Saturday, 21 March 2026

Blog

E-పేపర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు కౌంటింగ్‌ కోసం మొత్తం 42 టేబుల్స్‌ ఏర్పాటు ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనున్న కౌంటింగ్‌ మొత్తం 10 రౌండ్లలో తేలనున్న ఉప ఎన్నిక ఫలితాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదట షేక్ పేట డివిజ‌న్ నుండి ప్రారంభం ఆ త‌ర్వాత వెంగ‌ళ్ రావు న‌గ‌ర్ , ర‌హ‌మ‌త్ న‌గ‌ర్, యూస‌ఫ్ గూడ‌, సోమాజిగూడ‌, బోర‌బండ‌, ఎర్ర‌గ‌డ్డ డివిజ‌న్లతో పూర్తి

పశ్చిమ గోదావరి

అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం ; . భీమవరం మెంటేవారి తోటలో గ్రంధి శ్యామ్ శివరాజ్ అధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, మణికంఠ మందారం గురుస్వాములు బంగారమంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తామని, భక్తిశ్రద్ద లతో అయ్యప్ప స్వాముల పడిపూజ నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తీర్థ ప్రసాదాలు, నైవేధ్యాలు సమర్పించారు. అభిషేకాలు, మంగళ హారతులు, పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, మెంటే మనోజ్, తోట సురేష్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కూటమి నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

అన్నమయ్య

రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె.చౌదరి

రైల్వేకోడూరు మండలం రావఘవరాజపురం గ్రామంలో గురువారం రోజున జరిగిన రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కందల లోకేష్ ఆహ్వానం మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా చైర్మన్ కె.కె. చౌదరి మల్లికార్జున రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు. గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనేకమంది అభిమానులు పాల్గొన్నారు.

E-పేపర్

ఆదిబాట్ల మున్సిపాలిటీ ఏసీబి దాడులు… ఏసీబి వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ వరప్రసాద్…

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఆదిబాట్ల మున్సిపాలిటీ ఏసీబి దాడులు… ఏసీబి వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ వరప్రసాద్… 75 వేల లంచం తీసుకుంటూ ఏసీబి చిక్కిన వరప్రసాద్… రంగారెడ్డి జిల్లా అధిబట్ల మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు ఆధిబట్ల మున్సిపల్( టిపిఓ) ,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వర ప్రసాద్ , అసిస్టెంట్ వంశీ ఇల్లు పర్మిషన్ విషయంలో ఆనంద్ అనే వ్యక్తి నుండి 75 వేల రూపాయలు తీసుకుంటుండగా పక్క సమాచారంతో ఏసీబీ రైడింగ్.. మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు…

E-పేపర్

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన….. లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది. జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ 52 పేజీల తీర్పులో.. “ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ” అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారో, తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి, తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది. రిమాండ్‌కు 2 గంటల ముందు గడువు సాధారణంగా అరెస్టు సమయంలోనే లిఖితపూర్వక కారణాలు ఇవ్వడం తప్పనిసరి. అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అరెస్టు సమయంలో కారణాలు తెలియజేయడం సాధ్యం కాకపోతే.. వాటిని రిమాండ్‌ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరు పరచడానికి కనీసం రెండు గంటల ముందుగానైనా లిఖిత పూర్వకంగా అందజేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ గడువును పాటించడంలో విఫలం అయితే.. ఆ అరెస్టును, నిందితుడి రిమాండ్‌ను చట్టవిరుద్ధ చర్యగా పరిగణించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ తీర్పు ముంబయిలో 2024లో జరిగిన బీఎండబ్ల్యూ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడు మిహిర్‌ రాజేశ్‌ షా దాఖలు చేసిన అప్పీలుపై వెలువడింది. తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదనే కారణంపై షా తన అరెస్టు చట్టబద్ధతను సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు అమలు కోసం, దీని ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

విశాఖపట్నం

సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నాం : ప్రియాంక దండి*

శుక్రవారం, శనివారం విశాఖలో జరగబోయే సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ప్రకటన విడుదల చేసారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో సుమారు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం జరగవచ్చని అంచనాలు ఉన్నాయని, ఆచరణలోకి వస్తే రాష్ట్ర అర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని, ఎదరికో ఉపాధి అవకాశాలు వస్తాయని, ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఐ టీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషిని అభినందిస్తున్నామని ప్రియాంక అన్నారు.

E-పేపర్

అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ లో అయ్యప్ప మాల ధరించిన ఒక సామాజిక వర్గం కొంతమంది స్వాములు ఆలయం లోకి రానివ్వకుండా తాళం వేశారని ఆరోపణ నిన్నటి నుండి చలికి వణుకుతూ ఆరుబయటే ఉన్న అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు

విశాఖపట్నం

సృష్టి వరల్డ్ స్కూల్‌లో ప్రీ చిల్డ్రన్స్ డే వేడుకలు

విశాఖపట్నం, నవంబర్ (పున్నమి ప్రతినిధి) ఉక్కు నగరంలోని సృష్టి వరల్డ్ స్కూల్‌లో ప్రీ-చిల్డ్రన్స్ డే సందర్భంగా “Srishti’s CareNest – Fun and Brain Development Event”ను నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి కాగ్నిటివ్, మోటార్, సోషల్, ఎమోషనల్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ వంటి ఐదు ప్రధాన బాల్య నైపుణ్యాలపై ఆధారిత వినోదాత్మక ఆటల్లో పాల్గొన్నారు. మొత్తం 48 మంది తల్లిదండ్రులు 60 కంటే ఎక్కువ కార్యకలాపాలు పూర్తి చేసి సత్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా “Care and Grow” వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమం వోటు ఆఫ్ థ్యాంక్స్‌, గ్రూప్ ఫోటో, తల్లిదండ్రుల అనుభవాలు పంచుకోవడం తో ముగిసింది. కార్యక్రమంలో Founder & Director P. సుశీల రాణి, Executive Director మేఘనా, Executive Principal కిరణ్, Chief Academic Head P.N.V.K. సంతోష్, Creative Head రాధా పాల్గొన్నారు.

E-పేపర్

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఎంపిక

ఈనెల 8.9 తేదీ పొద్దుటూరు లో వై ఎమ్ ఆర్ కాలనీ లో స్టేడియం క్యాడిట్. సబ్ జూనియర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో చిట్వేల్ ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులలో బాలికల విభాగంలో బి లోహిత. సుదీప. కుష్మిత.బాలుల విభాగంలో అనూజ్. గ్రీతేశ్వర్ రెడ్డి. ధవనేశ్వర్ రెడ్డి బంగారు పతకాలు సాధించారని కోచ్ శివాజీ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 14 15 16 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్ర పాల్గొంటారని తెలిపారు. విజేతలకు ఈరోజు చిట్వేలి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీ లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోషల్ యాక్టివిస్ట్ గాడి ఇంతియాజ్ అహ్మద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి చంద్రశేఖర్, సాయి వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ టీ. రెడ్డయ్య నాయుడు ల ద్వారా పతకాలు అందించి అభినందన సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ సందర్భంగా కోచ్ శివాజీ మాట్లాడుతూ చిట్వేలి ఎస్ వి కే అకాడమీ నుండి విద్యార్థులు రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉందని, తన మీద నమ్మకంతో పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులకు మరియు మొదటి నుండి తనను ప్రోత్సహిస్తూ వస్తున్న సీఐ వెంకటేశ్వర్లు సార్ గారికి మరియు గ్రామీణ ప్రాంతాలలో చిన్నారులను ప్రేరేపిస్తూ తమ అకాడమీ అభివృద్ధికి సహకరిస్తున్న గాడి ఇంతియాజ్ అహ్మద్ కు, మరియు సాయి వికాస్ పాఠశాల రెడ్డయ్య కు కృతజ్ఞతలు తెలియజేశారు. విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిట్వేలి లో టైక్వాండో అకాడమీని స్థాపించి అనతి కాలంలోనే విద్యార్థులను రాష్ట్రస్థాయి వరకు తీసుకువెళ్లడానికి కృషిచేసిన శివాజీ మాస్టర్ ను అభినందించారు. చదువులతో పాటు క్రీడలలో కూడా ప్రతి ఒక్కరూ రాణించాలని మానసిక వికాసానికే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని రాష్ట్రస్థాయి నుండి జాతీయస్థాయి వరకు పిల్లలు ఎదగాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ జిమ్ వ్యాయామకారులు కొరముట్ల నరసింహ, అలిశెట్టి పెంచలయ్య, చంద్రశేఖర్, ఓసూరయ్య, మరియు అకాడమీ క్రీడాకారులు పాల్గొన్నారు

Featured

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రెడ్డివారిపల్లి పంచాయతీ గాంధీనగర్ నందు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైష్ ఎంపీపీ #రామిరెడ్డి #ద్వాజారెడ్డి. ఈ కార్యక్రమం లో గాంధీనగర్ రామిరెడ్డి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు , మాజీ టూరిజం డైరెక్టర్ మందల నాగేంద్ర, మాజీ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు , సర్పంచులు హరికృష్ణ రెడ్డి, ఆర్ వి రమణ,ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, బండారు మల్లి,లత, ఎనుమల మహేష్ , ప్రతాప్ రెడ్డి, కొప్పల శంకరయ్య ,రాజగోపాల్, ఇరగబోయిన నాగేశ్వరరావు, భూంపల్లి నాగరాజు, బత్తల సుబ్రహ్మణ్యం, ex సర్పంచ్ శంకర్ రెడ్డి, రాజారావు,షఫీ , కోటి, శ్రీరాములు, రవి, షేక్ మొహమ్మద్, మహేష్,శివ,మని యాదవ్ , షేక్ గౌసియా,ప్రమీల,మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.