నలిస్టులందరికీ అక్రిడి టేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల జo గ్ సైరన్ పేరిట చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని జర్నలిస్టులను కోరారు.రాష్ట్ర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని, తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ రోడ్డబాగ్య వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ అయిన కేకే మహేందర్ రెడ్డి తుర్కపల్లి గ్రామా నివాసులైన అంబేద్కర్ సంఘం శాఖ అంకని అశోక్ అంకని మురళి అడ్వకేట్ అంకని అశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు వెలుమల రామిరెడ్డి యాదగిరి గౌడ్ కర్ణాకర్ బాలయ్య ఇతర కార్యకర్తలు ప్రముఖ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు మహిళా మండల అధ్యక్షులు వనిత పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ రోడ్డబాగ్య వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ అయిన కేక మహేందర్ రెడ్డి తుర్కపల్లి గ్రామా నివాసులైన అంబేద్కర్ సంఘం శాఖ అంకని అశోక్ అంకని మురళి అడ్వకేట్ అంకని అశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు వెలుమల రామిరెడ్డి యాదగిరి గౌడ్ కర్ణాకర్ బాలయ్య ఇతర కార్యకర్తలు ప్రముఖ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు మహిళా మండల అధ్యక్షులు వనిత పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

నూతన సంవత్సర వేడుకల్లో డ్రింక్ అండ్ డ్రైవ్‌కు చెక్ – చిట్వేల్ ఎస్సై హెచ్చరిక

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని చిట్వేల్ మండలం ఎస్సై ఎస్.వినోద్ కుమార్ హెచ్చరించారు. డ్రింక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే చర్యలు కూడా తప్పవని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ డ్రైవింగ్, సైలెన్సర్ల మార్పు, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చిట్వేల్ మండల ప్రజలు చట్టాన్ని అతిక్రమించకుండా నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై సూచించారు.

E-పేపర్

వంగవీటి మోహనరంగాకు నివాళులర్పించిన చెన్నంశెట్టి చిన్న

వంగవీటి మోహనరంగాకు నివాళులర్పించిన నాయకులు రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు స్థానిక శివాలయం సెంటర్లో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి సందర్భముగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నా చెన్నంశెట్టి శెట్టి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన అభిమానులు మరియు రైల్వే కోడూరు పట్టణంలో ఆయనకు ఘనంగా బాణసంచా పేలుస్తూ నాయకులందరూ ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. అన్నమయ్యజిల్లా రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు మర్రి రెడ్డి ప్రసాద్,రైల్వేకోడూరు గౌరవ అధ్యక్షులుచెన్నం శెట్టి చలపతి,కోడూరు అధ్యక్షులు చెన్నం శెట్టి శ్రీనివాసులు,భాస్కర్,మందల నాగేంద్ర, రమేష్, వంశీ, ఎంపీటీసీ మల్లికార్జున, రత్తయ్య, అంకెపల్లి అఖిల్, వాసా బాబు మొదలగువారు పాల్గొన్నారు.

E-పేపర్

పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్..

*పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్….* అబ్దుల్లాపూర్మెట్ మండల పున్నమి న్యూస్ ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 25 డిసెంబర్ 2025 అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రం వద్ద విజయవాడ హైవే పై 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని గోరక్షక కార్యకర్తలు అడ్డుకొని పట్టుకున్నారు. నిందితులు పోలీసుల కళ్లుగప్పేందుకు లారీ పైభాగంలో తాడిమట్టలతో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసి, వాటి కింద గోవులను దాచారు. అంతేకాకుండా, ఈ లారీకి ఒకవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. కార్యకర్తలు వెంటనే లారీని పోలీస్ స్టేషన్ తరలించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

E-పేపర్

పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్ అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో

*పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్….* అబ్దుల్లాపూర్మెట్ మండల పున్నమి న్యూస్ ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 25 డిసెంబర్ 2025 అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రం వద్ద విజయవాడ హైవే పై 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని గోరక్షక కార్యకర్తలు అడ్డుకొని పట్టుకున్నారు. నిందితులు పోలీసుల కళ్లుగప్పేందుకు లారీ పైభాగంలో తాడిమట్టలతో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసి, వాటి కింద గోవులను దాచారు. అంతేకాకుండా, ఈ లారీకి ఒకవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. కార్యకర్తలు వెంటనే లారీని పోలీస్ స్టేషన్ తరలించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*తిరుమలపై వైసీపీ దుష్ప్రచారం* *అబద్ధాలతో భక్తుల విశ్వాసాలపై దాడి* : *వేమూరి ఆనంద్ సూర్య*

తిరుమలతో పాటు రాష్ట్రంలోని దేవాలయాల పవిత్రతను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. అయినా ‘తొక్కిసలాట’, ‘ప్రభుత్వ నిర్లక్ష్యం’ అంటూ వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు.తిరుమలలో ఎలాంటి తొక్కిసలాట జరగలేదని స్వయంగా ఎస్పీ పరిశీలించి స్పష్టం చేసినప్పటికీ, భయాందోళన సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నా యని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలోనే ఆలయాలపై దోపిడీలు, అక్రమాలు జరిగాయని,ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తోందన్నారు. తిరుమల గోశాల, నిత్యాన్నదానం, దర్శనాలపై తప్పుడు వదంతులు పుట్టించి భక్తుల మనోభావాలను కించపరుస్తున్నారని పేర్కొన్నారు. ఆలయాలపై దుష్ప్రచారం ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయా లనే కుట్రగా ఆయన అభివర్ణించారు.

E-పేపర్

*​విద్యార్థులు సృజనాత్మకతపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*

​గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సృజనాత్మకతపై పట్టు సాధించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. బి కే ఆర్ సేవా సంఘం, అమ్మ చిల్డ్రన్ హోమ్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన దేశభక్తి గీతాలు, చిత్రలేఖన పోటీల విజేతలకు ఆయన బహుమతులు పంపిణీ చేశారు. ​ఈ కార్యక్రమానికి బి కే ఆర్ సేవా సంస్థల చైర్మన్ కానూరు శేషు మాధవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజ్ పాయ్ దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన నైతిక విలువలతో కూడిన పాలన అందించారని కొనియాడారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని అభివృద్ధి పథంలో సాగాలని పిలుపునిచ్చారు. ​అదేవిధంగా, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పుట్టినరోజు వేడుకలను కూడా ఇక్కడే నిర్వహించారు. కుమారస్వామి కేక్ కట్ చేయగా, పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. *​ముఖ్య అంశాలు:* ​గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని 15 పాఠశాలల నుండి 450 మంది విజేతలకు బహుమతులు అందజేశారు. ​విద్యార్థి దశ నుండే సేవాభావాన్ని అలవర్చుకోవాలని కుమారస్వామి కోరారు. ​పోటీల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో పోటీ తత్వం, మంచి ఆలోచనలు పెరుగుతాయని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి షేక్ బాజీ, మట్ట ప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు గుడపాటి తులసి మోహన్, జనసేన నాయకులు చిమట రవి వర్మ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*నల్లగా మారిన అంగన్వాడీ గుడ్లు*

నందిగామ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బాలింతలకు ఇచ్చే గుడ్లు నాణ్యత లేదు ప్రభుత్వం ఇలాంటి గుడ్లు పంపిణీ చేస్తుంది. చిన్న పిల్లలు గుడ్లు తింటే బలం అంటున్నారు. కానీ ఈ గుడ్లు తింటే అనారోగ్యనికి గురవుతారు. ఈ గుడ్లు అంగన్వాడీ సెంటర్ లో పంపిణీ జరుగుతున్నా అక్కడ వాళ్ళు నోరు విప్పటం లేదు ఈసారి ఇలాంటి గుడ్లు వస్తే పై అధికారులకు చెపొచ్చు అని అక్కడి వాళ్ళకు నచ్చచెపుతున్నారు. గుడ్లు ను బాగా ఉడకపెట్టిన కూడా గుడ్డు లోపల నల్ల వలయం లా మారుతుంది. ఈ గుడ్లు తినటం వలన చాలా ప్రమాదం. అంగన్వాడీ సెంటర్ లో వచ్చే నాసిరాకం గుడ్లు కాకుండా నాణ్యత చూసి ప్రభుత్వం పంపిణీ చేయాలి. అని కోరుతున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.