(పున్నమి న్యూస్ – అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 13):
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో బ్రాండిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని దొరస్వామి సందర్శించి వైద్య సేవలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 620 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన రోగులను గుర్తించి తదుపరి చికిత్సకు పంపించారు. ఈ శిబిరం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని స్థానికులు తెలిపారు.





