Tuesday, 7 April 2026

Blog

తెలంగాణ

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ ఏఐసీసీ కార్యాదర్శి సంపత్

జూబ్లీహిల్స్ అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి) **జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు.* ఎలక్షన్ స్టార్ క్యాంపేయినర్ గా బాధ్యతల నిర్వాహణ , పార్టీ గెలుపుకు స్థానిక నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన సంపత్ కుమార్. పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ గారు . జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు యూసఫ్ గూడా డివిజన్ లోని కృష్ణ నగర్ లో ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డిగారి తో కలిసి గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు , సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ అధికారం లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మీ ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి పథకాలు ప్రతి గడపకు చేరుతాయని ప్రత్యక్షము లో ఉన్నవారు అభివృద్ధి చేయలేరు అనే విషయాన్ని గ్రహించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రజలకు అర్థం అయ్యేలా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరితో పాటు , tricor చైర్మెన్ బెల్లయ్య నాయక్ గారు,MUDA చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్ గారు, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ గారు ,రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ శివ సేన రెడ్డి గారు, మహిళ కాంగ్రెస్ నాయకురాలు సునీత రావ్ గారు,మరియు ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు మహిళలు ,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

హైదరాబాద్

మల్కాజ్‌గిరి కొండపై రాళ్లు జారిపడిన ఘటన – అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం లేదు

మల్కాజ్‌గిరి, అక్టోబర్ , పున్నమి ప్రతినిధి మల్కాజ్‌గిరి మండలంలోని మల్లికార్జున్‌నగర్‌ సమీపంలోని కొండపై రాళ్లు జారిపడిన ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా స్పందించగా, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం శుభపరిణామంగా నిలిచింది. సమాచారం అందుకున్న వెంటనే ఆపత్‌ ప్రతిస్పందన దళం (Disaster Response Force – DRF) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించింది. అధికారులు రాళ్ల కదలికలపై జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన వరుడుని ఆశీర్వదించిన వైసిపి నాయకులు

సీతారామపురం మండలంలోని గుండుపల్లి గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకుడు మాచిరాజు వెంకటేశ్వరరాజు మేనల్లుడు కప్ప సురేంద్ర రాజు వివాహ వేడుకకు హాజరై నూత నవరుడుని మండల వైసిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు రామిశెట్టి తిరుపతయ్య లు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వరుడి వివాహ జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి బాలినేని మాబయ్య, ఎస్.నారాయణ రాజు, ఎస్కే. జమీర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిపిపి విధానం వల్ల పేద ప్రజలకు వైద్య విద్యా దూరం

ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పిపిపి విధానం వల్ల పేద ప్రజలకు, విద్యార్థులకు విద్యా వైద్యం దూరమవుతాయని సీతారామపురం మండల వైసిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం సీతారామపురం బస్టాండ్ సెంటర్లో మండల మాజీ ఉపాధ్యక్షుడు రామిశెట్టి తిరుపతయ్య, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణం రాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపరిచే ధోరణిలో కూటమి ప్రభుత్వం నడుస్తుందన్నారు. పిపిపి విధానం వల్ల కూటమి పెద్దల జేబులు నిండుతాయే గాని పేద ప్రజలకు వైద్య విద్య దూరం అవుతూ ఖర్చు లేని నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రమంతటా ప్రజలందరూ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీకి బాసటగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు వదులుకున్నామా అని ప్రస్తుతం చింతిస్తున్నారన్నారు. అనంతరం ఇటీవల మరణించిన నారాయణమ్మ పేట గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు రమణయ్య కుటుంబాన్ని, అదేవిధంగా ఇటీవల గుండె నొప్పితో మరణించిన బట్టల వ్యాపారస్తుడు సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి బాలినేని మాబయ్య, వైసీపీ నాయకులు గుండ్లపల్లి తిరుపాలు, చింతం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కనమర్లపూడి పవన్, ఎస్. నారాయణరాజు, షేక్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవనంలో తాళ్ళపాక గ్రామానికి చెందిన బాలరాజు మురళీమోహన్ రాజుకు 42,833 రూపాయలు మరియు ఊటుకూరు గ్రామానికి చెందిన సంబర్ శరత్ కుమార్ కు 53,084 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను జనసేన రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసు రాజు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు వైద్య ఖర్చులు నిమిత్తం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన శ్రేణులు, కూటమి శ్రేణులు, పట్టణ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమము

పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా తొట్టంబేడు మండలం చిట్టతూరు పంచాయతీ గణపతి పురం గిరిజన కాలనీ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 66 వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి,గంధం శీను, కల్లిపూడి వెంకటేష్,ప్రదీప్ కుమార్,తేజ, మనీ,దినేష్,గోపి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు

బస్సు అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఆర్థిక సహాయం

ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి) చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు యాజమాన్యం వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులు మరణించిన 19 మందికి రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన నలుగురికి రూ.50 వేల చొప్పున రూ.40 లక్షల చెక్ ను కలెక్టరేట్ లో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు టి.జి. భరత్,జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్,జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత లకు అందించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు పరిదిలో నీట మునిగిన 66 హెక్టార్ల వరి పంట

మొంథా తుఫాను ప్రభావంతో అరకు వ్యవసాయ శాఖ డివిజన్ పరిదిలో 66 హెక్టార్ల లో వరి పంట నీట మునిగిందని ఏడీఏ మోహనరావు తెలిపారు. అత్యధికంగా హుకుంపేట మండలంలో 28.328 హెక్టర్లు, అరకులోయ మండలంలో 19.5 హెక్టర్లు, అనంతగిరి మండలంలో 11.33 హెక్టర్లు, డుంబ్రిగుడ లో 6.87 హెక్టర్లు నీట మునిగినట్లు ఏడీఏ పేర్కొన్నారు. తుఫాను కారణంగా పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించినట్లు ఏడీఏ తెలిపారు.

నిర్మల్

నష్టపోయిన పంటను పరిశీలించిన – ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్

నిర్మల్ అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి ) నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలంలోని ముఠాపూర్ గ్రామంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పంట పొలంలో నీరు చేరి వరి పంటకు చాలా నష్టం జరిగింది. పంట నష్టాన్ని అంచనా వేయడానికి నిర్మల్ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ గారు నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించడం జరిగింది, ఈ సందర్భంగా సయ్యద్ హైదర్ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా పొలాలలో నీరు చేరి పంట నష్టము చాలానే జరిగినందున ప్రభుత్వము రైతుల రైతుల వద్ద నుండి తడిసిన ధాన్యాన్ని కూడా ఇలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వరికి మద్దతు ధరను కూడా తగ్గించకుండా గిట్టుబాటు ధరనే రైతుకు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు వినోద్, సాధిక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు

అగ్ని ప్రమాదం జరిగిన మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన:-ఎమ్మెల్యే బి వి జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి) బుధవారం అగ్నిప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. మార్కెట్ యర్డు చైర్మన్ మల్లయ్య మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు ఇతర ప్రతినిధులతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.