Thursday, 23 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చామదల గ్రామంలో దంపూరి మల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల.

తేది.25.10.2025 న జలదంకి. 🔸చామదల గ్రామంలో దంపూరి మల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల. జలదంకి అక్టోబర్ 25న ఇటీవల జలదంకి మండలంలోని చామదల పంచాయతీ పరిధిలో ఉబ్బల వాగులో భారీ వరదల కారణంగా ఆకస్మికంగా ఉప్పొంగి భారీ నీటి ప్రవాహం కారణంగా దురదృష్టవశాత్తు చామద గ్రామానికి చెందిన దంపూరి మల్లి మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ సంఘటనపై హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించి, ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన దంపూరి మల్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి బాధను పంచుకున్న ఎమ్మెల్యే సురేష్ గారు, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. 50,000 లను అందజేశారు. బాధితులకు ఇది కష్టకాలంలో కొంత ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “ఈ విషాదకర సమయంలో మల్లి కుటుంబానికి అండగా నిలవడం మన అందరి బాధ్యత అని ప్రభుత్వం నుండి వీరికి తగిన నష్టపరిహారం అందేలా నేను వ్యక్తిగతంగా కృషి చేస్తానని,భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా చామదల గ్రామ ప్రజలు కూడా ఈ కుటుంబానికి సహాయ సహకారలను అందించి అండగా నిలవాలని తెలిపారు.

విశాఖపట్నం

మంత తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ విశాఖపట్నం రేంజ్‌ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్ విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల ఆల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలో గల వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ పలు కీలక సూచనలు చేశారు “మంతా” తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాలన్నింటినీ సందర్శించి, మత్స్యకారులు మరియు గ్రామస్థులకు తగిన హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24/7 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి, తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించి, పాతనేరస్తులు అంతర్రాష్ట్ర గ్యాంగుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాత్రిపూట గస్తీ పెంచి, వ్యూహాత్మక ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో నిందితులను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ఫ్రీజ్‌ అయిన డబ్బు తిరిగి అందేలా చూడాలని సూచించారు. డిజిటల్‌ అరెస్ట్‌, ఫైనాన్షియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్ వంటి మోసాలను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తరచుగా అభ్యంతరకర పోస్టులు చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు రవాణా మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి కేసుల్లో పట్టుబడి పోలీస్‌ స్టేషన్లలో ఉన్న వాహనాలను త్వరితగతిన డిస్పోజల్‌ చేయాలని సూచించారు. రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతలపై చర్చించి, పోలీస్‌ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, మీటింగ్‌లు నిర్వహించరాదని హెచ్చరించారు.

E-పేపర్

బ్రేకింగ్ న్యూస్* హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ

*బ్రేకింగ్ న్యూస్* హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డిసిపి చైతన్య ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి ఆసుపత్రికి తరలింపు చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో ఘటన..

విశాఖపట్నం

ఘనంగా గ్యార్మీ షరీఫ్ వేడుకలు.

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 ఆంధ్రాయూనివర్సిటీ ఔట్ గేట్ సమీపంలో సందాని ఇస్లామిక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాజరత్ మహబూబ్ సుభాని, గౌస్ పాక్ వారి గ్యార్మీ షరీఫ్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు మధ్యాహ్నం అసర్ నమాజ్ అనంతరం ఖురాన్ ఖాని, సాయంత్రం సమీప పరిసర ప్రాంతాల్లో గౌస్ పాక్ వారి సందల్ సందాని ఇస్లామిక్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది. నరై తక్బీర్ అల్లాహు అక్బర్, గౌస్ క దామాన్ నహి చోడేంగే అంటూ గౌస్ అజం వారిని ప్రశంసిస్తూ వారి భక్తిని చాటుకున్నారు. అనంతరం రాత్రి గౌస్ పాక్ నిషాని వద్ద సలాతు సలాం, ఫాతేహ, సర్కార్ గౌస్ పాక్ వారి జెండా ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎత్తున (తబ్ రుఖ్), ప్రసాద వితరణ, ఆమ్ దావత్ జరిగింది. నగర పరిసర ప్రాంతంల నుండి పెద్ద ఎత్తున ముస్లిం లు పాల్గొన్నారు

రంగారెడ్డి

కామ్రేడ్ మహబూబ్ పాషా నరహరి గార్ల 36వ వర్ధంతి సందర్భంగా బహిరంగ సభ అంబేద్కర్ చౌరస్తా ఇబ్రహీంపట్నం

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9133469506 ప్రజా సేవకుడికి అక్షర నివాళి ఒక నాయకుడు నడిచిన దారి, నేడు చరిత్ర పుటల్లో చెరగని స్మృతి. మీరు వదిలి వెళ్లిన అడుగుజాడ, పాషా నరహరి వర్ధంతి నాడిది. పల్లె పల్లెకు చేరిన ప్రజావాక్యం మీరు, ఓటు కోసం కాదు, ఊరి కోసమే నిలిచారు. ప్రజల కోసం తమ మాట ఒక ఆయుధం లాగా స్పూర్తితో సభలో మీరు పలికిన ప్రతి మాటా, పేద ప్రజల కష్టాలను మార్చిన బాటా. మీ కల నెరవేర్చగ మేము కలసి నడుస్తాం, మీ ఆశయం మా లక్ష్యం, ఈ రోజు చెబుతాం. అధికారం శాశ్వతం కాదని చూపారు, ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు. దొరల పాలనలో ధీరుడు మీరై నిలిచారు, మా నియోజకవర్గానికి వెలుగుబాట వేశారు. మీ నిరాడంబరత, నిజాయితీ మాకు స్ఫూర్తి, వర్ధంతి సందర్భంగా ఇదే మా కన్నీటి హారతి. మీ పోరాట పటిమను మరువబోము, మీ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటాము. జయహో కామ్రేడ్! జయహో ప్రజా సేవకా! మీ ఆత్మకు శాంతి, మాకు ఉద్యమ దీక్ష. నీ బాటలో * అల్లంపల్లి దుర్గేష్ * నక్కర్త మేడిపల్లి

తిరుపతి

శ్రీకాళహస్తి లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు

కర్నూల్లో బస్సు దగ్ధమైన ఘటనను దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి డిఎస్పి కే.నరసింహమూర్తి, మోటార్ వెహికల్ అధికారి దామోదర్ నాయుడు,శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ ప్రకాష్ నేతృత్వంలో దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాహన పత్రాలు,లగేజ్ పరిమితి,అత్యవసర ద్వారాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు.

విశాఖపట్నం

పేద కార్మికురాలికి సమయోచిత వైద్య సహాయం అందించిన ఉక్కునగరం శ్రీ సత్య సాయి భక్తులు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 “మానవ సేవయే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య సందేశాన్ని ఆచరణలో పెట్టుతూ, ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి భక్తులు నిరుపేద మహిళకు తగిన వైద్య సహాయం అందించారు. విశాఖ జిల్లాలోని ఎల్లమంచిలిదొడ్డి గ్రామానికి చెందిన ఉరుకుటి లక్ష్మి అనే దినసరి కార్మికురాలు మూడు సంవత్సరాల క్రితం కాలికి అమర్చిన ఇనుపరాడ్ తొలగించడానికి శస్త్రచికిత్స అవసరమైంది. దానికి సుమారు ₹20,000 రూపాయలు అవసరం కావడంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు తీవ్ర కాలి నొప్పి ఎదుర్కొంటున్న ఆమె ఉక్కునగరం శ్రీ సత్య సేవా సమితి యూత్ కోఆర్డినేటర్ ప్రకాశ్‌ను సంప్రదించింది. ఆమె పరిస్థితి తెలిసిన వెంటనే ప్రకాశ్ , ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి సేవా విభాగం కోఆర్డినేటర్ పద్మ తో కలిసి ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో సేవ చేస్తున్న రత్నం సిస్టర్‌ను సంప్రదించారు. ఆమె సహకారంతో శస్త్రచికిత్స విజయవంతంగా ఉచితంగా పూర్తయింది. శస్త్రచికిత్సకు కావలసిన సామగ్రి కోసం శ్రీ సత్య సాయి భక్తురాలు త్రివేణి, శ్రీ సత్య సాయి మందిరం కాంట్రాక్టర్ అనిల్, ప్రకాశ్ లు ఆర్థిక సహాయం అందించారు. భగవాన్ బాబా దివ్య బోధనలకు ప్రేరణగా ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా భక్తులు చేసిన సహాయానికి ఉరుకుటి లక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా “అందరినీ ప్రేమించండి – అందరినీ సేవించండి ” అన్న భగవాన్ సందేశం మరొకసారి ప్రతిధ్వనించింది.

ఖమ్మం

రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ మాన్ కీ బాత్

పున్నమి ప్రతి నిధి భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నాడు దేశ ప్రజలతో ముచ్చ టించే కార్యక్రమం మాన్ కీ బాత్. ఈ కార్యక్రమం ఈ నెల 26అనగా రేపు ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది. మొదటగా హిందీ లో ప్రసారం అయి తరువాత 5నిముషాలు తరువాత తెలుగు లో ప్రసారం అవుతుంది.

విశాఖపట్నం

బ్లింకిట్ బ్యాగ్‌లో గంజాయి రవాణా – ఇద్దరు అరెస్ట్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 శనివారం ఉదయం సుమారు 09:30 గంటలకు పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూ. ఎస్. ఐ. ఎన్‌. సునీత కి విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం ఆధారంగా సిబ్బందితో కలిసి కోమ్మాది ప్రాంతంలో ప్రత్యేక దాడి నిర్వహించగా, ఇద్దరు వ్యక్తులు బ్లింకిట్ డెలివరీ బ్యాగ్‌లో గంజాయి తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినారు. వారిని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో నిందితులను నల్లబిల్లి గణేష్ (వయసు 32), హోరో సంజయ్ కుమార్ (వయసు 29) లు గా గుర్తించారు. వీరి వద్ద నుండి మొత్తం 2 కిలోల గంజాయి స్వాధీనం చేసారు. కేసు క్రైమ్ నెం. 622/2025, యు/ఎస్ 20(b)(ii) ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 ఆర్/డబ్ల్యు 187 బి ఎన్ ఎస్ ఎస్ 2023 కింద నమోదు చేయబడింది. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు దర్యాప్తు సబ్-ఇన్‌స్పెక్టర్ కే. భాస్కరరావు పర్యవేక్షణలో జరుగుతోంది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. బాలకృష్ణ సూచనలు: నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (గంజాయి) అక్రమ రవాణా, నిల్వ, విక్రయం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే తక్షణమే పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ (ఫోన్: 9440796060) కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

జనగాం

బహిరంగ చర్చకు కడియం శ్రీహరి గారు సిద్ధమా??* కోరుకొప్పుల నాగేష్ గౌడ్ BJP మండల అధ్యక్షులు

👉 BJP అంటేనే ఉలిక్కి పడుతున్న రాజకీయ పండితుడు కడియం శ్రీహరి గారు 👉 BJP MLA MP ల నియోజకవర్గలలో అభివృద్ధి తో పోటీ పడలేక నిందలతో కాలం ఎల్లదిస్తున్న మాజీ ఉప ముఖ్య మంత్రివర్యులు కడియం 👉 గత పాలకులు నియోజకవర్గం కి అన్యాయం చేసారు అని కడియం శ్రీహరి గారు మాట్లాడం అయన విజ్ఞత్త కే వదిలేస్తున్నాం 👉 గత TDP పాలనలో మంత్రిగా BRS పాలనలో MP గా MLC గా ఉపముఖ్యమంత్రిగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో MLA గా ఉన్నది కడియం శ్రీహరి గారే 👉 అమలుకు సాధ్యం కానీ BC లకు 42% రిజర్వేషన్ అనే ఆశ చూపించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లో నియోజకవర్గం అభివృద్ధి అంటూ BRS నుండి కడియం శ్రీహరి గారు చేరింది వాస్తవం కదా?? 👉 స్టేషన్ ఘనుపూర్ కేంద్రం లోనే రోడ్లు సరిగా లేవు అనే విషయం మరియు రైల్ వే అండర్ బ్రిడ్జ్ కింద దారిని కనీసం మరమ్మత్ చేసి అక్కడ ఒక్క లైట్ పెట్టలేని కడియం శ్రీహరి గారికి BJP నాయకలను విమర్శించే అర్హత ఉందా?? 👉బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే అభివృద్ధి పోయి చూస్తే తెలుస్తుంది 👉 జఫర్ గడ్ మండలం లోని వెంకటాపూర్ X నుండి సాగరం X వరకు జనవరి 24 వ తేదీన అంటే 11 నెలల కింద నే రోడ్డు మంజూరు అయ్యింది అన్నారు కానీ ఇప్పటికి తట్టేడు మట్టి తీసిన అనే విషయం ఎక్కడ కూడా చూడలేదు 👉 ఉప ఎన్నిక వచ్చే సూచన ఉండటం తో స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గ ప్రజలని మళ్ళీ మోసం చేసే కుట్రలో భాగమే BJP నీ తిట్టడం 👉 నిన్న ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమలు రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తాం అని పెద్దలు చెప్పడం జరిగింది అప్పటికి మళ్ళీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వస్తుంది స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గం లోని ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అనే విషయం మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు కడియం శ్రీహరి గారు గుర్తుంచుకోవాలి ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షులు ఎదులాపురం మదన్ మోహన్ స్థానిక సంస్థల మండల కన్వీనర్ మారేపల్లి రవి వడ్డెగూడెం బూత్ అధ్యక్షులు తాటికాయల హరికృష్ణ గార్లు పాల్గొనడం జరిగింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.