Friday, 13 March 2026

Blog

విశాఖపట్నం

10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ

10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ. *జనవరి 1 నుండి అన్ని జోనల్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం. * జోనల్ కమిషనర్లు జనవరి 1న జోనల్ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధం చేయాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ . *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో 2026 జనవరి 1వ తేదీ నుండి పునర్వ్యవస్థీకరించిన 10 జోనల్ కార్యాలయాలను కార్యచరణ ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జోనల్ కమిషనర్ లను జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న జోనల్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది జోన్లను 10 జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు సంబంధించి జోనల్ కార్యాలయాలు, అధికారులు,సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. 2026 జనవరి 1 వ తేదీ నుండి 10 జోనల్ కార్యాలయాలు పనిచేయాలని అందుకు సంబంధించిన ఫైల్స్, రికార్డులు తారుమారు కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఆయా జోన్లకు తీసుకువెళ్లాలన్నారు. ఇకపై సిబ్బంది, అధికారులు ఆయా జోనల్ కార్యాలయాల నుండి విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా జోనల్ కార్యాలయం పరిధిలో ఉన్న వార్డులు, సచివాలయాలు ప్రజలకు తెలిసే విధంగా సచివాలయాల వారీగా వార్డు కార్యదర్శులు అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్లను, అధికారులను కమిషనర్ ఆదేశించారు. “” జివిఎంసి క్రొత్త జోన్ల వివరాలు”” భీమునిపట్నం జోన్ – వార్డులు: 1, 2, 3, 4 – మొత్తం 4 వార్డులు – 58.884 చ.కి.మీలు, మధురవాడ జోన్ – వార్డులు: 5, 6, 7, 8, 98 – మొత్తం 5 వార్డులు – 95.668 చ.కి.మీ లు, ఈస్ట్ జోన్ – వార్డులు: 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 28 – మొత్తం 15 వార్డులు – 48.527 చ.కి.మీ లు, నార్త్ జోన్ – వార్డులు: 14, 24, 25, 26, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 54, 55 – మొత్తం 17 వార్డులు – 19.928 చ.కి.మీలు, సౌత్ జోన్ – వార్డులు: 27, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 41 – మొత్తం 13 వార్డులు – 9.698 చ.కి.మీలు, వెస్ట్ జోన్ – వార్డులు: 40, 52, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 89, 90, 91, 92 – మొత్తం 14 వార్డులు – 72.937 చ.కి.మీలు, పెందుర్తి జోన్ – వార్డులు: 88, 93, 94, 95, 96, 97 – మొత్తం 6 వార్డులు – 75.038 చ.కి.మీలు, గాజువాక జోన్ – వార్డులు: 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 86, 87 – మొత్తం 15 వార్డులు – 108.115 చ.కి.మీలు, అగనంపూడి జోన్ – వార్డులు: 77, 78, 79, 85 – మొత్తం 4 వార్డులు – 102.830 చ.కి.మీలు, అనకాపల్లి జోన్ – వార్డులు: 80, 81, 82, 83, 84 – మొత్తం 5 వార్డులు – 41.079 చ.కి.మీలు గా విభజించడం జరిగిందని తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇకపై జీవీఎంసీ కల్పిస్తున్న సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాలు ,సేవలు ఆయా జోనల్ కార్యాలయాల ద్వారా పొందవచ్చునని తెలిపారు

విశాఖపట్నం

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 100 వినతులు.

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 100 వినతులు. – జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి *: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 100 వినతులు వచ్చాయని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం పాత సమావేశ మందిరం లో అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ ఎస్ వర్మ లతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 100 అర్జీలు / ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా భీమిలి జోన్ కు 06, మధురవాడ జోన్ కు 16, ఈస్ట్ జోన్ కు 15, వెస్ట్ జోన్ కు 07, నార్ట్ జోనుకు 06, సౌత్ జోన్ కు 12, పెందుర్తి జోన్ కు 07, అగనంపూడి జోన్ కు 02, గాజువాక జోన్ కు 07, అనకాపల్లి జోన్ కు 01, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 21 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 14, రెవెన్యూ విభాగమునకు 11, ప్రజారోగ్య విభాగమునకు 06, పట్టణ ప్రణాళిక విభాగమునకు 43, ఇంజినీరింగు విభాగమునకు 18, మొక్కల విభాగమునకు 03, యుసిడి విభాగమునకు 05 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం కమిషనరు మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను, జోనల్ కమీషనర్లను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, సిసిపి ఏ.ప్రభాకర రావు, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, డిడిహెచ్ ఎమ్.దామోదరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, కార్యదర్శి బివి రమణ ,స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, సిపి, డిసీపీ లు, ఏసీపీ లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు,బయాలజిస్ట్, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ల మీద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం…* 🎥 *ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా… లేరా…?*

పున్నమి ప్రతినిధి: *కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ల మీద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం…* 🎥 *ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా… లేరా…?* *మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ శ్రీ దండెం రాంరెడ్డి మీడియా సమావేశంలో దండెం రాంరెడ్డి మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా.. లేరా..? అనేది ప్రజలకు అర్ధం కావడం లేదు అన్నారు, పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల ఏర్పాటు గందరగోళంగా ఉంది అన్నారు, వ్యవసాయం మీద ఆధారపడిన నాలుగు గ్రామాలను తెచ్చి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ లో కలిపారు ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ని జీహెచ్ఎంసీ లో కలపడం వలన ఆయా గ్రామాల ప్రజల మీద తీవ్ర టాక్స్ భారం పడుతుంది, అందువలన ఏం అర్థం కాని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు అన్నారు, ఎల్బీనగర్ జోన్ లో ఉన్న పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ లను నాగోల్ సర్కిల్ లో కాకుండా పక్కనే ఆనుకొని ఉన్న హయాత్నగర్ సర్కిల్ లో ఈ డివిజన్ల ను కలపాలి అని అన్నారు, పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల లోని ఓటర్ల వ్యత్యాసం, పెద్ద అంబర్ పేట్ డివిజన్ లో 55 వేలకు పైచిలుకు, కుంట్లూరు డివిజన్ లో 12 వేల పైచిలుకు ఓటరు వ్యత్యాసం ఉంది అన్నారు, అదేవిధంగా కుంట్లూరు రెవెన్యూ ఏ లేదు దానిని ఒక డివిజన్ గా చేశారు అన్నారు, కుంట్లూరు తట్టి అన్నారం కలిపి ఒక డివిజన్ గా చేయాలని తెలిపారు, ఈ విషయమై కమిషనర్ గారికి మెమోరాండం కూడా అందజేయడం జరిగింది అన్నారు, రంగారెడ్డి జిల్లా లోనే సీనియర్ శాసన సభ్యుడిని అని చెప్పుకునే మన ఎమ్మెల్యే కి ఈ మాత్రం అవగాహన లేదా అని ప్రశ్నించారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న అన్ని డివిజన్ల లో లోపాలు సరిచేసి అన్ని డివిజన్లు సరిసమానంగా ఏర్పాటు చేయాలని అన్నారు, దీని మీద స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు, లేని పక్షంలో కోర్టుకు వెళ్లి న్యాయపరంగా తేల్చుకుంటాం అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈదమ్మల్ల బలరాం, మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ అర్చన దామోదర్, తాజా మాజీ కౌన్సిలర్ మండల కోటేశ్వర్ రావు, తాజా మాజీ కౌన్సిలర్ తొండెపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేసారం బాలకృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్ పిల్లి నగేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ భాస్కర్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు జోర్క రాము, గాదె శేఖర్, పత్తి రవికాంత్, ఊటుకూరి కర్నాకర్, గాయాల రాము, పండుగుల సత్యనారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు. దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం}

E-పేపర్

*అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి

పున్నమి ప్రతినిధి: అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి* *గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి* *ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) బృందం* గ్రేటర్ హైదరాబాద్ పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా జీవోలో సవరింపులు చేపట్టాలని కోరుతూ టీ యూ డబ్ల్యూ జే (ఐజేయూ) బృందం సమాచార శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయం లోని ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కే శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, హెచ్ యు జె అధ్యక్షులు శిగా శంకర్, మేడ్చల్ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, మేడ్చల్ కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణలు సమస్యను ఆమెకు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాలలో ప్రధాన పత్రికలలో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని ఆమెకు తెలిపారు. నూతన జీవో 252 ద్వారా ఒక పత్రికకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ముగ్గురు నలుగురికి అక్రిడిటేషన్ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రూరల్ మండలాలతో కాకుండా అర్బన్ మండలాలను ప్రత్యేకంగా చూడాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఆవేదనలు దృష్టిలో ఉంచుకొని జీవోలో సవరణలు చేసి న్యాయం చేయాలని కోరారు. *సానుకూలంగా స్పందించిన కమిషనర్* గ్రేటర్ పరిధిలోని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్య పై పౌర సంబంధాలు అండ్ సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక సానుకూలంగా స్పందించారు. అర్బన్ మండలాలలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వడం న్యాయ బద్ధమైనదని తెలిపారు. త్వరలోనే మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీని ఇచ్చారు.

తెలంగాణ

రబి సీజన్లో యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన: మంత్రి

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ఈరోజు(సోమవారం) రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో, రబీ సీజన్లో యూరియా పంపిణి పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరతలేదని అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

కామారెడ్డి

రెడ్డిపేటలో ఉచిత నట్టల నివారణ శిబిరం

1404 జీవాలకు మందులు…… కామారెడ్డి, 29డిసెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గొర్రెల పెంపకం దారులు ఉచిత నట్టల నివారణ మందుల శిబిరాలను సద్వి నియోగం చేసుకోవా లని మండల పశువైద్యాధికారీ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిబిరాలు రైతులకు గొప్ప ఆశీస్సుగా మారాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారీ, సర్పంచ్ చేతుల మీదుగా రెడ్డిపేట గ్రామంలో ఉచిత నట్టల నివారణ శిబిరాన్ని ప్రారం భించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, నారాయణ జేవీఓ, రమేష్ వీఏ , సిబ్బంది ఆంజనేయులు, బలమని, గోపాల మిత్ర హారిక, స్వామి, గొర్రెల పెంపకం దారులు రాములు, రాజయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

వరుస దొంగతనాలతో హడలిపోతున్న కోళ్ల పెంపకం దారులు

కృత్తివెన్ను మండలం సీతనపల్లె పంచాయతీ ఒంటిల్లు గ్రామం లో 25 వ తారీకు అర్ధరాత్రి జరిగిన కోళ్లు దొంగతనం కేసులో కొప్పర్తి. అచ్చిబాబు s/o లక్ష్మణరావు గుడ్లవల్లేరు మండలం, పేరం కొండలరావు s/o దుర్గారావు, గుడ్లవల్లేరు మండలం అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి 10కోడిపుంజులు, బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్టు కృత్తివెన్ను SI పైడిబాబు తెలిపారు. ఇటు బంటుమిల్లి లో కూడా షుమారు 6 లక్షలు విలువ చేసే 10 కోడిపుంజులను ఆదివారం తెల్లవారు జామున దొంగలు అపహారించినట్టు సమాచారం. సంక్రాంతి సమీపిస్తుండడం తో కోళ్లు దొంగతనాలు జరగడం అవి లక్షల ఖరీదు చేసేవి కావడం తో కోళ్ల పెంపకం దారులు హడలెత్తిపోతున్నారు.

సిద్ధిపేట

యూరియా కోసం రైతుల తిప్పలు పట్టనట్టున్న ప్రభుత్వం

మిరుదొడ్డి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. యూరియా వస్తుందని తెలవడంతో భారీగా తరలివచ్చిన రైతన్నలు. యూరియా కోసం ఓ షాప్ ముందు భారీగా లైన్ కట్టిన అన్నదాతలు. వచ్చిన యూరియా అందరికీ సరిపోక నిరాశకు గురైన రైతన్నలు. పున్నమి ప్రతినిధి మిరుదొడ్డి మండలం మల్లేశం . సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి ఉదయం 6 గంటల నుంచి ఓ ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు యూరియా కోసం లైన్లో నిల్చొని ఉన్నారు. వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇచ్చిన స్టాక్ లేదని చెప్పడంతో రైతులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు వింత నిబంధనాలతో రైతులను ఇబ్బంది పెడుతూ యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఇటీవల ఫర్టిలైజర్ యాప్ తీసుకు రావడంతో గందరగోళంలో పడిన రాష్ట్ర రైతాంగం. అయితే ఈ యాప్ లో యూరియా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తీసుకోకపోతే మళ్లీ 15 రోజుల వరకు యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉండదనే నిబంధనలు తీసుకురావడంతో అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. యాప్ లో యూరియా బుక్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్ వివరాలు అడగడంతో కౌలు రైతులకు. రైతుబంధు నిధులు వేస్తారేమో అని ఆందోళనలో ఉన్న భూ యజమానులు. ఈ నేపథ్యంలో తమకు భూమినీ కౌలికి ఇచ్చేందుకు యజమానులు వెనకాడుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్న కౌలి రైతులు. యూరియా తీసుకునే లిమిట్ పెట్టిన ప్రభుత్వం. పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఈ షాపుల్లో లేని యూరియా యాప్ లో ఎలా అని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రైతన్నల పైన కక్షపూరిత వైఖరి మాని అన్నదాతలకు యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు డిమాండ్ చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

అత్యంత భక్తి శ్రద్దలతో లక్ష పత్రి పూజ

బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం జరిగిన లక్షపత్రి పూజ అత్యంత వైభవోపేతం గా భక్తి శ్రద్దలతో జరిగింది. ఉదయం గణపతి పూజ తో మొదలైన ఈ కార్యక్రమం వేదంపండితుల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన,మహాన్యాస పారాయణం,నీరాజన మంత్రపుష్పం వంటి కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగింది.వందలాదిగా భక్తులు పాల్గొని నాగేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనలు పొందారు.అనంతరం మధ్యాహ్నంజరిగిన అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కొత్తపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చందర్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో పంచాయితీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) మరియు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై, కూటమి నాయకులతో కలిసి చందర్లపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో కాంపౌండ్ వాల్స్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మొత్తం 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల అంచనా వ్యయం రూ.128.00 లక్షలుగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గ్రామాల అభివృద్ధికి రోడ్లు, గోడలు వంటి మౌలిక సదుపాయాలు కీలకమని, ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటు లోకి వస్తాయని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.