రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నెల్లూరులోని ఆనం నివాసం వద్ద నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు వెంకటశేషయ్య ఆచారి మరియు పలువురు కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి తమ సమస్యల నివేదన సమర్పిస్తూ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్న నెల్లూరు జిల్లాలోని లక్షా 70 వేల మంది చేతివృత్తుల వడ్రంగి, కుమ్మరి, కంచర, శిల్పి, స్వర్ణకార మరియు పౌరోహిత్యం ద్వారా జీవనభృతి పొందుతున్న కుటుంబాలకు తాత్కాలిక ఆసరాగా కుటుంబానికి పది వేల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడానికి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేశారు*.ఈ సందర్భంగా ఆనం వారి విన్నపాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సానుకూల నిర్ణయం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆనం రంగమయూర్ రెడ్డి మరియు పలువురు నెల్లూరు నగర విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు.
కరోనా తో కష్టాల్లో కెళ్ళాం – ఆదుకోండి – విశ్వబ్రాహ్మణ సంఘం విజ్ఞప్తి
రాపూరు, మే 26, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : నెల్లూరులోని ఆనం నివాసం వద్ద నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు వెంకటశేషయ్య ఆచారి మరియు పలువురు కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి తమ సమస్యల నివేదన సమర్పిస్తూ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్న నెల్లూరు జిల్లాలోని లక్షా 70 వేల మంది చేతివృత్తుల వడ్రంగి, కుమ్మరి, కంచర, శిల్పి, స్వర్ణకార మరియు పౌరోహిత్యం ద్వారా జీవనభృతి పొందుతున్న కుటుంబాలకు తాత్కాలిక ఆసరాగా కుటుంబానికి పది వేల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడానికి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేశారు*.ఈ సందర్భంగా ఆనం వారి విన్నపాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సానుకూల నిర్ణయం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆనం రంగమయూర్ రెడ్డి మరియు పలువురు నెల్లూరు నగర విశ్వబ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు.