Friday, 13 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాష్ట్ర జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు

జిల్లా స్థాయిలో మెరిసిన టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోవూరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “స్పెల్‌బీ” పోటీల్లో టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మూడు దశలుగా జరిగిన ఈ పోటీల్లో అర్హత పరీక్ష, క్విజ్‌, ఇంగ్లీష్ పదాల ఉచ్చారణస్పెల్లింగ్ పరీక్షల్లో రాణిస్తూ, మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థిని గాయత్రీ నెల్లూరు జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. అదే కళాశాలకు చెందిన ఎంఫీసీ విద్యార్థిని నేహా నిపేక్ష ఆగ్రా లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచింది. సీఈసీ విద్యార్థి మహేంద్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాలపై ప్రిన్సిపాల్‌ సికిందర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు వివిధ నైపుణ్యాల్లోనూ రాణిస్తూ మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యాపక వర్గం కూడా విద్యార్థులను శుభాకాంక్షలు తెలిపింది.

E-పేపర్

రాష్ట్ర జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు

జిల్లా స్థాయిలో మెరిసిన టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోవూరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “స్పెల్‌బీ” పోటీల్లో టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మూడు దశలుగా జరిగిన ఈ పోటీల్లో అర్హత పరీక్ష, క్విజ్‌, ఇంగ్లీష్ పదాల ఉచ్చారణస్పెల్లింగ్ పరీక్షల్లో రాణిస్తూ, మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థిని గాయత్రీ నెల్లూరు జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. అదే కళాశాలకు చెందిన ఎంఫీసీ విద్యార్థిని నేహా నిపేక్ష ఆగ్రా లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచింది. సీఈసీ విద్యార్థి మహేంద్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాలపై ప్రిన్సిపాల్‌ సికిందర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు వివిధ నైపుణ్యాల్లోనూ రాణిస్తూ మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యాపక వర్గం కూడా విద్యార్థులను శుభాకాంక్షలు తెలిపింది.

పిల్లలకు

మహాదేవి ( విభాగం -1)

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు వాయు లింగేశ్వరపురం. ఆ ఊరిలో మహేశ్వరి, దేవా అనే దంపతులు ఉండేవారు. వీరికి పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. అయినా వీళ్ళకు పిల్లలు లేరు. అందుకు వీరు చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక ఋషి ఆ ఊరికి వచ్చి, అక్కడ ఉన్న శివాలయంలో ఉన్న శివుని దర్శనం చేసుకుని,ఆ దంపతులు ఇద్దరూ ఉన్న ప్రదేశం గుండా అతను వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఋషి వచ్చి ఆ దంపతులతో ఇలా చెప్పాడు ” తల్లీ నీవు సంతానం లేకుండా చాలా బాధపడుతున్నావు కదా ” అని ఆ ఋషి వాళ్లను అడిగాడు. మహేశ్వరి ” అవును! మీకు ఎలా తెలుసు” అని అడిగింది. ఋషి ” అంతా ఆ మహాదేవుని మహిమ” అని చెప్పాడు. తరువాత ఆ ఋషి మహేశ్వరి తో ఇలా చెప్పాడు ” తల్లి నీవు ఈ క్షణం నుంచి మహాదేవుడిని పూజించు, అతనికి భక్తి శ్రద్ధలతో శ్రమించుకో ఇలా నువ్వు చేయడం ద్వారా నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది” అని ఆ ఋషి చెప్పాడు. అప్పుడు తన భర్త దేవాతో ఈ విషయాన్ని గురించి చెప్పింది. అలా రోజు ఇద్దరూ కలిసి వారికి దగ్గరలో ఉన్న శివాలయంనందుకు వెళ్లి రోజు పూజలు చేసి, అభిషేకం చేసి, నైవేద్యం సమర్పించి, చాలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో మహా దేవుడిని పూజించారు. ప్రతి సోమవారం వారు ఇద్దరూ సాయంత్రం సమయంలో దీపం వెలిగించి,ఆ రాత్రి అక్కడే ఉండి జాగారం చేసి, తెల్లవారి జామున లేచి, అక్కడే ఉన్న కోనేరు లో స్నానం చేసి, మహాదేవుడిని దర్శించుకుని వారి ఇంటికి వెళ్లారు. తరువాత కొన్ని రోజులకి మహేశ్వరి తన పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు తన వెళ్ళిన రెండో రోజు తను తల్లి కాబోతుంది అని తెలిసింది. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది మహేశ్వరి. మహేశ్వరి మరియు తన భర్త దేవా ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి మహాదేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆరోజు మొత్తం వారు ఇద్దరు గుడిలో ఉండి అన్నదానం కార్యక్రమం చేసి, రాత్రి జాగారం చేశారు. కొన్ని నెలల తరువాత మహేశ్వరి శ్రీమంతం చేసుకుంది. అలా అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. హఠాత్తుగా ఒక రోజు మహేశ్వరి తన భర్త అయినా దేవాతో కలిసి మందుల కోసం పట్నం వెళ్ళారు. అప్పుడు దేవా రోడ్డును దాటబోతు ఉండగా ఒక లారీ వచ్చి అతనిని ఢీ కొట్టింది. అప్పుడు అతనిని వైద్యశాలకు తరలించారు. దేవా తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి వెంటనే స్పృహ కోల్పోయింది. వెంటనే మహేశ్వరిని అదే వైద్యశాలలో చేర్పించారు. అప్పుడు తన స్థితి చాలా ప్రమాదకరమైనదిగా ఉంది. అని వైద్యులు చెప్పారు. తన కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదం ఉందని చెప్పారు.

నాగర్‌కర్నూల్

పీఏసీఎస్ చైర్మ‌న్ పై ఆశ‌..!

పీఏసీఎస్ చైర్మ‌న్ పై ఆశ‌..! వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్ల‌ను నియమిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్ల‌ను నియమిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో వెల్డండ మండల కాంగ్రెస్ నాయకుడు పీఏసీఎస్ చైర్మన్ పదవీ పై ఆశలు పెట్టుకున్నట్టు సొంత పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. సహకార పరపతి సంఘాలకు ఇకపై ఎన్నికలు ఉండవని, నామినేటెడ్ పద్దతిలో పాలక మండలాల‌ను వచ్చే సంవత్సరం జనవరి లో ప్రకటించనున్నారనే ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు వెల్డండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ పదవీ కోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో మంతనాలు కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకే చైర్మన్ పదవీ దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక .

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిహారానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎండిఓ జలజాక్షి మేడం ,పి డి గంగాభవాని మేడం ,డి వి ఓ విజయలక్ష్మి మేడం, జె క్యు సి ఖలీల్ సార్, ఏ పి డి గాయత్రీ దేవి మేడం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనుల అమలు, ఖర్చుల వివరాలు, పరిహార చెల్లింపులపై పారదర్శకంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సామాజిక తనిఖీ ద్వారా పథకం అమలులో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ

రబి సీజన్ లో యూరియా సరఫరాకు ఇబ్బందులు లేవు : రెవిన్యూ అదనపు కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) రబి సీజన్లో యూరియా పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరతలేదని, యాప్ ద్వారా రైతులు సులభంగా స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్సై హెచ్చరిక

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని మనుబోలు ఎస్సై శివ రాకేష్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అశాంతి సృష్టించడం, శబ్ద కాలుష్యం వంటి చర్యలకు తావిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు సంయమనంతో వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రాత్రంతా ప్రత్యేక తనిఖీలు, ప్యాట్రోలింగ్ కొనసాగుతాయని తెలిపారు.

E-పేపర్

*ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ*

*శాసన సభ్యులు వనమాడి కొండబాబు* కాకినాడ జిల్లా కాకినాడ సిటీ :కాకినాడ నగర ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 32, 33,34,35 డివిజన్లకు సభందించి పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగాణంలో మధ్యాహ్నం 27,28,29,30,31, డివిజన్లకు సంబంధించి అన్నదాన సమాజంలోనూ ప్రజాధర్భర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటికి పరిష్కారం మార్గాలు చేపట్టడమే కొరకు ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని, నగర అభివృద్ధి, మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై ఫిర్యాదులు తగ్గు ముఖం పట్టాయని అన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పెన్షన్, ఇళ్ల స్థలాల కోసం పిర్యాదులు అధికంగా వస్తున్నాయని వాటిని పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సమయపాలనతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువయ్యేలా చేస్తాయని, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడానికి ఇవి దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమం కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వి చరణ్, టిపిఆర్ఓ శైలజ, డిసిపి కృష్ణారావు, డి కనకారావు, స్థానిక కూటమి శ్రేణులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, SK రహీం బాబు, గుజ్జు దుర్గ లక్ష్మణరావు, బంగారు సూర్యావతీ సత్యనారాయణ, చింతలపూడి రవి, రిక్క లక్ష్మి, పొంగ బుజ్జి, పసుపులేటి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బూరయ్య, కోడూరి పెద్ద, రెడ్డనం సత్తిబాబు, నేమాని సత్యనారాయణ, చిట్టిబాబు, మనోహర్ గుప్తా, అమలకంటి బలరాం, పొంగా సత్య, గబ్బర్ సింగ్, బాక్సర్, తోట రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పురస్కారాలకన్నా ముందున్న వ్యక్తిత్వం – డాక్టర్ ప్రసాద్

కుటుంబం అనే బలమైన పునాదిపై నిలబడి, బాల్యం నుంచే క్రమశిక్షణ, కష్టపడి చదవాలనే తపన, ఇతరులకు ఉపకారం చేయాలనే సేవాభావాన్ని అలవర్చుకున్న వ్యక్తి డాక్టర్ ప్రసాద్. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చినా, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిన ఆయన జీవన ప్రయాణం నేటి యువతకు ఒక జీవంత ఆదర్శంగా నిలుస్తోంది. బాల్య దశలోనే తల్లిదండ్రులు నాటిన విలువలు — నిజాయితీ, వినయం, బాధ్యత, మానవత్వం — ఇవే ఆయన వ్యక్తిత్వానికి పునాదులయ్యాయి. చదువులో ప్రతిభ చూపుతూ, ఒక్కో అంచెలో తన లక్ష్యానికి దగ్గరవుతూ ఎదిగిన డాక్టర్ ప్రసాద్, వైద్య విద్యను కేవలం వృత్తిగా కాకుండా ఒక మహత్తర సేవగా భావించారు. యూరాలజీ వైద్యుడిగా అనేక విజయాలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు, జాతీయ స్థాయి గుర్తింపులు ఆయనను వరించాయి. అయితే ఈ అన్నిటికన్నా ముందుగా ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన స్వభావమే. రోగితో మాట్లాడే తీరు, వారి బాధను అర్థం చేసుకునే మనసు, నమ్మకాన్ని నింపే మాటలు — ఇవే ఆయనను నిజమైన “డాక్టర్”గా నిలబెట్టాయి. పురస్కారాలు గోడలపై అలంకరణలైతే, రోగుల నమ్మకం ఆయన జీవితానికి అసలైన సత్కారం. విజయ శిఖరాలను అధిరోహించినప్పటికీ నేలమీద నిలబడి ఉండే వినయం, నిరంతరం నేర్చుకోవాలనే తపన, సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే త్యాగభావమే డాక్టర్ ప్రసాద్ గారిని మరింత గొప్పవారిగా తీర్చిదిద్దుతోంది. కుటుంబం ఇచ్చిన విలువలు, బాల్యం నుంచే అలవర్చుకున్న క్రమశిక్షణ, అంచెలంచలుగా సాధించిన విజయం — ఇవన్నీ కలిసే డాక్టర్ ప్రసాద్ అనే వ్యక్తిత్వాన్ని రూపుదిద్దాయి. అందుకే ఆయనకు దక్కిన ప్రతి గౌరవం కేవలం వ్యక్తిగత విజయం కాదు; అది విలువలకు దక్కిన గౌరవం. విజయాన్ని పండగగా మార్చే స్నేహం డాక్టర్ ప్రసాద్ గారికి వచ్చిన ప్రతి గౌరవం ఒక సర్టిఫికెట్ మాత్రమే కాదు. ఆయనతో పాటు చదివిన స్కూల్ మిత్రుల హృదయాల్లో వెలిగే ఆనంద దీపం. “మాలో ఒకడు ఎదిగాడు” అనే గర్వమే ఆ దీపానికి నూనె. విజయం వస్తే పండగలా చేసుకోవడం, బాధ వస్తే భుజం ఇచ్చి ధైర్యం నింపడం — ఇదే వారి స్నేహానికి నిర్వచనం. ఎవరిదైనా సంతోషం అందరిదీ అవుతుంది. ఎవరిదైనా బాధ అందరూ పంచుకుంటారు. అందుకే ఆ స్నేహం కాలాన్ని, దూరాన్ని దాటి నేటికీ అలాగే నిలిచింది. డాక్టర్ ప్రసాద్ గారి స్కూల్ మిత్రులందరూ నేడు వివిధ రంగాల్లో, వివిధ ఖండాల్లో ప్రత్యేక స్థానాల్లో రాణిస్తుండటం విశేషం. పోలీస్ సుధాకర్, సుధా, శ్రీ, త్రినాధ్, రమేష్, మూర్తి, కేఎం, ఎమ్మెస్ ఎస్, మహేష్, సాల్మన్, కిషోర్, వెంకట్, కుమార్, గోవింద్, బలివాడ, చిన్ని తదితరులు తమ తమ రంగాల్లో గుర్తింపు పొందుతూ ముందుకు సాగుతున్నారు. అయితే వారిలో ఒకరిద్దరు మాత్రమే సాధారణ దిగువ–మధ్యతరగతి జీవితాల్లో ఉన్నప్పటికీ, ఈ మిత్రుల సాంగత్యంతో వారు ఒంటరితనాన్ని కాదు — ధైర్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి కారణం వారి మధ్య ఉన్న అపూర్వమైన స్నేహభావమే. ఫిట్‌నెస్‌కు స్ఫూర్తిగా పోలీస్ సుధాకర్ ఈ మిత్రబృందంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పోలీస్ సుధాకర్. క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై అవగాహనతో ఆయన ఫిట్‌నెస్‌కు నిర్వచనంగా నిలుస్తున్నారు. తన ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని సమానంగా చూసుకుంటూ, మిత్రులకు కూడా ఫిట్‌నెస్‌పై ప్రేరణగా మారుతున్నారు. ఇది వారి స్నేహ బంధానికి మరో ప్రత్యేకతగా నిలుస్తోంది. పురస్కారాలు డాక్టర్ ప్రసాద్ గారి పేరును ప్రపంచానికి చెబితే, ఆ విజయానికి నిజమైన అర్థం ఇచ్చేది ఆయన మిత్రుల అనుబంధమే. ఎందుకంటే నిజమైన గౌరవం అవార్డుల్లో కాదు… స్నేహ హృదయాల్లో ఉంటుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.