కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ*
కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ* పున్నమి న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం డిసెంబర్ 26 ) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలని కోరుతూ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 పిలుపుమేరకు ఈనెల 27న చేపట్టనున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా జయప్రదం చేయాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 9:30 గంటల వరకు జర్నలిస్టులందరూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా జారీ చే సిన జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో 252ను నిరసిస్తూ ధర్నా చేపడం జరుగుతుందన్నారు. అర్హులైనజర్నలిస్టులందరికీ అక్రిడి టేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల జo గ్ సైరన్ పేరిట చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని జర్నలిస్టులను కోరారు.రాష్ట్ర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని, తెలిపారు.











